-
స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
టాలీవుడ్లో మురారి, ఇంద్ర లాంటి సూపర్ హిట్ సినిమాలతో మెప్పించిన భామ సోనాలి బింద్రే. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ వెండితెరపై మెరిసింది. ఇటీవల ది బ్రోకెన్ న్యూస్ సీజన్-2 తో ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం తన వెబ్ సిరీస్ ప్రమోషన్లతో బిజీగా ఉంది ముద్దుగుమ్మ. ఈ సందర్భంగా సోనాలికి ఓ ఊహించని ప్రశ్న ఎదురైంది. గతంలో పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ అక్తర్ మీపై విపరీతంగా ప్రేమించాడని వార్తలొచ్చాయి.. అంతేకాదు పెళ్లికి ఒప్పుకోకపోతే కిడ్నాప్ చేస్తానని అన్నట్లు తెగ వైరలయ్యాయి.అయితే తాజా ఇంటర్వ్యూలో వీటిపై సోనాలి బింద్రే స్పందించింది. ఆ ప్రశ్న వినగానే సోనాలి ఆశ్చర్యం వ్యక్తం చేసింది. దీని గురించి మాట్లాడుతూ.. 'అతను నిజంగా చెప్పాడో లేదో నాకు తెలియదు.. అయితే ఇది ఎంతవరకు నిజమో కూడా నాకు తెలియదు.. ఇప్పటికీ ఆ ఫేక్ న్యూస్ ఉందని ఆమె కొట్టిపారేశారు. అయితే అతను తన అభిమాని కావడం సంతోషంగా ఉందని ఆమె అన్నారు.అయితే 2019లో సోనాలికి సంబంధించి తాను ఎప్పుడూ ఎక్కడా మాట్లాడలేదని షోయబ్ స్పష్టం చేశాడు. షోయబ్ తన సొంత యూట్యూబ్ ఛానెల్లో దీనిపై వీడియో పోస్ట్ చేశారు. ఇంతటితో ఈ రూమర్స్కు స్వస్తి చెప్పాలనుకుంటున్నట్లు తెలిపారు. నేను ఆమెను సినిమాల్లో చూశాను.. తన అందమైన నటి కూడా అని అన్నారు. అయితే ఆమె క్యాన్సర్తో పోరాడిన తీరు చూసి అభిమానించడం మొదలుపెట్టానని షోయబ్ వెల్లడించారు. -
పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
అమెజాన్ ప్రైమ్లా బెస్ట్ వెబ్ సిరీస్లో లిస్ట్లో 'పంచాయత్' తప్పకుండా ఉంటుంది. ఇప్పటి వరకు విడుదలై రెండు సిజన్లూ సూపర్ హిట్ అందుకున్నాయి. సీజన్ 3 కోసం ఎదురుచూస్తోన్న ఫ్యాన్స్ కోసం మేకర్స్ తాజాగా ట్రైలర్ను విడుదల చేశారు. మే 28 నుంచి ఈ సిరీస్ అమెజాన్లో విడుదల కానుంది. 2020లో మొదటి సీజన్ విడుదలైతే.. 2022లో సీజన్-2 రిలీజ్ అయింది.కామెడీ డ్రామా సిరీస్లో అభిషేక్ త్రిపాఠిగా నటించిన జితేంద్రకుమార్కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇండియాలోనే అత్యధిక మంది వీక్షించిన వెబ్సిరీస్ల లిస్ట్లో టాప్ ప్లేస్లో ఒకటిగా పంచాయత్ సీజన్ 1, సీజన్ 2 నిలిచాయి. గత సీజన్స్ లాగే సీజన్ 3 కూడా ఎనిమిది ఎపిసోడ్స్తో విడుదల కానుంది. మే 28 నుంచి అమెజాన్ ప్రైమ్లో 'పంచాయత్' సీజన్ 3 ఎంట్రీ ఇవ్వనుంది.తాజాగా విడుదలైన ట్రైలర్తోనే పంచాయత్ మూడో సీజన్పై భారీ అంచనాలను పెంచేశారు. తొలి రెండు సీజన్లు ఎంతటి హిట్ అందుకున్నాయో.. మూడో సీజన్ కూడా ప్రేక్షకులను అలరిస్తుందని అంచనావేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా కామెడీకి ఎక్కువ చోటు కల్పించిన దర్శకుడు రెండో భాగం ముగింపులో కాస్త భావోద్వేగాలను కూడా జోడించడంతో మరింతగా ప్రేక్షకులకు ఈ సిరీస్ దగ్గరైంది. -
Buddy First Single: పాటతో రూమర్స్కి చెక్ పెట్టిన అల్లు శిరీష్!
‘ఊర్వశివో రాక్షసీవో’(2022) తర్వాత అల్లు శిరీష్ నుంచి ఎలాంటి సినిమా రాలేదు. ఆ సినిమా రిలీజైన కొన్నాళ్లకే బడ్డీ మూవీ అనౌన్స్ చేశాడు. చిన్న గ్లింప్స్ కూడా విడుదల చేశారు. కానీ ఆ తర్వాత ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. ఒకనొక దశలో ఈ సినిమాను పక్కకు పెట్టేసినట్లు వార్తలు వినిపించాయి. తాజాగా ఓ పాటను రిలీజ్ చేసి రూమర్స్ అన్నింటికి చెక్ పెట్టారు మేకర్స్. బుధవారం ఉదయం ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'ఆ పిల్ల కనులే..' రిలీజ్ చేశారు. హిప్ హాప్ తమిళ ఈ పాటను బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు. సాయి హేమంత్ లిరిక్స్ అందించగా హిప్ హాప్ తమిళ తో కలిసి సంజిత్ హెగ్డే, ఐరా, విష్ణు ప్రియ రవి పాడారు. 'ఆ పిల్ల కనులే, చూశాక తననే ఊహల్లో ఎగిరే మైకంలో మునిగే , మైకంలో తేలే, మబ్బులు తాకే, ఇద్దరి కథ ఇక మొదలాయే, నింగి నేల కలిశాయో, ఊసులేవో పలికాయో..' అంటూ మంచి రొమాంటిక్ నెంబర్ గా సాగుతుందీ పాట.శిరీష్, గాయత్రి భరద్వాజ్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు శామ్ ఆంటోన్ దర్శకత్వం వహించగా, స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న "బడ్డీ" సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. రిలీజ్ డేట్ ను త్వరలో అనౌన్స్ చేయబోతున్నారు. -
ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సినిమా.. ఉచితంగా స్ట్రీమింగ్
గతేడాదిలో విడుదలైన హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా 'ఆక్వామాన్ అండ్ ద లాస్ట్ కింగ్డమ్' మరో ఓటీటీలోకి రానుంది. ఇప్పటికే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్ ప్రాతిపదికన స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఇప్పుడు జియో సినిమాలో ఈ చిత్రాన్ని ఉచితంగా చూడొచ్చు. 2018లో వచ్చిన ‘ఆక్వామెన్’ తెలుగు ప్రేక్షకులను కూడా అలరించింది. ఆ చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన మరో సూపర్ హీరో ఫిల్మ్ 'ఆక్వామెన్ అండ్ ది లాస్ట్ కింగ్డమ్'.జేమ్స్ వాన్ డైరెక్ట్ చేసిన ఈ ఆక్వామాన్ మూవీలో జేసన్ మొమొవా ఈ ఆక్వామాన్ (ఆర్థర్ కర్రీ) పాత్ర పోషించాడు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి విజయాన్ని అందుకుంది. కామిక్స్ నుంచి పుట్టుకొచ్చిన మరో సూపర్ హీరో 'ఆక్వామెన్'. ఇప్పటికే పలువురు సూపర్హీరోలను అందించిన హాలీవుడ్.. అక్వామాన్ను కూడా సూపర్ హిట్ అయింది. మే 21వ తేదీ నుంచి జియో సినిమాలో ఈ చిత్రాన్ని ఫ్రీగా చూడొచ్చు. -
పబ్లిసిటీ కోసం వాడుకున్నారు.. అందువల్లే తీవ్రమైన సమస్య: నటి సోదరుడు
బాలీవుడ్ నటి రాఖీ సావంత్ బీ టౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. అయితే ఆమె తల్లి మరణం, భర్తతో వివాదం తర్వాత డిప్రెషన్లోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో తాజాగా రాఖీ సావంత్ తీవ్రమైన గుండె సమస్యతో ముంబయిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని ఆమె బ్రదర్ రాకేశ్ వెల్లడించారు. తన సోదరి డిప్రెషన్లో ఉండడం వల్లే గుండె సమస్య వచ్చిందని ఆమె సోదరుడు రాకేష్ సావంత్ వెల్లడించారు.మా అమ్మ చనిపోయాక అందరూ రాఖీని పబ్లిసిటీ కోసం, డబ్బు కోసం వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. అంతే కాకుండా ఆమెను అందరూ వేధింపులకు గురి చేశారని అన్నారు. ఆదిల్ తన సోదరి వద్ద ఉన్న డబ్బునంతా కాజేసి మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిల్పై ఇప్పటివరకు ఛార్జ్షీట్ వేయలేదని..డబ్బులతో అందరినీ మేనేజ్ చేస్తున్నాడని అన్నారు. తన సోదరి కోసం ప్రార్థించాలని ఆమె అభిమానులను కోరారు. అందరూ కలిసి రాఖీకి ద్రోహం చేయడంతో దిగ్భ్రాంతికి గురయ్యానని రాకేశ్ పేర్కొన్నారు. రాఖీకి ఏదైనా జరిగితే ఆమె అభిమానులు తనను ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టరని రాకేశ్ సావంత్ అన్నారు. ఆమెకు అపరేషన్ బాగా జరగాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. View this post on Instagram A post shared by Bollywood Khabar (@bollywoodkhabarofficial) -
మెహరీన్పై తప్పుడు వార్తలు.. క్షమాపణ చెప్పాలంటూ ఫైర్
‘హనీ ఈజ్ ది బెస్ట్’ అంటూ ‘ఎఫ్ 2’లో బోలెడంత సందడి చేశారు మెహరీన్. ఈ సినిమాతో ఆమెకు టాలీవుడ్లో భారీగా పాపులారిటీ దక్కింది. అయితే, కొద్దిరోజుల క్రితం మెహరీన్ ఎగ్ ఫ్రీజింగ్ గురించి ఒక పోస్ట్ పెట్టారు.పిల్లలు అప్పుడే వద్దని భావించే తల్లి దండ్రులకు ఎగ్ ఫ్రీజింగ్ పద్ధతి ఉపయోగపడుతుంది. ఈ క్రమంలో కొందరు సెలబ్రటీలు కూడా పెళ్లి కాకుండానే తమ అండాలను భద్రపరుచుకుంటున్నారు. ఈ విధానాన్ని ఇప్పటికే వివిధ రంగాలకు చెందిన యువతులే కాకుండా హీరోయిన్లు కూడా ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలో మెహరీన్ కూడా ఎగ్ ఫ్రీజింగ్ను ఎంపిక చేసుకుంది. ఇదే విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలిపింది.అయితే, తన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని మెహరీన్ ఫైర్ అయింది. ఈ అంశం గరించి తప్పుగా వార్తలను ప్రచురించిన వారు వారు బహిరంగ క్షమాపణలు చెప్పాలని కోరింది. ' పలు మీడియా సంస్థల్లో పనిచేసే వారు వారి వృత్తి పట్ల చాలా గౌరవంగా ఉండాలి. ఇలాంటి అంశాలను అర్థం చేసుకుని వార్తలను అందించండి. ఎవరికితోచినట్లు వారు తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. సోషల్ మీడియాలో నేను పెట్టిన 'ఎగ్ ఫ్రీజింగ్' పోస్ట్పై కొందరు రకరకాల వార్తలు రాశారు. ఈ విధానంలో అమ్మాయిలు గర్భవతులు కావాల్సిన అవసరం లేదు. మొదట ఈ విషయాన్నిఅందరూ తెలుసుకోవాలి. నేను ఒక సెలబ్రిటీగా అవగాహన కల్పించడం కోసం మాత్రమే ఆ పోస్ట్ పెట్టాను. పిల్లలు అప్పుడే వద్దని భావించే వారందరికీ ఎగ్ ఫ్రీజింగ్ ఉపయోగపడుతుంది. కానీ ఇలాంటివి ఏమీ తెలుసుకోకుండా మీ స్వార్థం కోసం తప్పుడు వార్తలు రాశారు. నేను ప్రెగ్నెంట్ అని ప్రచారం చేశారు. ఇదీ చాలా తప్పుగా అనిపించలేదా..? ఇప్పటికైనా ఇలాంటి వార్తలకు ఫుల్స్టాప్ పెట్టిండి. మీ తప్పును తెలుసుకొని సరిచేసుకోండి లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వెంటనే నాపై పెట్టిన పోస్ట్లను తొలగించండి. ఆపై బహిరంగ క్షమాపణలు చెప్పండి.' అని మెహరీన్ కోరింది.'ఎగ్ ఫ్రీజింగ్' పద్ధతి ఎందుకు పాటిస్తున్నారంటే..?ఈ కాలంలో మహిళలు తమ కెరీర్, ఇతర కారణాల రీత్యా అమ్మతనాన్ని వాయిదా వేస్తున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది. ముఖ్యంగా వ్యాపారం, సినిమా రంగలో ఉండే మహిళలు పెళ్లి, అమ్మతనాన్ని వాయిదా వేస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం. లైఫ్లో అనుకున్నంతగా సెటిల్ అయ్యాక పిల్లల్ని కంటాం అని ఇప్పటికే చాలామంది దంపతులు చెప్పారు కూడా.. ఆ కోవకు చెందిన వారు తీరా పిల్లల్ని కనాలనుకునే సరికి.. వయసు దాటి పోవడం, అండాల నిల్వ, నాణ్యత తగ్గిపోవడం జరుగుతుంది. అలాంటి వారికి 'ఎగ్ ఫ్రీజింగ్' పద్ధతి ఒక వరం అని చెప్పవచ్చు. 30 ఏళ్ల వయసులోపు ఉన్నప్పుడే ఆరోగ్యకరమైన తమ అండాల్ని ఇలా భద్రపరుచుకుంటారు. ఆపై వారికి నచ్చినప్పుడు పిల్లల్ని కంటారు. View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) -
సైకో థ్రిల్లర్గా 'దక్షిణ'.. ట్రైలర్తోనే భయపెట్టారు!
కబాలి ఫేమ్ సాయి ధన్షిక ప్రధానపాత్రలో వస్తోన్న చిత్రం దక్షిణ. మంత్ర, మంగళ సినిమాలతో మెప్పించిన ఓషో తులసి రామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కల్ట్ కాన్సెప్ట్స్ మూవీ బ్యానర్పై అశోక్ షిండే నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రిషవ్ బసు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి గ్లింప్స్ రిలీజ్ చేయగా.. ఆడియన్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను డైరెక్టర్ బుచ్చిబాబు సనా రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా డైరెక్టర్ బుచ్చిబాబు మాట్లాడుతూ... 'ఈ మధ్య కాలంలో నన్ను బయపెట్టిన ట్రైలర్ ఇదే. తులసి రామ్ టాలీవుడ్కి మరో ట్రెండ్ సెట్టర్. దక్షిణ సినిమాతో సైకో థ్రిల్లర్ను ఇవ్వబోతున్నారు' అంటూ అభినందించారు. కాగా.. ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాతలతో పాటు చిత్రబృందం కూడా పాల్గొన్నారు. ఈ సినిమా సైకో థ్రిల్లర్గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా చూసేటప్పుడు ఏం జరుగుతోందన్న సస్పెన్స్ ప్రేక్షకుల్లో ఉత్కంఠ కలిగిస్తుందని నిర్మాత అశోక్ షింజే అన్నారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని ఆయన తెలిపారు. -
'హౌస్ ఆఫ్ డ్రాగన్స్' సీజన్ 2 ట్రైలర్ రిలీజ్
ప్రపంచంలోనే అద్భుతమైన వెబ్ సిరీసుల లిస్టు తీస్తే అందులో 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' టాప్లో ఉంటుంది. 2011-18 మధ్య దాదాపు ఎనిమిది సీజన్లు వస్తే అవన్నీ కూడా ఒకదాన్ని మించి మరొకటి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. దీనికి ప్రీక్వెల్గా 'హౌస్ ఆఫ్ డ్రాగన్' పేరుతో మరో సిరీస్ తీస్తే అది కూడా హిట్ అయింది. 2022లో తొలి సీజన్ రిలీజ్ కాగా, త్వరలో రెండో సీజన్ స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే ట్రైలర్ రిలీజ్ చేయగా, అది అంచనాల్ని పెంచేస్తోంది.(ఇదీ చదవండి: ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం)'హౌస్ ఆఫ్ డ్రాగన్స్' రెండో సీజన్లో మొత్తంగా ఎనిమిది ఎపిసోడ్స్ ఉన్నాయి. జూన్ 16 నుంచి ఒక్కో వారం ఒక్కొక్కటి చొప్పున రిలీజ్ చేయనున్నారు. హెచ్బీవో మ్యాక్స్, జియో సినిమా ఓటీటీల్లో దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే తొలి సీజన్ చూసిన ప్రేక్షకులు.. రెండో సీజన్ తొలి ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చూస్తున్నారు.(ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన 'దసరా' నటుడి హిట్ సినిమా) -
ఆ స్ఫూర్తితోనే ‘రాజు యాదవ్’ కథ రాశా: డైరెక్టర్ కృష్ణమాచారి
‘‘భాగ్యలక్ష్మి బంపర్ డ్రా’లో అలీగారికి కోటి రూపాయిల లాటరీ తగులుతుంది. ఆ ఆనందంలో ఆయన నవ్వుతూనే చనిపోతారు. సినిమా అంతా నవ్వు ముఖంతోనే ఉంటారు. అలాగే క్రికెటర్ లక్ష్మీపతి బాలాజీకి జరిగిన సర్జరీ వల్ల ఆయన ముఖం ఎప్పుడూ నవ్వుతున్నట్లే కనిపిస్తుంది. ఇలాంటి లోపంతో కథ రాస్తే బావుంటుందనిపించి ‘రాజు యాదవ్’ స్క్రిప్ట్ రాశాను’’ అని డైరెక్టర్ కృష్ణమాచారి అన్నారు. గెటప్ శ్రీను హీరోగా కె. ప్రశాంత్ రెడ్డి, రాజేశ్ కల్లెపల్లి నిర్మించిన చిత్రం ‘రాజు యాదవ్’. ఈ నెల 17న ఈ సినిమా రిలీజవుతున్న సందర్భంగా కృష్ణమాచారి మాట్లాడుతూ– ‘‘15 ఏళ్ల క్రితం ఇండస్ట్రీకి వచ్చాను. ‘నీదీ నాదీ ఒకే కథ, విరాటపర్వం’ చిత్రాలకు దర్శకుడు వేణు ఊడుగులగారి వద్ద అసోసియేట్ డైరెక్టర్గా చేశాను. దర్శకుడిగా ‘రాజు యాదవ్’ నా తొలి చిత్రం. నాకు సహజత్వంతో కూడకున్న సినిమాలంటే ఇష్టం. ‘రాజు యాదవ్’ రియలిస్టిక్గా ఉంటుంది. గెటప్ శ్రీను కెరీర్లో ఇది గుర్తుండిపోయే సినిమా అవుతుంది. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం, సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతం సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లాయి. చంద్రబోస్గారు మా సినిమా కోసం ఓ పాట రాసి, పాడటం సంతోషంగా ఉంది. సినిమా అద్భుతంగా వచ్చింది’’ అన్నారు. -
'అత్తమ్మాస్ కిచెన్'పై విమర్శలు.. వివరణ ఇచ్చిన టీమ్
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ ఇటీవల వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. 'అత్తమ్మాస్ కిచెన్' పేరుతో ఫుడ్ బిజినెస్ ప్రారంభించారు. అత్తాకోడళ్ల అనుబంధాన్ని ఉపాసన సరికొత్తగా 'అత్తమ్మాస్ కిచెన్'తో నిర్వచించారు. తన అత్తగారైన సురేఖ కొణిదెల వంటలను అందరికీ రుచి చూపించేలా అత్తమ్మ కిచెన్ పేరుతో ఫుడ్ బిజినెస్ను ప్రారంభించారు ఉపాసన. అప్పటికప్పుడు తయారుచేసుకునేలా నాణ్యమైన డ్రై హోమ్ ఫుడ్స్ని అందించే లక్ష్యంతో దీనిని మొదలుపెట్టారు. ఇందులోభాగంగా 'అత్తమ్మాస్ కిచెన్' కోసం సురేఖ తాజాగా మామిడికాయ పచ్చళ్లు పెట్టారు. అవి ఆన్లైన్లో భారీగా విక్రయాలు కొనసాగుతున్నాయి.తాజాగా 'అత్తమ్మాస్ కిచెన్' పేజీ నుంచి ఒక ఫోటోను విడుదల చేశారు. అందులో తన అత్తగారు అయిన పద్మతో కలిసి లావణ్య త్రిపాఠి కనిపించారు. కొత్త ఆవకాయ్ పచ్చడిని తయారు చేస్తూ ఫోటోలు దిగారు. అయితే, ఆ ఫోటోలపై కొందరు కామెంట్లు చేశారు. 'అత్తమ్మాస్ కిచెన్' ప్రొడక్ట్ విషయంలో సరైన నాణ్యత విలువలు పాటించడం లేదంటూ కామెంట్ల రూపంలో నెటిజన్లు తెలిపారు. ఆవకాయ్ కలిపే సమయంలో చేతులకి గ్లౌస్ పెట్టుకోలేదు.. ఆపై వారి జుట్టుని కూడా అలా వదిలేశారు. అందులో హెయిర్ పడితే పరిస్థితి ఏంటి..? ఏ మాత్రం హైజీన్ పాటించడం లేదంటూ విమర్శలు చేశారు. దీంతో అత్తమ్మాస్ కిచెన్ పేజీ నుంచి నెటిజన్లకు తిరిగి సమాధానం వచ్చింది. వాస్తవంగా కస్టమర్స్ కోసం చేసేటప్పుడు చాలా హైజీన్ పాటిస్తామని తెలిపారు. లావణ్య, పద్మ గారు తమ ఇంటి కోసం చేస్తున్న ఆవకాయ్ కాబట్టి అలా కనిపించారని తెలిపారు. అత్తమ్మాస్ కిచెన్ నుంచి వచ్చే ప్రొడక్ట్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటామని, అవి చాలా హైజిన్గా మెయింటైన్ చేస్తామని ఆ విషయంలో ఎలాంటి సందేహాలు వద్దని వారు చెప్పారు. View this post on Instagram A post shared by Athamma`s Kitchen (@athammaskitchen) -
యంగ్ హీరోతో మృణాల్ డేటింగ్? ఏంటి విషయం!
హీరోయిన్ మృణాల్ ఠాకుర్.. ఈ పేరు చెబితే తెలుగు గుర్తుపట్టేస్తారు. 'సీతారామం' బ్యూటీ అంటే ఇంకా త్వరగా గుర్తుపట్టేస్తారు. చేసినవి మూడు నాలుగు సినిమాలే అయినా గోల్డెన్ లెగ్ అనిపించింది. 'ఫ్యామిలీ స్టార్' తప్పితే మిగతా రెండు సూపర్ హిట్ అయ్యాయి. అయినా సరే ఆచితూచి సినిమాలు చేస్తోంది. మరోవైపు తాజాగా ఓ యువ హీరోతో చెట్టాపట్టాలేసుకుని కనిపించడం హాట్ టాపిక్గా మారిపోయింది.(ఇదీ చదవండి: ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం)2014 నుంచి ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ మృణాల్కి 'సీతారామం' సినిమాతో బోలెడంత గుర్తింపు దక్కింది. హిట్ దక్కింది కదా అని వరసపెట్టి మూవీస్ ఏం చేసేయలేదు. కానీ ఫొటోషూట్స్తో ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లో ఉంటోంది. అలానే మొన్నీమధ్య ఎగ్ ఫ్రీజింగ్ గురించి కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. ఇప్పుడు బాలీవుడ్ యువ హీరో సిద్ధాంత్ చతుర్వేదితో డేటింగ్ చేస్తుందా అనే డౌట్ వస్తోంది.ఎందుకంటే తాజాగా సిద్ధాంత్-మృణాల్.. ముంబయిలోని ఓ రెస్టారెంట్కి కలిసి వెళ్లారు. తిరిగి వెళ్లిపోయేటప్పుడు మృణాల్.. ఇతడికి హగ్ ఇవ్వడంతో పాటు చేతులు పట్టుకుని బయటకు నడుచుకుంటూ వచ్చింది. దీంతో వీళ్లిద్దరి మధ్య ఏమైనా ఉందా? అని మాట్లాడుకుంటున్నారు. మరోవైపు వీళ్లిద్దరూ ఏదైనా కొత్త ప్రాజెక్ట్ కోసం కలిసి ఉంటారని పలువురు నెటిజన్లు అంటున్నారు. వీటిలో ఏది నిజమనేది క్లారిటీ రావాల్సి ఉంది.(ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన 'దసరా' నటుడి హిట్ సినిమా)#siddhantchaturvedi being the true Gentleman for Mrunal ❤️✨ #mrunalthakur pic.twitter.com/n4zLhtI46T— Viral Bhayani (@viralbhayani77) May 13, 2024 -
టబుకి హాలీవుడ్ చాన్స్.. ఆ వెబ్ సీరీస్లో కీలక పాత్ర!
సీనియర్ నటి టబు సెకండ్ ఇన్నింగ్స్లో వరుస బాలీవుడ్ చిత్రాలతో దూసుకెళుతున్నారు. ఇటీవల విడుదలైన ‘క్రూ’ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న టబు ప్రస్తుతం హిందీలో మరికొన్ని ప్రాజెక్ట్లు కమిట్ అయ్యారు. అలాగే హాలీవుడ్ సూపర్ హిట్ టెలివిజన్ సిరీస్ ‘డ్యూన్: ఫ్రొఫెసి’లో నటించే లక్కీ చాన్స్ అందుకున్నారు. ‘డ్యూన్’ సిరీస్కి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన ఫాలోయింగ్ ఉంది. తొలి భాగానికి మంచి స్పందన రావడంతో రెండో భాగం ‘డ్యూన్: ఫ్రొఫెసి’ని ప్లాన్ చేశారు మేకర్స్. ఇందులో సిస్టర్ ఫ్రాన్సెస్ అనే ఎంతో ప్రాధాన్యమైన పాత్రలో టబు నటించనున్నారు. డయాన్ అడెము–జాన్ క్రియేషన్లో ఈ సిరీస్ రూపొందనుంది. పది వేల సంవత్సరాల క్రితం ఏం జరిగింది? అనే పాయింట్తో ‘డ్యూన్’ తొలి భాగం రూపొందింది. ‘డ్యూన్: ఫ్రొఫెసి’ని సైన్స్ ఫిక్షన్ జానర్లో తెరకెక్కించనున్నారట. తొలి భాగం కంటే ఐదు రెట్ల బడ్జెట్ కేటాయించారని టాక్. -
కియారాకు అరుదరైన అవకాశం
ప్రతిష్టాత్మక 77వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో హీరోయిన్ కియారా అద్వానీ తొలిసారి సందడి చేయనున్నారు. ఈ చిత్రోత్సవాల్లో భాగంగా రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్యానెల్లో కియరా ఇండియాకి ప్రాతినిధ్యం వహిస్తారట. మంగళవారం (మే 14) ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఈ నెల 25వరకూ జరగనున్నాయి. ఇప్పటివరకు దేశం తరఫున పలుమార్లు ప్రాతినిధ్యం వహించి, మెప్పించారు ఐశ్వర్యా రాయ్. ఆ తర్వాత సోనమ్ కపూర్ కూడా ఇండియా ప్రతినిధిగా మెప్పించారు. ఈ ఏడాది ఇండియాకి ప్రాతినిధ్యం వహించే అవకాశం కియరా అద్వానీని వరించింది. కాన్స్లో వేనిటీ ఫెయిర్ హోస్ట్ చేస్తున్న ‘రెడ్ సీ ఫిల్మ్ ఫౌండేషన్ ఉమెన్ ఇన్ సినిమా’ కార్యక్రమంలోనూ కియరా ΄ాల్గొంటారు. ప్రపంచ సినిమాకు ప్రొత్సాహకాలు, చిత్రీకరణ, సినిమా నిర్మాణంలో వస్తున్న సాంకేతిక అంశాలు.. వంటి వాటి గురించి నాలుగు ప్యానెల్స్ చర్చలు జరపనున్నాయి. మే 18న లా ప్లేజ్ డెస్ పామ్స్లో ఈ చర్చలు జరుగుతాయి. ఆ చర్చల్లోనూ కియారా పాల్గొంటారు. కాగా ఈ ఏడాది చిత్రోత్సవాల్లో ఐశ్వర్యా రాయ్, అదితీ రావ్ హైదరి, శోభితా ధూళి΄ాళ వంటి తారలు దేశం నుంచి హాజరు కానున్నారు. ఇప్పుడు కియారా అద్వానీ పేరు ఈ జాబితాలో చేరింది. ఈ చిత్రోత్సవాల్లో స్టయిలిష్గా కనిపించడానికి, చర్చల్లో తన అభి్ర΄ాయాలను స్పష్టంగా వ్యక్తపరచడానికి కియారా చాలా ప్రిపేర్ అయ్యారని సమాచారం. -
ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
జూ.ఎన్టీఆర్ మరోసారి వార్తల్లో నిలిచాడు. మొన్నీమధ్యే ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్లో తారక్ ఓటు వేశాడు. అయితే అతడు వేసుకున్న చొక్కా రంగు గురించి సోషల్ మీడియాలో ఓ రేంజ్ డిస్కషన్ నడిచింది. దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు మాత్రం ఎన్టీఆర్ తన గొప్ప మనసు చాటుకుని వార్తల్లోకెక్కాడు. ఇప్పుడు ఈ విషయం వైరల్ అవుతోంది. ఇంతకీ తారక్ చేసిందేంటి?(ఇదీ చదవండి: నో రెమ్యునరేషన్.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన ప్రభాస్?)చిన్న సాయం చేసినా సరే గొప్పగా చెప్పుకునే రోజులివి. అలాంటిది ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలోని జగ్నన్నపేట ఊరిలో వీరభద్ర స్వామి ఆలయానికి ఎన్టీఆర్ కుటుంబం రూ.12.5 లక్షలు విరాళం ఇచ్చింది. కానీ ఈ విషయం పెద్దగా బయటకు రాలేదు. తాజాగా కొందరు నెటిజన్లు శిలా ఫలకానికి సంబంధించిన ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తారక్ ఉదారత నలుగురికి తెలిసింది.ఇక సినిమాల విషయానికొస్తే.. 'ఆర్ఆర్ఆర్' తర్వాత 'దేవర' చేస్తున్నాడు. అక్టోబరులో పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. ఈ నెల 20న తారక్ బర్త్ డే సందర్భంగా తొలి లిరికల్ సాంగ్ రాబోతుందని సమాచారం. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్.(ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన 'దసరా' నటుడి హిట్ సినిమా)NTR @tarak9999 Anna Family Donated 12.5 Lakhs For Temple 👌👌❤️❤️.Mogalikuduru, Jaggannapeta, East Godavari. #JrNTR pic.twitter.com/MKs0dCg6ZV— Sai Mohan 'NTR' (@Sai_Mohan_999) May 14, 2024 -
సుచి లీక్స్.. నాకు ఆ ఫొటోలు త్రిషనే ఇచ్చింది: సుచిత్ర
సుచి లీక్స్ గొడవ మళ్లీ మొదలైంది. 2017లో కోలీవుడ్ను ఊపేసిన అత్యంత వివాదాస్పద అంశం సుచీ లీక్స్. ప్రముఖ సింగర్ సుచిత్ర… సుచీ లీక్స్ పేరిట తన ఫేస్బుక్ ఖాతాలో ప్రముఖ నటీనటులకు సంబంధించిన కొన్ని ప్రైవేట్ వీడియోలు, ఫొటోలను విడుదల చేసి తీవ్ర దుమారం సృష్టించింది. ఇందులో ధనుష్, ఆండ్రియా, అమలాపాల్, త్రిష, హన్సిక, అమీ జాక్సన్, అనిరుధ్, సింగర్ చిన్మయి ఇలా పలువురికి సంబంధించిన వ్యక్తిగత ఫొటోలు బయటకు వచ్చాయి. దీంతో ఈ విషయం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిప్గా మారింది.సుచీ లీక్స్ తర్వాత సుచిత్ర జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఒకానొక సమయంలో సుచిత్ర మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిసింది. తర్వాత భర్త కార్తీక్ కుమార్ ఆమెకు విడాకులు ఇచ్చి విడిపోయాడు. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురైన సుచిత్ర కొన్నాళ్లు మౌనంగా ఉండిపోయింది. తదనంతరం, ఆమె బిగ్ బాస్ నాలుగో సీజన్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా పాల్గొంది. చాలారోజుల తర్వాత ఇప్పుడు ఓ ప్రైవేట్ యూట్యూబ్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు షాకింగ్ విషయాలను ఆమె పంచుకుంది. ముఖ్యంగా ధనుష్-ఐశ్వర్య విడాకులు, సుచీ లీక్స్ ఇష్యూ తదితర విషయాలపై సుచిత్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఆమె ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.ముఖ్యంగా సుచీ లీక్స్ పేరుతో విడుదల చేసిన ఫోటోలన్నీ త్రిషనే ఇచ్చిందని ఆమె చెప్పడంతో ఇప్పుడు ఆ వ్యాఖ్యలు దుమారం రేగుతున్నాయి. 'సుచీ లీక్స్ పేరుతో వచ్చిన అన్ని ఫోటోలు త్రిష ఇచ్చినవే. కానీ, ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాక ‘నేను హర్ట్ అయ్యాను’ అంటూ త్రిషనే జనాలకు ట్వీట్ చేసేది. త్రిష ఒక బిచ్.' అని సింగర్ సుచిత్ర సెన్సేషనల్ కామెంట్ చేసింది.సుచీ లీక్స్లో భాగంగా త్రిష, అమలాపాల్ వంటి హీరోయిన్లతో ధనుష్ ప్రైవేట్ ఫోటోలు లీకయ్యాయి. ఆ సమయం నుంచే ఐశ్వర్య, ధనుష్ మధ్య విభేదాలు వచ్చాయని, చివరకు చేసేదేమిలేక వారు విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారని తమిళ సినీ వర్గాలు ఇప్పటికీ చెబుతుంటాయి. Trisha oruthi @trishtrashers bitch 🤣👀 https://t.co/9crRLcEUzE pic.twitter.com/kGaRJ8z16M— Nayanthara FC (@AjithTharan) May 14, 2024 -
హాలీవుడ్ తెరపై ఓ సాహస యాత్ర
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ని అధిరోహించడం చాలా కష్టం అనే అభిప్రాయాన్ని అబద్ధం చేశారు ఎడ్మండ్ హిల్లరీ, టెన్జింగ్ నార్గే. న్యూజిల్యాండ్కి చెందిన ఎడ్మండ్, నేపాల్కి చెందిన టెన్జింగ్ 1953లో ఎవరెస్ట్ చేరుకుని, అత్యంత ఎత్తయిన పర్వతాన్ని అధిరోహించిన మొదటి వ్యక్తులుగా చరిత్రలో నిలిచిపోయారు. ఈ ఇద్దరూ సాధించిన చరిత్ర నేపథ్యంలో హాలీవుడ్లో ‘టెన్జింగ్’ టైటిల్తో బయోపిక్ రూపొందనుంది. ఈ చిత్రంలో ఎడ్మండ్ హిల్లరీ పాత్రకు టామ్ హిడిల్స్టన్ని ఎంపిక చేశారు. యాత్ర నాయకుడు కల్నల్ జాన్ హంట్ పాత్రను విల్లెం డాఫో పోషించనున్నారు. టెన్జింగ్ నార్గే పాత్రకు సంబంధించిన ఎంపిక జరుగుతోంది. షెర్పా (పర్వతారోహకులు) కమ్యూనిటీతో సన్నిహిత సంబంధాలు ఉన్న జెన్నిఫర్ పీడోమ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. 2015లో ‘షెర్పా’ పేరిట జెన్నిఫర్ పీడోమ్ ఓ డాక్యుమెంటరీ తెరకెక్కించారు కూడా. అప్పుడు కొందరు పర్వతారోహకుల అనుభవాలను సేకరించి, ‘షెర్పా’ని చిత్రీకరించారు. తాజాగా జెన్నిఫర్ తెరకెక్కించనున్న ‘టెన్జింగ్’కి ల్యూక్ డేవిస్ స్క్రిప్ట్ సిద్ధం చేశారు. లిజ్ వాట్స్, ఎమిలే షెర్మాన్, ఇయాన్ కానింగ్ తదితరులు నిర్మించనున్నారు. ‘‘ఒక సాహస యాత్రను తెరపై ఆవిష్కరించడానికి ఆసక్తిగా ఉన్నాం’’ అని మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రం షూటింగ్ని వచ్చే ఏడాది ఆరంభించాలనుకుంటున్నారు. -
అతనితో 16 రోజులే ఉన్నాను.. రెండో పెళ్లి చేసుకోవాలని ఉంది: ఎస్తర్
కన్నడలో పలు సినిమాల్లో నటించి ఆపై తెలుగులో 'భీమవరం బుల్లోడు' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఎస్తర్ నోరోన్హ. ఆమె ఇప్పటి వరకు తెలుగు, తమిళం, కన్నడ, మరాఠీ, కొంకణి, హిందీ భాషా చిత్రాలలో నటించింది. జయ జానకి నాయిక, గరం,69 సంస్కార్ కాలనీ,డెవిల్,టనెంట్ వంటి తెలుగు సినిమాల్లో మెరిసింది. పలు సినిమాల్లో ఐటెం సాంగ్స్లో కూడా మెప్పించిన ఎస్తర్ రెండో పెళ్లికి సిద్ధమైనట్లు తెలిపింది.టాలీవుడ్ సింగర్, నటుడు నోయల్ను ప్రేమించి 2019లో పెళ్లి చేసుకున్న ఎస్తర్.. వారి బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. ఆరు నెలల్లోనే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించిన ఎస్తర్ తన గ్లామర్తో కుర్రకారును అదరగొట్టింది. రెక్కి, సంస్కార్ కాలనీ చిత్రాలలో తన గ్లామర్తో ఆకట్టుకుంది.తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి ఎస్తర్ ఇలా చెప్పుకొచ్చింది. 'నేను 2019లో పెళ్లి చేసుకున్నాను. అయితే, మేము కేవలం 16 రోజులు మాత్రమే కలిసి ఉన్నాము. పెళ్లయిన 16 రోజుల తర్వాత అతనితో దూరంగానే ఉంటూ వచ్చాను. అలా 2020లో విడాకులు తీసుకున్నాను. ప్రస్తుతం నాకు ఒంటరిగా బతకాలని లేదు. నేను మళ్లీ పెళ్లి చేసుకుంటాను. నాకు అందమైన జీవితం కావాలి. అందుకు తగిన భాగస్వామి కోసం వెతుకుతున్నారు. అయితే, ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలో నాకు క్లారిటీ లేదు. నేను ఇప్పటికే ఒకసారి వివాహం చేసుకున్నాను.. అందులో చాలా సమస్యలను ఎదుర్కొన్నాను, నన్ను అర్థం చేసుకునే అబ్బాయి నాకు దొరుకుతే సంతోషం. షోకేస్ లాంటి భర్త వద్దు.' అని ఎస్తర్ చెప్పుకొచ్చింది. రెండో పెళ్లిపై ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారాయి. -
నో రెమ్యునరేషన్.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన ప్రభాస్?
డార్లింగ్ ప్రభాస్ ఇప్పుడు ఊపిరి సలపనంత బిజీగా ఉన్నాడు. గతేడాది చివర్లో 'సలార్'తో హిట్ కొట్టాడు. త్వరలో 'కల్కి'గా రాబోతున్నాడు. జూన్ 27న థియేటర్లలోకి ఈ సినిమా రానుంది. దీని తర్వాత 'రాజా సాబ్', 'సలార్ 2'కి రెడీ అవుతున్నాడు. సరిగ్గా ఈ టైంలో ప్రభాస్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది. రూపాయి కూడా తీసుకోకుండా పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడని టాక్ అయితే వచ్చింది. ఏంటి సంగతి? ఆ సినిమా ఏది?(ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన 'దసరా' నటుడి హిట్ సినిమా)పైన చెప్పిన సినిమాలతో పాటే ప్రభాస్.. మంచు విష్ణు హీరోగా నటిస్తూ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న 'కన్నప్ప' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ విషయం చాలారోజుల క్రితమే బయటకొచ్చింది. అయితే ప్రభాస్, శివుడిగా కనిపించబోతున్నాడని టాక్ వచ్చింది కానీ పరశురాముడి పాత్ర చేస్తున్నాడని లేటెస్ట్ సమాచారం. ఇందులో నటిస్తున్నందుకు గానూ పూర్తిగా రెమ్యునరేషన్ తీసుకోవట్లేదట. మంచు ఫ్యామిలీతో తనకున్న అనుబంధం దృష్ట్యా ఇలా చేశాడట.ఇకపోతే మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న 'కన్నప్ప'లో అక్షయ్ కుమార్ (హిందీ), శివరాజ్ కుమార్ (కన్నడ), మోహన్ లాల్ (మలయాళం) కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇలా పాన్ ఇండియా అప్పీల్తో సినిమా తీస్తున్నారు. ఈనెల 20న క్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో 'కన్నప్ప' టీజర్ రిలీజ్ చేయబోతున్నారు. దీనిబట్టి సినిమాపై ఓ అంచనాకు రావొచ్చు.(ఇదీ చదవండి: రామ్-పూరీ 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ ఎలా ఉందంటే?) -
మే 17 నుంచి సినిమా థియేటర్లు మూసివేత
కరోనా తర్వాత మళ్లీ సినిమా థియేటర్లు మూత పడనున్నాయి. దీంతో సినిమా అభిమానులు షాక్ అవుతున్నారు. అయితే, ఈసారి కరోనా వల్ల థియేటర్లు మూత పడటం లేదు. కొత్త సినిమాలు విడుదల కాకపోవడంతో ఇలాంటి సమస్య వచ్చింది. థియేటర్ యజమానులకు సమ్మర్లో ఇలాంటి ఇబ్బందులు రావడంతో కాస్త నిరుత్సాహానికి గురౌతున్నారు.వేసవి శెలవులలో లెక్కలేనన్ని సినిమాలు విడుదల అవుతాయి. ప్రేక్షకులతో థియేటర్స్ అన్నీ నిండిపోతాయి.. కానీ ఈ ఏడాదిలో అలాంటి సందడి లేకపోవడంతో హైదరాబాద్లోని సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్నీ మే 17 నుంచి పదిరోజులపాటు మూసివేయనున్నారు. సినిమాలు విడుదల లేకపోవడంతో థియేటర్లు నడపడం భారం కావడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారు. కనీసం విద్యుత్ బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితి వచ్చినట్లు తెలుస్తోంది.థియేటర్స్ బంద్పై ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రియాక్షన్తెలంగాణలో థియేటర్స్ బంద్పై తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విజయేందర్ రెడ్డి స్పందించారు. థియేటర్స్ బంద్ కావడానికి కారణం చిన్న సినిమాలకు కలెక్షన్స్ లేకపోచడం పెద్ద సినిమాలు రిలీజ్ కాకపోవడమని ఆయన అన్నారు. ప్రతి రోజు థియటర్స్ ఖర్చులు భరించలేకే తాత్కాలికంగా సింగిల్ థియేటర్స్ మూసివేయాల్సి వచ్చిందన్నారు. కేవలం ఖర్చులు భరించలేకే బంద్ చేయాల్సి వచ్చింది. కానీ, మరే ఇతర కారణాలు ఏమి లేవన్నారు. నిర్మాతలు ముందుకు వచ్చి మెయింటెనెన్స్ భరిస్తామని చెబితే థియేటర్స్ ఓపెన్ చేస్తామని విజయేందర్ రెడ్డి అన్నారు. -
రామ్-పూరీ 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ ఎలా ఉందంటే?
'లైగర్' దెబ్బకు పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. 'డబుల్ ఇస్మార్ట్'తో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయిపోయాడు. 'ఇస్మార్ట్ శంకర్' సినిమాకు కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రంపై ఓ మాదిరి అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా టీజర్ రిలీజ్ చేశారు? ఇంతకీ ఎలా ఉంది? హిట్ కొడతారా లేదా అనేది ఇప్పుడు చూద్దాం.(ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన 'దసరా' నటుడి హిట్ సినిమా)2019లో రిలీజైన 'ఇస్మార్ట్ శంకర్'.. ఊహించిన విధంగా హిట్ అయింది. పూరీ జగన్నాథ్కి చాన్నాళ్ల తర్వాత సక్సెస్ రుచి చూపించింది. రామ్ కూడా ఫుల్ ఖుషీ అయిపోయాడు. కానీ దీని తర్వాత పూరీకి 'లైగర్' రూపంలో ఘోరమైన డిజాస్టర్ ఎదురైంది. రామ్ది ఇదే పరిస్థితి. చేసిన సినిమా చేసినట్లే ఫ్లాప్ అవుతూ వచ్చాయి. దీంతో వీళ్లిద్దరూ కలిసి 'ఇస్మార్ట్ శంకర్' సీక్వెల్ చేశారు. అదే 'డబుల్ ఇస్మార్ట్'. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు.పూరీ జగన్నాథ్ సినిమాలంటే పంచ్ డైలాగ్స్, మాస్ మూమెంట్స్ని ఆడియెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఈ టీజర్లో ఆ రెండూ మిస్ అయ్యాయి. టీజర్ అంతా కూడా పాత్రల పరిచయానికే ఉపయోగించినట్లు కనిపిస్తుంది. 'డబుల్ ఇస్మార్ట్'లో రామ్ తనదైన మేనరిజమ్ చూపించగా.. హీరోయిన్గా కావ్య థాపర్ కనిపించింది. అలీకి ఆది మానవుడి తరహా కామెడీ పాత్ర ఇచ్చినట్లు ఉన్నారు. సంజయ్ దత్ గన్స్తో కనిపించాడు. రామ్ రెండు డైలాగ్స్ చెప్పాడు గానీ వీటిలో పంచ్ అయితే లేదు. ఎప్పటిలానే మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్తో ఆకట్టుకోగా.. చివర్లో శివ లింగాన్ని చూపించి సినిమాలో డివోషనల్ టచ్ కూడా ఉందని చెప్పకనే చెప్పారు.(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరోయిన్కి అరుదైన వ్యాధి.. ఆస్పత్రిలో బెడ్పై అలా) -
సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన 'దసరా' నటుడి హిట్ సినిమా
మరో క్రేజీ హిట్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. 'దసరా' ఫేమ్ దీక్షిత్ శెట్టి నటించిన ఈ కన్నడ మూవీని సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్తో తీశారు. ఎలాంటి అంచనాల్లేకుండా థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. హీరోగా చేసిన దీక్షిత్ తెలుగులోనూ పలు సినిమాలు చేయడంతో తెలుగు ప్రేక్షకుల దృష్టి దీనిపై పడింది. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందనేది ఇప్పుడు చూద్దాం.(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరోయిన్కి అరుదైన వ్యాధి.. ఆస్పత్రిలో బెడ్పై అలా)'దసరా'లో నాని ఫ్రెండ్గా చేసిన కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి.. 'దియా' మూవీతో గుర్తింపు తెచ్చుకున్నాడు. అటు తెలుగు ఇటు కన్నడ సినిమాల్లో చేస్తున్నాడు. ఇతడు హీరోగా చేసిన 'బ్లింక్' అనే మ్యూజికల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ.. ఈ ఏడాది మార్చి 8న థియేటర్లలోకి వచ్చింది. తొలుత 50 కంటే తక్కువ థియేటర్లలో రిలీజ్ చేశారు. టాక్ బాగుండటంతో ఆ నంబర్ పెరిగింది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో కన్నడలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలో తెలుగు, తమిళ భాషల్లోనూ అందుబాటులోకి రావొచ్చని తెలుస్తోంది.ఇక 'బ్లింక్' కథ విషయానికొస్తే.. పీజీలో ఫెయిల్ అయిన కుర్రాడు అపూర్వ(దీక్షిత్ శెట్టి). తల్లి దగ్గర ఈ విషయం దాచి, పార్ట్ టైమ్ జాబ్ చేస్తుంటాడు. స్వప్న(మందాత)తో ప్రేమలో ఉంటాడు. మంచి జాబ్ చేసి సెటిల్ కావాలనుకుంటాడు. అలాంటిది తండ్రి గురించి తెలిసిన ఓ సీక్రెట్ ఇతడి జీవితాన్ని తలకిందులు చేస్తుంది. కనురెప్పల్ని మూస్తే టైమ్ ట్రావెల్లో ముందుకు వెనక్కి వెళ్తుంటాడు? అసలు ఇలా జరగడానికి కారణమేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్) -
టాలీవుడ్ హీరోయిన్కి అరుదైన వ్యాధి.. ఆస్పత్రిలో బెడ్పై అలా
తెలుగు సినిమాలో హీరోయిన్గా చేసిన ఓ బ్యూటీ.. అరుదైన వ్యాధి బారిన పడింది. హాస్పిటల్ బెడ్పై ఉన్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. బాధ భరించలేకపోతున్నానని అని చెబుతూ అసలు తనకు ఏమైంది? ఈ వ్యాధి సంగతేంటి? అనే విషయాల్ని చెప్పుకొచ్చింది. అలానే మహిళలకు ఇలాంటివి సాధారణంగా వస్తుంటాయని కూడా చెప్పింది. ఇంతకీ ఎవరా హీరోయిన్? అసలేమైంది?(ఇదీ చదవండి: హీరోతో వివాదం.. ఫేస్ బుక్ లో సినిమా పెట్టేసిన డైరెక్టర్!)హీరోయిన్ శిల్పా శెట్టి చెల్లి షమితా శెట్టి తెలుగులోనూ 'పిలిస్తే పలుకుతా' అనే సినిమాలో హీరోయిన్గా చేసింది. ఆ తర్వాత పూర్తిగా హిందీకే పరిమితమైంది. కాకపోతే అక్కలా పెద్దగా పేరు అయితే తెచ్చుకోలేకపోయింది. అలాంటిది ఇప్పుడు ఎండోమెట్రియోసిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడ్డట్లు బయటపెట్టింది. దీని గురించి హాస్పిటల్ బెడ్పై ఉంటూనే వివరంగా చెప్పుకొచ్చింది.'మహిళలకు వచ్చే సమస్యలో ఇది సర్వ సాధారణమైనది. గర్భాశయంలో చాలా నొప్పిగా అనిపిస్తుంది. అలాంటిదే నాకు ఇప్పుడు వచ్చింది. దాదాపు 40 శాతం మంది మహిళలు ఎండోమెట్రియోసిస్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. కాకపోతే మనలో చాలామందికి దీని గురించి తెలియదు. గత కొన్నాళ్ల నుంచి నేను దీని వల్ల నొప్పితో ఇబ్బంది పడ్డాను. కానీ డాక్టర్లు ఈ సమస్యకు మూలం ఏంటో గుర్తించారు. గర్భాశయంలో వచ్చిన ఈ సమస్యకు సర్జరీ ద్వారా పరిష్కారం దొరికింది' అని షమితా శెట్టి చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: నేనెవర్నీ విడగొట్టలేదు.. ఆ హీరోయిన్కు, నా భర్తకు ఆల్రెడీ బ్రేకప్!)Did you know that almost 40 % of women suffer from Endometriosis.. and most of us are unaware of this disease!!! I want to thank both my dr s my gynac dr Neeta Warty and my Gp dr Sunita Banerjee for not stopping til they found out the root cause of my pain!🧿❤️ pic.twitter.com/T7dmTC2Cv4— Shamita Shetty 🦋 (@ShamitaShetty) May 14, 2024 -
అజిత్ కి షాకిచ్చిన త్రిష.. ఏకంగా చిరు, కమల్ కోసం!
స్టార్ హీరోయిన్ త్రిష.. కెరీర్లో ఎన్నడూ లేనంత బిజీగా ఉన్నారు. 40 ఏళ్ల వయసులోనూ ఈమె నటిస్తున్న సినిమాలన్నీ సూపర్ స్టార్స్తోనే కావడం శేషం. అన్ని భాషల్లోనూ ఏక కాలంలో నటించేస్తున్నారు. ప్రస్తుతం అజిత్ 'విడామయూర్చి', కమల్ హాసన్ 'థగ్ లైఫ్', చిరంజీవి 'విశ్వంభర', మోహన్ లాల్ 'రామ్' చిత్రాల్లో త్రిషనే హీరోయిన్.(ఇదీ చదవండి: నేనెవర్నీ విడగొట్టలేదు.. ఆ హీరోయిన్కు, నా భర్తకు ఆల్రెడీ బ్రేకప్!)కాగా అజిత్ 'విడా మయూర్చి' షూటింగ్ లేట్ అవుతూ వస్తోంది. దీంతో ఈ సినిమాకు కేటాయించిన డేట్స్ని విశ్వంభర, థగ్ లైఫ్ చిత్రాలకు ఉపయోగించేస్తోంది. దీంతో 'విడామయర్చి' చిత్రానికి షాక్ తగిలినట్లయింది. అయితే ఇదంతా దర్శకుడు మణిరత్నం చేసిన పని అనుకోవచ్చు.. ఎందుకంటే 'పొన్నియన్ సెల్వన్'లో కుందవై పాత్ర ఇచ్చి త్రిషకి మళ్లీ లైఫ్ ఇచ్చాడు. దీంతో ఇప్పుడు ఈమె ఊపిరిసలపనంత బిజీగా మారిపోయింది. టైమ్ అంటే ఇదే మరి.(ఇదీ చదవండి: నా మాజీ భర్త గే.. అతడి గదిలో రాత్రి ధనుష్కు ఏం పని? సుచిత్ర సంచలన వ్యాఖ్యలు) -
క్లైమాక్స్లో సరిపోదా
నాని హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాంకా అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది.ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘సరిపోదా శనివారం’లో సూర్య పాత్రలో మునుపెన్నడూ కనిపించని ఇంటెన్స్ పవర్–ప్యాక్డ్ క్యారెక్టర్లో నాని కనిపించనున్నారు. హై బడ్జెట్తో యూనిక్ అడ్వంచర్గా రూపొందుతున్న ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ను ప్రారంభించాం. ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో అద్భుతమైన సెట్ను నిర్మించాం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆగస్టు 29న ఈ సినిమా విడుదల కానుంది’’ అన్నారు. సాయికుమార్, ఎస్జే సూర్య కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజోయ్, కెమెరా: మురళి జి. -
మూడు వారాల తర్వాత కూలీగా...
జస్ట్ చిన్న బ్రేక్... ఆ తర్వాత కూలీగా కూల్గా సెట్లోకి అడుగుపెట్టడానికి రజనీకాంత్ ప్లాన్ చేసుకున్నారట. ‘వేట్టయాన్’ సినిమాలో తన పాత్రకు సంబంధించిన షూట్ని పూర్తి చేసిన రజనీకాంత్ ఓ మూడు వారాలు విరామం తీసుకుంటారని సమాచారం. ఆ తర్వాత జూన్ 6 నుంచి తన మరో చిత్రం ‘కూలీ’ షూటింగ్లో పాల్గొంటారట.లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం కోసం చెన్నైలో భారీ సెట్ రూపొందించారట. ఆ సెట్లోనే కొత్త షెడ్యూల్ ఆరంభించనున్నారని కోలీవుడ్ టాక్. కాగా ఈ చిత్రంలో శ్రుతీహాసన్ నటించనున్నారు. రజనీ కుమార్తె పాత్రలో ఆమె కనిపిస్తారట. ఈ పాత్ర కథకి కీలకంగా ఉంటుందని తెలిసింది. సన్ పిక్చర్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ స్వరకర్త.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
సోషల్ మీడియాలో వైరల్గా మారిన టీడీపీ, జనసేన వీడియో
రోహిత్ శర్మతో పాటు షకీబ్!.. ఎవరికీ సాధ్యం కాని రికార్డు!
ఏపీ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రాపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు
ఈసీ బదిలీ చేసిన చోటే ఈ దారుణాలు
రాజశ్యామల సహస్ర చండీయాగం వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు
కొంతమంది పోలీసులు టీడీపీ వాళ్ళతో కుమ్మక్కై: అంబటి
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (15-05-2024)
స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
గర్భస్త శిశువుకూ జీవించే హక్కుంది: సుప్రీం సంచలన తీర్పు
స్వాతి మలివాల్పై దాడి.. కేజ్రీవాల్ మౌనమేల?
తప్పక చదవండి
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
- ‘ఆ దేవాలయాలు నిర్మించాలంటే 400కుపైగా సీట్లు కావాల్సిందే’
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
- NewsClick Row: ప్రబీర్ తక్షణ రిలీజ్కు సుప్రీం కోర్టు ఆదేశం
Advertisement