-
స్ట్రాంగ్ రూముల్లో అభ్యర్థుల భవితవ్యం:
సోమవారం పోలింగ్ ముగిసిన అనంతరం ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యాన్ని స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. పోలింగ్ ముగిశాక ఈవీఎంలను ఎన్నికల సంఘం నిబంధనల మేరకు సీల్స్ వేసి కట్టుదిట్టమైన భద్రత మధ్య నియోజకవర్గాల వారీగా జిల్లాలో ఏర్పాటు చేసిన 5 ఇంటిగ్రేటెడ్ స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలను సంబంధిత పోలింగ్ కేంద్రాల పీవోలు, ఏపీవోలు జమ చేశారు. అక్కడి నుంచి మంగళవారం సాయంత్రం వరకు ఆయా ఇంటిగ్రేటెడ్ స్ట్రాంగ్ రూముల నుంచి జిల్లా మొత్తానికి ఏర్పాటు చేసిన రైజ్ ఇంజినీరింగ్ కాలేజిలోని స్ట్రాంగ్ రూములకు తరలించారు. యర్రగొండపాలెం, మార్కాపురం నియోజకవర్గంలోని ఈవీఎంలు మార్కాపురంలోని ఎస్వీకేపీ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కాలేజిలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ స్ట్రాంగ్ రూములకు, అదేవిధంగా దర్శి నియోజకవర్గంలోని ఈవీఎంలు దర్శిలోని ఏపీ మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ స్ట్రాంగ్ రూముకు, ఒంగోలు, సంతనూతలపాడు, కొండపి నియోజకవర్గాల ఈవీఎంలు రైజ్ ఇంజినీరింగ్ కాలేజిలోని స్ట్రాంగ్ రూములకు, గిద్దలూరు నియోజకవర్గంలోని ఈవీఎంలను సెయింట్ పాల్స్ కాలేజిలోని ఇంటిగ్రేటెడ్ స్ట్రాంగ్ రూముకు, కనిగిరి నియోజకవర్గంలోని ఈవీఎంలను అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలోని ఇంటిగ్రేటెడ్ స్ట్రాంగ్ రూములకు తరలించారు. ఆయా ఇంటిగ్రేటెడ్ స్ట్రాంగ్ రూముల నుంచి జిల్లాలోని మొత్తం నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను రిటర్నింగ్ అధికారులు, సెక్టోరల్ అధికారులు, రూట్ అధికారులు పోలీసు బందోబస్తుతో రైజ్ ఇంజినీరింగ్ కాలేజిలోని స్ట్రాంగ్ రూముకు తరలించి కౌంటింగ్ వరకు అక్కడే కట్టుదిట్టంగా భద్రపరుస్తారు. -
వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడి హేయమైన చర్య
● ఎంపీ అభ్యర్థి భాస్కర్రెడ్డి పుల్లలచెరువు: మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దాడిచేయడం హేయమైన చర్య అని ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అన్నారు. సోమవారం శతకోడులో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దాడి చేయడంతో సొసైటీ చైర్మన్ కృష్ణతో పాటు మరో ఇద్దరికి గాయాలైన సంఘటన తెలిసిందే. విషయం తెలుసుకున్న చెవిరెడ్డి భాస్కర్రెడ్డి సోమవారం రాత్రి పొద్దుపోయిన తరువాత శతకోడు వచ్చి క్షతగాత్రులను పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని, ఎలాటి భయాలు పెట్టుకోవద్దని అన్నారు. గ్రామాల్లో ఇలాంటి దాడులు జరగడం దురదృష్టం అని, రాష్ట్రంలోనే పలు ప్రాంతాల్లో టీడీపీ కార్యకర్తలు దాడులు చేయడం ఎక్కువగా ఉందన్నారు. చెవిరెడ్డి వెంట వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుముల శ్రీనివాసరెడ్డి ఉన్నారు. -
విజయం వైఎస్సార్ సీపీదే
ఒంగోలు: ఎన్నికల్లో విజయం వైఎస్సార్ సీపీదే అని లిడ్ క్యాప్ చైర్మన్, వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కాకుమాను రాజశేఖర్ అన్నారు. స్థానిక వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాలు పెరుగుతున్న ఓటింగ్ను అడ్డుకునేందుకు కుట్రలు, కుతంత్రాలు, దౌర్జన్యాలు, దాడులకు తెగబడ్డా ప్రజల తిరుగుబాటు చేయడంతో తోకముడిచారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా ఓటర్లు కూడా పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా వైఎస్సార్ సీపీ మెరుగైన ఆధిక్యాన్ని ప్రతి నియోజకవర్గంలో సాధిస్తోందన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేద ప్రజలకు, మహిళలకు గత ఐదేళ్ల పాలనలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని, ఈ నేపథ్యంలోనే ఓటింగ్ వినియోగించుకుని పెత్తందారులకు బుద్ధిచెప్పేందుకు పేదలు ముందుకు వచ్చారన్నారు. ఎస్సీ/ఎస్టీ/బీసీ/మైనార్టీలు వైఎస్సాసీపీకి అండగా ఉంటున్నాయని గమనించి రిగ్గింగ్కు సైతం టీడీపీ పాల్పడేందుకు యత్నించిందని, చివరకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తల లక్ష్యంగా భౌతిక దాడులకు పాల్పడడం దురదృష్టకరమన్నారు. ప్రజల కొనుగోలు శక్తి రాష్ట్రంలో విపరీతంగా పెరిగిందని, అందుకు కారణం సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందడమేనన్నారు. కేంద్ర గణాంకాల ప్రకారం గతంలో పేదరికం శాతం 12.50గా ఉండేదని, కానీ నేడు ఆ శాతం కేవలం 6 శాతం మాత్రమే ఉందన్నారు. టీడీపీ కేవలం రాజధానిలో వారు అక్రమంగా కొనుగోలు చేసిన భూములను అభివృద్ధి చేసుకుని లబ్ధి పొందేందుకు అమరావతి రాజధాని పేరును పేర్కొంటున్నాయని, అంతే తప్ప పేద ప్రజల అభివృద్ధి కోసం కాదన్నారు. గతంలో చంద్రబాబు 650 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదని, కానీ నేడు జగన్మోహన్రెడ్డి 99 శాతం నెరవేర్చాడన్నారు. జూన్ 4న జరిగే కౌంటింగ్లో వైఎస్సార్ సీపీ ఘన విజయం సొంతం చేసుకోవడంతోపాటు వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమన్నారు. ప్రకాశం జిల్లాలో కూడా వైఎస్సార్సీపీ ఫ్యాన్ స్పీడుకు అడ్డే లేదని పేర్కొన్నారు. ప్రతిపక్షాల కుట్రలను ప్రజలు తిప్పికొట్టారు పెరిగిన ఓటింగ్ శాతమే అందుకు నిదర్శనం కూటమి అరాచకాలను ప్రజలు ధైర్యంగా ఎదుర్కొన్నారు లిడ్ క్యాప్ చైర్మన్ కాకుమాను రాజశేఖర్ -
ఓటేసిన 15,89,412 మంది
జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 259 లొకేషన్లలో మొత్తం 2183 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. జిల్లాలో 18,22,470 మంది ఓటర్లు ఉండగా వారిలో పురుష ఓటర్లు 9,07,980, మహిళా ఓటర్లు 9,14,379, థర్డ్ జెండర్ ఓటర్లు 111 మంది ఉన్నారు. మొత్తం ఓటర్లలో కొత్తగా ఓటు హక్కు పొందిన యువత 43,264 మంది ఉన్నారు. మొత్తం ఓటర్లలో 15,89,412 మంది ఓటు హక్కు వినియోగించుకోవడంతో జిల్లాలో అత్యధికంగా 87.28 శాతం ఓటింగ్ నమోదైంది.ఒంగోలు అర్బన్: విశ్వసనీయత, విలువలు, మాట తప్పని నైజానికే ప్రజలు పట్టం కట్టేలా ఉంది పోలింగ్ ప్రక్రియ చూస్తే. జిల్లాలో సోమవారం అర్ధరాత్రి ఒంటి గంట వరకు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఓటు వేశారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులైన మహిళలు, వృద్ధులు, వికలాంగులు ఓటు వేసేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. గత ఎన్నికల్లో 86.04 శాతం నమోదుకాగా ఈ ఎన్నికల్లో 87.28 శాతం నమోదైంది. పోలింగ్ సమయంలో ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించడంలో వైఎస్సార్ సీపీ కృషి సఫలమైంది. వైఎస్సార్ సీపీకి అత్యధిక ఓట్లు పడేందుకు క్షేత్రస్థాయి క్యాడర్ చేసిన ప్రచారం, కృషి ఆ పార్టీకి ప్లస్గా మారనుంది. ఈవీఎంల్లో నేతల భవితవ్యం నిక్షిప్తమై ఉంది. కౌంటింగ్ కు మరో 20 రోజులు ఉండడంతో నరాలు తెగే ఉత్కంఠ, ఊపిరి సలపని టెన్షన్తో అందరూ ఎదురు చూస్తున్నారు. జిల్లాలో 87.28 శాతం పైగా ఓటింగ్ నమోదు: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సోమవారం తుది సమరం అయిన పోలింగ్ ప్రక్రియ ముగిసే సరికి జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో 87.28 శాతం పైగా ఓటింగ్ నమోదైంది. జిల్లాలో ఓటర్లు ఎంతో చైతన్యంతో పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ భారీ ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాల బాట పట్టారు. ఆ లైన్ పూర్తయ్యే సరికి మధ్యాహ్నం రెండు దాటింది. తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుంచి జనం పోటెత్తారు. సాయంత్రం ఆరుగంటలకు సైతం వందలాది మంది పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరారు. దీంతో ప్రక్రియ అర్ధరాత్రి ఒంటి గంట వరకు కొనసాగింది. ఎన్నికల నిబంధనల ప్రకారం సాయంత్రం 6 గంటల తర్వాత పోలింగ్ కేంద్రాలకు అనుమతించకున్నా పోలింగ్ కేంద్రాల్లో క్యూలో ఉన్న ఓటర్లందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు. దీంతో అర్ధరాత్రి ఒంటి గంటకు ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. దీన్ని బట్టి ఓటర్లు ఎంత చైతన్యంతో ఓటింగ్లో పాల్గొన్నారో అర్థమవుతోంది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 73.05 శాతం ఓటింగ్ నమోదైంది. 6 గంటల నుంచి రాత్రి ఒంటి గంట వరకు కొనసాగిన పోలింగ్ అనంతరం ఓటింగ్ శాతం మరింతగా పెరిగింది. మొత్తం పోలింగ్ ముగిసే సరికి 87.28 శాతం పైగా నమోదైంది. జిల్లాలో జరిగిన పోలింగ్ సరళిని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దినేష్కుమార్ జిల్లా కేంద్రం కలెక్టరేట్లోని కంట్రోలు రూములో లైవ్ వెబ్కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించారు. అధికార యంత్రాంగంలో సమన్వయ లోపం: జిల్లాలో సోమవారం జరిగిన పోలింగ్ ప్రక్రియలో ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లు గంటల కొద్దీ క్యూలైన్లలో ఉండాల్సి వచ్చింది. పలు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. మరికొన్ని కేంద్రాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. చాలా కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ నెమ్మదిగా నడిచింది. దీంతో ఓటింగ్ ప్రక్రియ అర్ధరాత్రి వరకూ కొనసాగింది. జిల్లాలోని అన్నీ శాఖల యంత్రాంగం మధ్య సమన్వయ లోపం ఉన్నట్లు పోలింగ్ నిర్వహణలో తేటతెల్లమైంది. పోలింగ్ కేంద్రాల నుంచి మంగళవారం వరకూ ఈవీఎంలు తరలింపు కొనసాగింది. ఉత్సాహంలో వైఎస్సార్ సీపీ: గతంలో, తాజాగా నమోదైన పోలింగ్ సరళిని విశ్లేషించుకుంటూ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2019 ఫలితాలకంటే ఈ దఫా మెరుగుపడుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్ల కాలంలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అలాగే చేపట్టిన అభివృద్ధికి జనం జై కొట్టారంటూ పార్టీ నేతలు ఉత్సాహంగా ఉన్నారు. ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో గెలుపు లాంఛనమేనంటున్నారు. అధికార వైఎస్ఆర్ సీపీ నుంచి పార్లమెంట్ నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉండగా అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి, కొండపి ఆదిమూలపు సురేష్, సంతనూతలపాడు మేరుగు నాగార్జున, మార్కాపురం అన్నా వెంకట రాంబాబు, గిద్దలూరు కుందురు నాగార్జునరెడ్డి, దర్శి బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, యర్రగొండపాలెం తాటిపర్తి చంద్రశేఖర్, కనిగిరి నియోజకవర్గం నుంచి దద్దాల నారాయణ ఎన్నికల పోటీలో ఉన్నారు. నైరాశ్యంలో టీడీపీ నేతలు: పోలింగ్ ప్రక్రియ నిర్వహణలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా విఫలమైంది. ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించడంలో ఓటర్ల నుంచి చేదు అనుభవాలు ఎదురవడంతో క్షేత్ర స్థాయి ఆ పార్టీ క్యాడర్ చేతులెత్తేసింది. ఒక సమయంలో పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ క్యాడరే లేరంటే వారెంత నిరాశ, నిస్పృహలకు లోనయ్యారో అర్థమవుతోంది. దీంతో పోలింగ్ ప్రక్రియను పరిశీలించేందుకు వెళ్లిన టీడీపీ నేతలు క్షేత్ర స్థాయి క్యాడర్కు పోలింగ్ నిర్వహణలో పాల్గొనాలని సూచించినా పట్టించుకునే పరిస్థితులు లేవు. పోలింగ్ అనంతరం టీడీపీ అభ్యర్థుల్లో నైరాశ్యమే మిగిలింది. పోలింగ్ సరళిని చూస్తే ఎక్కువ ఓటింగ్ వైఎస్సార్ సీపీకి అనుకూలంగా ఉందనే విషయం గ్రహించిన టీడీపీ నేతలు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గొడవలు సృష్టించి ఓటింగ్ శాతం తగ్గించే కుట్రలకు తెరతీశారు. అధికార యంత్రాంగం, ఓటర్లు ఆ గొడవలను పట్టించుకోకుండా పోలింగ్ ప్రక్రియను దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లారు. దీంతో టీడీపీ కుయుక్తులు ఎక్కడా ఫలించలేదు.మొత్తం ఓటర్లు : 18,22,470 పోలైన ఓట్లు : 15,89,412 పురుషులు : 7,93,666 మహిళలు : 795678 ఇతరులు : 68 నియోజకవర్గాల వారీగా ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లు ఓటు వేసిన నియోజకవర్గం పురుష ఓటర్లు మహిళా ఓటర్లు ఇతరులు మొత్తం శాతం యర్రగొండపాలెం 93,944 91,296 2 1,85,242 89.40 దర్శి 1,03,765 1,02,227 1 2,05,993 91.00 ఒంగోలు 98,055 1,05,050 38 2,03,143 84.56 కొండపి 1,05,174 1,06,174 2 2,11,350 88.21 మార్కాపురం 95,195 92,750 7 1,87,952 87.58 గిద్దలూరు 1,00,318 1,02,809 9 2,03,136 84.74 కనిగిరి 1,04,532 1,00,259 7 2,04,798 85.30 సంతనూతలపాడు 92,683 95,113 2 1,87,798 87.50 -
No Headline
ఫ్యాన్ కే ప్లస్ఎండవేడిమిని పట్టించుకోకుండా మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు పోటెత్తారు. ఉదయం ఆరుగంటల నుంచే జిల్లాలో పలు పోలింగ్ కేంద్రాల వద్ద భారీ క్యూలు కనిపించాయి. ఈ దఫా గతం కంటే జిల్లాలో 1.2 శాతం అదనంగా పోలింగ్ పెరిగింది. ప్రభుత్వంపై వ్యతిరేకత లేదు.. ప్రతిపక్షం పై సానుకూలత లేదు. ఈ అంశాలపై విశ్లేషణ చేస్తున్న పండితులు ఇది కచ్చితంగా అధికార వైఎస్సార్ సీపీకి అనుకూల ఓటుగా మారిందని చెబుతున్నారు. పోలింగ్ అంతటా సానుకూలం దీవించిన గ్రామీణ ఓటరు అక్కున చేర్చుకున్న పట్టణం ఓటెత్తిన సంక్షేమ మహిళలు, వృద్ధులు పెరిగిన ఓటింగ్ ప్రభుత్వానికే అనుకూలమని ప్రజల్లో చర్చ ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించడంలో వైఎస్ఆర్ సీపీ సఫలం గొడవలతో ఓటింగ్ను అడ్డుకోవాలని టీడీపీ విఫలయత్నం పోలింగ్ అనంతరం టీడీపీ నేతల్లో కనిపిస్తున్న నైరాశ్యం -
20న ఎడ్ల బండలాగుడు పోటీలు
సీఎస్పురం (పామూరు): సీఎస్పురం మండలం రామాపురం గ్రామంలో పట్టాభిరామస్వామి తిరునాళ్ల సందర్భంగా ఈనెల 20వ తేదీ సోమవారం ఉదయం 7.30 గంటలకు ప్రకాశం, నెల్లూరు, కడప, కృష్ణా, గుంటూరు 5 జిల్లాల స్థాయి ఎడ్ల బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు నారా కుటుంబ సభ్యులు తెలిపారు. ఎడ్ల పోటీల్లో పాల్గొనేందుకు ఆసక్తిగల యడ్ల జతల యజమానులు తమ పేర్లను ఈనెల 19వ తేదీ రాత్రి 9 గంటలలోగా రూ.500 ఎంట్రీఫీజు చెల్లించి నమోదు చేసుకోవాలన్నారు. పోటీల్లో విజేతలకు బహుమతులు వరుసగా ప్రథమ రూ.50 వేలు, ద్వితీయ రూ.40 వేలు, తృతీయ రూ.30 వేలు ఇవ్వనున్నారు. వివరాలకు సెల్: 9666673735, 8499036565, 9611118712 నంబర్లను సంప్రదించవచ్చు. స్ట్రాంగ్ రూముకు చేరిన ఈవీఎంలు ఒంగోలు అర్బన్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సోమవారం జరిగిన పోలింగ్ ప్రక్రియ అనంతరం మంగళవారం సాయంత్రానికి జిల్లాలోని అన్నీ నియోజకవర్గాల ఈవీఎంలు రైజ్ ఇంజినీరింగ్ కాలేజిలో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ స్ట్రాగ్ రూముకు చేరాయి. మంగళవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దినేష్కుమార్ ఈవీఎంలను పరిశీలించి స్ట్రాంగ్ రూములకు సీళ్లు వేశారు. అనంతరం అక్కడి పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. ఒంగోలు, సంతనూతలపాడు, కొండపి నియోజకవర్గాల్లో పోలింగ్ అనంతరం సోమవారం రాత్రి రైజ్ ఇంజినీరింగ్ కాలేజి స్ట్రాంగ్ రూముకు తరలించారు. ఇతర నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచిన ఈవీఎంలకు సంబంధించి దర్శి, మార్కాపురం, యర్రగొండపాలెం, కనిగిరి, గిద్దలూరు నియోజకవర్గాల ఈవీఎంలు మంగళవారం రైజ్ కాలేజికి చేరాయి. ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల పర్యవేక్షణలో ప్రత్యేక కంటైనర్ వాహనాల్లో తీసుకొచ్చారు. సెంట్రల్ స్ట్రాంగ్ రూములోని ఈవీఎంలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్నీ భద్రతా చర్యలు తీసుకున్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్ రూముల తలుపులకు సీళ్లు వేశారు. కలెక్టర్తో పాటు ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్, ఎన్నికల పరిశీలకులు అరవింద్ కుమార్ చౌరాసియా, మయూర్ కే మెహతా, అసిస్టెంట్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్, ఏఎస్పీ నాగేశ్వరరావు, డీఆర్ఓ శ్రీలత ఇతర అధికారులు, వైఎస్ఆర్ సీపీ ప్రతినిధి దామరాజు క్రాంతికుమార్, ఇతర పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. వేలానికి అన్ని గ్రేడులు తెచ్చుకోవాలి ● పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్ టంగుటూరు: పొగాకు రైతులందరూ వేలానికి అన్ని రకాల గ్రేడులను తెచ్చుకోవాలని పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్ అన్నారు. స్థానిక వేలం కేంద్రాన్ని పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్, వైస్ చైర్మన్ గుత్తా వాసుబాబు, ఒంగోలు పొగాకు బోర్డు ప్రాంతీయ అధికారి లక్ష్మణరావు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు వేలం సరళిని, వివిధ పొగాకు గ్రేడులకు వచ్చిన ధరలను పరిశీలించి, రైతులతో వారి సమస్యలు అడిగారు. రైతులందరూ ధరలు మంచిగా ఉన్నందున సంతృప్తి వ్యక్తం చేశారు. అన్య పదార్థాలు లేకుండా జాగ్రత్తలు వహించాలని కోరారు. మార్కెట్ నడుస్తున్న ప్రకారం పొగాకు బేళ్లను తెచ్చుకోవాలని, సాఫ్టు, హీటు, గ్రేడ్ మిక్సు లేకుండా తెచ్చుకోవాలని సూచించారు. అలాగే కంపెనీ బయ్యర్లతో మాట్లాడి అన్ని రకాల గ్రేడ్లను కొనుగోలు చేయాలని కోరారు. వేలం నిర్వహణాధికారి శ్రీనివాసరావు, రైతు నాయకులు, బోర్డు సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. 861 పొగాకు బేళ్ల కొనుగోలు స్థానిక వేలం కేంద్రంలో మల్లవరప్పాడు, శివపురం, గొర్లమిట్ట, మట్టిపాడు గ్రామాలకి చెందిన రైతులు 919 బేళ్లను వేలానికి తీసుకురాగా వాటిలో 861 కొనుగోలు జరగ్గా, 58 పొగాకు బేళ్లు తిరస్కరించారు. గరిష్ట ధర రూ.300 కాగా, కనిష్ట ధర రూ.205, సరాసరి రూ.261.69 ధర పలికింది. ఈ వేలంలో మొత్తం 36 మంది వ్యాపారులు పాల్గొన్నారని తెలిపారు. -
కనిగిరిలో మళ్లీ జెండా ఎగరేస్తున్నాం
కనిగిరి రూరల్: కనిగిరిలో మళ్లీ వైఎస్సార్ సీపీ జెండా ఎగరవేస్తున్నాం... గెలుపు కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తా.. జగనన్న సైనికులందర్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని వైఎస్సార్సీపీ కనిగిరి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మంగళవారం మున్సిపల్ చైర్మన్ ఎస్కే అబ్దుల్ గఫార్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో తాను విజయం సాధిస్తున్నట్లు చెప్పారు. తన గెలుపు కోసం అహర్నిశలు శ్రమించి పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు చెప్పారు. ఎన్నికల్లో బూత్లలో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని, ఎవర్ని మరిచిపోనని తెలిపారు. ప్రతి బూత్ల వైఎస్సార్ సీపీకి మెజార్టీ వస్తోందన్నారు. పీడీసీసీబీ చైర్మన్ వైఎం ప్రసాద్రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో ఘన విజయం సాధిస్తున్నట్లు తెలిపారు. టీడీపీ గ్లోబల్ ప్రచారాలను నమ్మోద్దని తెలిపారు. ఓటింగ్ శాతం పెరిగిందంటే ప్రజలు, సంక్షేమ లబ్ధిదారులు సంతోషంగా వచ్చి ఓట్లు వేశారని వివరించారు. వచ్చే నెల 4న వచ్చే ప్రజా తీర్పు టీడీపీ నేతల అసత్య ప్రచారాలకు చెంప పెట్టుగా మారుతుందన్నారు. మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్, జెడ్పీటీసీల సంఘ అధ్యక్షుడు గుంటక తిరుపతిరెడ్డి, జెడ్పీటీసీలు కస్తూరిరెడ్డి, ఒకేరెడ్డి, ఏఎంసీ చైర్మన్ సాల్మన్ రాజు, ఎంపీపీ దంతులూరి ప్రకాశం, రామన తిరుపతిరెడ్డి, అత్యాల జఫన్య, వాసవీ సత్ర సముదాయాల జాతీయ అధ్యక్షుడు దేవకి వెంకటేశ్వర్లు, గజ్జల వెంకటరెడ్డి, ఎస్కే రహీం, దాదిరెడ్డి మాలకొండారెడ్డి, మూలే గోపాల్రెడ్డి,పిల్లి లక్ష్మీ నారాయణరెడ్డి, బసిరెడ్డి పిచ్చిరెడ్డి, ఎస్ నర్సారెడ్డి, పాల్గొన్నారు. తొలుత రెడ్డి కార్పొరేషన్ చైర్మన్, చింతల చెరువు సత్యన్నారాయణరెడ్డి పార్టీ శ్రేణులతో సమీక్ష చేసి మాట్లాడారు. కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తా వైఎస్సార్సీపీ కనిగిరి అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్ -
అదుపు తప్పిన కార్లు
కొనకనమిట్ల/పొదిలి: ఎన్నికల విధులు ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఉన్న ఉద్యోగులు ప్రమాదాలకు గురయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలు, వీవీ ప్యాట్లు, ఇతర పోలింగ్ సామగ్రిని ఉన్నతాధికారులకు అప్పగించిన ఉద్యోగులు మంగళవారం తెల్లవారుజామున ఇంటికి వెళ్తున్న క్రమంలో కొనకనమిట్ల, పొదిలి మండలాల్లో ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఒంగోలుకు చెందిన ముగ్గరు ఉద్యోగులు గిద్దలూరు నియోజకవర్గం అర్ధవీడులో ఎన్నికల విధులు ముగించుకుని కారులో బయలుదేరారు. ఒంగోలు–గిద్దలూరు హైవేపై కొనకనమిట్ల మండలం పాతపాడు సమీపంలో నిద్ర మత్తులోకి జారుకోవడంతో కారు అదుపుతప్పి రోడ్డు మార్జిన్లోకి దూసుకెళ్లింది. ముగ్గురు ఉద్యోగులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అలాగే కొండపిలో ఎన్నికల విధులు ముగించుకుని కారులో మార్కాపురం వెళ్తున్న ముగ్గురు ఉద్యోగులు ప్రమాదానికి గురయ్యారు. వీరు ప్రయాణిస్తున్న కారు పొదిలి మండలం మాదిరెడ్డిపాలెం వద్ద రోడ్డు మార్జిన్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ముగ్గరు ఉద్యోగులకు గాయాలయ్యాయి. అదే మార్గంలో వెళ్తున్న వారు వేగంగా స్పందించి క్షతగాత్రులను పొదిలిలోని ఆసుపత్రికి తరలించారు. తప్పిన పెను ప్రమాదం పొదిలి మండలం సలకనూతల సమీపంలో జాతీయ రహదారిపై వెళ్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. శ్రీశైలం వైపు నుంచి పొదిలి వైపు వస్తుండగా చోటుచేసుకున్న ఈ ఘటనలో విద్యుత్ స్తంభం నేలకూలింది. కారులో ప్రయాణిస్తున్న మహిళతో సహా ముగ్గురు వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రెండు వేర్వేరు ఘటనల్లో ఉద్యోగులకు స్వల్ప గాయాలు ఎన్నికల విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ప్రమాదాలు మరో ప్రమాదంలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు -
నేడు పోస్టల్ ఇన్సూరెన్స్ ఏజెంట్ల నియామకానికి ఇంటర్వ్యూలు
ఒంగోలు సెంట్రల్: భారత ప్రభుత్వ తపాలా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తపాలా బీమా, గ్రామీణ తపాలా బీమా పాలసీలను సేకరించేందుకు ఏజెంట్ల నియామకానికి బుధవారం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ప్రకాశం డివిజన్ తపాలా శాఖ సీనియర్ పర్యవేక్షకుడు ఎండీ జాఫర్ సాధిక్ తెలిపారు. ఒంగోలులోని భాగ్యనగర్ రెండో లైన్లో ఆంజనేయ కాంపెక్ల్లో ఉన్న ప్రకాశం పోస్టల్ సీనియర్ సూపరిండెంట్ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పదో తరగతి పాసై 18 ఏళ్లు నిండిన వారు అర్హులని స్పష్టం చేశారు. సంబంధిత విద్యార్హత సర్టిఫికెట్లతోపాటు రెండు పాస్ పోర్టు సైజు ఫొటోలు, ఆధార్ కార్డు తీసుకుని రావాలని సూచించారు. ఎంపికై న అభ్యర్థులు రూ.5 వేలను ఎన్ఎస్సీ, కేవీపీ ఎకౌంట్ రూపంలో సెక్యూరిటీ డిపాడిట్ చేయాల్సి ఉంటుందని వివరించారు. రెజ్లింగ్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ కొనకనమిట్ల: చిత్తూరులో ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో మండలంలోని వెలుగొండలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించినట్లు ప్రిన్సిపాల్ ఎస్.వెంకటేశ్వరరావు తెలిపారు. విద్యార్థులు ఇట్లా శివయ్య, ఆర్.విష్ణువర్థన్, డి.మహంత్ అండర్–17 రెజ్లింగ్ పోటీల్లో పాల్గొన్నారు. బంగారు పతకం సాధించిన శివయ్య ఈ నెలాఖరున జార్ఖండ్లో నిర్వహించే జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీలకు ఎంపికయ్యాడు. పీఈటీలు చంద్రశేఖర్, ఖాదర్ బాషాను, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారులను ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు అభినందించారు. 19న చేజర్ల తిరునాళ్లకు ఏర్పాట్లు ఒంగోలు రూరల్: ఒంగోలు మండలంలోని చేజర్ల గ్రామంలో కొలువై ఉన్న చేజర్లమ్మ తల్లి తిరునాళ్లను ఈ నెల 19వ తేదీన ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. చేజర్ల గ్రామంలో ఏటా నిర్వహించే ఈ తిరునాళ్లలో ఒంగోలుతోపాటు రూరల్ గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించడం ఆనవాయితీగా వస్తోంది. చేజర్లమ్మ ఆలయంలో అమ్మవారి దర్శనానికి సీ్త్ర, పురుషులకు వేర్వేరు మార్గాల్లో ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేస్తున్నామని, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వైఎస్సార్ సీపీ ఏజెంట్ గుండెపోటుతో మృతి మర్రిపూడి: వైఎస్సార్ సీపీ ఎన్నికల ఏజెంట్ గుండెపోటుతో మృతి చెందిన సంఘటన మండలంలోని జువ్విగుంట గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. బంధువుల కథనం మేరకు.. జువ్విగుంట పోలింగ్ బూత్ 34లో జంగా వెంకటరామిరెడ్డి(37) వైఎస్సార్ సీపీ తరఫున సార్వత్రిక ఎన్నికల ఏజెంట్గా వ్యవహరించారు. ఎన్నికల విధుల్లో భాగంగా ఉదయం 5 గంటలకే పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకుని మాక్ పోలింగ్లో పాల్గొన్నారు. చివరి 10 నిమిషాల సమయంలో తన ఓటు వినియోగించుకున్నారు. ఈవీఎంలను సీల్ చేసిన తర్వాత పోలింగ్ అధికారుల నుంచి ఫారం 17సీ తీసుకుని ఇంటికి వెళ్లారు. భోజనం చేసిన వెంటనే గుండె నొప్పితో కుప్పకూలిన ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు బంధువులు వెల్లడించారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తెలు ఉన్నారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఫోన్లో వెంకటరామిరెడ్డి కుటుబం సభ్యులను పరామర్శించారు. పలువురు పార్టీ నాయకులు మృతుడి నివాసానికి చేరుకుని నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వైఎస్సార్ సీపీలో క్రియాశీలకంగా పని చేసిన వెంకటరామిరెడ్డి లేని లోటు పార్టీకి తీర్చలేనిదని ఎంపీపీ వాకా వెంకటరెడ్డి, ఎంపీటీసీ కముజుల బ్రహ్మారెడ్డి, సర్పంచ్ రావులపల్లి సుమలత నాగరాజు, జెడ్పీటీసీ సభ్యురాలు మాకినేని సుధారాణి వెంకట్రావు పేర్కొన్నారు. నివాళులర్పించిన వారిలో నాయకులు ఇనుకొల్లు సుబ్బారెడ్డి, బోద రమణారెడ్డి, ఇనుకొల్లు పిచ్చిరెడ్డి, మాచేపల్లి నాగయ్య, బోగసముద్రం విజయభాస్కర్రెడ్డి, కదిరి భాస్కర్, మాచేపల్లి హనుమంతరావు ఉన్నారు. ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్లో ఉచిత శిక్షణ ఒంగోలు టౌన్: ఒంగోలులోని భాగ్యనగర్లో గల రూడ్సెట్ సంస్థలో ఈనెల 22 నుంచి ఉచితంగా ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్లో శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ పి.ప్రతాప్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 19 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు కలిగిన పురుషులకు మాత్రమే శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ కాలంలో ఉచిత వసతితోపాటు భోజన సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఆధార్, రేషన్ కార్డుతో సంప్రదించాలని, పేరు నమోదు కోసం 9492583484కు ఫోన్ చేయాలని సూచించారు. -
వాదంపల్లిలో ఉద్రిక్తత
యర్రగొండపాలెం: మండలంలోని వాదంపల్లిలో మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. నీటి ట్యాంకర్ల వద్ద వచ్చిన వివాదంతో పెద్ద ఎత్తున ఇరువర్గాల వారు ఘర్షణకు దిగారు. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఒక వర్గానికి మద్దతుగా సమీప గ్రామమైన అమానిగుడిపాడు గ్రామానికి చెందిన వారు వందల సంఖ్యలో తరలివచ్చారు. వివాదం విషయం తెలియడంతో సీఐ ఆర్.రాములు నాయక్ ఆధ్వర్యంలో పోలీసులు గ్రామానికి చేరుకుని బందోబస్తు నిర్వహించారు. గ్రామంలో నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించేందుకు ఇరువర్గాలకు చెందినవారు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేశారు. ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో ఒక వర్గానికి చెందిన వారు తమ వర్గీయులకు నీటి సరఫరాను నిలిపివేశారు. రెండో వర్గానికి చెందిన నీటి ట్యాంకర్ వద్ద ప్రత్యర్థి వర్గీయులు నీటికోసం వెళ్లి అక్కడ గొడవకు దిగారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు వీధుల్లో మోహరించి ఇరువర్గాల వారిని బయటికి రానీయకుండా చేశారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్బాబు ఆధ్వర్యంలో చేరుకున్న అదనపు పోలీసు బలగాలు పక్క గ్రామం నుంచి వచ్చిన వారిని తరిమికొట్టారు. గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. కంభం సీఐ రామకోటయ్య, ఎస్సైలు సుదర్శన్, వెంకటసైదులు, అంకమరావు, నరసింహారావు తదితరులు బందోబస్తులో పాల్గొన్నారు. గ్రామంలో మోహరించిన పోలీసులు -
ఈవీఎం.. కట్టుదిట్టం
స్ట్రాంగ్ రూమ్ వద్దకు వీవీ ప్యాట్ల చేరవేతసీరియల్ ప్రకారం భద్రపరిచేందుకు సిద్ధం చేసిన వీవీ ప్యాట్లురైజ్ కాలేజీలో ఈవీఎంల అప్పగింత ప్రక్రియను పరిశీలిస్తున్న కలెక్టర్ దినేష్కుమార్వీవీ ప్యాట్లను వాహనం నుంచి దించుతున్న సిబ్బందిసార్వత్రిక ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలను పోలీస్ బందోబస్తు నడుమ ఒంగోలు రైజ్ కాలేజీలోని స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. జిల్లాలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి ఈవీఎంలను ప్రత్యేక వాహనాల్లో ఒంగోలు చేరుకున్నాయి. ఈ ప్రక్రియను జిల్లా అధికారులు పర్యవేక్షించారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లకు సీల్ వేశారు. సాయుధ బలగాలు స్ట్రాంగ్ రూమ్ల వద్ద పహరా కాస్తున్నాయి. – సాక్షి, ఒంగోలుఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లోకి తరలిస్తున్న సిబ్బందిస్ట్రాంగ్ రూమ్లకు సీల్ వేయిస్తున్న కలెక్టర్రైజ్ కాలేజీ ప్రాంగణంలో కలెక్టర్ వెంట ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్, జేసీలు, ఏఎస్పీమార్కాపురంలో ఈవీఎంలను పరిశీలిస్తున్న సబ్కలెక్టర్4321756109118 -
ఏడుగురు టీడీపీ నాయకులపై కేసు నమోదు
కొమరోలు: ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్తను కులం పేరుతో దూషించి, దాడి చేసిన ఏడుగురు టీడీపీ నాయకులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మధుసూదన్రావు తెలిపారు. మండలంలోని చింతలపల్లె గ్రామంలోని ఎంపీపీ పాఠశాలలో సోమవారం ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ వద్ద గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త మన్నె సుశీల్ ఓటు వేసి వస్తున్న సమయంలో టీడీపీ నాయకుడు కృష్ణమోహన్రెడ్డి, కొంకాల కొండయ్య, కొంకాల నరసింహులు, సారె పెద్ద ఓబులేసు, రామ వెంకటేశ్వర్లు, కొంకాల నరసింహులు, ముత్తుముల మధుసూదన్రెడ్డి కులం పేరుతో దూషించి కాళ్లు, చేతులతో దాడి చేశారు. టీడీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు పైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ధన్యవాదాలు తెలిపిన మంత్రి ఆదిమూలపు సురేష్
జరుగుమల్లి (సింగరాయకొండ): కొండపి నియోజకవర్గ ప్రజలకు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులకు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, కొండపి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ధన్యవాదాలు తెలిపారు. అధినేత జగనన్న ఆశీస్సులతో మీ ఆదరాభిమానాలతో సహాయ సహకారాలు అందించారని ప్రశంసించారు. కులాలు, మతాలు, వర్గాలకు అతీతంగా తనకు మద్దతుగా నిలిచి అడుగులో అడుగు వేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని చెప్పారు. ఓటర్లకు ఎమ్మెల్యే అన్నా రాంబాబు కృతజ్ఞతలు మార్కాపురం టౌన్: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్సాహంగా స్పందించి ఓటు హక్కు వినియోగించుకున్న మార్కాపురం నియోజకవర్గ ఓటర్లకు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ మార్కాపురం నియోజకవర్గ అభ్యర్థి అన్నా రాంబాబు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. మంగళవారం మార్కాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీస్సులతో తాను పోటీ చేస్తున్నానని ప్రకటించినప్పటి నుంచి పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు నియోజకవర్గ ఓటర్లు అపూర్వమైన సహకారం అందించారన్నారు. కులాలు, మతాలకు వర్గాలకు అతీతంగా తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. చైతన్య దీప్తితో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోంచుకున్నందుకు ఆయన అభినందించారు. ప్రజలు అందించిన ప్రోత్సాహాన్ని తాను ఎన్నటికీ మర్చిపోనని, మంచి ఆధిక్యతతో గెలుపు దిశగా తనకు సహకరించారంటూ మార్కాపురం నాయకులకు, కార్యకర్తలకు, ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. -
బాక్సుల్లో భవితవ్యం
జిల్లాలో ఎన్నికల బరిలో పార్లమెంట్ నియోజవకర్గంలో 25మంది అభ్యర్థులు పోటీలో ఉండగా 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 140 మంది అభ్యర్థులు ఎన్నికల పోటీలో నిలిచారు. పోటీలో నిలిచిన వారిలో వైఎస్సార్ సీపీ నుంచి పార్లమెంట్ నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉండగా అసెంబీ నియోజకవర్గాలకు సంబంధించి ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి, కొండపిలో ఆదిమూలపు సురేష్, సంతనూతలపాడులో మేరుగు నాగార్జున, మార్కాపురంలో అన్నా వెంకట రాంబాబు, గిద్దలూరులో కుందురు నాగార్జునరెడ్డి, దర్శిలో బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, యర్రగొండపాలెంలో తాటిపర్తి చంద్రశేఖర్, కనిగిరి నుంచి దద్దాల నారాయణ ఎన్నికల బరిలో ఉన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, రిజిస్టర్ అయ్యి గుర్తింపు లేని పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరి భవితవ్యం ఈవీఎం బాక్సుల్లో నిక్షప్తమై ఉంది. -
ఉద్రిక్తతలు సృష్టించినా బంపర్ మెజార్టీతో గెలుపు నాదే
● ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు: ప్రతిపక్షాలు ఎన్ని ఉద్రిక్తతలు సృష్టించినా బంపర్ మెజార్టీతో గెలుపు తనదే అని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. స్థానిక ఉమామహేశ్వర కాలేజీ వద్ద సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులను పోలింగ్ బూత్ల వద్దకు రానివ్వడంలేదని, కానీ పోలింగ్ బూత్ల్లోకి కూడా ప్రతిపక్షాల నాయకులు, కార్యకర్తలను అనుమతిస్తున్నారన్నారు. కేవలం బీజేపీతో కూటమి పొత్తు అనే ఉద్దేశంతో పోలీసులు కూడా ప్రతిపక్ష కూటమికే సహకరిస్తున్నారన్నారు. అయినా జనం తమ వైపు ఉన్నారని బంపర్ మెజార్టీతో గెలుస్తామన్నారు. మహిళలు పెద్ద ఎత్తున తమ పార్టీ పట్ల రాష్ట్రవ్యాప్తంగా ఆదరణ కనబరుస్తున్నారని, వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో మారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమన్నారు. ఎవరు ఎన్ని ఉద్రిక్తతలు సృష్టించినా తాము గమనిస్తూనే ఉన్నామని, కానీ వారి చేష్టలకు ప్రజలే బుద్దిచెప్పేందుకు క్యూలైన్లలో సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట సతీమణి శచీదేవితోపాటు మేయర్ గంగాడ సుజాత, వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు. -
పోలింగ్ ప్రశాంతం
ఒంగోలు అర్బన్: జిల్లాలో ఎన్నికల నేపథ్యంలో చెదురు మదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దినేష్కుమార్ తెలిపారు. సోమవారం రాత్రి కమాండ్ కంట్రోలు సెంటర్లో పోలింగ్ నిర్వహణపై మీడియాతో మాట్లాడారు. పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి కమాండ్ కంట్రోల్ సెంటర్లో వెబ్కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తూ అధికారులకు సూచనలు చేస్తూ పోలింగ్ నిర్వహించామన్నారు. మొదటి మూడు గంటల్లో ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తెలిపారు. పీవోలు, ఏపీవోలు, ఇతర పోలింగ్ సిబ్బంది చక్కటి విధులు నిర్వహించారన్నారు. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ కేంద్రాల్లో క్యూలో ఉన్న ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లా యంత్రాంగం ఓటు హక్కుపై కల్పించిన అవగాహనతో ఓటర్లు భారీగా ఓటు వేశారని తెలిపారు. నందనవనంలో ఓటేసిన 105ఏళ్ల వృద్ధురాలు సుబ్బమ్మఓటేయడానికి వస్తున్న వృద్ధురాలు, దివ్యాంగురాలు -
ఓటు వేయడానికి వెళ్లిన వృద్ధురాలు మృతి
టంగుటూరు: ఓటు విలువ తెలిసిన ఓ వృద్ధురాలు తన హక్కు వినియోగించుకోవడానికి వెళ్లి విగత జీవిగా మారింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలోని మర్లపాడులో సోమవారం జరిగింది. పాలపర్తి అంజమ్మ (65) అనే వృద్ధురాలు స్థానిక మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన బూత్ నంబర్ 173 లో ఓటు వేయడం కోసం క్యూలైన్లో నుంచుంది. అయితే ఓటర్లతో క్యూలైన్ కిక్కిరిసిపోవడంతో అంజమ్మకు ఊపిరి ఆడలేదు. ఈ క్రమంలో అపస్మారక స్థితికి వెళ్లిన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అదే బూత్లో ఓ యువతి కూడా సొమ్మసిల్లి పడిపోవడంతో స్థానికులు అప్రమత్తమై ఆమెకు సపర్యలు చేయడంతో కోలుకుంది. -
ఓటుగాలి వీచింది..
రాత్రి 11.30నిశ్రీశ్రీ లకు అందిన సమాచారం మేరకు జిల్లాలో పోలింగ్ శాతం 82.63. మహిళలే నిర్ణేతలుపల్లె నుంచి పట్నం దాకా ఉదయం ఆరు గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు పోటెత్తారు. సాయంత్రం ఆరు గంటల తర్వాత కూడా బూత్ల వద్ద జన జాతర నెలకొంది. వృద్ధులు, మహిళలు, యువత పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకున్నారు. మేము సైతం అంటూ దివ్యాంగులు కూడా చైతన్యంతో పోలింగ్ కేంద్రాలవైపు కదిలారు. మండుటెండను సైతం లెక్కచేయలేదు. రాత్రి ఎనినిమిది గంటలు దాటినా పలు పోలింగ్ కేంద్రాల వద్ద భారీ క్యూలు కనిపించాయి. కడపటి వివరాలు అందే సరికి జిల్లా వ్యాప్తంగా 82.63 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లలో సంక్షేమ గాలి వీచిందని వైఎస్సార్ సీపీ నేతలు ఉత్సాహంగా కనిపించారు. ఒంగోలు సెయింట్ జేవియర్స్ హైస్కూల్లో ఓటు వేసేందుకు బారులుతీరిన ఓటర్లుమార్కాపురం జెడ్పీ గరల్స్ హైస్కూల్లో క్యూలో ఉన్న ఓటర్లుఒంగోలు అర్బన్: సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఓటర్లు తమ నిర్ణయాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఇక మిగిలింది వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థుల భవితవ్యమే. సోమవారం జిల్లాలో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు చైతన్యంతో పోటెత్తారు. ఉదయం 7 గంటలకు ప్రారంభం అయిన పోలింగ్ ప్రక్రియలో ఆరు గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. నిబంధనల ప్రకారం సాయంత్రం 6 గంటలకు బూత్ల్లోకి ఓటర్లు ప్రవేశించకుండా పోలీసులు గేట్లు మూతేశారు. పోలింగ్ సమయంలో ముగిసేలోగా బూత్ల వద్ద క్యూలో ఉన్న వేలాది మంది రాత్రి పది గంటల వరకూ వేచి ఉండి ఓటు వేశారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో కేంద్రాలకు తరలివచ్చారు. తొలి గంట నుంచి చివరి నిమిషం వరకు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆసక్తి చూపారు. జిల్లాలోని అన్నీ నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాలకు నిర్దేశించిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పోలింగ్ సామగ్రి తరలించి సోమవారం ఉదయం 5 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహించి అనంతరం 7 నుంచి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభించారు. పోలింగ్ సాగుతున్న తీరును జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దినేష్కుమార్ కలెక్టరేట్లోని కంట్రోలు రూములో లైవ్ వెబ్కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించి సంబంధిత రిటర్నింగ్ అధికారులకు సూచనలు చేశారు. జిల్లాలో భద్రతా చర్యలను ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ పర్యవేక్షించారు. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి జిల్లాలో పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి 74.21 శాతం, అసెంబ్లీ నియోజకవర్గాల్లో 73.05 శాతం ఓటింగ్ నమోదు అయింది. 6 గంటలకు పోలింగ్ సమయం అయిన తర్వాత పోలింగ్ కేంద్రాల్లోకి వచ్చి వేచి ఉన్న ఓటర్లకు ఓటు వేసే అవకాశం కల్పించారు. పోలింగ్ ప్రక్రియ జాప్యం జిల్లాలో పలు చోట్ల ఈవీఎంలు మోరాయించాయి. దీంతో పోలింగ్ ప్రక్రియ కొంత జాప్యం అయింది. మరికొన్ని చోట్ల విద్యుత్ అంతరాయం రావడంతో పోలింగ్ ఆలస్యంగా కొనసాగింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఎటువంటి అసౌకర్యం లేకుండా తాగునీరు, షామియానాలు, టాయిలెట్లు తదితర సౌకర్యాలను సిద్ధం చేశారు. పోలింగ్ కేంద్రాలకు 100మీటర్ల దూరంలో వాహనాలు నిలిపేలా చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా 200 మీటర్ల అవతల రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘం నిర్దేశించిన సైజులో షామియానా ఏర్పాటు చేసుకుని ఓటర్లకు అవసరమైన స్లిప్లు ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. జిల్లాలో అక్కడక్కడా చెదురుముదురు ఘటనలు తప్ప పోలింగ్ ప్రశాతంగా ముగియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కొన్ని పోలింగ్ కేంద్ల్ర వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు హల్చల్ చేశారు. కమాండ్ కంట్రోల్ నుంచి పర్యవేక్షణ జిల్లా కేంద్రంలోని ప్రకాశం భవనంలో 16 మంది నోడల్ అధికారులతో వివిధ విభాగాలతో ఎన్నికల ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించేందుకు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచే జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించేలా పెద్ద ఎల్ఈడి స్క్రీన్ను ఏర్పాటు చేసి జిల్లా కలెక్టర్ పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు. ఓటు వేసేందుకు ఉత్సాహంగా కదం తొక్కిన మహిళలు, వృద్ధులు జిల్లాలో 2183 కేంద్రాల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అక్కడక్కడా మొరాయించిన ఈవీఎంలతో పోలింగ్ జాప్యం తెల్లవారుజామున ఆరు గంటల నుంచే క్యూకట్టిన ఓటర్లు ఆలస్యమైనా ఉత్సాహంగా ఓటు వేసిన ప్రజలు సాయంత్రం 6 గంటలకు 73.05 శాతం పోలింగ్ నమోదు 6 గంటల తర్వాత కూడా పోలింగ్ కేంద్రాల్లో వందలాదిగా ఓటర్లు రాత్రి 10 గంటల వరకూ క్యూలోనే ఉండి ఓటేసిన వైనం ప్రకాశం భవన్లోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి కలెక్టర్ దినేష్కుమార్ పర్యవేక్షణ భద్రతా చర్యలపై ఎస్పీ గరుడ్సుమిత్ సునీల్ నిరంతర సమీక్ష -
నెమ్మదిగా ప్రారంభమై జోరందుకుని..
ఒంగోలు అర్బన్: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సోమవారం జరిగిన పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైన ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు కేవలం 9.67 శాతం నమోదైంది. ఆ తర్వాత 9 నుంచి 11 గంటలకు 23.54 శాతం, 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 40 శాతం, అప్పటి నుంచి సాయంత్రం 3 గంటల వరకు 51.31 శాతం, ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు 73.5 శాతం ఓటింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల తర్వాత కూడా పోలింగ్ కేంద్రాల్లో జిల్లా వ్యాప్తంగా వేలాది మంది ఓటర్లు క్యూలైన్లలో ఉన్నారు. వారంతా ఓటు వేసే సరికి రాత్రి 9 గంటలైంది. దీంతో ఓటింగ్ శాతం మరింత పెరిగింది. తొలి నాలుగు గంటల్లో అత్యల్పంగా మార్కాపురం నియజకవర్గంలో 20.45 శాతం ఓటింగ్ నమోదు కాగా, ఆ తర్వాత మూడు గంటల సమయానికి మార్కాపురంలో అత్యధికంగా 52.91 శాతం నమోదైంది. తొలి నాలుగు గంటల్లో ఒంగోలు నియోజకవర్గంలో అత్యధిక శాతం ఓటింగ్ నమోదైనా.. ఆ తర్వాత కొంత మేరకు తగ్గింది. మొత్తం మీద 6 గంటల సమయానికి దర్శిలో 76.23 శాతం ఓటింగ్ నమోదవగా, కొండపిలో అత్యల్పంగా 69.4 శాతం ఓటింగ్ నమోదైంది. రాత్రి 11 గంటలు దాటే నాటికి 15,04,964 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇందులో 7,43,264 మంది పురుషులు, 7,61,662 మంది మహిళలు, ఇతరులు 78 మంది ఉన్నారు. రాత్రి 11.30 గంటల సమయానికి జిల్లాలో 82.63 శాతం ఓటింగ్ నమోదు అత్యధికంగా సంతనూతలపాడులో 86.17 శాతం, అత్యల్పంగా కొండపిలో 79.93 శాతం ఓటింగ్ మొదటి రెండు గంటలు మినహా ఉదయం 9 గంటల నుంచి పోటెత్తిన ఓటర్లు పురుషుకల కంటే మహిళా ఓట్లే అధికం -
జిల్లాలో పోలింగ్ సరళి ఇలా...
నియోజకవర్గం ఉదయం ఉదయం మధ్యాహ్నం మధ్యాహ్నం సాయంత్రం సాయంత్రం రాత్రి 9 గంటలకు 11 గంటలకు 1 గంటలకు 3 గంటలకు 4 గంటలకు 6 గంటలకు 11 గంటలకు యర్రగొండపాలెం 8.52 32.23 36.83 49.3 59.28 72.79 81.58 దర్శి 9.50 21.55 39.95 51.44 67.03 76.23 83.89 సంతనూతలపాడు 11 24.57 43.98 57.95 65.76 79.5 86.17 ఒంగోలు 12.52 26.92 38.16 50.66 71.05 72.68 82.15 కొండపి 12 24.13 37.08 49.10 65.3 69.4 79.93 మార్కాపురం 5.73 20.45 42.10 52.91 61.38 75.51 84.08 గిద్దలూరు 9.57 24.21 40.54 52.85 61 74 81.43 కనిగిరి 8.78 22.41 41.43 52.78 62.36 74.19 81.87 మొత్తం 9.83 24.56 40 52.03 64.02 74.21 82.63 -
యర్రగొండపాలెం నియోజకవర్గం
అభ్యర్థి : ఎరిక్షన్ బాబు పార్టీ : టీడీపీ మేనిఫెస్టోలో ఉన్న హామీలను సైతం ప్రజలకు స్పష్టంగా వివరించలేక టీడీపీ అభ్యర్థి గూడూరి ఎరిక్షన్బాబు ఇబ్బంది పడటం, స్థానికంగా ఉన్న కీలకమైన పార్టీ నేతలతో ఆది నుంచీ ఉన్న విభేదాలు ఆ పార్టీ శ్రేణులను నిరుత్సాహానికి గురిచేస్తున్నాయి. నియోజకవర్గంలోని రైతులు, రైతు కూలీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ సామాజికవర్గాలు టీడీపీ మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను ఆ పార్టీ నేతల ఎదుటే కడిగిపారేయడం, చంద్రబాబు గత హామీలను అమలు చేయని తీరు, టీడీపీ ప్రభుత్వంలో చేసిన అవినీతి, అక్రమాలు ఎరిక్షన్బాబును కలవరపెడుతున్నాయనే వాదన స్థానికంగా బలంగా వినిపిస్తోంది. అభ్యర్థి : తాటిపర్తి చంద్రశేఖర్ పార్టీ : వైఎస్సార్ సీపీ యర్రగొండపాలెం నియోజకవర్గం వైఎస్సార్ సీపీ కంచుకోటగా ఉంది. యర్రగొండపాలెం గడ్డపై మరోసారి వైఎస్సార్ సీపీ జెండా రెపరెపలాడటం ఖాయమని ఆ పార్టీ నేతలు మరింత ధీమా వ్యక్తం చేస్తున్నారు. నవరత్నాలు, ఇతర సంక్షేమ పథకాల రూపంలో నియోజకవర్గంలో పేద, మధ్య తరగతి ప్రజలకు రూ.2 వేల కోట్ల మేర చేకూరిన లబ్ధి, స్థానికంగా అన్ని మండలాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, గిరిజన సంక్షేమానికి చేపట్టిన చర్యలు, రైతుల ఆశలు నెరవేరుస్తూ టీ–5 కెనాల్ నిర్మాణం, వెలిగొండ పూర్తి చేయడం తదితర అంశాలు వైఎస్సార్ సీపీ అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్కు కలిసొచ్చే అంశాలుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
అభ్యర్థి : ఆదిమూలపు సురేష్
పార్టీ : వైఎస్సార్ సీపీ కొండపి నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందించిన సంక్షేమ లబ్ధిని వివరించడంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఆదిమూలపు సురేష్ సఫలమయ్యారు. ఎస్సీ, ఎస్టీలతోపాటు బీసీ, మైనారిటీలు, అగ్రవర్ణాల వారికి ప్రభుత్వం చేసిన మంచిని తెలియజేస్తూ, కార్యకర్తలను చైతన్య పరుస్తూ తనదైన శైలిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీఎం వైఎస్ జగన్ పొన్నలూరు మండలంలో బస్సుయాత్ర, టంగుటూరులో ఎన్నికల సభ నిర్వహించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది. నియోజకవర్గ బాధ్యతలు చేపట్టిన మూడు నెలల్లోనే అభివృద్ధి పనులు చేయడం, ప్రజలకు రూ.1.15 కోట్ల మేర సీఎం రిలీఫ్ చెక్కులు మంజూరు చేయించడంలో చూపిన చొరవ, గత ఐదేళ్లలో సంక్షేమ పథకాల రూపంలో పేదలకు కలిగిన లబ్ధి, పల్లెల్లో అభివృద్ధి కార్యక్రమాలు, దాదాపు 30 ఏళ్లుగా సింగరాయకొండ మండల కేంద్రంలోని రైల్వేస్టేషన్ రోడ్డులో కోదండరామస్వామి దేవస్థానం స్దల సమస్యను పరిష్కరించి ఆర్యవైశ్యులకు అండగా నిలవడం కలిసొచ్చే అంశాలుగా ఉన్నాయన్నది రాజకీయ విశ్లేషకుల మాట. అభ్యర్థి : డీబీవీ స్వామి పార్టీ : టీడీపీ ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు నెగ్గినా కొండపి నియోజకవర్గానికి డీబీవీ స్వామి చేసింది ఏమిటన్న ప్రశ్న ప్రజల నుంచి ఉత్పన్నమవుతోంది. నియోజకరవ్గంలో శాశ్వత అభివృద్ధి చేశామని ఎన్నికల ప్రచారంలో సైతం చెప్పుకొని పరిస్థితి డీబీవీ స్వామిది. ఆది నుంచీ కొండపి నియోజకవర్గంపై తమ ముద్ర ఉండాలని రాజకీయాలు చేస్తున్న దామచర్ల కుటుంబం స్వామిని కీలుబొమ్మలా ఆడిస్తోందన్న విమర్శలున్నాయి. సూపర్ సిక్స్ పథకాల పేరుతో ప్రజలను మభ్యపెట్టేందుకు టీడీపీ నేతలు చేసిన ప్రయత్నం ఆశించిన ఫలితం ఇచ్చేలా కనిపించడం లేదని, గత ప్రభుత్వంలో నీరు–చెట్టులో చేసిన అవినీతి, 15 వేల మరుగుదొడ్ల నిధులు కాజేయడం, గ్రావెల్, ఇసుక దందాలు, కాంట్రాక్టర్లకు బెదిరింపులు తదితర అంశాలు టీడీపీకి ప్రతికూల అంశాలని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. -
దర్శి నియోజకవర్గం
అభ్యర్థి : గొట్టిపాటి లక్ష్మి పార్టీ : టీడీపీ నరసరావుపేట నుంచి వచ్చి దర్శిలో పోటీ చేస్తున్న గొట్టిపాటి లక్ష్మిని స్థానికేతరురాలనే కారణంతో టీడీపీ శ్రేణులే వ్యతిరేకించాయి. ప్రచారంలో లక్ష్మి చేసిన వ్యాఖ్యలు మరింత వ్యతిరేకతను మూటగట్టుకునేలా చేశాయన్నది విశ్లేషకుల అభిప్రాయం. సొంత సామాజికవర్గంలోనూ ఆశించిన ఆదరణ లేకపోవడం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలతోపాటు కాపులు దూరంగా ఉండటం, ప్రజలకు ఏం మంచి చేస్తామో చెప్పి ఆకట్టుకోవడంలో విఫలం చెందడం టీడీపీకి ప్రతికూల అంశాలని స్థానికంగా వినిపిస్తోంది.అభ్యర్థి : బూచేపల్లి శివప్రసాద్రెడ్డి పార్టీ : వైఎస్సార్ సీపీ దర్శి నియోజకవర్గంలో గడిచిన 20 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు దగ్గరగా ఉండటం బూచేపల్లి శివప్రసాద్రెడ్డికి కలిసొచ్చే అంశం. నియోజకవర్గంలో సంక్షేమ పథకాల రూపంలో పేదలకు రూ.2 వేల కోట్ల వరకు అందించడం ద్వారా ఆయా వర్గాల ప్రజల నుంచి భారీగా మద్దతు లభిస్తోంది. బూచేపల్లి కుటుంబంపై ఎక్కడా అవినీతి మచ్చలేకపోవడం, నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కరించేందుకు బూచేపల్లి చేసిన కృషి, ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు, కేజీబీవీ, మోడల్స్కూల్, గురుకుల పాఠశాలలు అభివృద్ధికి చేపట్టిన చర్యలు ప్రజల్లో పేరు తెచ్చాయి. -
హంతకుడు
అన్నదాతల 458 మంది రైతులు బలి చంద్రబాబు మాటలు విని బ్యాంకుల్లో బంగారం కుదవపెట్టిన రైతులు.. రుణమాఫీ కాకపోవడంతో అప్పు తీర్చే మార్గం లేక చివరకు ఆస్తులు అమ్ముకున్నారు. ఆస్తులు కుదవపెట్టినా అప్పులకు సరిపోని 458 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కానీ నాటి ప్రభుత్వం 58 మంది రైతులే ఆత్మహత్య చేసుకున్నట్లు తేల్చింది. మిగిలిన వారివి సాధారణ మరణాలని పేర్కొంటూ రైతుల ఆత్మహత్యల సంఖ్యను తక్కువ చేసి చూపేందుకు ప్రయత్నించింది. ఫలితంగా ఆ కుటుంబాలు ఆర్థికంగా మరింత చితికిపోయాయి. మృతులకు పరిహారం కింద ఐదు లక్షల రూపాయలిస్తామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం విడతలవారీగా రూ.3.50 లక్షల వరకు ఇచ్చి చేతులు దులుపుకొంది. అయితే వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే సీఎం వైఎస్ జగన్ మృతి చెందిన అన్నదాతల కుటుంబాలను ఆదుకున్నారు. ఓ వైపు రైతు సంక్షేమానికి కృషి చేస్తూనే.. అనుకోని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకే చెందేలా రూ.7 లక్షల పరిహారం ఇవ్వాలని నిర్ణయించి, ఆ మేరకు చర్యలు తీసుకున్నారు. ● కనిగిరి నియోజకవర్గం పామూరు మండలం మోపాడు రెడ్డిపాలెంలో 2015 అక్టోబర్ 1న పొగాకు రైతు వాకుమళ్ల చిన పోలిరెడ్డి(62), కనిగిరి మండలం నిమ్మమహేశ్వరపురంలో 2018 ఏప్రిల్ 23న పారాబత్తుని శ్రీహరి(25), 2018 జూన్ 12న చాకిరాలలో నరాల శ్రీనివాసులరెడ్డి(55) అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డారు. ● మార్కాపురం మండలం జమ్మనపల్లె గ్రామానికి చెందిన కౌలురైతు సింగారెడ్డి పేరారెడ్డి పంటలు సాగుకు చేసిన రూ.10 లక్షల అప్పు తీర్చలేక 2016 డిసెంబర్ 31న ఆత్మహత్య చేసుకున్నారు. తర్లుపాడు మండలం సీతానాగులవరంలో రమణయ్య, కొనకనమిట్లకు చెందిన అంగడి తిరుపతయ్య, పొదిలి మండలం రామాపురానికి చెందిన ఎరుకలయ్య అప్పుల ఊబిలో కూరుకుని అర్ధంతరంగా తనువు చాలించారు. ● పెద్దారవీడు పంచాయతీలోని సిద్దినాయునిపల్లెకు చెందిన మెడతోటి అంకయ్య(45), అలాగే రాచర్ల మండలం ఆకవీడుకు చెందిన రైతు సూర రంగారెడ్డి(46) అప్పులోళ్ల ఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. ● కొండపి మండలం పెరిదేపి గ్రామంలో కౌలు రైతు మద్దిరాల వెంకటేశ్వర్లు(50) 2018 సెప్టెంబర్ 13న ఆత్మహత్య చేసుకోగా చంద్రన్న బీమా కింద రూ.30 వేలు చేతిలో పెట్టి, పరిహారం కింద ఇవ్వాల్సిన రూ.5 లక్షలు ఎగ్గొట్టారు. ● మర్రిపూడి మండలం అయ్యపురాజుపాలేనికి చెందిన గంగవరపు హరిబాబు 2015 జూలె 12న అప్పుల బాధ తాళలేక పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పంట సాగు కోసం తెచ్చిన అప్పు వడ్డీతో కలిపి రూ.8 లక్షలు కావడం, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కుదువపెట్టిన బంగారం వేలానికి రావడం, అధికారుల చుట్టూ ఇరవైసార్లు తిరిగినా రుణమాఫీ కాకపోవడంతో హరిబాబు తనువు చాలించాడు. వాస్తవానికి హరిబాబు కుటుంబం టీడీపీ పుట్టినప్పటి నుంచి మద్దతుగా ఉండేది. సభ్యత్యం ఉన్నవారికి పార్టీ తరఫున పరిహారం ఇవ్వాలి. కానీ అటు ప్రభుత్వం తరఫున, ఇటు పార్టీ నుంచి వారికి ఎలాంటి లబ్ధి చేకూర్చలేదు. ఇలా సామాన్యులను, సొంత పార్టీ కార్యకర్తలను చంద్రబాబు నమ్మించి నట్టేట ముంచారు. ఇలా వందలాది మంది రైతులను చంద్రబాబు ఐదేళ్ల పాలనలో బలయ్యారు. సరిగ్గా పదేళ్ల క్రితం.. 2014 ఎన్నికల వేళ టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ హామీ అన్నదాతలను ఆనంద డోలికలో ముంచేసింది. బాబు నక్కజిత్తులను కొద్ది కాలానికే అర్థం చేసుకున్న రైతులు తాము చేసిన తప్పిదానికి చింతించారు. రుణమాఫీ చేయకపోవడంతో బ్యాంకుల్లో కుదవపెట్టిన బంగారం విడిపించుకోలేక, పెట్టుబడికి డబ్బులేక, చేసిన అప్పు తీర్చలేక మదన పడిన రైతులకు పురుగు మందే పెరుగన్నమైంది.. ఉరికొయ్యలే ఊయలలయ్యాయి. బాబు ఐదేళ్ల జమానాలో జిల్లాలో 458 మంది రైతులు అర్ధంతరంగా తనువు చాలించారు. – సాక్షి నెట్వర్క్ బాబు–కరువు కవల పిల్లలు టీడీపీ జమానాలో రైతు లోగిళ్లు కళ తప్పాయి. 2014 నుంచి 2019 వరకు ఏటా లోటు వర్షపాతమే నమోదై కరువు–బాబు కవల పిల్లలు అనే మాటను నిజం చేసింది. తీవ్ర వర్షాభావం కారణంగా పంటలు సాగు చేసినా దిగుబడి రాక.. పెట్టుబడి కూడా దక్కక రైతులు విలవిల్లాడారు. కరువు తీవ్ర రూపం దాల్చడంతో జిల్లాలో 4 లక్షల మంది రైతులు, కూలీలు బతుకుదెరువు కోసం చైన్నె, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాలకు వలస వెళ్లిన దుస్థితి. కందుకూరు, కనిగిరి ప్రాంతాల రైతులు హైదరాబాద్ లాంటి నగరాల్లో జ్యూస్ షాపుల్లో పనిచేశారంటే నాటి పరిస్థితి ఎలా ఉందో అవగతమవుతుంది. పంట నష్ట పరిహారం ఇవ్వడంలో, ఇన్పుట్ సబ్సిడీ మంజూరులో బాబు సర్కారు నిర్లక్ష్య వైఖరి రైతులను మరింత కష్టాల్లోకి నెట్టింది. ● రుణమాఫీ పేరుతో రైతులను దారుణంగా వంచించిన చంద్రబాబు ● బ్యాంకులకు అప్పు కట్టవద్దంటూ 2014కు ముందు ఊరూరా డప్పు ● నిజమని నమ్మి వడ్డీ కూడా కట్టకపోవడంతో భారం తడిసి మోపెడు ● చంద్రబాబు ఐదేళ్ల పాలనలో జిల్లాలో సుమారు 458 మంది రైతుల ఆత్మహత్య -
No Headline
సార్వత్రిక ఎన్నికల సమరానికి ఎలక్షన్ కమిషన్ సర్వం సిద్ధం చేసింది. పటిష్ట బందోబస్తు నడుమ పోలింగ్ బూత్లకు ఎన్నికల సామగ్రిని తరలించింది. మరో వైపు ప్రధాన రాజకీయ పార్టీలు అస్త్ర శస్త్రాలతో ఎన్నికల సంగ్రామానికి పాంచజన్యం పూరించాయి. ఎన్నికల యుద్ధంలో కాలర్ ఎగరేసేది ఎవరో ఓటర్లు తేల్చనున్నారు. నేరుగా ఇంటికే చేరిన సంక్షేమ పథకాలు, కళ్ల ఎదుట కనిపిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని అధికార వైఎస్సార్ సీపీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తుండగా.. టీడీపీ శ్రేణులు మాత్రం విజయావకాశాలపై ధీమా వ్యక్తం చేయలేని స్థితిలోకి చేరుకోవడం గమనార్హం. ప్రధాన రాజకీయ ప్రత్యర్థుల బలాలు, బలహీనతలపై ఓటర్లు ఇప్పటికే ఓ అంచనాకు వచ్చినట్టు స్పష్టమవుతోంది. – సాక్షి నెట్వర్క్
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
మిస్ యూఎస్ఏ విజేతల వరుస రాజీనామాలు! రీజన్ ఏంటో చెప్పిన తల్లులు
ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సినిమా.. ఉచితంగా స్ట్రీమింగ్
వారి కోసం విరుష్క స్పెషల్ గిఫ్ట్.. ఎందుకంటే? (ఫొటోలు)
ఏపీ సీఎస్, డీజీపీని ఢిల్లీకి పిలిచిన ఈసీఐ
పబ్లిసిటీ కోసం వాడుకున్నారు.. అందువల్లే తీవ్రమైన సమస్య: నటి సోదరుడు
వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్లోనే !
WC: నో రిజర్వ్ డే!.. ఒకవేళ టీమిండియా సెమీస్ చేరితే.. జరిగేది ఇదే!
‘పీవోకే’ భారత్లో భాగమే.. మేం దానిని చేజిక్కించుకుంటాం
YSRCPకి ఓటు వేశాడని తండ్రిపై కొడుకు దాడి..
T20 WC: సంజూ వద్దు.. పంత్ బెటర్!.. తుదిజట్టులో ఆడించినా..
తప్పక చదవండి
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- లైంగిక వేధింపుల కేసు: భారత్కు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ!
- నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- యంగ్ హీరోతో మృణాల్ డేటింగ్? ఏంటి విషయం!
- టీడీపీ మూకలకు మంత్రి మేరుగ వార్నింగ్
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
- ‘ఆ దేవాలయాలు నిర్మించాలంటే 400కుపైగా సీట్లు కావాల్సిందే’
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- NewsClick Row: ప్రబీర్ తక్షణ రిలీజ్కు సుప్రీం కోర్టు ఆదేశం
Advertisement