ఉద్రిక్తతలు సృష్టించినా బంపర్‌ మెజార్టీతో గెలుపు నాదే | Sakshi
Sakshi News home page

ఉద్రిక్తతలు సృష్టించినా బంపర్‌ మెజార్టీతో గెలుపు నాదే

Published Tue, May 14 2024 12:40 PM

-

ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి

ఒంగోలు: ప్రతిపక్షాలు ఎన్ని ఉద్రిక్తతలు సృష్టించినా బంపర్‌ మెజార్టీతో గెలుపు తనదే అని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. స్థానిక ఉమామహేశ్వర కాలేజీ వద్ద సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు, నాయకులను పోలింగ్‌ బూత్‌ల వద్దకు రానివ్వడంలేదని, కానీ పోలింగ్‌ బూత్‌ల్లోకి కూడా ప్రతిపక్షాల నాయకులు, కార్యకర్తలను అనుమతిస్తున్నారన్నారు. కేవలం బీజేపీతో కూటమి పొత్తు అనే ఉద్దేశంతో పోలీసులు కూడా ప్రతిపక్ష కూటమికే సహకరిస్తున్నారన్నారు. అయినా జనం తమ వైపు ఉన్నారని బంపర్‌ మెజార్టీతో గెలుస్తామన్నారు. మహిళలు పెద్ద ఎత్తున తమ పార్టీ పట్ల రాష్ట్రవ్యాప్తంగా ఆదరణ కనబరుస్తున్నారని, వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో మారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమన్నారు. ఎవరు ఎన్ని ఉద్రిక్తతలు సృష్టించినా తాము గమనిస్తూనే ఉన్నామని, కానీ వారి చేష్టలకు ప్రజలే బుద్దిచెప్పేందుకు క్యూలైన్లలో సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట సతీమణి శచీదేవితోపాటు మేయర్‌ గంగాడ సుజాత, వైఎస్సార్‌ సీపీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement