-
ఇంటికి చేరే వేళ మృత్యు గంట
ఇంటికి చేరే వేళ మృత్యు గంట ’’ తెల్లారిన కూలీల బతుకులు ట్రాక్టర్ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్ రోడ్డు ప్రమాదంలో నలుగురు కూలీల మృతి ధాన్యం బస్తాలు లోడ్ చేస్తుండగా దుర్ఘటన మృతదేహాల వద్ద కుటుంబ సభ్యుల రోదన పి.గన్నవరం/అంబాజీపేట: వారంతా రెక్కాడితేగాని డొక్కాడని పేద కుటుంబాలకు చెందిన కూలీలు. జీవనాధారంలో భాగంగా ట్రాక్టర్ పై ధాన్యం బస్తాలు లోడ్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఆర్టీసీ బస్ రూపంలో మృత్యువు వారిని కాటేసింది. ప్రధాన రహదారి నెత్తురోడింది. మృతుల కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. కూలి పనులకు వెళ్లిన వారు తిరిగి మరో 30 నిమిషాల్లో ఇంటికి చేరతారనుకున్న సమయంలో విగత జీవులు అయారనే వార్త తెలియడంతో వారి కుటుంబాలు శోకసంద్రంలో మునిగాయి. పి.గన్నవరం మండలం, ఊడిమూడి గ్రామం వద్ద ఆర్.పి.రోడ్డుపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఊడిమూడి గ్రామం వద్ద చింతావారిపేట సమీపంలో రోడ్డు పక్కన ట్రాక్టర్ పై ధాన్యం బస్తాలను పది మంది కూలీలు లోడ్ చేసి పగ్గం కడుతున్నారు. అదే సమయంలో రాజోలు నుంచి రావులపాలెం వెళుతున్న ఆర్టీసీ బస్ ట్రాక్టర్ను వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్, ట్రాక్టర్ల కింద పడి కూలీలు మృత్యువాత పడ్డారు. జి.పెదపూడికి చెందిన నూకపెయ్యి శివ (35), వాసంశెట్టి సూర్యనారాయణ (45), ఈరి కట్లయ్య (50), ఊడిమూడి శివారు ఆదిమూలంవారిపాలెంకు చెందిన చిలకలపూడి మణిబాబు (30) అక్కడికక్కడే మృతి చెందారు. ఆదిమూలవారిపాలెంకు చెందిన చిలకలపూడి సురే‹Ùకు తీవ్ర గాయాలు కాగా అమలాపురం ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. జి.పెదపూడికి చెందిన బొరుసు నానికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. బొరుసు రాంబాబు, బుజ్జి, వాసంశెట్టి సాయికిరణ్, గూనపాటి పెద్దిరాజులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఆర్టీసీ బస్లో 20 మంది ప్రయాణికులున్నారు. ఇద్దరు మహిళలకు స్వల్పగాయాలు అయ్యాయి. బస్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. రెండు గ్రామాల్లో విషాద ఛాయలు... మరో 30 నిమిషాల్లో ఇళ్లకు చేరుకోవల్సిన వారు విగత జీవులుగా మారడంతో జి.పెదపూడి, ఆదిమూలంవారిపాలెం గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యుల రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి. జి.పెదపూడికి చెందిన నూకపెయ్యి శివ కొబ్బరి వలుపు కారి్మకుడిగా, కూలీగా పని చేసేవాడు. మృతునికి భార్య బేబి కుమారి, సుశాంత్, జస్వంత్ అనే చిన్న పిల్లలు ఉన్నారు. భర్త శివ మరణించడంతో ఆ కుటుంబం దిక్కులేనిదయ్యిందని బంధువులు, కుటుంబ సభ్యులు రోదించారు. అదే గ్రామానికి చెందిన వాసంశెట్టి సూర్యనారాయణ మృతి చెందడంతో భార్య దుర్గ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. సూర్యనారాయణ కుమార్తె నాగేశ్వరికి ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. ఇంటిలో శుభకార్యం జరిగి ఏడాది తిరగ కుండానే అందరిని వదలి వెళ్లిపోయాడని కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన వీరి కట్లయ్యకు భార్య సుబ్బలక్షి్మ, కుమారులు నాగరాజు, సురే‹Ù, కుమార్తెలు వైష్ణవి, హారికలు ఉన్నారు. అతని మృతితో పెద్ద దిక్కును కోల్పోవడమే కాకుండా జీవనాధారం కోల్పోయామని కుటుంబీకులు విలపిస్తున్నారు. ఆదిమూలంవారిపాలెంకు చెందిన చిలకలపూడి మణిబాబు మృతి చెందడం, అతని అన్న సురేష్ తీవ్ర గాయాలపాలై ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో వారి తల్లితండ్రులు వెంకటేశ్వరరావు, సత్యనారాయణమ్మ రోదనలు గ్రామస్తులకు కంటతడి పెట్టించాయి. అందరితో కలివిడిగా ఉండే మణిబాబు మృతి చెందడం, సురేష్ తీవ్ర గాయాలు పాలవ్వడంతో బంధువులు, స్నేహితులు బోరున విలపిస్తున్నారు. ఆందోళన చేపట్టిన గ్రామస్తులు నిర్లక్ష్యంగా, మితి మీరిన వేగంతో బస్సును నడిపి నలుగురు మృతికి కారణమైన బస్ డ్రైవర్పై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జి.పెదపూడి, ఊడిమూడికి చెందిన నాయకులు, గ్రామస్తులు ఆర్పీ రోడ్డుపై ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. కలెక్టర్, ఎస్పీ, ఆరీ్టవోలు రావాలని నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్తత వాతావారణం నెలకొనడంతో పి.గన్నవరం సీఐ డి.ప్రశాంత్కుమార్, ఎస్సై బి.శివకృష్ణ ఆందోళన కారులతో చర్చించారు. ఆర్డీఓ సత్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకుని మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈ మొత్తం పెంచాలని మృతుల కుటుంబ సభ్యులు ఆందోళన కొనసాగిస్తున్నారు. -
ఫోర్త్ జనరేషన్ స్విఫ్ట్ కార్ మార్కెట్లోకి విడుదల
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): సరికొత్త ఫీచర్లతో, జెడ్ సిరీస్ ఇంజన్తో ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన స్విఫ్ట్ కార్ను ఎస్బీఐ డివిజనల్ జనరల్ మేనేజర్ ప్రమోద్ కుమార్ మిశ్రా రాజమహేంద్రవరంలో ఆవిష్కరించారు. స్థానిక లాలాచెరువులోని ఎస్బి మోటార్స్ షోరూమ్లో మంగళవారం జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎస్బీఐ డీజీఎం ప్రమోద్ కుమార్ మిశ్రా, రీజనల్ మేనేజర్ తటవర్తి శ్రీనివాస్, వర్ధమాన నటుడు గోల్డెన్రెడ్డి, ప్రముఖ రచయిత మను శ్రీ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ మధ్యతరగతి కుటుంబాల వారిని సైతం ఆకట్టుకునేలా ఫోర్త్ జనరేషన్ స్విఫ్ట్ కారును మార్కెట్లోకి విడుదల చేయడం శుభ పరిణామం అన్నారు. ఎస్బీ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.రామ్కుమార్, జనరల్ మేనేజర్ ఎంవీఎస్ఎస్ఆర్ గుప్తా మాట్లాడుతూ నేటి యువతరానికి నచ్చేలా.. మెచ్చేలా సరికొత్త భద్రతా ప్రమాణాలతో ఈ కారును తూర్పుగోదావరి జిల్లా మార్కెట్లోకి తీసుకురావడం ఆనందదాయకమన్నారు. ఈ సరికొత్త స్విఫ్ట్ కారు 25.75 కిలోమీటర్ల మైలేజీతో నడవడం మరో అద్భుతం అన్నారు. సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ను అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. -
భవిత భద్రం
ఫ జిల్లాలో 80.93 శాతం పోలింగ్ ఫ అర్ధరాత్రి వరకూ క్యూలో నిలబడి ఓటెత్తిన మహిళలు ఫ స్ట్రాంగ్ రూముకు చేరిన ఈవీఎంలు ఫ గెలుపోటముల అంచనాల్లో నేతల తలమునకలుసాక్షి, రాజమహేంద్రవరం: దాదాపు 40 డిగ్రీల సెల్సియస్కు పైబడిన ఉష్ణోగ్రతలతో కొద్ది నెలలుగా చెలరేగిపోయిన సూర్యుడు కొద్ది రోజులుగా కాస్త శాంతిస్తున్నాడు. వాతావరణ మార్పులతో ఉష్ణతాపం నుంచి కాస్త విరామం లభిస్తోంది. మండిపోయిన ఎండలకు తోడా అన్నట్టుగా కొద్ది నెలలుగా పెరిగిన పొలిటికల్ హీట్కు కూడా ప్రస్తుతానికి తెర పడింది. సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ ప్రక్రియ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా పూర్తి కావడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. ఈ ఎన్నికల్లో ఓటర్లు మునుపెన్నడూ చూడని విధంగా భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల భవితవ్యం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో (ఈవీఎం) నిక్షిప్తమైంది. వచ్చే నెల 4న జరిగే ఓట్ల లెక్కింపులో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. అర్ధరాత్రి వరకూ పోలింగ్ ఈ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా భారీ స్థాయిలోనే పోలింగ్ శాతం నమోదైంది. మధ్యాహ్నం కాస్త మందకొడిగా నమోదైనా.. సాయంత్రం ఓటర్లు అధిక సంఖ్యలో పోటెత్తారు. మహిళలు అత్యధికంగా ఓటు బాట పట్టడం విశేషం. సాయంత్రం 6 గంటల వరకూ క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. దీంతో కొన్ని కేంద్రాల్లో అర్ధరాత్రి వరకూ పోలింగ్ జరిగింది. అనంతరం రాజమండ్రి లోక్సభ నియోజకవర్గంతో పాటు, దీని పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన ఈవీఎంలను రాజానగరం సమీపంలోని నన్నయ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములకు తరలించారు. సాయంత్రం 5 గంటలకు 66.55 శాతం ఓటింగ్ జరగగా.. పోలింగ్ ముగిసే సమయానికి అది ఏకంగా 80.93 శాతానికి చేరింది. ఫ జిల్లావ్యాప్తంగా మొత్తం 16,23,149 మంది ఓటర్లు ఉండగా వీరిలో 13,13,645 మంది ఓట్లు వేశారు. వీరిలో పురుషులు 6,47,474 మంది ఉండగా, అత్యధికంగా 6,66,113 మంది మహిళా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఫ జిల్లాలో అత్యధికంగా రాజానగరం నియోజకవర్గంలో 87.53 శాతం పోలింగ్ నమోదైంది. ఫ అత్యల్పంగా రాజమండ్రి సిటీలో 67.57 శాతం మంది మాత్రమే ఓటు వేశారు. అయితే, 2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటింగ్ కాస్త పెరిగింది. ఆ ఎన్నికల్లో ఇక్కడ 66.19 శాతం ఓటింగ్ నమోదైంది. ఫ అనపర్తిలో 86.23, కొవ్వూరు 85.90, నిడదవోలు 84.67, గోపాలపురం 86.67 చొప్పున పోలింగ్ శాతం నమోదైంది. ఫ రాజమండ్రి రూరల్లో 2014 ఎన్నికల్లో 73.97 శాతం, 2019లో 74.21 శాతం పోలింగ్ నమోదు కాగా, ఈసారి 73.02 శాతం మంది మాత్రమే ఓట్లు వేశారు. ఫ రాజానగరంలో 2014లో 85.93 శాతం, 2019లో 87.83 శాతం పోలింగ్ నమోదవగా, ఈసారి అది 87.53గా నిర్ధారణ అయ్యింది. టెన్షన్.. టెన్షన్ ఫ ఇన్నాళ్లుగా ప్రచారం, వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగి తేలిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు.. పోలింగ్ పూర్తవడంతో గెలుపోటములపై అంచనాలు వేయడం మొదలుపెట్టారు. ప్రత్యర్థికి ఎక్కడ అనుకూలంగా ఓట్లు పోలయ్యాయి, మన బలమెంత, విజయావకాశాలు ఎలా ఉన్నాయనే అంశాలపై కసరత్తు ప్రారంభించారు. ప్రత్యర్థి కంటే ఎలక్షనీరింగ్ సమర్థంగా నిర్వహించామని, కచ్చితంగా విజయం తమనే వరిస్తుందని భావిస్తున్నారు. ఎక్కడ ఎన్ని ఓట్లు తమకు అనుకూలంగా పోలయ్యాయనే లెక్కలు తీస్తున్నారు. ఎవరికి లాభమో! మొత్తం మీద జిల్లాలో పోలింగ్ భారీగానే జరగడం, ఓట్లు వేసిన వారిలో మహిళలే అధికంగా ఉండటం ఎవరికి లాభం చేకూరుస్తుందనే చర్చ సర్వత్రా నడుస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో లబ్ధి పొందిన మహిళలు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివచ్చి, వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు పలికారని, వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా మరోసారి అధికార పీఠంపై కూర్చోబెట్టేందుకు అనుకూలంగా తీర్పు ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో తరలిరావడం వైఎస్సార్ సీపీ తిరిగి అధికారంలోకి వస్తుందనేందుకు నిదర్శనమనే భావన ప్రజల్లో కలుగుతోంది. కొందరు యువతీ యువకులు సైతం తమ విద్యావసరాల కోసం జగనన్న అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాల ద్వారా లబ్ధి చేకూరిన కారణంగా సీఎం వైఎస్ జగన్ పాలన తిరిగి రావాలని ఓటు వేసినట్లు బహిరంగంగా వెల్లడించడం విశేషం. హైదరాబాద్, బెంగళూరు, ఇతర రాష్ట్రాల నుంచి సుమారు 80 వేల మంది ఓటర్లు వచ్చారని సమాచారం.స్ట్రాంగ్ రూములకు ఈవీఎంలు సోమవారం రాత్రి వరకూ కొనసాగిన పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే ఈవీఎంలను కేంద్ర బలగాల రక్షణలో నన్నయ వర్సిటీలోని స్ట్రాంగ్ రూములకు తరలించారు. వర్సిటీ నార్త్ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలను భద్రపరచి సీల్ వేశారు. రికార్డులు, ఈవీఎంలలో పోలైన ఓట్ల సంఖ్యపై రాజకీయ పార్టీలు, అభ్యర్థుల సమక్షంలో స్క్రూట్నీ నిర్వహించారు. అందులో ఎటువంటి లోపాలూ లేకపోవడంతో పరిశీలకులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడి ఈవీఎంలను వచ్చే నెల 4న కౌంటింగ్ సమయంలో తిరిగి బయటకు తీయనున్నారు. జిల్లాలో పోలింగ్ వివరాలు ఇలా.. నియోజకవర్గం మొత్తం పోలైన ఓట్లు ఓటర్లు అనపర్తి 2,26,053 1,94,924 రాజానగరం 2,16,491 1,89,505 రాజమండ్రి 2,67,484 1,80,733 సిటీ రాజమండ్రి 2,72,826 1,99,220 రూరల్ కొవ్వూరు 1,84,136 1,58,176 నిడదవోలు 2,13,396 1,80,688 గోపాలపురం 2,42,763 2,10,399తూర్పున ఫ్యాన్ గాలి? జిల్లాలో మళ్లీ ఫ్యాన్ గాలి బలంగా వీచే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే ఎంపీ స్థానం పక్కాగా గెలుపొందే అవకాశం ఉందని చెబుతున్నారు. మెజార్టీ ఎమ్మెల్యే స్థానాలు దక్కించుకునే అవకాశం ఉందని లెక్కలు వేస్తున్నారు. కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాల్లో మళ్లీ ఫ్యాన్ గాలి వీచ్చే సూచనలు స్పష్టంగా దర్శనమిస్తున్నాయి. అనపర్తి, రాజానగరంలో ఫ్యాన్ గిర్రున తిరిగే అవకాశం ఉంది. రాజమండ్రి సిటీ, రూరల్లో టీడీపీ కంచుకోటలు బద్దలయ్యే సూచనలున్నాయని భావిస్తున్నారు. -
ఏపీఆర్జేసీ ఫలితాలలో తిరుమల హవా
రాజమహేంద్రవరం రూరల్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన ఏపీఆర్జేసీ ఎంట్రన్స్ పరీక్షా ఫలితాలలో రాజమహేంద్రవరంలోని తమ తిరుమల ఐఐటీ అండ్ మెడికల్ అకాడమీ విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ఎంపీసీ విభాగంలో ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు, బైపీసీ విభాగంలో సెకండ్ ర్యాంకులతో పాటు టాప్టెన్లో ఎనిమిది ర్యాంకులను సాధించి అత్యుత్తమ ఫలితాలను అందించారని తిరుమల ఐఐటీ అండ్ మెడికల్ అకాడమి చైర్మన్ నున్న తిరుమలరావు తెలిపారు. జే.యశ్వంత్సాయి స్టేట్ ఫస్ట్ర్యాంకును, జి.ప్రభవ్తేజ స్టేట్ సెకండ్ ర్యాంకును, ఎం.మారుతి సత్యశ్రీకర్ స్టేట్ సెకండ్ ర్యాంకును, పీవీఎన్ సూర్యధావన్ రాష్ట్రస్థాయిలో ఐదవ ర్యాంకును, బీఎస్ఎస్ భవ్య రాష్ట్రస్థాయి ఆరవ ర్యాంకును, ఎంకెఎస్ సాకేత్ రాష్ట్ర స్థాయి ఆరవ ర్యాంకును, డి.శ్రీవేద్ రాష్ట్రస్థాయి 8వ ర్యాంకును, సీహెచ్ త్రివేణి రాష్ట్రస్థాయి 10వ ర్యాంకును కై వసం చేసుకున్నారని ఆయన తెలిపారు. 10లోపు 8మంది, 50లోపు 26మంది, 100లోపు 46మంది ర్యాంకులు సాధించారని నున్న తిరుమలరావు తెలిపారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను నున్న తిరుమలరావు, డైరెక్టర్ సరోజినిదేవి, అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్బాబు, ప్రిన్సిపాల్ వి.శ్రీహరి అభినందించారు. -
రత్నగిరికి కల్యాణశోభ
ఫ 18 నుంచి సత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవాలు ఫ 24 వరకూ నిర్వహణ ఫ 19వ తేదీ రాత్రి స్వామివారి కల్యాణం అన్నవరం: సాక్షాత్తూ ఆ శ్రీమన్నారాయణుడే అనంతలక్ష్మీ సత్యవతీదేవి సమేతుడై వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రంగా అన్నవరం ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ పావన పంపా నదీ తీరాన రత్నగిరిపై వెలసిన భక్తవరదుడు.. శ్రీ వీర వేంకట సత్యనారాయణస్వామి వారి వార్షిక దివ్యకల్యాణ మహోత్సవాలకు చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్వామివారికి ఎడమ భాగాన లక్ష్మీదేవి అంశగా దేవేరి శ్రీ అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు, కుడివైపున శంకరుడు ఒకే పానవట్టంపై దర్శనమిచ్చే దివ్యధామం ఈ హరిహర క్షేత్రం. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా సత్యదేవుని ఖ్యాతి జగద్విఖ్యాతం. కల్యాణోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు రత్నగిరిపై సత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవాలు ఈ నెల 18 నుంచి 24వ తేదీ వరకూ అంగరంగ వైభవంగా నిర్వహించడానికి దేవస్థానం ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 19వ తేదీ రాత్రి 9 గంటల నుంచి 11.030 గంటల వరకూ స్వామివారి దివ్య కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. సత్యదేవుని కల్యాణ మహోత్సవ ఏర్పాట్లపై గత నెల 28వ తేదీన పెద్దాపురం ఆర్డీఓ జె.సీతారామారావు అధ్యక్షతన అన్నవరం దేవస్థానం ఈఓ కె.రామచంద్రమోహన్, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, దేవస్థానం అధికారులతో సమీక్ష నిర్వహించారు. విభాగాల వారీగా కార్యాచరణ రూపొందించారు. నిత్య కల్యాణాలు రద్దు కల్యాణోత్సవాల ఏర్పాట్లపై దేవస్థానం అధికారులతో ఈఓ కె.రామచంద్ర మోహన్ గడచిన వారం రోజుల్లో రెండుసార్లు సమావేశమై ఏర్పాట్లు పురోగతిపై చర్చించారు. కల్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అందరూ కృషి చేయాలని ఆదేశించారు. ప్రధానంగా 19వ తేదీన జరిగే స్వామివారి కల్యాణం, 22న జరిగే రథోత్సవం సందర్భంగా తీసుకోవలసిన చర్యలపై సిబ్బందికి సూచనలు ఇచ్చారు. వార్షిక దివ్య కల్యాణ మహోత్సవాల సందర్భంగా ఈ నెల 18 నుంచి 24వ తేదీ వరకూ సత్యదేవుని నిత్య కల్యాణాలను రద్దు చేశారు. ఈ నెల 25 నుంచి తిరిగి ఈ కల్యాణాలు నిర్వహిస్తారు. సీతారాములే పెళ్లి పెద్దలు భద్రాద్రి రాముని కల్యాణోత్సవం తరువాత తెలుగు రాష్ట్రాల్లో అంత ప్రాముఖ్యత కలిగిన వేడుక సత్యదేవుని దివ్యకల్యాణం. ఈ వేడుకకు సీతారాములే పెళ్లి పెద్దలుగా వ్యవహరిస్తారు. అన్నవరం క్షేత్ర పాలకునిగా శ్రీరాముడు పూజలందుకుంటున్న విషయం తెలిసిందే. ఆ హోదాలో సత్యదేవుని కల్యాణోత్సవాలకు సీతారాములే పెళ్లి పెద్దలుగా వ్యవహరిస్తూండటం ఇక్కడి సంప్రదాయం. ఇదీ కల్యాణోత్సవాల క్రమం ఫ మే 18: వైశాఖ శుద్ధ దశమి శనివారం సాయంత్రం 4 గంటలకు ప్రధానాలయంలోని అనివేటి మండపంలో అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని, సత్యదేవుడిని వధూవరులుగా అలంకరిస్తారు. అనంతరం రామారాయ కళావేదిక మీద స్వామి, అమ్మవార్లకు ఎదుర్కోలు ఉత్సవం నిర్వహిస్తారు. ఫ మే 19: వైశాఖ శుద్ధ ఏకాదశి ఆదివారం రాత్రి 9 నుంచి 11.30 గంటల వరకూ రత్నగిరిపై వార్షిక కల్యాణ వేదిక మీద స్వామి, అమ్మవార్ల దివ్య కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. అనంతరం భక్తులకు ప్రసాదం, తలంబ్రాలు పంపిణీ చేస్తారు. ఫ మే 20: వైశాఖ శుద్ధ ద్వాదశి సోమవారం ప్రధాన స్థాలీపాక హోమాలు, రాత్రి 7 గంటలకు అరుంధతీ నక్షత్ర దర్శనం నిర్వహిస్తారు. ఫ మే 21: వైశాఖ శుద్ధ త్రయోదశి మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు అనివేటి మండపంలో పండిత సదస్యం నిర్వహిస్తారు. ఫ మే 22: వైశాఖ శుద్ధ చతుర్దశి బుధవారం సాయంత్రం 5 గంటలకు కొండ దిగువన దేవస్థానం గార్డెన్స్లో సత్యదేవుని వనవిహారోత్సవం. ఫ మే 23: వైశాఖ పౌర్ణమి గురువారం ఉదయం 8.30 గంటలకు పంపా నదిలో స్వామివారి శ్రీచక్రస్నాన మహోత్సవం. సాయంత్రం 4 గంటలకు రత్నగిరిపై అనివేటి మండపంలో నీలలోహిత గౌరీపూజ, నాకబలి, దండియాడింపు, ధ్వజావరోహణం, కంకణ విమోచన కార్యక్రమాలు. ఫ మే 24: వైశాఖ బహుళ పాడ్యమి శుక్రవారం రాత్రి 7 గంటలకు నిత్య కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్లకు శ్రీ పుష్పయాగం కార్యక్రమంతో ఉత్సవాలు ముగుస్తాయి. ప్రత్యేక ఆకర్షణగా రథోత్సవం సత్యదేవుని కల్యాణోత్సవాల్లో భాగంగా ఈ నెల 22వ తేదీన నిర్వహించే రథోత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. స్వామివారికి రూ.1.04 కోట్ల వ్యయంతో భారీ టేకు రథంపై నిర్మించిన విషయం తెలిసిందే. ఆ రోజు సాయంత్రం 5 గంటలకు ఈ రథంపై రథోత్సవం నిర్వహించనున్నారు. ఈ రథాన్ని ఇప్పటికే గత నెల 26న లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆ రథానికి రంగులు వేసే కార్యక్రమంతో పాటు, ఆరు చక్రాలకు పట్టీలు, హైడ్రాలిక్ బ్రేకులు, హైడ్రాలిక్ జాకీలు, ముందు భాగంలో రెండు గుర్రాలు అమర్చే పనులు చురుకుగా జరుగుతున్నాయి. ఈ పనులన్నీ ఈ నెల 16వ తేదీకల్లా పూర్తి చేసి, ఆ రోజు ఉదయం 9 గంటలకు పూర్తి స్థాయిలో ట్రయల్ రన్ వేయనున్నారు. దీనికోసం రథం ఉన్న పంపా సత్రం గేట్లు తొలగించి ర్యాంపు ఏర్పాటు చేస్తున్నారు. పంపా సత్రం నుంచి మెయిన్ రోడ్డు మీదుగా సత్యదేవుని తొలి పావంచా వద్దకు తీసుకుని వెళ్లి, అక్కడి నుంచి మళ్లీ పంపా సత్రానికి తీసుకుని వస్తారు. రథాలను లాగడంలో అనుభవం కలిగిన ధవళేశ్వరానికి చెందిన నిపుణులను ఈ రథోత్సవానికి తీసుకుని వస్తున్నామని అధికారులు తెలిపారు. -
వైఎస్సార్ సీపీ శ్రేణులకు మంత్రి వనిత కృతజ్ఞతలు
దేవరపల్లి: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా దాదాపు మూడు నెలలుగా రేయింబవళ్లు వైఎస్సార్ సీపీ విజయానికి సైనికుల్లా పని చేసిన గోపాలపురం నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, బూత్ కన్వీనర్లు, గృహసారథులు, పార్టీ శ్రేణులు, అభిమానులు, సోషల్ మీడియా కన్వీనర్లకు పార్టీ అభ్యర్థి, రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం దేవరపల్లి మండలం యర్నగూడెంలోని మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. జూన్ నాలుగున జరగనున్న ఓట్ల లెక్కింపులో కూడా ఏజెంట్లు ఇదే ఉత్సాహంతో పాల్గొనాలని ఆమె కోరారు. నాలుగో తేదీన నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ జెండా రెపరెపలాడడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈవీఎంలు నన్నయలో భద్రం రాజానగరం: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను ఆదికవి నన్నయ యూనివర్సిటీ ప్రాంగణంలోని స్ట్రాంగ్ రూములకు సాయుధ బలగాల బందోబస్తు నడుమ తరలించారు. కొన్ని కేంద్రాల్లో సోమవారం అర్ధరాత్రి వరకూ పోలింగ్ జరిగింది. దీంతో రాత్రంతా ఈవీఎంలను నన్నయ వర్సిటీకి తీసుకుని వస్తూనే ఉన్నారు. తెల్లవారుజాము వరకూ వచ్చిన ఈవీఎంలను ఆయా రిసెప్షన్ కౌంటర్ల ద్వారా స్వీకరించారు. అనంతరం సాధారణ ఎన్నికల పరిశీలకుడు కె.బాలసుబ్రహ్మణ్యం సమక్షంలో వాటిని పరిశీలించి, నియోకవర్గాల వారీగా కేటాయించిన స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. రాజకీయ పార్టీల అభ్యర్థుల సమక్షంలో ఈ ప్రక్రియ జరిగింది. ఆయా గదులకు సీల్ వేసి, కేంద్ర బలగల రక్షణ ఏర్పాటు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె.మాధవీలత మంగళవారం తెలిపారు. కార్యక్రమంలో రాజానగరం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఎ.చైత్రవర్షిణి, రాజమండ్రి లోక్సభ, ఏడు అసెంబ్లీ నియోజవకర్గాల అభ్యర్థులు, వారి ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. పోలీసు యంత్రాంగానికి ఎస్పీ అభినందనలు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో జిల్లా పోలీసు యంత్రాంగం చేసిన కృషిని ఎస్పీ పి.జగదీష్ మంగళవారం ఒక ప్రకటనలో అభినందించారు. అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు మినహా జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని తెలిపారు. పక్కా ప్రణాళికతో పోలీసు యంత్రాంగాన్ని ముందుండి నడిపించి, ఎన్నికలు విజయవంతంగా పూర్తి చేశామన్నారు. ఎన్నికల విధి నిర్వహణలో పూర్తి సహాయ సహకారాలు అందించిన జిల్లా పోలీసు అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇద్దరు టీడీపీ కార్యకర్తలపై కేసు నిడదవోలు రూరల్: మండలంలోని రావిమెట్ల గ్రామంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడిచేసిన ఘటనలో ఇద్దరి టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేసినట్టు సమిశ్రగూడెం ఎస్సై రమేష్ మంగళవారం తెలిపారు. రావిమెట్ల గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ ఎన్నికల ఏజెంట్ చిలుకూరి చిట్టిప్రసాద్కు, టీడీపీ కార్యకర్తలకు సోమవారం పోలింగ్ సమయంలో ఎన్నికల బూత్ వద్ద వివాదం తలెత్తింది. దీంతో చిట్టిప్రసాద్పై టీడీపీ కార్యకర్తలు కొట్టేందుకు వెళ్లారు. వారిని అడ్డుకునేందుకు వెళ్లిన చిట్టిప్రసాద్ కుమారుడు భవానీ శివశంకరకుమార్పై దాడికి పాల్పడ్డారు. దీంతో బాధితుడు భవానీ శివశంకర్కుమార్ ఇచ్చిన ఫిర్యాదుపై టీడీపీ కార్యకర్తలు రాంగోను శ్రీను, రాంగోను సత్యనారాయణపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై చెప్పారు. -
దాడి కేసు నమోదు
రాయవరం: మండలంలోని కూర్మాపురంలో సోమవారం జరిగిన ఘటనపై ఆస్పత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు దాడి కేసు నమోదు చేసినట్లు రాయవరం ఏఎస్సై పి.వెంకటేశ్వరరావు మంగళవారం తెలిపారు. ఏఎస్సై వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన వీరబోయిన వీరవెంకటదుర్గాప్రసాద్ వలంటీర్గా పనిచేసి ఇటీవల రాజీనామా చేశాడు. సోమవారం నిర్వహించిన ఎన్నికల పోలింగ్ సమయంలో వలంటీర్ బయట వ్యక్తులతో మాట్లాడుతున్నాడు. అదే సమయంలో జనసేన పార్టీకి చెందిన చెక్కు మహేష్ మరో 13 మంది దుర్గాప్రసాద్ వద్దకు వచ్చిన నీకు ఇక్కడ పనేంటి? ఇక్కడకు ఎందుకు వచ్చావంటూ ఘర్షణకు దిగి, దాడికి పాల్పడ్డారు. గాయాల పాలైన దుర్గాప్రసాద్ రామచంద్రపురం ఏరియా ఆస్పత్రిలో చేరాడు. ఈ మేరకు ఆస్పత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై వెంకటేశ్వరరావు తెలిపారు. -
తమ పార్టీ వ్యక్తినే కిడ్నాప్ చేసిన జనసేన కార్యకర్తలు
మలికిపురం: మండలంలోని రామరాజులంక గ్రామంలో జనసేన కార్యకర్త రేకపల్లి నాగరాజును ఆ పార్టీ కార్యకర్తలే కిడ్నాప్ చేశారు. సోమవారం గ్రామంలోని పోలింగ్ స్టేషన్లో ఓటు ముందుగా వేసే విషయంలో గ్రామంలోని జనసేన కార్యకర్తలు పోటీ పడ్డారు. ఈ నేపథ్యంలో జరిగిన ఘర్షణలో రేకపల్లి నాగరాజును తోసేశారు. వాగ్వాదం జరిగింది. దీంతో నాగరాజు వ్యతిరేక వర్గమయిన అదే గ్రామానికి చెందిన వ్యక్తుల బంధువులు అయిన గూడపల్లి, కేశనపల్లి గ్రామాలకు చెందిన జనసేన యువకులు నాగరాజును సోమవారం సాయంత్రం కిడ్నాప్ చేసినట్టు నాగరాజుతండ్రి సూర్య నారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నాప్కు గురయిన నాగరాజు దొరికాడని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సంపత్కుమార్ తెలిపారు -
ఓటమి భయంతో టీడీపీ కవ్వింపు చర్యలు
● వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నేతలపై దాడులు ● మాజీ కార్పొరేటర్ రోకళ్ళ సత్యకు గాయాలు ● ఘటనా స్థలాన్ని సందర్శించిన ఎస్పీ కాకినాడ: ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఓటమి భయంతో టీడీపీ నేతలు కాకినాడ జిల్లాలోని పలు ప్రాంతాల్లో దాడులకు తెగబడ్డారు. ఏదో ఒక విధంగా అలజడులు సృష్టించి పోలింగ్కు అంతరాయం కలిగించి ఓటర్లను భయపెట్టే లక్ష్యంతో చేసిన వీరి ప్రయత్నం ఉద్రిక్తతలకు దారితీసింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. ఘర్షణలో కాకినాడ వైఎస్సార్ సీపీకి చెందిన మాజీ కార్పొరేటర్ రోకళ్ళ సత్యనారాయణ(సత్య) గాయపడ్డారు. కాకినాడలో టీడీపీ కవ్వింపు చర్య కాకినాడ రామకృష్ణారావుపేట ప్రాంతంలో పోలింగ్ సరళి తమకు వ్యతిరేకంగా కనిపించడంతో కొంతమంది టీడీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన కొంతమంది వైఎస్సార్ సీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా వ్యవహరించారు. ఉదయం నుంచి ఈ తరహాలో రెచ్చగొడుతున్న నేపథ్యంలో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం సాగింది. ఓ దశలో జగన్నాథపురం ప్రాంతానికి చెందిన వనమాడి ఉమామహేశ్వరరావు, చింతా కామేష్ ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు రోకళ్ళ సత్యపై దాడి చేశారు. ఘటనలో రోకళ్ళ చేతికి గాయమై ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, జేసీఎస్ కన్వీనర్ సుంకర విద్యాసాగర్ రోకళ్ళను కలిసి పరామర్శించారు. ఘర్షణ నేపథ్యంలో జిల్లా ఎస్పీ సతీష్కుమార్ ఆస్పత్రికి వెళ్లి సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కరపలో దౌర్జన్యం కాకినాడ రూరల్ కరప మండలం పెదకొత్తూరు గ్రామంలో జనసేన నాయకులు వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై పోలింగ్బూత్ వద్ద దాడికి దిగారు. చేతిలోని సెల్ఫోన్ లాక్కుని దౌర్జన్యం చేశారు. స్థానిక నాయకులు చింతా సత్యనారాయణపై ఈ దాడి జరిగింది. జనసేన అభ్యర్థి పంతం నానాజీ ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలంతా వైఎస్సార్ సీపీ సానుభూతిపరులను చంపుతామంటూ బెదిరింపులకు పాల్పాడ్డారు. పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీయడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. కృష్ణునిపాలెంలో లాఠీచార్జి జగ్గంపేట నియోజకవర్గంలోని సమస్యాత్మక ప్రాంతమైన కృష్ణునిపాలెంలో టీడీపీ నేతల కవ్వింపు చర్యలు కారణంగా ఘర్షణ వాతావరణం నెలకొంది. క్యూలో ఉన్న ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగి కొట్లాటకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఘర్షణను నివారించేందుకు పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. -
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం స్వాధీనం
యానాం: యానాం పట్టణ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్టు సోమవారం ఎస్పీ రాజశేఖరన్ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక మార్కెట్లో సుమారు 30 నుంచి 35 ఏళ్ల వయసు గల పురుషుని మృతదేహాన్ని గుర్తించినట్లు తెలిపారు. పురుగు మందు వంటి విష పదార్థాలను సేవించి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని యానాం జీజీహెచ్ మార్చురీకి తరలించినట్లు చెప్పారు. వివరాలు తెలిసినవారు యానాం పోలీస్స్టేషన్ 0884–2321244, 6300035449, 978555246కు ఫోన్ చేయాలని కోరారు. -
పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లపై అధికారుల అలసత్వం
ఓట్లు వేసే పరిస్థితి లేక వెవెనుదిరిగిన ఓటర్లు కాట్రేనికోన: మండలంలో బ్రహ్మసమేథ్యం, పల్లం పంచాయతీలలో అధికారులు ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలు ఓటు వేసేందుకు అనుకూలంగా లేకపోవడంతో ఓటర్లు వెనుదిరిగి వెళ్లిపోయారు. పోలింగ్ కేంద్రాల వద్ద మౌలిక వసతులు కల్పించవలసిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉన్నా అంటీముట్టనట్టు వ్యవహరించడంతో ఓటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బలుసుతిప్ప గ్రామంలో ఏర్పాటు చేసిన మూడు పోలింగ్ కేంద్రాలలో లోపలికి వెళ్లేందుకు మాత్రమే మార్గం ఉండటం, ఓటు వేసి బయటకు వచ్చే పరిస్థితి లేక పోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇతర ప్రాంతాల నుంచి సహితం గ్రామాలకు వచ్చిన ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద అధిక సంఖ్యలో బారులు తీరారు. పోలింగ్ సజావుగా సాగకపోవడంతో పోలింగ్ కేంద్రాల వద్ద గంటల తరబడి క్యూలో నిలబడలేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లపై ఓటర్లు మండి పడ్డారు. కనీసం ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలోఅధికారులు విఫమయ్యారు. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వెళ్లే సమయంలో జరిగిన తోపులాటలో మహిళలకు గాయాలు అయ్యాయి. ఈ ప్రాంతంలో మరొక పాఠశాల భవనాలు ఖాళీగా ఉన్నప్పటికీ ఇరుకు గదులలోనే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు పడుతున్న ఇబ్బందులపై మీడియా ప్రతినిధులు తహసిల్దారు దాసరి ప్రశాంతిని వివరణ కోరగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు విషయంలో తనకు సంబంధం లేదని, ఎన్నికల కమిషనర్, ఆర్ఓలు చూసుకోవలసి ఉందన్నారు. -
వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయుల దాడి
కాట్రేనికోన: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పల్లంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తల ఇంటిపై టీడీపీ వర్గీయులు దాడి చేశారు. పల్లంలో టీడీపీ వర్గీయులు చేసిన దాడిలో మల్లాడి చిన ధర్మారావు, నరసింహమూర్తి గాయపడ్డారు. ఇరువురు పరిస్థితి ఆందోళన కరంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్కు తరలించారు. మల్లాడి చిన ధర్మారావుకు తలకు బలమైన గాయం కావడంతో వైద్యులు 13 కుట్లు వేశారు. మల్లాడి నరసింహమూర్తి తలకు బలమైన గాయం కావడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. టీడీపీ వర్గీయులు దాడిలో అరధాని శ్రీను గాయపడ్డారు. పల్లంలో అడుగడుగునా ఇరువర్గాలు కవ్వింపు చర్యలకు దిగడంతో పోలీసులు సమయస్పూర్తిగా వ్యవహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కుండలేశ్వరం, కందికుప్ప, బలుసుతిప్ప తదితర గ్రామాలలో టీడీపీ, వైఎస్సార్ సీపీ వర్గీయులు కొట్లాటకు దిగారు. ముమ్మడివరం సీఐ కొండయ్య ఆధ్వర్యంలో పోలీసులు తక్షణమే స్పందించి ఘటనా స్థలాలకు చేరుకుని ఇరువర్గాలను చెదర గొట్టడంతో పరిస్థితి అదుపులోనికి వచ్చింది. పల్లంలో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సూర్యప్రభ వాహనంపై వీరేశ్వరుడు
వైభవంగా రుద్రహోమం ఐ.పోలవరం: నిత్యకల్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ల భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు మూడో రోజు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు శైవాగమ పద్ధతిలో స్వర్ణ రుద్రాక్ష కంకణ, స్వర్ణ సింహతలాట సన్మాన గ్రహీత, రాష్ట్ర ఆదిశైవ అర్చక సంఘ అధ్యక్షుడు యనమండ్ర సత్యసీతారామ శర్మ ఆధ్వర్యంలో ఆలయ అర్చక స్వాముల, అధికారుల పర్యవేక్షణలో ఈ అయిదు రోజుల క్రతువు జరుగనుంది. సోమవారం ఆలయంలో ఉదయం గవ్యాంతం, పంచవింశతి, కలశస్థాపన పూర్వక అభిషేకం, సరస్వతి హోమం, రుద్రహోమం ఘనంగా నిర్వహించారు. సాయంత్రం భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి వార్లను ప్రత్యేకంగా అలంకరించిన ్ఙసూర్య ప్రభశ్రీ వాహనంపై ఊరేగించారు. పచ్చిపూలతో స్వామివారి, అమ్మవారి అలంకరణ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ ఉత్సవాలలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లను ఆలయ ఈఓ మాచిరాజు లక్ష్మీనారాయణ పర్యవేక్షిస్తున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ ఆవరణలో భారీ చలువ పందిళ్లు, పచ్చిపూల అలంకరణ, విద్యుత్ దీపాలంకరణ ఏర్పాటు చేశారు. -
ఓటెత్తారు
● సార్వత్రిక ఎన్నికల్లో వెల్లువెత్తిన చైతన్యం ● ప్రశాంతంగా పోలింగ్ ● ఉదయం 7 గంటల నుంచే క్యూలో నిలబడిన ప్రజలు ● సాయంత్రం 5 గంటలకు 66.55 శాతం ఓటింగ్ నమోదు ● ఈవీఎంలలో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం ● జూన్ 4న ఓట్ల లెక్కింపుసాక్షి, రాజమహేంద్రవరం: సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన పోలింగ్ ప్రక్రియ జిల్లాలో సోమవారం ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడ స్వల్ప ఘటనలు, ఈవీఎంలు మొరాయించడం మినహా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ చోటు చేసుకోకపోవడంతో ఎన్నికల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లావ్యాప్తంగా ఒక లోక్సభ, 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఈ ఎన్నికల్లో ఓటర్ల చైతన్యం వెల్లివిరిసింది. పల్లె, పట్నం అనే భేదం లేకుండా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆసక్తి చూపారు. ఉదయాన్నే పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు తరలి వచ్చి, గంటల తరబడి బారులు తీరి మరీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ కొనసాగింది. అప్పటి వరకూ క్యూలో ఉన్న వారికి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు. దీంతో పలు పోలింగ్ కేంద్రాల్లో రాత్రి వరకూ అనేక మంది క్యూలో వేచి ఉండి మరీ ఓటు వేశారు. ఓట్లు వేసిన అనంతరం బ్యాలెట్ బాక్సులను అధికారులు భద్రపరిచారు. వాటిని కట్టుదిట్టమైన భద్రత నడుమ రాజానగరం సమీపంలోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలోని స్ట్రాంగ్రూములకు తరలించారు. ఇక్కడే వచ్చే నెల 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడతారు. అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. వెబ్ కాస్టింగ్ పర్యవేక్షణ జిల్లాలోని 1,577 పోలింగ్ కేంద్రాల్లో సిబ్బంది ఉదయం 5.30 గంటలకు మాక్ పోల్ నిర్వహించారు. అనంతరం ఉదయం 7 గంటల నుంచి రెగ్యులర్ పోలింగ్ మొదలు పెట్టారు. అన్ని కేంద్రాల్లోనూ నూరు శాతం వెబ్ కాస్టింగ్ నిఘా ఏర్పాటు చేశారు. దీనికోసం పోలింగ్ కేంద్రాల బయట, లోపల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటిని కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ రూముకు అనుసంధానం చేశారు. ఉదయం 5 గంటల నుంచే కంట్రోల్ రూము ద్వారా పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షించారు. ఈ ఎన్నికల నిర్వహణలో ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 20 వేల మంది సిబ్బంది భాగస్వాములయ్యారు. ఉదయం 4 గంటలకే వేకప్ కాల్ ద్వారా అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేశారు. కమాండ్ కంట్రోల్ రూములో 50 మంది అధికారులు, సిబ్బంది విధుల్లో ఉన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద వసతులు వేసవిని దృష్టిలో పెట్టుకుని ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద తాగునీరు, నీడ కోసం షామియానాలు ఏర్పాటు చేశారు. వృద్ధులు, నడవలేని వారి కోసం వీల్ చైర్లను సైతం సిబ్బందితో అందుబాటులో ఉంచారు. గణనీయంగా పోలింగ్ శాతం జిల్లా వ్యాప్తంగా ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రతి రెండు గంటలకూ పోలింగ్ శాతం క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఉదయం 7 నుంచి 9 గంటల మధ్యలో 1,31,988 మంది ఓటు హక్కు వినియోగించుకోగా.. 8.13 శాతం పోలింగ్ నమోదైంది. 11 గంటలకు 3,71,019 మంది ఓట్లు వేయగా.. 22.86 శాతం, మధ్యాహ్నం ఒంటిగంటకు 5,43,201 ఓట్లు పోలవడంతో 33.47 శాతానికి చేరింది. 3 గంటలకు 52.95 శాతం, 5 గంటలకు 66.55 శాతం చొప్పున పోలింగ్ నమోదైంది. రాత్రి 9.30 గంటల సమయానికి జిల్లా వ్యాప్తంగా 76.80 శాతం పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత కూడా కొన్ని కేంద్రాల్లో పోలింగ్ కొనసాగించారు. మొరాయించిన ఈవీఎంలు జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ప్రక్రియ కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. ● తాళ్లపూడి మండండలం వేగేశ్వరపురం హైస్కూల్లోని 25వ నంబర్ పోలింగ్ కేంద్రంలో గంట పాటు ఈవీఎం పని చేయలేదు. ● కొవ్వూరు పట్టణంలో 74, 92వ నంబర్ పోలింగ్ కేంద్రాల్లో కూడా ఈవీఎంలు మొరాయించాయి. ● నిడదవోలు జెడ్పీ బాలికల హైస్కూల్ 34వ నంబర్ బూత్లో ఈవీఎం కొంతసేపు పని చేయలేదు. దీంతో వృద్ధులు ఇబ్బందులు పడ్డారు. ● గోపాలపురం మండలం కొవ్వూరుపాడు గ్రామంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో క్యూలో ఉన్న ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ● రాజమండ్రి సిటీ జాంపేట లూథరన్ చర్చి పోలింగ్ కేంద్రంలో ఈవీఎం గంట పాటు పని చేయలేదు. స్వల్ప వివాదాలు ● అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం రంగాపురం పోలింగ్ కేంద్రం వద్ద వైఎస్సార్ సీపీకి చెందిన సర్పంచ్ వీరభద్రరావుపై టీడీపీ శ్రేణులు దాడికి దిగి గాయపరిచారు. ● రాజానగరం నియోజకవర్గం కలవచర్ల పోలింగ్ బూత్ నుంచి 100 మీటర్ల పరిధిలో ఉన్నారంటూ చెట్టు కింద కూర్చుని ఉన్న వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతో కొద్దిసేపు ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. స్పెషల్ ఫోర్స్ సిబ్బంది ఒకరు కుర్చీతో కొట్టడంతో ఆ యువకులు ఒక్కసారిగా కోపోద్రిక్తులయ్యారు. పోలింగ్ నిలిపివేస్తామంటూ బూత్ వద్దకు వెళ్లి అలజడి సృష్టించారు. వైఎస్సార్ సీపీ నాయకులు సర్ది చెప్పి యువకులను బయటకు తీసుకువెళ్లడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఓటేసిన ప్రముఖులు జిల్లావ్యాప్తంగా వైఎస్సార్ సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ బొమ్మూరు పంచాయతీ కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. హోం మంత్రి, గోపాలపురం ఎమ్మెల్యే అభ్యర్థి తానేటి వనిత యర్నగూడెంలోని 88వ నంబర్ పోలింగ్ బూత్లో ఓటు వేశారు. సిట్టింగ్ ఎంపీ, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ వీఎల్ పురం చేపల మార్కెట్ పక్కన ఉన్న సచివాలయంలో ఏర్పాటు చేసిన 160వ నంబర్ పోలింగ్ బూత్లో ఓటు వేశారు. ఏకేసీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో వైఎస్సార్ సీపీ రాజమండ్రి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ కుటుంబ సమేతంగా తమ హక్కును వినియోగించుకున్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె.మాధవీలత కుటుంబ సభ్యులతో కలసి తన ఓటు హక్కును కంబాలపేట చున్నీలాల్ జాజు రోటరీ మునిసిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో వినియోగించుకున్నారు. రాజానగరం మండలం సూర్యారావుపేట పోలింగ్ బూత్లో ఎమ్మెల్యే అభ్యర్థి జక్కంపూడి రాజా ఓటు వేశారు. రాత్రి 9.30 గంటల సమయానికి జిల్లాలో పోలింగ్ వివరాలు నియోజకవర్గం మొత్తం ఓట్లు పోలైన ఓట్లు శాతం అనపర్తి 2,26,053 1,82,873 80.90 గోపాలపురం 2,42,763 1,96,919 81.12 కొవ్వూరు 1,84,136 1,49,782 81.34 నిడదవోలు 2,13,396 1,67,439 78.46 రాజమండ్రి సిటీ 2,67,484 1,76,419 66.95 రాజమండ్రి రూరల్ 2,72,826 1,97,840 72.52 రాజానగరం 2,16,491 1,75,285 80.97 -
సంక్షేమమే బలం.. బలగం
● ఓటర్లంతా వైఎస్సార్ సీపీ వైపే ● ఆ పార్టీ అభ్యర్థుల ధీమా ప్రభుత్వం చేసిన అభివృద్ధే శ్రీరామరక్ష.. పేదలకు అందించిన పథకాలే కొండంత బలం, బలగం.. అందుకే ఈ ఎన్నికల్లో జనమంతా వైఎస్సార్ సీపీ వైపునకు వచ్చారు.. మళ్లీ పార్టీ విజయఢంకా మోగిస్తుందని, జగనన్న సీఎం కావడం ఖాయమని సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓటర్లు తమ అమూల్యమైన ఓటు ద్వారా అది నిజం చేశారని అన్నారు. వారి మాటలు ఇలా.. – రాజమహేంద్రవరం సిటీ, రాజానగరం -
అఖండ విజయం సాధిస్తాం..
రాజమహేంద్రవరంలో వైఎస్సార్ సీపీ అఖండ విజయం సాధించబోతోంది. నగరంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలంతా నిర్ణయించుకున్నారు. ప్రతిపక్ష కూటమిపై ఎవరికీ నమ్మకం లేదు. 2014లో ఇదే కూటమితో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ప్రజలకు, రాష్ట్రానికీ చేసిందేమీ లేదు. చంద్రబాబు అప్పుడు 640 హామీలిచ్చి ఏ ఒక్కటీ అమలు లేదు. ఇప్పుడు అదే కూటమి తప్పుడు వాగ్దానాలతో ముందుకొచ్చినా ఎవరూ నమ్మలేదు. జగన్మోహన్రెడ్డి అంటే ఒక నమ్మకం, ఒక భరోసా. ఈ ఐదేళ్లలో జగనన్న చెప్పిందానికన్నా ఎక్కువ పథకాలు చేశారు. రాష్ట్రంలో మళ్లీ సంక్షేమ రాజ్యం వస్తుంది. వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులు, నగరంలో విద్యాధికులు, మేధావులు కచ్చితంగా మద్దతిస్తారనే భావిస్తున్నా. – మార్గాని భరత్రామ్, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, రాజమహేంద్రవరం సిటీ -
తొండంగి మండలంలో బాహాబాహీ
తొండంగి: మండలంలోని పోలింగ్ బూత్ల వద్ద పోలీసులు, ప్రత్యేక బలగాల సిబ్బంది దురుసుగా ప్రవర్తించడంతో ఓటర్లు ఇబ్బంది పడ్డారు. ఎ.కొత్తపల్లిలో పోలింగ్ కేంద్రం వద్ద ఏఎస్సై స్థానికులను లాఠీతో కొట్టడంతో వివాదాస్పదమైంది. వెంటనే ఎస్సై వినయ్ ప్రతాప్ అక్కడకు చేరుకుని విచారణ చేశారు. గోపాలపట్నంలో ఘర్షణ గోపాలపట్నంలో ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో 158 పోలింగ్ బూత్లో ఘర్షణ కారణంగా ఎన్నికల సిబ్బందికి సహాయకుడిగా ఉన్న పంచాయతీ బోరు ఆపరేటర్ పెదపాటి దిలీప్కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో 108 అంబులెన్స్ సిబ్బంది ప్రాధమిక చికిత్స అందించి తుని ఆస్పత్రికి తరలించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్టు ఎస్సై బి.వినయ్ప్రతాప్ తెలిపారు. తాటియాకులపాలెంలో 218 పోలింగ్ బూత్లో ఏజెంట్ల మధ్య వచ్చిన వాగ్వివాదం కారణంగా సుమారు గంటపాటు పోలింగ్ నిలిచిపోయింది. ఎన్నికల అధికారులు, పోలీసులు సర్ది చెప్పడంతో పోలింగ్ యథావిధిగా కొనసాగింది. కోనసీమలో ఘర్షణలు, తోపులాటలు ● అమలాపురం మున్సిపల్ కార్యాలయం, రవణం మల్లయ్య వీధి పోలింగ్ కేంద్రాల్లో వైఎస్సార్ సీపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఓట్ల విషయమై గొడవ పడ్డారు. కేకలు, తోపులాటలతో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అల్లవరం మండలం బెండమూర్లంక పోలింగ్ కేంద్రం వద్ద జరిగిన గలాటాలో పోలీసులు లాఠీ చార్జీ జరపగా ఓ వ్యక్తి చేతికి గాయమైంది. ● సమనస పోలింగ్ కేంద్రం వద్ద ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులు సైకిల్ గుర్తుకు ఓటేయాలంటూ ఓటర్లకు చెబుతున్నారని వైఎస్సార్ సీపీ శ్రేణులు నిలదీయడంతో ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. దీంతో రూరల్ సీఐ వీరబాబు, ఎస్ఐ శేఖర్బాబులు బలగాలతో ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దీనిపై వైఎస్సార్ సీపీ నాయకులు ఆర్వో కేశవర్ధన్రెడ్డికి ఫిర్యాదుచేశారు. ● చిందాడగురువు పోలింగ్ కేంద్రంలో ఒక యువకుడు దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నించడంతో మరో వ్యక్తి గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ● నడిపూడిలో టీడీపీ కార్యకర్తలు ఓటర్లను వెంటబెట్టుకుని పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లి ఓట్లు వేయిస్తున్నారంటూ వైఎస్సార్ సీపీ శ్రేణులు అడ్డుకోవడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితి సద్దుమణిగించారు. ● బండారులంక పోలింగ్ కేంద్రం–11లో గ్రామ సర్పంచ్ పెనుమాల సునీత ఓటర్లను ప్రలోభపెడుతున్నారంటూ కొందరు అడ్డుకున్నారు. ఈ వివాదంలో సర్పంచ్ భర్త పెనుమాల ఏడుకొండలు తమను అడ్డగించి దాడి చేశారంటూ సరెళ్ల నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి ఏరియా ఆసుపత్రిలో చేరారు. -
జగన్ వెంటే జనం
రాజానగరం నియోజకవర్గంలో విజయం నాదే. రానున్న ఎన్నికల ఫలితాల్లో ఇదే నిజం కాబోతోంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలన్న ఒకేఒక ఆకాంక్షతో ఎక్కువ మంది ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. నా ఎన్నికల ప్రచారంలో బ్రహ్మరథం పట్టి ఓట్లతో గెలుపును అందిస్తున్న ప్రజలకు రుణపడి ఉంటా. రాష్ట్రం కోసం నిబద్ధత, అంకిత భావంతో పనిచేసిన జగన్ మళ్లీ సీఎం కాబోతున్నారు. టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి కూటమి ఎన్ని కుయుక్తులు పన్నినా జనం జగనన్న వెంటే ఉన్నారు. – జక్కంపూడి రాజా, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, రాజానగరం -
విజయం మనదే
ఈ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయదుందుభి మోగించనుంది. సంక్షేమ ప్రదాత జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కాబోతున్నారు. పార్లమెంట్ పరిధిలో ఎన్నికల పోలింగ్ సరళిని చూస్తే అది ప్రస్పుటమైంది. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రతి కుటుంబానికీ మేలు చేశాయి. ఆయన్నే మళ్లీ సీఎంగా చేయాలనే కృతనిశ్చయంతో ప్రజలంతా ఓటేశారు. తిరిగి రాష్ట్రంలో వచ్చేది వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే. – డాక్టర్ గూడూరి శ్రీనివాస్, వైఎస్సార్ సీపీ రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి -
తలకాయలు లేచిపోతాయ్
పలుచోట్ల ఘర్షణలు గోకవరం: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గంలో పలుచోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయి. గోకవరం మండలం కృష్ణునిపాలెం గ్రామంలో టీడీపీ, వైఎస్సార్ సీపీ వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఉదయం నుంచి ఇరుపార్టీల వారు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. సాయంత్రానికి తీవ్రంగా మారడంతో ఇరువర్గాల వారు పోలింగ్ కేంద్రం వద్ద ఒకరిపై ఒకరు దాడికి దిగారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీచార్జి చేశారు. కిర్లంపూడి మండలం కృష్ణవరంలో టోల్గేట్ సమీపంలో టీడీపీ, వైఎస్సార్ సీపీ వర్గీయులు ఘర్షణకు దిగారు. జగ్గంపేట మండలంలోని పలు గ్రామాల్లో, గండేపల్లి మండలం తాళ్లూరు, మల్లేపల్లి, ఉప్పలపాడులో టీడీపీ, వైఎస్సార్ సీపీ వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఫ జనసేన అభ్యర్థి సమక్షంలో ఆ పార్టీ కార్యకర్తల దౌర్జన్యం ఫ వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడిని చంపుతామని బెదిరింపు ఫ కాకినాడ రూరల్ వేములవాడలో ఘటన కరప: శ్రీఒక్కొక్కరి అంతు చూస్తాం. ఈ రోజు తలకాయలు లేచిపోతాయి. ఎవరొస్తారో చూస్తాంశ్రీ అంటూ వైఎస్సార్ సీపీ శ్రేణులపై కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థి పంతం నానాజీ సమక్షంలో ఆ పార్టీ కార్యకర్తలు దౌర్జన్యం, బెదిరింపులకు దిగారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కరప మండలం పెద కొత్తూరులో సోమవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎన్నికల సరళిని పరిశీలించేందుకు నానాజీ తన అనుచరులు, పొరుగూరు జనంతో కలసి ఆరు కార్లలో సాయంత్రం 5 గంటల సమయంలో వేములవాడ గ్రామానికి వచ్చారు. స్థానిక నాయకులను వెంట పెట్టుకుని పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అంతమంది జనంతో పోలింగ్ కేంద్రంలోకి వెళ్లడమేమిటని వారిని స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు అడ్డగించారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి కురసాల కన్నబాబునుద్దేశించి శ్రీవాడొస్తే బూత్లోకి పంపిస్తారా?శ్రీ అంటూ రాయలేని పదజాలంతో నానాజీ దూషణలకు దిగారు. ఆయన మాట తీరుపై వైఎస్సార్ సీపీ నాయకులు తీవ్ర స్థాయిలో అభ్యంతరం చెప్పారు. ఈ క్రమంలో వారితో జనసేన శ్రేణులు వాగ్వాదానికి, తోపులాటకు దిగారు. పోలీసులు రంగప్రవేశం చేసి, ఇరు వర్గాల వారినీ చెదరగొట్టడంతో గొడవ సద్దుమణిగింది. అనంతరం నానాజీ పెదకొత్తూరు గ్రామం వెళ్లారు. అదే సమయంలో వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు చింతా ఈశ్వరరావు ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వెళ్తూండగా, తన అనుచరులు 60 మందితో కలసి గేటు వద్ద నానాజీ అడ్డంగా నిలబడ్డారు. లోపలకు వెళ్లడానికి దారివ్వాలని ఈశ్వరరావు కోరగా.. శ్రీపక్క నుంచి వెళ్లుశ్రీ అని నానాజీ దురుసుగా మాట్లాడారు. ఇదే అదనుగా అక్కడే ఉన్న వైఎస్సార్ సీపీ కార్యకర్త తోటకూర శ్రీనుపై జనసేన కార్యకర్తలు దౌర్జన్యం చేసి మొబైల్ ఫోన్ లాగేసుకుని, ఒక్కొక్కరి అంతు చూస్తామంటూ బెదిరించారు. ఈ రోజు తలకాయలు లేచిపోతాయి, ఎవరొస్తారో చూస్తామంటూ బెదిరించారు. ఈ క్రమంలో ఇరువర్గాల వారూ వాగ్వాదానికి దిగి, తోసుకున్నారు. పోలీసులు సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ఇదిలా ఉండగా మధ్యాహ్నం తమ ఇంటి మీదకు బీరు సీసా విసిరి, తల తీసేస్తామంటూ జనసేన పార్టీ కార్యకర్తలు తమను బెదిరించి, భయభ్రాంతులకు గురి చేశారని ఈశ్వరరావు భార్య, మాజీ సర్పంచ్ చింతా దుర్గాశ్రీ తెలిపారు. జనసేన కార్యకర్తల నుంచి రక్షణ కల్పించాలని కోరారు. కూరాడలో కూడా జనసేన కార్యకర్తలు రెచ్చిపోయి వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దౌర్జన్యానికి దిగడంతో రెండు గంటల పాటు పోలింగ్ నిలిచిపోయింది. రాత్రి 9 గంటలకు కూడా పోలింగ్ నిర్వహించాల్సి వచ్చింది. కొరిపల్లి, గురజనాపల్లి గ్రామాల్లో కూడా జనసేన కార్యకర్తలు వీరంగం వేయడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. -
సార్వత్రిక సమరానికి సర్వం సిద్ధం
ఫ నేటి ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ ఫ పోలింగ్ సామగ్రితో తరలిన సిబ్బందిసాక్షి, రాజమహేంద్రవరం: సార్వత్రిక ఎన్నికల మహాసంగ్రామంలో కీలకమైన పోలింగ్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. సోమవారం ఉదయం ఏడు నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. జిల్లాలోని ఒక లోక్సభ, ఏడు శాసనసభ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల భవితవ్యాన్ని 16,23,149 మంది ఓటర్లు ఈవీఎంల ద్వారా నిర్దేశించనున్నారు. పునర్విభజన అనంతరం ఏర్పడిన నవ్య తూర్పు గోదావరి జిల్లాలో తొలిసారిగా జరుగుతున్న ఈ ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. జిల్లా వ్యాప్తంగా 1,577 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 15 వేల మంది పోలీస్, వివిధ శాఖల అధికారులను నియమించారు. ఎన్నికల సిబ్బందికి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం), వీవీ ప్యాట్లు, ఇతర పోలింగ్ సామగ్రిని ఆయా పోలింగ్ సిబ్బందికి ఆదివారం అందజేశారు. మధ్యాహ్నం 3 గంటల వరకూ ఈ ప్రక్రియ జరిగింది. అనంతరం ఎన్నికల సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలకు బయలుదేరారు. వీరందరూ ఆయా కేంద్రాల్లో ఉదయం 5.30 గంటలకే విధులకు హాజరై పీడీఎంఎస్ యాప్లో వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. ముందుగా ఉదయం మాక్ పోలింగ్ నిర్వహించి, ఈవీఎంలు సక్రమంగా పని చేస్తున్నాయో లేదో గుర్తిస్తారు. ఎక్కడైనా ఈవీఎంలు సరిగ్గా పని చేయకపోతే మైక్రో అబ్జర్వర్ల ద్వారా మరో యూనిట్ ఏర్పాటు చేసేలా అదనంగా రెండు ఈవీఎంలు అందుబాటులో ఉంచారు. ఈవీఎంలలో లోపాలను ఎప్పటికప్పుడు సరి చేసేందుకు జిల్లాలో 21 మంది ఇంజినీర్లను అందుబాటులో ఉంచారు. పోలింగ్ అనంతరం ఆయా నియోజకవర్గాల్లోని పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలను ఆయా కేంద్రాల నుంచి రాజానగరం సమీపంలోని ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములకు తరలిస్తారు. ఈవీఎంలను స్వీకరించేందుకు వర్సిటీలో ప్రత్యేకంగా కేంద్రాలు ఏర్పాటు చేశారు. జూన్ 4న నన్నయ యూనివర్సిటీలోనే ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. వెబ్ నిఘా పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకూ తావు లేకుండా వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు కలెక్టరేట్ నుంచి నేరుగా పర్యవేక్షించనున్నారు. పోలింగ్ కేంద్రాల బయట సైతం ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకూ గురి కాకుండా నిఘా పెట్టారు. జిల్లాలో 375 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఈ కేంద్రాల్లో ప్రత్యేక నిఘా కోసం మైక్రో అబ్జర్వర్లు, వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. దీంతో పాటు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. నేడు సెలవు ఎన్నికల నేపథ్యంలో రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని అన్ని కార్యాలయాలకూ సోమవారం సెలవు ప్రకటిస్తూ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె.మాధవీలత ఉత్తర్వులు జారీ చేశారు. దీని నుంచి జిల్లా ఖజానా, ఉప ఖజానా కార్యాలయాలు, అత్యవసర సేవల విభాగాలను మినహాయించారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి పోల్ డే అంటే హాలిడే కాదు. ప్రజాస్వామ్య పండగ. ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రానికి వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. అప్పుడు దీనికి సార్థకత. ప్రతి ఓటరూ పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లూ చేశాం. – కె.మాధవీలత, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పటిష్టంగా బందోబస్తు ఎన్నికలకు 1,700 మంది పోలీసు అధికారులు, సిబ్బంది, 10 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలతో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశాం. రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచి వారి కదలికలను పర్యవేక్షిస్తున్నాం. ఇప్పటి వరకూ 1,098 రౌడీ షీటర్లను, గత ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యకు కారకులైన 173 మందిని బైండోవర్ చేశాం. 178 లైసెన్స్డ్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాం. సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్ కాస్టింగ్, పోలీసులతో నిఘా కట్టుదిట్టం చేశాం. – కె.జగదీష్, జిల్లా ఎస్పీ -
దేశ భవితకు చుక్కాని
ఎందుకు చెరిగిపోదంటే..ఓటరు వేలికి వేసే సిరాలో 7.25 శాతం సిల్వర్ నైట్రేట్ ఉన్నందున వేసిన వెంటనే చెరిగిపోదు. ఈ సిరా చుక్క సూర్యుని వెలుతురు తగలగానే ఆరిపోతుంది. 2006 ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఓటరు ఎడమ చేతి చూపుడు వేలు గోరు పైభాగం నుంచి కింది వరకు సిరా గుర్తు వేస్తున్నారు. అంతకు ముందు గోరు పైభాగపు చర్మంపైననే వేసేవారు. కాకినాడ సిటీ: ఎన్నికల్లో ఓటు వేసిన ప్రతి ఒక్కరి వేలికి సిరా చుక్క పెతారన్నది అందిరకీ తెలిసిందే. ఓటు వేసిన వ్యక్తి మరో ఓటు వేయకుండా నిరోధించేందుకు ఎన్నికల యంత్రాంగం చేసిన ఏర్పాటు ఇది. అంతే కాదు.. ప్రతి ఓటరు ఎంతో గౌరవంగా ఆ సిరా పెట్టిన వేలితో సెల్ఫీ తీసుకుని ‘నేను ఓటు వేశాను’ అని దేశ పౌరుడిగా తన బాధ్యత మరికొంత మందికి గుర్తు చేస్తుంటాడు. చెరిగిపోకుండా కొన్ని రోజుల పాటు ఉండే ఈ సిరాకి ఓ చరిత్ర ఉంది. అదేమిటో తెలుసుకుందామా.. తయారయ్యేది ఎక్కడంటే సిరాను కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్కు చెందిన మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ (ఎంపీవీఎల్) అనే కంపెనీ తయారు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం 1962లో సిరా ఉత్పత్తి కోసం ఈ కంపెనీకి అనుమతి ఇచ్చింది. నేషనల్ ఫిజికల్ లేబొరేటరీస్ ఫార్ములాతో సిరా ఉత్పత్తి బాధ్యతను ఈ కంపెనీకి అప్పగించారు. అప్పటి నుంచి దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఈ సిరాను సరఫరా చేస్తుంటారు. 1950లో పేటెంట్ ఓటర్లకు సిరా వేసే విధానం చాలా కాలం పాటు లేదు. 1950 సంవత్సరంలో ఈ సిరా పేటెంట్ను భారత్లోని నేషనల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఆర్డీసీ) పొందింది. ఆ తరువాత సీఎస్ఐఆర్ (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్)కు చెందిన నేషనల్ ఫిజికల్ లాబొరేటరీ (ఎన్పీఎల్) ఈ సిరాను అభివృద్ధి చేసింది. అటు తరువాత సిరా ఉత్పత్తికి మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ అనే చిన్న కంపెనీకి అనుమతి ఇచ్చింది. ఈ కంపెనీని 1937లో మైసూర్ మహారాజు కృష్ణరాజ వడయార్ స్థాపించారు. ఈ కంపెనీ 1962లో జరిగిన మూడో సార్వత్రిక ఎన్నికల సమయంలో తొలిసారి ఈ సిరాను మైసూర్ ప్రాంతంలోనే వాడారు. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలలో వాడుతున్నారు. 5 ఎంఎల్ వైల్ 300 మందికి సిరా 5 ఎంఎల్ (మిల్లీలీటర్ల) వైల్ 300 మందికి సరిపోతుందని అంచనా. ప్రస్తుతం జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 97 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ క్రమంలో ఎన్నికల కోసం 30 లక్షల సిరా వైల్స్ అవసరం. ఇందుకోసం రూ.55 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. పలు దేశాలకు సరఫరా దేశీయంగా తయారవుతున్న సిరాకు అంతర్జాతీయంగా చాలా డిమాండ్ ఉంది. మన దేశంలోని అన్ని రాష్ట్రాల ఎన్నికలకూ సరఫరా చేయడంతో పాటు 1976 నుంచి 25 నుంచి 30 దేశాలకు ఇక్కడి నుంచి ఎగుమతి అవుతోంది. పాకిస్తాన్, అఫ్గనిస్తాన్, నేపాల్, మయన్మార్, ఇరాక్, ఇండోనేషియా, లెబనాన్, అల్జీరియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, సూడాన్, సిరియా, టర్కీ, ఈజిప్టు తదితర దేశాల్లో ఎన్నిల సమయంలో ఈ సిరాను వినియోగిస్తారు. ఓటరు బాధ్యతను గుర్తు చేసే సిరా చుక్క సుమారు వారం వరకు చెరిగిపోని గుర్తు కర్నాటక రాష్ట్రం మైసూరులో తయారీ -
ఊరు మారింది
గ్రామాభివృద్ధే లక్ష్యం గ్రామాభివృద్ధే లక్ష్యంగా రూ.5.69 కోట్లతో గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టాం. ఈ పనులన్నీ 80 శాతం పైగా పూర్తయ్యాయి. గ్రామంలో ఎన్నో ఏళ్లుగా ఉన్న తాగునీటి సమస్యను పరిష్కరించాం. రూ.40 లక్షలతో 36 సీసీ రోడ్లు నిర్మించాం. రూ.1.51 కోట్లతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆధునీకరించాం. ప్రభుత్వ సహకారంతో గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, వెల్నెస్ సెంటర్లు, సీసీ రోడ్లు, కల్వర్టులు, జీఎల్ఆర్ వాటర్ ట్యాంకులు తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినందుకు గర్వంగా ఉంది. – ఏనుగు శ్రీను (బంకు శ్రీను), వైస్ ఎంపీపీ, రాచపల్లి, ప్రత్తిపాడు మండలంప్రతి ఇంటికీ సంక్షేమం ప్రస్తుత ప్రభుత్వ హయాంలో గ్రామంలోని దాదాపు ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందాయి. డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా రూ.25.89 కోట్ల మేర గ్రామస్తులకు లబ్ధి చేకూరింది. – సారిపల్లి లోవలక్ష్మి, సర్పంచ్, రాచపల్లిప్రత్తిపాడు రూరల్: ప్రత్తిపాడు మండలం రాచపల్లి గ్రామం ఐదేళ్లుగా అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. గ్రామాభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో మౌలిక వసతులు మెరుగుపడ్డాయి. పీహెచ్సీకి మహర్దశ రాచపల్లి, పరిసర గ్రామాల ప్రజలకు నిత్యం వైద్య సేవలు అందించే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) దశాబ్ద కాలం కిందటే శిథిలావస్థకు చేరింది. ఎన్ని ఫిర్యాదులు చేసినా గత ప్రభుత్వం దీనిని పట్టించుకోలేదు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే నాడు – నేడులో భాగంగా రూ.1.51 కోట్లతో పీహెచ్సీ భవనాన్ని అత్యాధునిక వసతులతో అభివృద్ధి చేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. రూ.40 లక్షలతో సీసీ రోడ్లు రాచపల్లిలో రూ.40 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు. రూ.10 లక్షలతో 19 డ్రైనేజీలు, కల్వర్టులు నిర్మించారు. రూ.7 లక్షలతో శ్మశాన వాటికను అభివృద్ధి చేశారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా రూ.1.70 లక్షలతో ఆయా కాలనీల్లో 15 విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశారు. వైఎస్సార్ జలకళ పథకం కింద గ్రామానికి చెందిన 11 మంది రైతుల పంట పొలాల్లో రూ.55 లక్షలతో బోర్లు వేశారు. రూ.80 లక్షలతో సచివాలయ భవనాల నిర్మాణం గ్రామంలో రూ.80 లక్షలతో రెండు గ్రామ సచివాలయ భవనాలు, మరో రూ.46.80 లక్షలతో రెండు రైతు భరోసా కేంద్రాల భవనాలు నిర్మించారు. దీంతో ప్రజలకు, రైతులకు మెరుగైన ప్రభుత్వ సేవలు అందుబాటులోకి వచ్చాయి. మారిన ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వం రూ.18 లక్షలు కేటాయించింది. ఈ నిధులతో అదనపు తరగతి గదులు, మంచినీటి వసతి, మరుగుదొడ్లు సదుపాయం, డెస్క్లతో కూడిన బెంచీలు ఏర్పాటు చేశారు. కార్పొరేట్ పాఠశాలకు దీటుగా వసతులు మెరుగుపరచడంతో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. నాడు–నేడు రెండో దశలో రూ.15.92 లక్షలతో ప్రభుత్వ ప్రత్యేక పాఠశాలను అభివృద్ధి చేస్తున్నారు. తాగునీటి సమస్యల పరిష్కారం గ్రామస్తులు గతంలో తాగునీటి కోసం నానా ఇబ్బందులు పడేవారు. వేసవి వచ్చిందంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. దీని నుంచి ప్రజలకు విముక్తి కల్పిస్తూ రూ.11.90 లక్షలతో 14 జీఎల్ఆర్ వాటర్ ట్యాంకులను గ్రామం నలుమూలల నిర్మించారు. రూ.1.54 కోట్లతో రక్షిత మంచినీటి పథకం జల్జీవన్ మిషన్ నిధులు రూ.1.54 కోట్లతో గ్రామంలో 1.60 లక్షల లీటర్ల సామర్థ్యం గల రక్షిత మంచినీటి పథకానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఇంటింటికీ కుళాయి కనెక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా రూ.25.89 కోట్ల మేర లబ్ధి గ్రామంలో 5,542 జనాభా ఉంది. వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా గ్రామస్తులకు డీబీటీ, నాన్ డీబీటీ పద్ధతిలో రూ.25.89 కోట్ల మేర లబ్ధి చేకూరింది. 470 మందికి జగనన్న ఇళ్ల స్థలాలు మంజూరు చేయడమే కాకుండా 143 మంది లబ్ధిదారులకు రూ.2.57 కోట్ల హౌసింగ్ రుణాలు కింద నిధులు మంజూరు చేశారు. సొంత స్థలాల్లో 102 మంది లబ్ధిదారులకు రూ.1.83 కోట్లు మంజూరు చేసి పేదల సొంతింటి కలను నెరవేర్చారు. 450 మందికి ఇళ్ల స్థలాలు నిరుపేదల సాంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం జగనన్న కాలనీ ఏర్పాటు చేసి, 470 మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేసింది. రూ.2.66 కోట్లతో భూమి కొనుగోలు చేసి మరీ ఇళ్ల స్థలాలు అందజేసింది. ఇళ్లు కూడా మంజూరు చేయించడంతో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నారు. అభివృద్ధికి చిరునామాగా మారిన రాచపల్లి రూ.5.69 కోట్లతో పనులు సంక్షేమ పథకాల ద్వారా గ్రామస్తులకు రూ.14.87 కోట్ల మేర లబ్ధి మెరుగుపడిన మౌలిక వసతులు సొంతింటి కల సాకారం ప్రభుత్వం ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు ఇల్లు మంజూరు చేసింది. ప్రభుత్వ ఆర్థిక సహకారంతో ఇంటి నిర్మాణం పూర్తి చేశాం. ఇప్పుడు సొంతింటిలో హాయిగా ఉంటున్నాం. – బొమ్ము రాఘవమ్మ, గ్రామస్తురాలు, రాచపల్లి -
ఈ కార్డులుంటే చాలు.. ఓటేయవచ్చు
నిడదవోలు రూరల్: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సోమవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. బూత్ల వారీగా ఓటర్లకు ఇప్పటికే ఫొటో ఓటరు స్లిప్పులు పంపిణీ చేశారు. అయితే కొందరికి పోలింగ్ స్లిప్పులు అందలేదని చెబుతున్నారు. పోలింగ్ సమయంలో ఆ స్లిప్పులు అందుబాటులో లేకుంటే ప్రత్యామ్నాయంగా 12 రకాల గుర్తింపు కార్డులను చూపించి ఓటేసేందుకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చింది. వీటిలో ఏదైనా ఒకటి చూపించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. జాబితాలో ఓటరు పేరుకు సంబంధించి తప్పులు ఉన్నట్టయితే గుర్తింపు పత్రంలో నిర్ధారించుకుని ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తారు. గుర్తింపు కార్డులు ఇవే.. 1. ఓటరు గుర్తింపు కార్డు, 2. ఫొటో ఓటరు స్లిప్, 3. ఆధార్కార్డు, 4. డ్రైవింగ్ లైసెన్స్, 5. రేషన్కార్డు, 6.పాన్ కార్డు,7.పాస్పోర్టు, 8. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సర్వీసు గుర్తింపు కార్డు, 9. బ్యాంక్ పాస్బుక్ (ఫొటోతో ఉండాలి), 10. పోస్టాఫీసు పాస్ బుక్, 11. కార్మికశాఖ జారీచేసిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్కార్డు, 12. పెన్షన్ పత్రం, 13. ఉపాధిహామీ జాబ్కార్డు. నచ్చకపోతే నోటాకాకినాడ సిటీ: ఓటే వజ్రాయుధం.. మనకు నచ్చిన అభ్యర్థులను ఎన్నుకునేందుకు ఇదో ఆయుధం.. ఉత్తమ సమాజాన్ని నిర్మించే అస్త్రం.. ఓటరుకు నచ్చిన అభ్యర్థిని ఎన్నుకునేందుకు ఓటుహక్కు ఎంతో కీలకం. ఒకవేళ పోటీలోని అభ్యర్థులు ఎవరూ నచ్చకపోతే ‘నోటా’ (నన్ ఆఫ్ ద అబొవ్)ను సంధించొచ్చు. ఈ హక్కును 2104లో సుప్రీంకోర్టు ఓటర్లకు కల్పించింది. బ్యాలెట్పై అభ్యర్థుల జాబితాలో ఈ గుర్తు ఉంటోంది. ఇది చాలాసార్లు గెలుపోటములను తలకిందులు చేసింది. కాకినాడ జిల్లాలో 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు చాలా వరకూ నోటా వైపు వెళ్లారు. ప్రతి నియోజకవర్గంలో దాదాపు రెండు వేల మందికి పైగానే ఓటర్లు నోటాకు మద్దతు ఇచ్చారు. అత్యధికంగా జగ్గంపేట నియోజకవర్గంలో 3,626 మంది నోటాకు ఓటు వేశారు. అత్యల్పంగా కాకినాడ రూరల్లో 1,779 మంది నోటాను నొక్కారు. -
No Headline
కపిలేశ్వరపురం: సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధమయ్యాయి. ప్రభుత్వ యంత్రాంగమంతా ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఓటు వేసేందుకు ఓటర్లు సన్నద్ధమయ్యారు. 2009లో ఏర్పాటైన మండపేట నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఈ నియోజకవర్గంలోని ఎన్నికల తీరు మండపేట పట్టణం, రూరల్ మండలంలోని 12 గ్రామాలు, కపిలేశ్వరపురం మండలంలోని 19 గ్రామాలు, రాయవరం మండలంలోని 12 మొత్తం 43 గ్రామాల రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థితిగతులపై ఆధారపడి సాగుతోంది. 2014 , 2019, ప్రస్తుత ఎన్నికల తీరుపై ఈ కథనం.. ఎన్నికల బరిలో ఉన్నవారు.. 2014, 2019, ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు జరుగుతూ వస్తున్నాయి. ఆ మూడు ఎన్నికల్లోనూ టీడీపీ నుంచి ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, కాంగ్రెస్ నుంచి కామన ప్రభాకరరావు, స్వతంత్ర అభ్యర్థిగా కోన సూర్యభాస్కరరావు, మార్ని సత్యనారాయణ వరుసగా పోటీలో ఉన్నారు. మందపల్లి రవి 2019లోనూ, ప్రస్తుత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నారు. వైఎస్సార్ సీపీ తరపున 2014లో గిరిజాల వెంకటస్వామి నాయుడు, 2019లో పిల్లి సుభాష్ చంద్రబోస్, ప్రస్తుతం తోట త్రిమూర్తులు పోటీలో ఉన్నారు. బీఎస్పీ తరపున 2014లో ఎంవీ సుబ్బరాజు, ప్రస్తుత ఎన్నికల్లో గుర్రపు కొత్తియ్య పోటీలో ఉన్నారు. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున 2014లో మొగ్గా భారతి, 2019లో నల్లమిల్లి విజయభాస్కరరెడ్డి పోటీ చేశారు. జనసేన తరపున 2019లో వేగుళ్ల లీలాకృష్ణ, 2019లో బీజేపీ తరపున కోన సత్యనారాయణ, 2014లో జేఎస్పీ తరపున సినీనటి సయ్యద్ హేమ పోటీలో ఉన్నారు. లోక్ సత్తా తరపున 2014లో పీవీవీ రామకృష్ణ, 2014లో ఐసీఎస్పీ తరపున మందపల్లి సత్యానందం, ప్రస్తుత ఎన్నికల్లో నవతరం పార్టీ తరపున నందికోళ్ళ రాజు, ఆర్పీఐఏ తరపున సాదే డేవిడ్రాజు, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరపున నల్లా చిన్నారావు పోటీ చేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులుగా 2019లో గుత్తుల శ్రీనివాస్, దాసి ఈశ్వరరావు పోటీ చేయగా ప్రస్తుత ఎన్నికల్లో రాయుడు శ్రీనివాస్, కోన వీరవెంకట సత్యనారాయణ, కోన శ్రీకృష్ణలు పోటీలో ఉన్నారు. గత మూడు ఎన్నికల్లో 11 తగ్గని అభ్యర్థుల సంఖ్య ఆసక్తి చూపుతున్న స్వతంత్య్ర అభ్యర్థులు ప్రస్తుత ఎన్నికల బరిలో రాజకీయ పార్టీల నుంచి ఏడుగురు, స్వతంత్ర అభ్యర్థులు ఆరుగురు
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
మీసా భారతి.. రోహిణి ఆచార్య.. కూతుళ్లకు లాలూ ఈ పేర్లెందుకు పెట్టారు?
రేపల్లెలో టీడీపీ నేతల ఓవర్ యాక్షన్ కి మోపిదేవి స్ట్రాంగ్ కౌంటర్
ఏపీలో పెరిగిన పోలింగ్ శాతం.. గతంలో ఇదే జరిగింది..
చైనాకు ఒకేసారి రెండు దెబ్బలు.. షాకిచ్చిన బైడెన్, ట్రంప్!
వైఎస్సార్సీపీదే గెలుపు ఖాయం
పచ్చ ముఠా మంటల్లో ‘పల్నాడు’
రామ్ 'డబుల్ ఇస్మార్ట్' మూవీ స్టిల్స్
సీఎం జగన్ కాన్ఫిడెన్స్..ప్రమాణస్వీకారానికి సిద్ధం
4 రోజుల తర్వాత ఒక్కసారిగా.. మోత మోగించిన బంగారం!
అతనితో 16 రోజులే ఉన్నాను.. రెండో పెళ్లి చేసుకోవాలని ఉంది: ఎస్తర్
తప్పక చదవండి
- మనీష్ సిసోడియా జ్యుడిషీయల్ కస్టడీ పొడగింపు
- కెనడాలో ఘనంగా పదేళ్ల తెలంగాణ ఉత్సవాలు!
- పాడెపై వెళ్లి నామినేషన్! గోరఖ్పూర్లో విచిత్రం
- కిడ్నాప్ చేసి పక్కింట్లోనే 26 ఏళ్లుగా..
- సీజన్ మొత్తం మాకు అదే సమస్య.. అందుకే ఈ దుస్థితి: కేఎల్ రాహుల్
- NOTA: నోటా.. కోరల్లేని పులి!
- Anasuya Bharadwaj: అందానికే కాదు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అనసూయ.. బర్త్డే స్పెషల్ (ఫోటోలు)
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
Advertisement