-
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ‘తిరుమల’ ప్రభంజనం
రాజమహేంద్రవరం రూరల్: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో రాజమహేంద్రవరంలోని తమ తిరుమల ఐఐటీ అండ్ మెడికల్ అకాడమీ విద్యార్థులు 385 మంది ర్యాంకులు సాధించారని తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు తెలిపారు. వివిధ కేటగిరీలలో జాతీయ స్థాయిలో తమ విద్యార్థులు జీఎన్ వెంకటదుర్గసాయి 53వ ర్యాంకు, కె.సాకేత్ ప్రణవ్ 92, జి.సత్యనారాయణ 114, బి.హేమంత్ 123, ఎన్.నిషాంత్ 126, ఆర్.పవిత్ర 129, ఎం.వినేష్కుమార్ 133, ఎంజీ వెంకటమహేష్ 136, ఎం.చరణ్శ్రీతేజ 157, ఎన్.హార్ధిక్ 217, జి.చంద్రప్రకాష్ 225, ఎం.శ్రీమణికంఠ 235, టి.ఆదిత్య 236, సీహెచ్ ధనుంజయ 276, పి.సాయిఅమృత్ 291 ర్యాంకు సాధించారన్నారు. వీరితో పాటు 342, 352, 372, 391, 407, 424, 427, 440, 476 ర్యాంకులు వచ్చాయన్నారు. వెయ్యిలోపు 49 మంది, 3 వేలలోపు 163 మంది, 5 వేలలోపు 256 మంది, పది వేలలోపు 334 మంది ర్యాంకులు సాధించారని, 180 మంది పైన విద్యార్థులు ఐఐటీలో సీట్లు సాధించగలరని తెలిపారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను నున్న తిరుమలరావు, అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్బాబు, ప్రిన్సిపల్ వి.శ్రీహరి అభినందించారు. శ్రీషిర్డీసాయి విజయభేరిరాజమహేంద్రవరం రూరల్: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో రాజమహేంద్రవరం శ్రీషిర్డీసాయి జూనియర్ కళాశాల విద్యార్థులు వివిధ కేటగిరీల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించారని ఆ విద్యా సంస్థల డైరెక్టర్ టి.శ్రీవిద్య వెల్లడించారు. తమ లక్ష్యా ఐఐటీ అకాడమీలో శిక్షణ పొందుతున్న జె.శ్రీకర్ ఆల్ ఇండియా 189వ ర్యాంకు, కె.వెంకట శివరామకృష్ణ 253, బి.తనుశ్రీ 578 ర్యాంకు సాధించారన్నారు. ఏడుగురు వెయ్యి లోపు, 15 మంది రెండు వేల లోపు, 26 మంది ఐదు వేల లోపు, 38 మంది పది వేల లోపు ర్యాంకులు సాధించినట్లు శ్రీవిద్య తెలిపారు. శ్రీషిర్డీసాయి విద్యాసంస్థల చైర్మన్ తంబాబత్తుల శ్రీధర్ మాట్లాడుతూ హాజరైన 75 మంది విద్యార్థుల్లో 38 మంది దేశంలోని అత్యుత్తమ ఐఐటీలలో సీట్లు సాధించగలరన్న ఆశాభావం వ్యక్తపరిచారు. ప్రతి ఏటా తమ విద్యార్థులు రాణించడంపై హర్షం వ్యక్తం చేశారు. విజేతలు, అందుకు కృషి చేసిన అధ్యాపక బృందాన్ని చైర్మన్ శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, లక్ష్యా అకాడమీ డీన్ చంద్రశేఖర్ అభినందించారు. -
అంబేడ్కర్ విగ్రహానికి అవమానం
కె.గంగవరం: మండల పరిధిలోని యర్రపోతవరంలో శనివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు అంబేడ్కర్ చేతిలో రాజ్యాంగం పుస్తకానికి చెప్పుల దండవేసి అవమానపరిచారు. దీంతో పాటు గ్రామ సర్పంచ్ పిల్లి రాంబాబుతో పాటు వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులను తీవ్రంగా దూషిస్తూ కాగితంపై లేఖ రాసిపెట్టారు. ఈ సంఘటనను ఆదివారం ఉదయం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి రామచంద్రపురం డీఎస్పీ బి.రామకృష్ణ, సీఐ దొరరాజు, కె.గంగవరం ఎస్సై జానీబాషా చేరుకుని పరిశీలించారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్లకు సమాచారం అందించి ఆధారాలు సేకరించారు. దీనిపై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. సీఐ దొరరాజు, ఎస్సై జానీబాషా మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఈ దుశ్చర్యకు పాల్పడిన నిందితులను అరెస్టు చేసేందుకు మూడు టీమ్లు ఏర్పాటు చేశామని, నిందితుల జాడ కోసం గాలిస్తున్నామన్నారు. సాధ్యమైనంత త్వరగా నిందితులను పట్టుకుంటామని, ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. ఎంతటి వారైనా విడిచి పెట్టేది లేదన్నారు. స్థానికులకు ఏమైనా వివరాలు తెలిస్తే పోలీసులకు తెలపాలని వారు విజ్ఞప్తి చేశారు. యర్రపోతవరంలో ఉద్రిక్తత ఈ విషయం తెలుసుకున్న పలు దళిత సంఘ నాయకులు, వివిధ గ్రామాల దళితులు భారీగా యర్రపోతవరం చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. దీంతొ సంఘటనా స్థలం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కొంత సేపు రోడ్డుపై బైటాయించి నిందితులను పట్టుకోవాలని నినాదాలు చేశారు. వెంటనే పోలీసులు స్పందించి నిందితులు ఎంతటివారైనా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. మరో 24 గంటల్లో నిందితులను పట్టుకోకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని దళిత సంఘాలు హెచ్చరించాయి. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పూలదండలు వేశారు. దోషులను కఠినంగా శిక్షించాలి రామచంద్రపురం రూరల్: యర్రపోతవరంలో అంబేడ్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసిన దోషులను కఠినంగా శిక్షించాలని దళిత ఐక్య పోరాట వేదిక, జై భీమ్ దళిత సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ద్రాక్షారామ గుర్రాల పరంజ్యోతి స్మారక గ్రంథాలయం వద్ద వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. దళిత ఐక్య పోరాట వేదిక కన్వీనర్ వెంటపల్లి భీమశంకరం, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు రేవు నాగేశ్వరరావు, జై భీమ్ దళిత సంక్షేమ సంఘం అధ్యక్షుడు గుబ్బల శ్రీనివాసరావు మాట్లాడతూ అందరి ఆరాధ్య దైవం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాల జోలికి ఎవరూ పోకుండా కొత్త ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంబేడ్కర్ విగ్రహానికి అపచారం చేసిన దుండగులు ఎవరైనా 24 గంటల్లోగా అరెస్ట్ చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దళిత నాయకులు వెంటపల్లి రామకృష్ణ, చల్లపూడి పట్టాభిరామయ్య తదితరులు పాల్గొన్నారు. చెప్పుల దండ వేసిన దుండగులు కేసు నమోదు చేసిన పోలీసులు -
రేషన్ బియ్యం అక్రమ రవాణా
ఆలమూరు: రేషన్ బియ్యం అక్రమ రవాణా గుట్టురట్టు అయ్యింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ దాడుల్లో అది బహిర్గతమైంది. పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం శృంగవృక్షంలోని శ్రీకనకదుర్గ రైస్ ట్రేడర్స్ నుంచి నిబంధనలకు విరుద్ధంగా కాకినాడలోని లవన్ ఇంటర్నేషనల్ సంస్థకు రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారన్న ముందస్తు సమాచారంతో రాజమహేంద్రవరం విజిలెన్స్ శాఖ అప్రమత్తమైంది. విజిలెన్స్ ఎస్పీ కేఎస్ఎస్వీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో సీఐలు కిశోర్, జగన్నాథరెడ్డి, వలీతో పాటు పౌరసరఫరాలు, రెవెన్యూ శాఖ అధికారులు జొన్నాడలో ఆదివారం నిఘా ఉంచారు. ఆ రహదారిలో ఆదివారం వెళుతున్న లారీని వెంబడించి స్థానిక ఎస్ మలుపు వద్ద నిలిపి తనిఖీలు చేశారు. అందులో 480 బస్తాల్లోని రేషన్ బియ్యాన్ని గుర్తించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు లారీని సీజ్ చేసి, అందులోని 23.5 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని మండపేట పౌరసరఫరాల శాఖ గోదాముకు తరలించారు. సీజ్ చేసిన లారీని స్థానిక పోలీసులకు అప్పగించారు. దీంతో ఎస్సై ఎల్.శ్రీనునాయక్ ఇరు సంస్థలపైన 6ఏ కేసు నమోదు చేశారు. రేషన్ బియ్యం విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.18,69,250 ఉంటుందని విజిలెన్స్ శాఖ అంచనా వేసింది. జిల్లాలో ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తే కఠిన చర్యలు తప్పవని విజిలెన్స్ ఎస్పీ సుబ్బారెడ్డి తెలిపారు. రేషన్ బియ్యం కొనుగోలు చేయడం, విక్రయించడం నేరమన్నారు. ఈ దాడిలో ఎస్డీటీ ఎస్కే అలీషా, తహసీల్దార్ డీవీఎస్ అనీల్కుమార్, వీఆర్వో వెంకట్ పాల్గొన్నారు. -
రత్నగిరి కిటకిట
అన్నవరం: రత్నగిరి ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. విద్యా సంస్థలకు వేసవి సెలవులు ఈ నెల 12వ తేదీతో ముగుస్తున్న నేపథ్యంలో వేలాదిగా విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలసి వచ్చి, సత్యదేవుని వ్రతమాచరించి, స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఇతర భక్తులు కూడా తోడయ్యారు. ఆలయంతో పాటు ఆలయ ప్రాంగణం, వ్రత, విశ్రాంతి మండపాలు కిక్కిరిసిపోయాయి. సుమారు 40 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి వ్రతాలు మూడు వేలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. కన్నుల పండువగా సత్యదేవుని రథోత్సవం సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారి రథోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. ఉదయం పది గంటలకు రథాన్ని తూర్పు రాజగోపురం ముందుకు తీసుకుని వచ్చారు. ఆ రథంపై సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను వేంచేయించి, ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యం ఆధ్వర్యాన అర్చకుడు యడవిల్లి వేంకటేశ్వరరావు, పరిచారకుడు ముత్య వేంకట్రావు పూజలు చేశారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ కొబ్బరి కాయ కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం ఆలయ ప్రాకారంలో నాలుగు వైపులా కొబ్బరి కాయలు కొట్టి ఈ ఉత్సవాన్ని నిర్వహించారు. -
పీఠంలో శ్రీరామ ధనస్సుకు పూజలు
రాయవరం: వచ్చే ఏడాది అయోధ్యలో ప్రతిష్ఠించే శ్రీరాముడి విగ్రహానికి అమర్చే శ్రీరామ ధనస్సుకు వెదురుపాక విజయదుర్గా పీఠంలో ఆదివారం తొలి పూజలు నిర్వహించారు. తెలంగాణకు చెందిన చల్లా శ్రీనివాసశాస్త్రి తయారు చేయించిన శ్రీరామ ధనుస్సును విజయదుర్గా పీఠానికి తీసుకు వచ్చారు. పీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం (గాడ్) చేతుల మీదుగా పూజాదికాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసశాస్త్రి మాట్లాడుతూ వచ్చే ఏడాది అయోధ్యలో సీతారాముల విగ్రహాలు ప్రతిష్ఠిస్తారన్నారు. శ్రీరాముడు చేతబూనేలా 14 కిలోల వెండి, ఒక కిలో బంగారంతో ధనస్సును తయారు చేయించానన్నారు. కిలో వెండితో బాణం తయారు చేయించినట్టు తెలిపారు. ప్రతిష్ఠ సమయంలో శ్రీరాముల వారికి సమర్పించాలనే సంకల్పంతో చేయించిన ధనస్సుకు తొలిసారిగా పీఠంలో పూజలు చేయించామన్నారు. శ్రీలంక నుంచి బదరీనాథ్ వరకూ దేశంలో పలు పుణ్యక్షేత్రాల్లో శ్రీరాముని ధనస్సుకు పూజలు నిర్వహించాక అయోధ్యకు తరలించనున్నట్టు వివరించారు. తొలుత పీఠంలో సీతారాముల విగ్రహాల వద్ద ఉంచి వేద పండితులు పూజలు, అభిషేకాలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు ధనస్సును చూసేందుకు తరలి వచ్చారు. ఈ సందర్భంగా పీఠంలో విజయదుర్గా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి, పీఠంలో అన్నసమారాధన చేశారు. పీఠం అడ్మినిస్ట్రేటర్ వీవీ బాపిరాజు, పీఆర్వో వాడ్రేవు వేణుగోపాల్, విజయదుర్గా సేవాసమితి ప్రతినిధులు గాదె భాస్కరనారాయణ, సత్య వెంకటకామేశ్వరి, పెదపాటి సత్య కనకదుర్గ, బలిజేపల్లి రమ, అన్నవరం దేవస్థానం మాజీ పాలకవర్గ సభ్యుడు కందర్ప హనుమాన్ తదితరులు పాల్గొన్నారు. -
అధికార దుర్వినియోగం చేసిన ఎన్నికల సంఘం
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ ఆరోపణరాజమహేంద్రవరం సిటీ: ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో ఓటరు ఓటు వేసుకున్నాడో.. ఈవీఎం ఆటోమెటిక్ ప్రోగ్రాం ద్వారా కట్ ఆఫ్ ఓట్లు వేసుకున్నాయోననే అనుమానాలు అందరినీ వెంటాడుతున్నాయని ఆయన అన్నారు. ఆదివారం స్థానిక ఆర్టీపీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఎన్నికల సంఘానికి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఫిర్యాదులు వచ్చినా ఏ ఒక్క దానిపైనా స్పందించకపోవడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా అనేక పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయని, ఈ దఫా ఎన్నికల నిర్వహణలో ఓటుకు పెద్దగా గోప్యత లేకుండా పోయిందన్నారు. ఈవీఎంలలో పోలైన ఓట్ల సంఖ్యకు, పోటీ చేసిన అభ్యర్థులకు పోలైన ఓట్ల సంఖ్యను మొత్తంగా లెక్కపెడితే అనేక చోట్ల తేడా వచ్చిందని అన్నారు. అలాంటి ఘటనలపై ఇప్పటికే ఫిర్యాదులు అందినట్టు తెలుస్తుందన్నారు. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని అన్నారు. అతి పెద్ద ఎన్నికల మోసాన్ని బహిర్గతం చేయగల నేర పరిశోధన సంస్థ దేశంలో లేకపోవడం బాధాకరమన్నారు. ఎన్నికల నిర్వహణ ప్యానల్లోని ముగ్గురు సభ్యుల్లో ఒకరైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించి ఆ స్థానంలో మోదీ కేబినెట్లో మంత్రిని నియమించారన్నారు. ఇదంతా వ్యూహాత్మకంగా మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయమని ఆయన ఆరోపించారు. దేశంలో ఈవీఎం ద్వారా ఓటింగ్ ప్రక్రియ ఉన్నంతకాలం మోదీని గెలవడం సునాయాసం కాదన్నారు. భారత్ పాలనను తెర వెనుక నుంచి శాసించేది కొన్ని కార్పొరేట్ శక్తులేనని, పేరుకు మాత్రమే దేశంలో ఎన్నికల సంఘం ఉందన్నారు. 2019 సాధారణ ఎన్నికల్లో చంద్రబాబు సైతం ఈవీఎంల పనితీరుపై ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. ఇలాంటి అక్రమాలు గత 30 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ చూడలేదని, ఎన్నికల సంఘం అక్రమాలపై విచారణకు ఆదేశించి రాజమహేంద్రవరం పార్లమెంట్ ఎన్నిక విజయాన్ని రద్దు చేసి తిరిగి ఎన్నిక నిర్వహించాలని మేడా శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సమావేశంలో పెండ్యాల కామరాజు, సిమ్మా దుర్గారావు, శీరపు పురంధేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
అన్నదానానికి రూ.50 వేల విరాళం
సామర్లకోట: స్థానిక పంచారామ క్షేత్రంలో నిత్యాన్నదాన పథకానికి అడపా రామకృష్ణ, పార్వతి దంపతులు (భీమవరం) ఆదివారం రూ.50 వేల విరాళం అందజేశారు. తొలుత వారు బాలాత్రిపుర సుందరీ సమేత కుమారారామ భీమేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం తమ కుమారుడు లక్ష్మీనరసింహరాజు పేరిట విరాళం అందజేశారు. దాతలను పండితులు ఆశీర్వదించారు. ఆలయ ఈఓ బళ్ల నీలకంఠం ఈ విషయం తెలిపారు. లోవకు భక్తుల తాకిడి తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారిని దర్శించేందుకు వేలాదిగా వచ్చిన భక్తులతో లోవ దేవస్థానంలో రద్దీ నెలకొంది. ఆదివారం వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన 16 వేల మంది భక్తులు తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకున్నట్టు ఇన్చార్జ్ డిప్యూటీ కమిషనర్, ఆలయ ఈఓ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. అమ్మవారి ప్రత్యేక దర్శనానికి అరగంట, సర్వదర్శనాలకు గంట సమయం పట్టింది. లడ్డూ, పులిహోర ప్రసాదాలు విక్రయం ద్వారా రూ.2,70,135, పూజా టికెట్లకు రూ.1,70,650, కేశఖండన శాలకు రూ.36,040, వాహన పూజలకు రూ.3.700, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలుగా రూ.86,016, విరాళాలు రూ.47,980 కలిపి మొత్తం రూ.6,14,521 ఆదాయం సమకూరిందని ఈఓ వివరించారు. బుచ్చిబాబుకు గీత పరామర్శ కొత్తపల్లి: ఉప్పెన సినిమా దర్శకుడు సానా బుచ్చిబాబును కాకినాడ మాజీ ఎంపీ, వైఎస్సా ర్ సీపీ నేత వంగా గీత ఆదివారం పరామర్శించారు. పితృవియోగంతో బాధ పడుతున్న బుచ్చిబాబును కొత్తపల్లిలోని ఆయన నివాసంలో పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. బుచ్చిబాబును పరామర్శించిన వారిలో పార్టీ మండల అధ్యక్షుడు ఆనాల సుదర్శన్, వైస్ ఎంపీపీ మదిరెడ్డి దొరబాబు, కారే శ్రీనివాస్, రావు చిన్నారావు, ఉమ్మిడి జాన్, సర్పంచ్ కర్రి చిన్నారావు, నక్క తాతాజీ, గింజల శ్రీనివాస్, కుక్కల వెంకట రమణ తదితరులున్నారు. -
అంతర్వేది స్వామి సన్నిధిలో కలెక్టర్ దంపతులు
సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనృసింహుని ఆలయంలో ఆదివారం కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. తొలుత ఆలయం వద్ద వారికి అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. పూజల అనంతరం అర్చకులు ఆశీర్వచనాలు పలికారు. కలెక్టర్ హిమాన్షు శుక్లాకు స్వామివారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాన్ని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ అందజేశారు. ఆలయాల్లో హుండీల చోరీఅంబాజీపేట: మూడు గ్రామాల్లోని ఆలయాల్లో హుండీలు ఆదివారం అర్ధరాత్రి సమయంలో చోరీకి గురయ్యాయి. కె.పెదపూడి కుడుపూడివారిపాలెంలో ఉన్న శ్రీబాల కనకదుర్గమ్మ ఆలయ తలుపులను పగులకొట్టి హుండీలను దొంగిలించారు. ఈ హుండీలో సుమారు రూ.20 వేలు ఉంటాయని భావిస్తున్నారు. అలాగే పక్కనే ఉన్న శ్రీసిద్ధి వినాయక ఆలయం తాళాలను బద్దలుకొట్టి హుండీలో సొమ్ము చోరీ చేశారు. అంబాజీపేట జయంతినగర్ వద్ద లక్ష్మీగణపతి ఆలయ తాళాలను పగులకొట్టి అక్కడున్న హుండీని పట్టుకుపోయారు. సుమారు ఇందులో రూ.20 వేలు ఉంటుందని అంచనా. ముక్కామలలోని ఓ ఆలయంలో కూడా హుండీ చోరీ జరిగింది. ఏడుగురిపై కేసు నమోదు కొత్తపల్లి: పలువురిపై దాడిచేసిన ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. వారి కథనం ప్రకారం.. కొండెవరం శివారు శీలంవారి పాకలులో రామాలయాన్ని శనివారం ఉదయం శుభ్రం చేస్తుండగా ఫ్యాన్ ఆపాలని పోలవరపు శివను రాయుడు వరలక్ష్మి అడిగింది. దీంతో ఆమైపె దుర్భాషలాడాడు. ఆమె ఆలయ కమిటీ దృష్టికి తీసుకువెళ్లారు. రాత్రి కమిటీ సభ్యులు చర్చిస్తుండగా శివ వర్గం వారు, వరలక్ష్మి వర్గానికి చెందిన రాయుడు వెంకటరమణ, పిల్లి లోవరాజు, వాసంశెట్టి శ్రీనులపై దాడి చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలవరపు శివ, పోలవరపు ప్రసాద్, వాసంశెట్టి రామచంద్రరావు, వాసంశెట్టి ఏడుకొండలు, వాసంశెట్టి వెంకన్న, వాసంశెట్టి రాంబాబు, వాసంశెట్టి సాయిలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై స్వామినాయుడు తెలిపారు. -
ఏవండి.. ఏం తినాలండి
ధరలు నియంత్రించాలి పెరిగిన కూరగాయల ధరలు ఇబ్బందిగా మారాయి. ఎండలతో పాటే కూరగాయల ధరలు సైతం మండుతున్నాయి. గతంలో రూ.500కు సంచి నిండా కూరగాయలు వచ్చేవి. ప్రస్తుతం మూడు, నాలుగు రకాలు సైతం రాలేని పరిస్థితి ఉంది. అధికారులు స్పందించి ధరలు నియంత్రించాలి. – మండవ సమాధానం, తూరంగి, కాకినాడ ఏం కొనలేని పరిస్థితి బహిరంగ మార్కెట్తో పాటు రైతు బజార్లోనూ కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. టమాటా కిలో రూ. 50 దాటగా, ఇతర రకాలు వందకు చేరువయ్యాయి. పెరిగిన ధరలతో ఏమీ కొనలేని పరిస్థితి నెలకొంది. కిలోల చొప్పున కొనుగోలు చేసేవారు కూడా పావు, అర కిలోలతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. – బి కిరణ్బాబు, కాకినాడ కాకినాడ సిటీ: ఏం కొనేట్టు లేదు.. ఏం తినేట్టు లేదు.. కూరగాయల ధర చూస్తుంటే రోజురోజుకూ కొండెక్కుతోంది. కిందకు దిగిరానంటోంది.. నిన్న మొన్నటి వరకూ ఓ మోస్తరులో ఉండే ధర నేడు చుక్కలను తాకింది. మార్కెట్కు వెళ్లి కూరగాయలను చూస్తేనే సామాన్యుల గుండె గుబేలుమంటోంది. ఒక్కసారిగా రెండింతలు పెరగడంతో ఏం కొనలేపోతున్నామని వినియోగదారులు అల్లాడుతున్నారు. మరోవైపు పప్పు దినుసుల ధరలూ భగ్గుమంటున్నాయి. ఏ కూరగాయ కొనాలన్నా కిలో రూ.80కి పైనే ఉంటోంది. ఇక ప్రైవేట్ వ్యాపారుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎండాకాలం పేరిట మరింత ధరలు వడ్డించి విక్రయిస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా 60 శాతం మంది రైతులు కూరగాయల సాగు చేపట్టలేదు. జిల్లాలోని పెద్దాపురం, పిఠాపురం, సామర్లకోట, కాకినాడ రూరల్, తుని, జగ్గంపేట తదితర ప్రాంతాల నుంచి రైతుబజార్లకు కూరగాయలు వస్తుంటాయి. వర్షాభావ పరిస్థితులతో సాగు తగ్గి ధరలు పెరిగాయని వ్యాపారులు అంటున్నారు. వంటింట ధరల మంట వంటింట్లో ఎలాంటి వంటకం చేయాలన్నా టమాటా, పచ్చిమిర్చి తప్పనిసరిగా ఉండాలి. రోజువారీ వాడకంలో కీలకమైన వీటిలో మిర్చి ధర ఘాటెక్కిస్తుంది. ఏకంగా సెంచరీ దాటేసింది. టమాటా ప్రస్తుతం రూ.50కి చేరింది. దొండ, బెండ, బీర, కాకరకాయ ధరలు భారీగానే పెరిగాయి. వంకాయ కూడా టమాటాతో పోటీపడి రూ.70 కిలో పలుకుతోంది. ఇక క్యారెట్, బీన్స్, బీట్రూట్, చిక్కుడు ధరలు వందకు చేరువయ్యాయి. ఒకవైపు భగభగమండే ఎండలతో ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న ప్రజలకు పెరిగిన కూరగాయల ధరలు పెనుభారంగా మారాయి. వాటిని కొనుగోలు చేయడం అటుంచితే ధరలు వింటేనే ఆందోళన చెందుతున్నారు. కిలోల్లో కొనుగోలు చేసేవారు ఇప్పుడు పావు, అర కిలోలతో సరిపెట్టుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయల ధరలు పెరగడానికి ఎండల ప్రభావమే కారణమని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాకు ఎక్కువగా కర్నూలు, చిత్తూరు, బెంగళూరు, తమిళనాడు, తదితర ప్రాంతాల నుంచి కూరగాయలు దిగుమతి అవుతుంటాయి. రైతుబజార్లు, మార్కెట్లలో కూరగాయలు కొనడానికి వచ్చిన సామాన్య, మధ్యతరగతి ప్రజలు ధరలు చూసి బెంబేలెత్తుతున్నారు. ధరలు ఎలా ఉన్నాయంటే.. టమాటా మొదటి రకం కిలో రూ.50కు విక్రయిస్తుండగా, షాపింగ్ మాల్స్లో రూ.70 నుంచి రూ.80 ఉంటోంది. మార్కెట్లో కిలో పచ్చిమిర్చి రూ.100కు అమ్ముతున్నారు. బీట్రూట్ కిలో ధర రూ.40 నుంచి రూ. 80కు, బంగాళాదుంపలు రూ.40కు చేరాయి. ఉల్లిపాయలు రూ.30 నుంచి రూ.50కి అమ్ముతున్నారు. గతంలో చవకగా లభించిన క్యాప్సికం కిలో ధర రూ.55 నుంచి రూ.70, క్యాబేజీ కిలో రూ.40 నుంచి రూ.54, క్యాలీఫ్లవర్ రూ.30 నుంచి 45కు పలుకుతోంది. క్యారెట్ ధరలు రూ.41 నుంచి రూ.80కి పెరిగింది. రూ. 20లకు లభించే ఒక కొబ్బరికాయను రూ. 30, రూ.40 అమ్ముతున్నారు. కొత్తిమీర, కరివేపాకు నుంచి గోంగూర, పాలకూర, తోటకూర తదితర అన్ని ధరలూ పెరిగాయి. వంకాయ కిలో రూ.80కు చేరింది. పది నిమ్మకాయలను ప్రస్తుతం రూ.70 నుంచి రూ. 90 అమ్ముతున్నారు. పంట ఎక్కడంటే.. జిల్లాలో జగ్గంపేట, పెద్దాపురం, కాకినాడ రూరల్, పిఠాపురం, తుని తదితర ప్రాంతాల్లో కూరగాయలు పండిస్తారు. అకాల వర్షాలతో పంటలు దెబ్బతినడంతో ధరలు పెరిగాయి. జిల్లాలో పలు ప్రాంతాల నుంచి కూరగాయలు మరోనెల రోజుల వరకూ తక్కువగానే వస్తాయని వ్యాపారులు చెబుతున్నారు. దీనివల్ల దూరప్రాంతాల నుంచి కూరగాయలు దిగుమతి చేసుకోవాల్సి రావడంతో రవాణా చార్జీల భారంతో ధరలు పెరిగాయని మార్కెట్ వ్యాపారులు వివరిస్తున్నారు. కొండెక్కుతున్న కూరగాయల ధరలు సెంచరీ దాటిన పచ్చిమిర్చి కొనలేకపోతున్న సామాన్యులు -
చికిత్స పొందుతూ వివాహిత మృతి
జగ్గంపేట: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వివాహిత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. జగ్గంపేట ఎస్సై నాగార్జునరాజు కథనం ప్రకారం.. కాట్రావులపల్లికి చెందిన కుంచే దత్తాత్రేయ, గండేపల్లి మండలం పి.నాయకంపల్లికి చెందిన ముమ్మన గంగాభవానీలకు 2015లో వివాహం జరిగింది. ఏడాది పాటు వారి కాపురం సజావుగా జరిగినా ఆ తర్వాత నుంచి దత్తాత్రేయ తన భార్య గంగాభవానీని వేధించడం ప్రారంభించాడు. దీనిపై అనేకమార్లు పెద్దలు సఖ్యత కుదిర్చారు. అయినా దత్తాత్రేయలో మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో గతంలో గంగాభవానీ రాజమహేంద్రవరం వద్ద గోదావరిలో దూకగా స్థానికులు రక్షించారు. ఈ నెల 8న భోజనం విషయంలో దత్తాత్రేయ తన భార్య గంగాభవానీతో ఘర్షణకు దిగాడు. మనస్తాపం చెందిన ఆమె కాట్రావులపల్లిలోని తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది గమనించిన అత్తమామలు ఆమెను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె శనివారం అర్ధరాత్రి మృతి చెందింది. మృతురాలి తల్లి ముమ్మన సత్యవతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగార్జునరాజు వివరించారు. మద్యం సీసాలతో వ్యక్తి అరెస్ట్తాళ్లరేవు: సుంకరపాలెం గ్రామంలోని ఎస్ఈబీ చెక్పోస్టు వద్ద నిర్వహించిన తనిఖీల్లో 46 మద్యం సీసాలను తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఈబీ ఎస్సై రామస్వామి తెలిపారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నుంచి ఆంధ్రా ప్రాంతానికి ద్విచక్ర వాహనంపై అక్రమంగా మద్యం తరలిస్తుండగా అతన్ని పట్టుకున్నట్లు తెలిపారు. నిందితుడిని తదుపరి చర్యల నిమిత్తం తాళ్లరేవు ఎస్ఈబీ స్టేషన్కు తరలించామన్నారు. ఈ దాడుల్లో కానిస్టేబుల్స్ రాజు, రామకృష్ణ, అరుణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
No Headline
తాళ్లపూడి: వయ్యారి గోదారి పరవళ్లు.. ఒంపులు తిరిగిన గోదారి గట్లు.. ఆపైనుండే గుడి గోపురాలు.. నీటి మధ్య ఇసుక తిన్నెలు.. లంకలు.. సూర్యోదయాస్తమయ వేళల్లో గోదారమ్మ నుదుటిన అలదుకునే సిందూరం.. పావన నదిపై నీలి మేఘాలంకరణలు.. ఇలా ఒకటా రెండా.. ఎన్నని చెప్పేది గోదారోళ్ల సౌభాగ్యం. భౌతిక నేత్రంతో చూసే భాగ్యం ఇక్కడివారిదైతే.. ఇవే దృశ్యాలను వెండితెరపై చూసి అచ్చెరువొంది.. జీవితంలో ఒక్కసారైనా ఈ ప్రాంతాలను సందర్శించాలని భావించేవారెందరెందరో.. కొంత కళాత్మక దృష్టి.. ఒకింత భావుకత.. మరికొంత రసరమ్యమైన మనసు.. వీటికి తోడు భావగర్భితమైన కెమెరా కన్ను.. చాలు.. ఓ సుందర దృశ్య కావ్యాన్ని వెండి తెరపై ఆవిష్కరించడానికి. ఇలాంటి మనసున్న దర్శక, నిర్మాతలెందరో మన గోదావరిని అమ్మగా.. కొంటె కోణంగిగా.. వయ్యారిభామగా.. పడుచు పిల్లగా.. మరెన్నో విధాలుగా వెండి తెరపై ప్రపంచానికి చూపించి వారి జీవితాలను సార్థకం చేసుకున్నారు. ఎన్నో వైవిధ్యమైన కథలకు నేపథ్యంగా గోదావరి పరీవాహక ప్రాంతాలను ఎన్నుకుని ఎనలేని కీర్తిని గడించారు. తెలుగు సంస్కృతికి ప్రతీకలు గోదావరి జిల్లాలు. ఇక్కడి ప్రజల వాడుక భాషే ‘చిత్ర’ భాషగా వ్యవహరిస్తారు. ఇక్కడి ఆచార వ్యవహారాలే ప్రామాణికంగా భావిస్తారు. దర్శక దిగ్గజాల్లో ఒకరైన నాటి ఆదుర్తి సుబ్బారావు నుంచి నేటి శేఖర్ కమ్ముల వరకూ ఎందరో గోదావరి అందాలతో వారి చిత్రాలను సుసంపస్నం చేసుకున్నారు. కళాతపస్వి కె.విశ్వనాథ్, బాపు, దాసరి నారాయణరావు వంటి అగ్ర దర్శకులే కాక.. ఈ ప్రాంతానికే చెందిన వంశీ తీసిన చాలా సినిమాలు గోదావరి నది నేపథ్యంగా సాగినవే. వారిలో చాలా మందికి పాపికొండల నుంచి అంతర్వేది వరకూ ఎన్నో ప్రాంతాల్లో కనీసం ఒక్క సన్నివేశమైనా చిత్రీకరిస్తే చాలు.. ఆ చిత్రం హిట్టు కొట్టేస్తుందనేది గట్టి నమ్మకం కొవ్వూరు పరిసరాల్లో.. ముఖ్యంగా కొవ్వూరు మండలంలోని గోష్పాద క్షేత్రం, కుమారదేవం, ఆరికిరేవుల, తాళ్లపూడి మండలం వేగేశ్వరపురం పరిసర ప్రాంతాల్లో గోదావరి తీరాన తీసిన ప్రతి సినిమా సూపర్ హిట్టే. వేగేశ్వరపురంలో గోదావరి ఒడ్డున ఉన్న ఆంజనేయుని ఆలయం రేవు, బల్లిపాడు ఇసుక ర్యాంపు లంకలు, మలకపల్లిలోని కుంటముక్కల వారి గృహంలో అనేక సినిమాల్లో చాలా సన్నివేశాలే చిత్రీకరించారు. ● వేగేశ్వరపురంలో చిరంజీవి నటించిన రక్తసింధూరంలోని ఓ పాటను, రామ్చరణ్, సమంత నటించిన రంగస్థలంలోని పలు సన్నివేశాలను తాడిపూడి, వేగేశ్వరపురం గోదావరి లంకల్లో చిత్రీకరించారు. ● నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు తాళ్లపూడిలోనే తీశారు. ● సాయికుమార్, ఆయన కుమారుడు ఆది కథా నాయకుడిగా నటించిన చుట్టాలబ్బాయ్ చిత్రంతో పాటు, మంచు మనోజ్, రెజీనా నటించిన శౌర్య చిత్రంలో పలు కీలక సన్నివేశాలను ఇక్కడే తెరకెక్కించారు. ● నాగార్జున, అనుష్క నటించిన ఢమరుకం చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాలను గోదావరి నది ఒడ్డున ఆంజనేయస్వామి గుడి వద్ద తీశారు. ప్రత్యేకంగా రుషుల కోసం ఒక సెట్ వేసి వారం రోజుల పాటు ఇక్కడ షూటింగ్ చేశారు. ● సుమంత్ నటించగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన గోదావరి, వంశీ దర్శకత్వంలో అల్లరి నరేష్ నటించిన సరదాగా కాసేపు చిత్రంలో కారులో వెళ్లే పాటను ఇక్కడే చిత్రీకరించారు. ● జగపతిబాబు, ప్రియమణి నటించిన పెళ్లైన కొత్తలో చిత్రంలో వారి స్నానపు సన్నివేశాన్ని ఇక్కడే తెరకెక్కించారు. ● ప్రక్కిలంకలో కృష్ణ నటించిన పాడిపంటలుతో పాటు, చంద్రమోహన్ నటించిన సిరిసిరిమువ్వ ఈ ప్రాంతంలో చిత్రీకరించినవే. ● శ్రీకాంత్, చార్మి నటించిన చిత్రంలోని ఓ పాటను, శివాజీ హీరోగా నటించిన మిస్టర్ ఎర్రబాబులో మిత్రులతో కలిసి కథానాయికను ఆయన పరిచయం చేసుకునే సన్నివేశాన్ని, సునీల్పై హాస్య సన్నివేశాలను, ఆలీ నటించిన ఆషాఢం పెళ్లికొడుకులో ఒక పాటను ఇక్కడి ఇసుక తిన్నెల్లో ప్రత్యేకంగా సెట్ వేసి చిత్రీకరించారు. ● కేవలం సినిమాలే కాకుండా కొన్ని ధారావాహికలు సైతం ఇక్కడి గోదారి ప్రాంతాల్లో చిత్రీకరించారు. హిట్ చిత్రాల భవనం సుమారు 110 ఏళ్ల క్రితం మలకపల్లిలో ఆ గ్రామానికి చెందిన కుంటముక్కల వీరభద్రరావు, వెంకటాద్రి, జానకిరామయ్య లోగిలిని అత్యాధునికంగా నిర్మించారు. ఈ గృహంలో సినిమా తీస్తే హిట్ గ్యారెంటీ అని చిత్రరంగ ప్రముఖుల్లో గట్టి నమ్మకం. ● జంధ్యాల దర్శకత్వంలో 1985లో వచ్చిన సీతారామకల్యాణం చిత్రం ఎక్కువ భాగం ఈ ఇంట్లోనే తీశారు. ● ఆ చిత్రం విజయం సాధించడంతో సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో డి.సురేష్బాబు నిర్మాతగా బి.గోపాల్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటించిన బొబ్బిలిరాజా చిత్రంలోని కీలక సన్నివేశాలను కూడా ఈ ఇంట్లోనే తెరకెక్కించారు. ● అలాగే క్రాంతికుమార్ దర్శకత్వంలో వచ్చిన సీతారామయ్య గారి మనవరాలు, బాలకృష్ణ నటించిన సీతారామ కల్యాణం, నరేష్ నటించిన ప్రేమచిత్రం.. పెళ్లి విచిత్రం, ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో శోభన్బాబు నటించిన ఏవండీ ఆవిడ వచ్చింది, ఇంకా.. సీతారత్నం గారి అబ్బాయి, తాళి తదితర చిత్రాలన్నీ విజయం సాధించాయి. ● ఇదే గ్రామంలో దివంగత కుంటముక్కల భాస్కరరావు గృహానికి 140 ఏళ్ల చరిత్ర ఉంది. ప్రేమవిజేత అనే చిత్రం, రజనీకాంత్ నటించిన తమిళ సినిమా, జగదాంబ టూరింగ్ టాకీస్ తదితర సినిమాల్లో చాలా సన్నివేశాలు ఇక్కడే చిత్రీకరించారు. అప్పట్లో డి.రామానాయుడు ఇక్కడి గ్రంథాలయానికి రూ.30 వేల విరాళం అందజేశారు. దీంతో గ్రామస్తులు ఆ భవనానికి మరమ్మతులు చేసి, రామానాయుడు గ్రంథాలయంగా పేరు పెట్టారు. రామచరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తాజాగా నిర్మిస్తున్న గేమ్ చేంజర్ చిత్రంలోని కీలక సన్నివేశాలను ఇక్కడే చిత్రీకరించారు. మలకపల్లిలో హిట్ చిత్రాలు ఎక్కువగా తీసిన కుంటముక్కల వారి ఇల్లుకుమారదేవంలో గోదావరి ఒడ్డున 200 పైగా చిత్రాలు తీసిన హిట్ చిత్రాల సినిమా చెట్టు సినీ చిత్రీకరణలకు నెలవైన గోదావరి వేగేశ్వరపురం ఒడ్డు హిట్టుకు తొలి మెట్టు మలకపల్లిలో భవనం చిత్రసీమకు నందనం కుమారదేవంలో 150 ఏళ్ల సినిమా చెట్టు గోష్పాద క్షేత్రం సినీవర్గాల పుణ్యధామం 150 ఏళ్ల నాటి సినిమా చెట్టు కుమారదేవం గ్రామంలో గోదావరి ఒడ్డున ఉన్న నిద్రగన్నేరు చెట్టుకు 150 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ఇక్కడ సుమారు 200 పైగా సినిమాల షూటింగ్లు జరిగాయి. దీంతో, దీనికి ‘సినిమా చెట్టు’గా పేరొచ్చింది. ఇక్కడ సినిమా తీస్తే తప్పకుండా హిట్ అవుతుందన్న సెంటిమెంట్ చిత్రసీమలో స్థిరపడిపోయింది. ఈ నమ్మకంతోనే ఒక్క సీన్ అయినా ఈ చెట్టు కింద తీస్తారు. మొదటిగా కృష్ణ హీరోగా 1975లో పాడిపంటలు ఈ చెట్టు వద్ద చిత్రీకరించారు. ఏఎన్ఆర్, ఎన్టీఆర్, చిరంజీవి, శోభన్బాబు, బాలకృష్ణ, మోహన్బాబు, సుమన్, మహేష్బాబు, రామ్చరణ్, రాజశేఖర్, నాని తదితర హీరోలతో పాటు, దర్శకులు వంశీ, రాఘవేంద్రరావు, క్రాంతికుమార్, సుకుమార్ ఈ చెట్టు కింద ఏదో ఒక సన్నివేశాన్ని చిత్రీకరించడం సెంటిమెంట్గా భావిస్తారు. -
తెలుగు.. ఆంగ్ల సమేతంగా..
● రెండు మాధ్యమాల్లోనూ పాఠ్యాంశాలు ● విద్యార్థులకు మిర్రర్ ఇమేజ్ పుస్తకాలు రాయవరం: ప్రభుత్వ విద్య కొత్త పుంతలు తొక్కుతోంది.. మరింత ఉత్తమ ఫలితాలను సాధించే దిశగా అడుగులు వేస్తోంది. ఆంగ్ల మాధ్యమంతోనే ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగా పాఠ్యాంశాల్లోనూ మార్పులకు శ్రీకారం చుట్టింది. ఆ పాఠ్యాంశాలను విద్యార్థులు సులువుగా అర్థం చేసుకుంటే మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చని విద్యాశాఖ భావించింది. ఈ క్రమంలో మూడేళ్ల కిందట ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకూ ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టింది. ఏటా ఒక్కో తరగతి పెంచుతూ వస్తోంది. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి పూర్తిగా 10వ తరగతి వరకూ ఆంగ్ల మాధ్యమం బోధించనున్నారు. గతంలో సక్సెస్పుల్ పాఠశాలల పేరిట కొన్ని ఉన్నత పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని సాగిస్తున్నప్పటికీ 2022–23 విద్యా సంవత్సరం నుంచి అన్ని పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రారంభించారు. విద్యార్థులు పాఠాలు తేలికగా అర్థ చేసుకునేందుకు పుస్తకాల ముద్రణలోనూ మార్పులు చేశారు. ఇందులో భాగంగా పుస్తకాల్లో ప్రతి పాఠ్యాంశాన్ని ఒక పక్క తెలుగు, మరోవైపు ఆంగ్లం (మిర్రర్ ఇమేజ్)లో ముద్రించడం విశేషం. రెండు భాషల్లోనూ ముద్రణ తెలుగు మాధ్యమం నుంచి వచ్చిన విద్యార్థులు ఆంగ్ల మాధ్యమం చదవాలంటే కొంత ఇబ్బందే. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రతి పుస్తకాన్ని రెండు భాషల్లో ముద్రించారు. మూడేళ్ల కిందట 1–8 తరగతి వరకూ ప్రతి పుస్తకంలో అంటే నాన్ లాంగ్వేజ్ పుస్తకాలైన గణితం, సామాన్యశాస్త్రం, భౌతికశాస్త్రం, జీవశాస్త్రం, సాంఘికశాస్త్రం పుస్తకాల్లో అన్ని పాఠ్యాంశాలను ఒక పేజీలో తెలుగు, పక్క పేజీలో ఇదే పాఠ్యాంశానికి సంబంధించిన అంశాలను ఆంగ్ల భాషలో ముద్రించడం విశేషం. ఆ తర్వాత తొమ్మిదో తరగతి. తాజాగా ఈ ఏడాది పదో తరగతి పుస్తకాల్లో ప్రతి పాఠాన్ని రెండు భాషల్లోనూ ఇస్తున్నారు. ఇక ప్రాథమిక స్థాయి నుంచి పదో తరగతి వరకూ అన్ని పాఠ్య పుస్తకాల్లో రెండు మాధ్యమాల్లోనూ సులభంగా చదువుకునే అవకాశం ఉంటుంది. పదానికి అర్థం తెలియకున్నా పక్కనే ఉన్న పేజీలో తెలుగులో ఉండటంతో అటు విద్యార్థులకు, ఇటు ఉపాధ్యాయులకు ప్రయోజనకరంగా ఉంటుంది. రెండు సెమిస్టర్లుగా పుస్తకాలు ప్రతి పుస్తకాన్ని ఆంగ్లం, తెలుగులో ముద్రిస్తే పుస్తకంలో పేజీల సంఖ్య రెట్టింపు కావడంతో విద్యార్థులకు బరువు పెరగకుండా ఉండేందుకు రెండు సెమిస్టర్లుగా విభజించారు. సగం పాఠాలను సెమిస్టర్–1, మిగతా సగం పాఠాన్ని సెమిస్టర్–2గా విభజించారు. విద్యా సంవత్సరం ప్రారంభంలో మొదటి భాగం, ఆ తర్వాత నవంబర్లో రెండో భాగం అందజేసి పాఠ్యాంశాలను బోధిస్తారు. మిర్రర్ ఇమేజ్ పుస్తకాలతో ప్రస్తుత విద్యా సంవత్సరం వార్షిక పరీక్షల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంది. దీనివల్ల ప్రభుత్వానికి ఆర్థిక భారం పడుతున్నప్పటికీ విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర విద్యా శాఖ అధికారులు ఈ పుస్తకాల ముద్రణకే ప్రాధాన్యం ఇచ్చారు. సీఎస్ఈ వెబ్సైట్లో అన్ని మిర్రర్ ఇమేజ్ పాఠ్య పుస్తకాలను విద్యార్థుల సౌకర్యార్థం పీడీఎఫ్ రూపంలో అందుబాటులో ఉంచారు. జిల్లాలో పరిస్థితి ఇదీ కోనసీమ జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు మొత్తం 1,585 ఉన్నాయి. జెడ్పీ/మండల పరిషత్ యాజమాన్యంలో 1,499, ప్రభుత్వ యాజమాన్యంలో 10, మున్సిపల్ యాజమాన్యంలో 62, ఎయిడెడ్ 6, సాంఘిక సంక్షేమంలో ఆరు, బీసీ వెల్ఫేర్లో రెండు పాఠశాలలు ఉన్నాయి. వీటిలో చదువుతున్న సుమారు 1.80 లక్షల మంది విద్యార్థులకు మిర్రర్ ఇమేజ్ పాఠ్య పుస్తకాలను ప్రభుత్వం సరఫరా చేస్తోంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పదో తరగతి విద్యార్థులు సుమారు 19 వేల మంది ఉన్నారు.పట్టు పెరుగుతోంది మిర్రర్ ఇమేజ్ పాఠ్య పుస్తకాలతో పాఠ్యాంశాలు సులువుగా అర్థమవుతాయి. ఇంగ్లిష్ మీడియంలో ఉన్న వాక్యానికి అదే అర్థం ఇచ్చే తెలుగు పక్క పేజీలోనే ఉండడం వల్ల విద్యార్థికి ఇంగ్లిష్పై పట్టు పెరుగుతోంది. మిర్రర్ ఇమేజ్ పుస్తకాలు ఉపాధ్యాయులు బోధనకు, విద్యార్థులకు కంటెంట్ను అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తున్నాయి. సాధారణ స్థాయి విద్యార్థికి కూడా ప్రయోజనం చేకూరుతుంది. – ఎం. చంద్రకళ, హెచ్ఎం, జెడ్పీహెచ్ఎస్, ఉచ్చిలి, ఆత్రేయపురం మండలం చాలా ప్రయోజనకరం ఈ ఏడాది పదో తరగతి పాఠ్య పుస్తకాలను మిర్రర్ ఇమేజ్ పుస్తకాలుగా మార్చారు. ద్విభాషా విధానంలోని పాఠ్యాంశాలతో విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆంగ్ల భాష పట్ల పట్టు కొంతమేర తక్కువగా ఉంటున్నందున, ఈ రకమైన విధానంతో పదో తరగతిలో మరిన్ని మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటోంది. – కేఎస్వీ కృష్ణారెడ్డి, జీహెచ్ఎం, పాఠ్యపుస్తక రచయిత, జెడ్పీహెచ్ఎస్, ఈతకోట, రావులపాలెం మండలం -
శ్రావణం వరకూ మోగని పెళ్లి బాజాలు
కొవ్వూరు: ఈ ఏడాది ఆగస్టు ఐదో తేదీ వరకూ పెళ్లి బాజాలకు బ్రేక్ పడింది. ఏప్రిల్ 28 నుంచి వరుసగా మూఢమి రావడంతో రెండున్నర నెలలుగా వివాహాలు, ఉపనయనాలు, గృహ ప్రవేశాల వంటి శుభకార్యాలు నిలిచిపోయాయి. క్రోధి నామ సంవత్సరం ఏప్రిల్ తొమ్మిదో తేదీ నుంచి ముహూర్తాలు ప్రారంభమై 26వ తేదీ చైత్ర మాసం వరకూ శుభ ముహూర్తాలు నడిచాయి. ఏప్రిల్ 28వ తేదీ చైత్ర చవితి ఆదివారం నుంచి జూలై ఎనిమిదో తేదీ వరకూ ఆషాఢ శుద్ధ తదియ వరకూ శుక్ర మౌఢ్యమి (మూఢం) నడుస్తోంది. మే 7 నుంచి చైత్ర బహుళ చతుర్ధశి మంగళవారం నుంచి జూన్ ఏడో తేదీ వరకూ గురు మౌఢ్యమి నడిచింది. వరుసగా గురు, శుక్ర మౌఢ్యములు రావడంతో రెండు నెలలుగా వివాహాలకు ఆటంకం ఏర్పడింది. మరో వైపు జూలై ఐదో తేదీ నుంచి ఆషాఢ మాసం ప్రారంభం అవుతుంది. ఆషాఢ మాసం ఆగస్టు ఐదో తేదీ వరకూ కొనసాగుతుంది. ఇది శూన్యమాసం కావడంతో ఈ ¯ðనెలలో కూడా వివాహాలు, ఉపనయనాలు, గృహ ప్రవేశాల వంటి శుభకార్యాలు నిర్వహించరు. మొత్తం మీద ఏప్రిల్ 28 నుంచి ఆగస్టు ఐదో తేదీ వరకూ పెళ్లి బాజాలు మోగే అవకాశం లేదని పండితులు, పురోహితులు చెబుతున్నారు. మూఢంలో కేవలం అన్నప్రాసన, అక్షరాభ్యాసం, నామకరణం, నూతన వ్యాపారాల ప్రారంభోత్సవాలు, సీమంతాలు, రిజి్రస్టేషన్ల వంటి పనులకు మౌఢ్యమిలోని మంచి రోజుల్లో చేసుకోవచ్చునని పండితులు సూచిస్తున్నారు. సెపె్టంబర్ నాలుగో తేదీ నుంచి అక్టోబర్ మూడో తేదీ వరకూ బాద్రపదం కూడా శూన్యమాసం కావడంతో ఈనెలలో వివాహాల ముహూర్తాలు ఉండవు. శ్రావణ మాసంలోనే.. శ్రావణ మాసం ఆగస్టు ఏడో తేదీ నుంచి ప్రారంభమై 28వ తేదీ వరకూ నడుస్తుంది. ఈ నెలలోనే దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఆగస్టు ఏడో తేదీ నుంచి 28 వరకూ ముహూర్తాలు ఉన్నాయి. వాటిలో 5,12,13,19, 20, 26, 27 తేదీల్లో శుక్ర, మంగళవారాలు మినహా అన్నీ రోజులూ దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.వందలాది మంది ఉపాధికి గండి గత రెండున్నర నెలలుగా వివాహ ముహూర్తాలకు మూఢాలు అడ్డంకి కావడంతో వందలాది మంది ఉపాధిపై తీవ్ర ప్రభావం పడింది. కేవలం వివాహాలపై ఆధారపడి ఎన్నో వృత్తుల వారు జీవనం సాగిస్తున్నారు. కల్యాణ మండపాలు, కేటరింగ్, వంటవాళ్లు, పురోహితులు, ఫొటో, వీడియో గ్రాఫర్స్, ట్రావెల్స్ కార్లు, బస్సులు, ఐస్క్రీమ్లు, మినరల్ వాటర్స్, ఈవెంట్ మేనేజ్మెంట్లు, పూలు, డెకరేషన్స్, లైటింగ్, కూరగాయలు, కిరాణా, వస్త్ర, బంగారు, వెండి వ్యాపారాలు, షామ్యానాలు, మాంసపు దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, లాడ్జీలు, సాంస్కృతిక కళాకారులకు పని లేకుండా పోయింది. మరెంతో మంది రోజువారీ కూలీలకూ ఉపాధి కొరవడింది. అడపాదడపా చిన్నచిన్న ఫంక్షన్లు వస్తున్నా పెళ్లిళ్లు అయితే సరైన గిరాకీ లభిస్తుందని ఆయా వర్గాల వారు చెబుతున్నాయి.ఆగస్టు ఏడో తేదీ వరకూ మళ్లీ ఎదురు చూపులు చూడాల్సిందేనని పేర్కొంటున్నారు.శ్రావణంలో దివ్యమైన ముహూర్తాలు గురు, శుక్ర మౌఢ్యాలు వరుసగా రావడంతో వివాహాలు, ఉపనయనాలు, గృహ ప్రవేశాలు 70 రోజుల పాటు నిలిచిపోయాయి. ఏప్రిల్ 28 తర్వాత వివాహాలకు ఇంత వరకు మళ్లీ ముహూర్తాలు లేవు. శ్రావణ మాసంలో ఆగస్టు 7 నుంచి 28 వరకూ నాలుగైదు రోజులు మినహా దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయి.సెప్టెంబర్లో మళ్లీ భాద్రపద మాసం శూన్యమాసం కావడం వలన వివాహ ముహూర్తాలు ఉండవు. – వారణాసి హనుమంతశర్మ, రాష్ట్ర పురోహిత సంఘం అధ్యక్షుడు, కొవ్వూరు -
గోదారి సీనుంటే.. బొమ్మ బ్లాక్బస్టరే..
తాళ్లపూడి: వయ్యారి గోదారి పరవళ్లు.. ఒంపులు తిరిగిన గోదారి గట్లు.. ఆపైనుండే గుడి గోపురాలు.. నీటి మధ్య ఇసుక తిన్నెలు.. లంకలు.. సూర్యోదయాస్తమయ వేళల్లో గోదారమ్మ నుదుటిన అలదుకునే సిందూరం.. పావన నదిపై నీలి మేఘాలంకరణలు.. ఇలా ఒకటా రెండా.. ఎన్నని చెప్పేది గోదారోళ్ల సౌభాగ్యం. భౌతిక నేత్రంతో చూసే భాగ్యం ఇక్కడివారిదైతే.. ఇవే దృశ్యాలను వెండితెరపై చూసి అచ్చెరువొంది.. జీవితంలో ఒక్కసారైనా ఈ ప్రాంతాలను సందర్శించాలని భావించేవారెందరెందరో.. కొంత కళాత్మక దృష్టి.. ఒకింత భావుకత.. మరికొంత రసరమ్యమైన మనసు.. వీటికి తోడు భావగర్భితమైన కెమెరా కన్ను.. చాలు.. ఓ సుందర దృశ్య కావ్యాన్ని వెండి తెరపై ఆవిష్కరించడానికి. ఇలాంటి మనసున్న దర్శక, నిర్మాతలెందరో మన గోదావరిని అమ్మగా.. కొంటె కోణంగిగా.. వయ్యారిభామగా.. పడుచు పిల్లగా.. మరెన్నో విధాలుగా వెండి తెరపై ప్రపంచానికి చూపించి వారి జీవితాలను సార్థకం చేసుకున్నారు. ఎన్నో వైవిధ్యమైన కథలకు నేపథ్యంగా గోదావరి పరీవాహక ప్రాంతాలను ఎన్నుకుని ఎనలేని కీర్తిని గడించారు. తెలుగు సంస్కృతికి ప్రతీకలు గోదావరి జిల్లాలు. ఇక్కడి ప్రజల వాడుక భాషే ‘చిత్ర’ భాషగా వ్యవహరిస్తారు. ఇక్కడి ఆచార వ్యవహారాలే ప్రామాణికంగా భావిస్తారు. దర్శక దిగ్గజాల్లో ఒకరైన నాటి ఆదుర్తి సుబ్బారావు నుంచి నేటి శేఖర్ కమ్ముల వరకూ ఎందరో గోదావరి అందాలతో వారి చిత్రాలను సుసంపస్నం చేసుకున్నారు. కళాతపస్వి కె.విశ్వనాథ్, బాపు, దాసరి నారాయణరావు వంటి అగ్ర దర్శకులే కాక.. ఈ ప్రాంతానికే చెందిన వంశీ తీసిన చాలా సినిమాలు గోదావరి నది నేపథ్యంగా సాగినవే. వారిలో చాలా మందికి పాపికొండల నుంచి అంతర్వేది వరకూ ఎన్నో ప్రాంతాల్లో కనీసం ఒక్క సన్నివేశమైనా చిత్రీకరిస్తే చాలు.. ఆ చిత్రం హిట్టు కొట్టేస్తుందనేది గట్టి నమ్మకం కొవ్వూరు పరిసరాల్లో.. ముఖ్యంగా కొవ్వూరు మండలంలోని గోష్పాద క్షేత్రం, కుమారదేవం, ఆరికిరేవుల, తాళ్లపూడి మండలం వేగేశ్వరపురం పరిసర ప్రాంతాల్లో గోదావరి తీరాన తీసిన ప్రతి సినిమా సూపర్ హిట్టే. వేగేశ్వరపురంలో గోదావరి ఒడ్డున ఉన్న ఆంజనేయుని ఆలయం రేవు, బల్లిపాడు ఇసుక ర్యాంపు లంకలు, మలకపల్లిలోని కుంటముక్కల వారి గృహంలో అనేక సినిమాల్లో చాలా సన్నివేశాలే చిత్రీకరించారు. 👉వేగేశ్వరపురంలో చిరంజీవి నటించిన రక్తసింధూరంలోని ఓ పాటను, రామ్చరణ్, సమంత నటించిన రంగస్థలంలోని పలు సన్నివేశాలను తాడిపూడి, వేగేశ్వరపురం గోదావరి లంకల్లో చిత్రీకరించారు. 👉 నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు తాళ్లపూడిలోనే తీశారు. 👉 సాయికుమార్, ఆయన కుమారుడు ఆది కథా నాయకుడిగా నటించిన చుట్టాలబ్బాయ్ చిత్రంతో పాటు, మంచు మనోజ్, రెజీనా నటించిన శౌర్య చిత్రంలో పలు కీలక సన్నివేశాలను ఇక్కడే తెరకెక్కించారు. 👉 నాగార్జున, అనుష్క నటించిన ఢమరుకం చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాలను గోదావరి నది ఒడ్డున ఆంజనేయస్వామి గుడి వద్ద తీశారు. ప్రత్యేకంగా రుషుల కోసం ఒక సెట్ వేసి వారం రోజుల పాటు ఇక్కడ షూటింగ్ చేశారు. 👉 సుమంత్ నటించగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన గోదావరి, వంశీ దర్శకత్వంలో అల్లరి నరేష్ నటించిన సరదాగా కాసేపు చిత్రంలో కారులో వెళ్లే పాటను ఇక్కడే చిత్రీకరించారు. 👉 జగపతిబాబు, ప్రియమణి నటించిన పెళ్లైన కొత్తలో చిత్రంలో వారి స్నానపు సన్నివేశాన్ని ఇక్కడే తెరకెక్కించారు. 👉 ప్రక్కిలంకలో కృష్ణ నటించిన పాడిపంటలుతో పాటు, చంద్రమోహన్ నటించిన సిరిసిరిమువ్వ ఈ ప్రాంతంలో చిత్రీకరించినవే. 👉 శ్రీకాంత్, చార్మి నటించిన చిత్రంలోని ఓ పాటను, శివాజీ హీరోగా నటించిన మిస్టర్ ఎర్రబాబులో మిత్రులతో కలిసి కథానాయికను ఆయన పరిచయం చేసుకునే సన్నివేశాన్ని, సునీల్పై హాస్య సన్నివేశాలను, ఆలీ నటించిన ఆషాఢం పెళ్లికొడుకులో ఒక పాటను ఇక్కడి ఇసుక తిన్నెల్లో ప్రత్యేకంగా సెట్ వేసి చిత్రీకరించారు. 👉 కేవలం సినిమాలే కాకుండా కొన్ని ధారావాహికలు సైతం ఇక్కడి గోదారి ప్రాంతాల్లో చిత్రీకరించారు. హిట్ చిత్రాల భవనం సుమారు 110 ఏళ్ల క్రితం మలకపల్లిలో ఆ గ్రామానికి చెందిన కుంటముక్కల వీరభద్రరావు, వెంకటాద్రి, జానకిరామయ్య లోగిలిని అత్యాధునికంగా నిర్మించారు. ఈ గృహంలో సినిమా తీస్తే హిట్ గ్యారెంటీ అని చిత్రరంగ ప్రముఖుల్లో గట్టి నమ్మకం. 👉 జంధ్యాల దర్శకత్వంలో 1985లో వచ్చిన సీతారామకల్యాణం చిత్రం ఎక్కువ భాగం ఈ ఇంట్లోనే తీశారు. 👉 ఆ చిత్రం విజయం సాధించడంతో సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో డి.సురే‹Ùబాబు నిర్మాతగా బి.గోపాల్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటించిన బొబ్బిలిరాజా చిత్రంలోని కీలక సన్నివేశాలను కూడా ఈ ఇంట్లోనే తెరకెక్కించారు. 👉 అలాగే క్రాంతికుమార్ దర్శకత్వంలో వచ్చిన సీతారామయ్య గారి మనవరాలు, బాలకృష్ణ నటించిన సీతారామ కల్యాణం, నరేష్ నటించిన ప్రేమచిత్రం.. పెళ్లి విచిత్రం, ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో శోభన్బాబు నటించిన ఏవండీ ఆవిడ వచ్చింది, ఇంకా.. సీతారత్నం గారి అబ్బాయి, తాళి తదితర చిత్రాలన్నీ విజయం సాధించాయి. 👉 ఇదే గ్రామంలో దివంగత కుంటముక్కల భాస్కరరావు గృహానికి 140 ఏళ్ల చరిత్ర ఉంది. ప్రేమవిజేత అనే చిత్రం, రజనీకాంత్ నటించిన తమిళ సినిమా, జగదాంబ టూరింగ్ టాకీస్ తదితర సినిమాల్లో చాలా సన్నివేశాలు ఇక్కడే చిత్రీకరించారు. అప్పట్లో డి.రామానాయుడు ఇక్కడి గ్రంథాలయానికి రూ.30 వేల విరాళం అందజేశారు. దీంతో గ్రామస్తులు ఆ భవనానికి మరమ్మతులు చేసి, రామానాయుడు గ్రంథాలయంగా పేరు పెట్టారు. రామచరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తాజాగా నిర్మిస్తున్న గేమ్ చేంజర్ చిత్రంలోని కీలక సన్నివేశాలను ఇక్కడే చిత్రీకరించారు.150 ఏళ్ల నాటి సినిమా చెట్టుకుమారదేవం గ్రామంలో గోదావరి ఒడ్డున ఉన్న నిద్రగన్నేరు చెట్టుకు 150 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ఇక్కడ సుమారు 200 పైగా సినిమాల షూటింగ్లు జరిగాయి. దీంతో, దీనికి ‘సినిమా చెట్టు’గా పేరొచ్చింది. ఇక్కడ సినిమా తీస్తే తప్పకుండా హిట్ అవుతుందన్న సెంటిమెంట్ చిత్రసీమలో స్థిరపడిపోయింది. ఈ నమ్మకంతోనే ఒక్క సీన్ అయినా ఈ చెట్టు కింద తీస్తారు. మొదటిగా కృష్ణ హీరోగా 1975లో పాడిపంటలు ఈ చెట్టు వద్ద చిత్రీకరించారు. ఏఎన్ఆర్, ఎన్టీఆర్, చిరంజీవి, శోభన్బాబు, బాలకృష్ణ, మోహన్బాబు, సుమన్, మహే‹Ùబాబు, రామ్చరణ్, రాజశేఖర్, నాని తదితర హీరోలతో పాటు, దర్శకులు వంశీ, రాఘవేంద్రరావు, క్రాంతికుమార్, సుకుమార్ ఈ చెట్టు కింద ఏదో ఒక సన్నివేశాన్ని చిత్రీకరించడం సెంటిమెంట్గా భావిస్తారు.షూటింగ్ల అడ్డా.. గోష్పాద క్షేత్రం కొవ్వూరు గోష్పాద క్షేత్రం పలు హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచింది. జూనియర్ ఎనీ్టఆర్, భూమిక నటించిన హిట్ చిత్రం సింహాద్రిలో ఇంటర్వెల్ సీన్ ఇక్కడే తీశారు. అలాగే సుకుమార్ దర్శకత్వంలో 100 పర్సంట్ లవ్తో పాటు గుండెల్లో గోదారి, బెండు అప్పారావు ఆర్ఎంపీ తదితర అనేక చిత్రాలు ఇక్కడ తీశారు. ఇలా గోదావరి తీరంలో ఏటా చాలా చిత్రాల షూటింగులు జరుగుతూనే ఉంటాయి. -
గత చరితకు దర్పణం
● బ్రిటిష్ జ్ఞాపకాలకు నెలవు ● ఇక్కడే కాటన్ హయాంలో ఉపయోగించిన పరికరాలు ● నాటి రికార్డులు, వస్తువులు పదిలం ● శెట్టిపేట ఇరిగేషన్ కార్యాలయం ప్రత్యేకతనిడదవోలు: శతాబ్దానికి పైబడిన ఘన చరిత్రకు నేటికీ సజీవ దర్పణంగా నిలుస్తోంది నిడదవోలు మండలం శెట్టిపేట వద్ద ఉన్న జలవనరుల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈఈ) కార్యాలయ భవనం. ఇందులో గత చరితకు సంబంధించిన ఎన్నో సాక్ష్యాలు నేటికీ పదిలంగా ఉన్నాయి. గోదావరి ఆయకట్టు మూడు డెల్టాలుగా ఉన్న విషయం తెలిసిందే. ఇందులో తూర్పు డెల్టా కాకినాడ, కోనసీమ జిల్లాలు, మధ్య డెల్టా కోనసీమ జిల్లా పరిధిలో ఉన్నాయి. సుమారు 5.30 లక్షల ఎకరాల ఆయకట్టు కలిగిన పశ్చిమ డెల్టా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో విస్తరించి ఉంది. మొత్తం గోదావరి డెల్టా ఆయకట్టులో దాదాపు సగం పశ్చిమ డెల్టాలోనే ఉంది. ఇంత కీలకమైన ప శ్చిమ డెల్టా ఆయకట్టుకు గుండెకాయ జలవనరుల శాఖ ఈఈ కార్యాలయం నిడదవోలు పట్టణానికి చేరువన శెట్టిపేట వద్ద ఉంది. బ్రిటిష్ హయాంలో ధవళేశ్వరం నుంచి విజ్జేశ్వరం వరకూ గోదావరిపై బ్యారేజీ నిర్మించారు. ఆ నదీ జలాలను ఒడిసిపట్టి, ప్రధాన కాలువలు, పంట కాలువలు, పిల్ల కాలువలు, డ్రెయినేజీలతో డెల్టా వ్యవస్థకు రూపుదిద్దిన అపర భగీరథుడు సర్ ఆర్థర్ కాటన్. ఆయన హయాంలోనే ఈ కార్యాలయాన్ని నిర్మించారు. పక్కన 1870లో ఈ భవన నిర్మాణం ప్రారంభించారు. ఈ పనులు 1892లో పూర్తయ్యాయి. ఈ భవనం గోడలను రాయి, నాటు కోడిగుడ్ల సొన కలిపిన గానుగ సున్నంతో నిర్మించారని ఇక్కడ పని చేసిన విశ్రాంత ఉద్యోగులు చెబుతున్నారు. కార్యాలయం పై కప్పు నిర్మాణానికి బర్మా నుంచి ప్రత్యేకంగా తెప్పించిన కలపను ఉపయోగించారు. అప్పట్లో ఎంతో నాణ్యతతో నిర్మించడంతో 131 ఏళ్లు గడచినా ఈ భవనం ఇంకా చెక్కు చెదరకుండా ఉంది. పై నుంచి చూస్తే ఈ కార్యాలయం శిలువ ఆకృతిలో కనిపిస్తుంది. అప్పట్లో బ్రిటిష్ వారు ఎటువంటి కట్టడం నిర్మించినా దానిని ఇదే ఆకారంలో నిర్మించేవారని అంటారు. ఇదీ ప్రాధాన్యం గోదావరి పశ్చిమ డెల్టా పరిధిలోని 5.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటి నియంత్రణ పూర్తిగా ఈ కార్యాలయ పర్యవేక్షణలోనే జరుగుతుంది. అంతేకాకుండా పశ్చిమ డెల్టా పరిధిలోని నాలుగు సబ్ డివిజన్లలో పనుల అంచనాలు రూపొందించడం, కాలువ పనుల పర్యవేక్షణ, ధవళేశ్వరం హెడ్ వర్క్స్ పర్యవేక్షణలో శివారు భూములకు సాగునీటి విడుదల వంటి కార్యకలాపాలను ఇక్కడి నుంచే నిర్వహిస్తారు. ఘన చరిత్రకు సజీవ సాక్ష్యాలు ● కాటన్ దొర హయాంలో వినియోగించిన పలు వస్తువులు ఇప్పటికీ ఈ భవనంలో పదిలంగా ఉన్నాయి. వీటిల్లో పలు వస్తువులను ఇప్పటికీ సిబ్బంది ఉపయోగించుకుంటున్నారంటే ఇవి ఎంత నాణ్యమైనవో అర్థం చేసుకోవచ్చు. ● 1871లో అప్పటి మొదటి బ్రిటిష్ ఇంజినీర్ జీఐ వాల్క్ నుంచి ఇప్పటి వరకూ గోదావరి డెల్టాకు సంబంధించిన రికార్డులు ఈ కార్యాలయంలో భద్రంగా ఉన్నాయి. ● నాడు ఏర్పాటు చేసిన ఫర్నిచర్ ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. ● అప్పట్లో ఏర్పాటు చేసిన ఫ్యాన్లను కార్యాలయం సిబ్బంది నేటికీ దర్జాగా ఉపయోగిస్తున్నారు. ● ఆ రోజుల్లో వాడిన తక్కెడ కూడా చెక్కుచెదరకుండా ఉంది. ● ఈ కార్యాలయంలోని బీరువాకు వేసిన తాళం కప్ప ఎటువంటి మరమ్మతులూ లేకుండా నేటికీ పని చేస్తూండటం విశేషం. ఈ తాళం కప్పపై లండన్ దేశపు ముద్రతో విక్టోరియా స్ట్రీట్ అనే పదాలు కనిపిస్తాయి. దీనిపై 863775 అనే నంబర్ కూడా ఉంది. అప్పటిలో ఈ నంబర్ల ఆధారంగానే వస్తువులను దిగుమతి చేసుకునే వారని చెబుతారు. ఈ తాళం కప్పకు ఇప్పటి వరకూ తుప్పు కూడా పట్టకపోవడం దీని నాణ్యతకు నిదర్శనం. ● కార్యాలయానికి వచ్చిన వారు ఇక్కడి తాళం కప్పను, నాటి ఫ్యాన్లను నేటికీ వినియోగించడం చూసి ఆశ్చర్యపోతూంటారు. ● ఈ భవనంలో సుమారు 9 అడుగుల ఎత్తున ఉన్న బీరువాలు కూడా ఇప్పటికీ వినియోగంలో ఉంది. దీనికి చెదలు కూడా పట్టకపోవడం విశేషం. ● నాడు పూర్తి ఐరన్తో తయారు చేసిన బోషాణాన్ని కూడా ఇక్కడి సిబ్బంది ఇప్పటికీ నిక్షేపంలా ఉపయోగించుకుంటున్నారు. గోడలో 10 అంగుళాల లోపలకు ఈ బోషాణాన్ని అమర్చారు. దీనిపై గుర్రం, సింహం గుర్తులతో ఉన్న రాజముద్రను ముద్రించారు. అప్పట్లో బ్రిటిష్ వారు ఈ రాజ ముద్ర ద్వారా పరిపాలన సాగించినట్లు పూర్వపు ఉద్యోగులు చెబుతున్నారు. అప్పట్లో డీడీలు, చెక్కులు, చలానాలు, నగదు, పనుల మంజూరు పత్రాలను ఈ బోషాణంలో దాచేవారు. ● అలాగే, అప్పట్లో ఉపయోగించిన తక్కెడ కూడా ఈ కార్యాలయంలో ఇప్పటికీ ఉంది. ● 1908లో అప్పటి బ్రిటిష్ ఇంజినీరు జేఎం లేసె కుటుంబ సభ్యులు మరణించగా.. కార్యాలయం సమీపాన నిర్మించిన సమాధి ఇక్కడ ఉంది. ఆ బ్రిటిష్ ఇంజినీర్ కుటుంబ సభ్యులు కొంత కాలం ఇక్కడకు వచ్చి నివాళులర్పించేవారని సీనియర్ ఉద్యోగులు చెబుతున్నారు. ఇంజినీర్ల బంగ్లా శెట్టిపేటలోని ఇరిగేషన్ ఈఈ కార్యాలయం సమీపాన ఉన్న ఇంజినీర్ల రెండంతస్తుల బంగ్లా ఇప్పటికీ పదిలంగా ఉంది. దీని నిర్మాణంలో బర్మా నుంచి తీసుకుని వచ్చిన కలపను ఎక్కువగా ఉపయోగించారు. కొద్దిపాటి మరమ్మతులు చేయడం మినహా ఈ బంగ్లా ఇప్పటికీ ఎంతో పటిష్టంగా ఉంది. ఈఈలుగా ఎవరు వచ్చినా ఇక్కడ నివాసం ఉండాల్సిందే. దీందో ఇది ఇంజినీర్ల బంగ్లాగా పేరొందింది. జిల్లాలో శివారు భూములకు సాగునీటి సరఫరా, వేసవిలో మంచినీటి చెరువులకు నీటి మళ్లింపు, నీటి విడుదల క్రమబద్ధీకరణ, గోదావరి జలాల పర్యవేక్షణ వంటి కీలక విధులను ఈ బంగ్లా నుంచే నిర్వహిస్తారు. -
వాడపల్లికి పోటెత్తిన భక్తులు
ఆత్రేయపురం: కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరుని ఆలయం శనివారం అశేష భక్తజనంతో పోటెత్తింది. గోవింద నామస్మరణ మార్మోగింది. ఉదయమే స్వామివారికి మేలుకొలుపు అనంతరం ప్రత్యేక పుష్పాలతో అలంకరణ చేశారు. గౌతమీ గోదావరిలో స్నానాలు ఆచరించిన భక్తులు స్వామివారిని దర్శించుకుని పులకించారు. ఆలయ ఆవరణలో వేంచేసి ఉన్న క్షేత్ర పాలకుడు శ్రీఅన్నపూర్ణా సమేత విశ్వేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక దర్శనం, అన్నప్రసాద విరాళాలు, వివిధ సేవలు, లడ్డూ ప్రసాదం విక్రయం, ఆన్లైన్ సేవల ద్వారా స్వామివారికి సుమారు రూ.40,36,722 ఆదాయం సమకూరింది. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన అన్న సమారాధనలో వేలాదిగా స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. -
కొబ్బరికి కొత్త ఊపిరి
ఆర్అండ్ఆర్ పథకంలో కొబ్బరి చెట్ల తొలగింపు పనులు (ఫైల్) ● పాత చెట్ల స్థానంలో కొత్తవి నాటేందుకు అవకాశం ● జిల్లాలో వెయ్యి హెక్టార్లలో ఆర్అండ్ఆర్ ● హెక్టారుకు రూ.53,500 రాయితీ వర్తింపు సాక్షి, అమలాపురం: కర్ణుడి చావుకు వెయ్యి కారణాలు అన్నట్టుగా కొబ్బరి సంక్షోభానికి కారణాలు అనేకం. కొబ్బరి కాయల దిగుబడి తగ్గడం.. కొబ్బరి (చిప్ప) దిగుబడి మందగించడం.. నాణ్యత లేకపోవడం.. పరిపక్వత లేని కొబ్బరి కాయలను దింపుగా తీయడం.. ఇతర దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే కొబ్బరి కాయ సైజు చిన్నగా ఉండడం.. ఉత్తరాది ఎగుమతుల్లో వెనుకబడడం.. చెట్లను ఆశించే తెగుళ్లు.. వివిధ రకాల పురుగులు.. చెప్పుకొంటూ పోతే ఎన్నెన్నో. అయినా అంతిమంగా కోనసీమ జిల్లాలో వయసు మళ్లిన కొబ్బరి తోటలు ఉండడమే ప్రధాన సమస్య. దేశవాళీ కొబ్బరి చెట్టు (ఈస్టుకోస్టాల్) వయసు వందేళ్లు. కానీ 60 ఏళ్ల వరకూ మాత్రమే పూర్తిస్థాయి దిగుబడి వస్తోంది. తరువాత తగ్గిపోతుంది. జిల్లాలో 1.03 లక్షల కొబ్బరి తోటలు ఉండగా, మరో 25 వేల ఎకరాలకు సరిపడా కొబ్బరి చెట్లు ఇళ్ల వద్ద, తోటలు, చెరువు గట్లు, రోడ్ల వెంబడి ఉన్నాయి. ఇప్పుడున్న తోటల్లో 90 శాతం దేశవాళీ రకం కాగా, ఇందులో 50 శాతానికి పైగా తోటలు ఇవే రకాలు ఉండడం గమనార్హం. దేశవాళీ రకం సగటు దిగుబడి చెట్టుకు ఏడాదికి సగటున 70 కాయల వరకూ వస్తాయి. ఇంతకన్నా అధికంగా దిగుబడి ఇచ్చే సంకర జాతి (హైబ్రీడ్) రకాలు ఉన్నాయి. ఇందులో గోదావరి గంగ ఒకటి. ఇది సగటున 140 కాయల వరకూ దిగుబడి ఇస్తోంది. దిగుబడి పతనం గతంలో ఎకరాకు 1,200 వరకూ కొబ్బరి కాయల దిగుబడి వచ్చేది. ఇప్పుడు 600 నుంచి 800 కాయలకు పడిపోయింది. 45 రోజులకు ఒకసారి చొప్పున సగటు ఎనిమిది దింపులు వచ్చేది. అది కాస్తా ఇప్పుడు 60 రోజులకు ఒకసారి ఆరు దింపులకు మాత్రమే పరిమితమైంది. ఈ విధంగా చూస్తే గతంలో 9,600ల కాయలు దిగుబడిగా వస్తే, ఇప్పుడు కేవలం 4,800 కాయలు మాత్రమే వస్తోంది. కాయలో కొబ్బరి సైతం తగ్గిపోతోంది. దేశవాళీ రకంలో 125 గ్రాముల వరకూ ఉండేది. దీని నుంచి 64 శాతం నూనె ఉత్పత్తి అయ్యేది. కానీ ఇప్పుడు 100 గ్రాములకు పడిపోయిందని, నూనె శాతం 61 మాత్రమే వస్తుందని అంచనా. తోటలు పునరుద్ధరించాల్సిందే.. జిల్లాలోని తోటల్లో చాలా వరకూ కొబ్బరి చెట్లు తొలగించాల్సిందేనని నిపుణుల అంచనా. ఒకేసారి తోటలు తొలగిస్తే ఐదేళ్ల పాటు ఆదాయం కోల్పోయే అవకాశం ఉంది. అలా కాకుండా దిగుబడి తక్కువగా వస్తున్న చెట్లను గుర్తించి తొలిగించి కొత్తవాటిని వేయాల్సి ఉంది. గతంలో 45 ఏళ్ల పైబడి వయసున్న తోటల్లో కొబ్బరి చెట్ల మధ్య కొత్తగా కొబ్బరి మొక్కలు వేసేవారు. ఇప్పుడు రైతులు ఈ విధానానికి దూరంగా ఉంటున్నారు. ఇలా దిగుబడి లేని చెట్ల తొలగింపు చాలా కాలంగా నిలిచిపోయింది. దీనివల్ల రైతులు నష్టపోయే పరిస్థితి నెలకొంది. ఆర్అండ్ఆర్తో మేలు కోకోనట్ బోర్డు (సీడీబీ) రీ ప్లాంటేషన్ అండ్ రిజనువేషన్ (ఆర్అండ్ఆర్) పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా దిగుబడి తక్కువగా వచ్చే చెట్లను, తెగుళ్లు, పురుగులు ఆశించిన చెట్లను, పిడుగుపాటుకు గురై దెబ్బతిన్న చెట్లను తొలగించి కొత్తవి నాటుకోవచ్చు. గతంలో సీడీబీ నేరుగా అమలు చేసే ఈ పథకాన్ని ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లో ఉద్యాన శాఖ ద్వారా చేపడుతున్నారు. చెట్లను తొలగించడం, వాటి స్థానంలో కొత్తవి నాటుకోవడం, వాటికి రెండేళ్ల పాటు ఎరువులు ఉచితంగా అందించడం ఈ పథకం ఉద్దేశం. చెట్టు తొలగింపునకు రూ.వెయ్యి చొప్పున రాయితీ అందిస్తారు. దీనికి హెక్టారు పరిమితి కాగా, హెక్టారుకు 32 చెట్లను తొలగించుకునే సౌలభ్యం రైతుకు ఉంది. ఇందుకు గాను రూ.32 వేలు రాయితీగా అందుతోంది. దీనితోపాటు కొత్తగా నాటుకునేందుకు చెట్టుకు రూ.40 చొప్పున హెక్టారుకు 100 చెట్ల వరకూ రైతుకు రూ.4 వేలు, ఎరువులు హెక్టారుకు ఏడాదికి రూ.8,750 చొప్పున రెండేళ్లకు గాను రూ.17,500 చొప్పున మొత్తం రూ.53,500 అందజేయనున్నారు. పెద్ద ఎత్తున కేటాయింపులు జిల్లాలో ఈ ఏడాది వెయ్యి హెక్టార్లలో పథకం అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉద్యానశాఖ అధికారులు ప్రతిపాదనలు పంపగా, వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేసిన కృషి ఫలితంగా జిల్లాకు పెద్దఎత్తున కేటాయింపులు జరిగాయి. గతంలో జిల్లాకు కేవలం 400 హెక్టార్లకు మించి ఇచ్చేవారు కాదు. కానీ ఈసారి వెయ్యి హెక్టార్లకు అనుమతి వచ్చింది. అర ఎకరం, ఎకరం ఉన్న చిన్న, సన్నకారు రైతులకు సైతం అమలు చేస్తున్నారు. అందుకు తగినట్టుగా రాయితీ అందజేయనున్నారు. ఇక్కడ తక్కువే... కోనసీమ జిల్లాతో పోలిస్తే కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో కొబ్బరి సాగు తక్కువ. కాకినాడ జిల్లాలో తుని, కత్తిపూడి మండలాల్లో కేవలం 1,482 ఎకరాల్లో సాగు జరుగుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో కోరుకొండ, చాగల్లు, కొవ్వూరు, ద్వారకాతిరుమల, నిడదవోలు, గోపాలపురం మండలాల్లో 19,838 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఈ జిల్లాలో 51.14 హెక్టార్లలో ఆర్అండ్ఆర్ పథకాన్ని అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రైతులకు ఎంతో లబ్ధి ఆర్అండ్ఆర్ జిల్లాకు ఇంత పెద్దఎత్తున రావడం ఇదే తొలిసారి. ఉద్యాన రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా తక్కువ దిగుబడి ఇచ్చే చెట్లను తొలగించి మేలైన వంగడాలను నాటుకోవచ్చు. తద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చు. ఈ పథకం ద్వారా చిన్న, సన్నకారు రైతులు సైతం లబ్ధి పొందవచ్చు. అవసరమైన వారు స్థానిక ఉద్యాన శాఖ అధికారులను సంప్రదించాలి. – బీవీ రమణ, జిల్లా ఉద్యాన శాఖ అధికారి అన్నివిధాలా లాభం 45 ఏళ్ల వయసున్న తోటలను ముందుగానే గుర్తించాలి. అందులో దిగుబడి తక్కువగా ఉన్న చెట్లను గుర్తించి వాటి సమీపంలో కొత్తవి పెంచుకోవాలి. అవి పక్వానికి వచ్చిన తరువాత ముదుర చెట్లను తొలగించాలి. ఇది చాలా మంచి మార్గం. ఇందుకు ఆర్అండ్ఆర్ స్కీమ్ అన్ని విధాలా మేలు చేస్తోంది. కానీ చాలామంది చెట్లను నరికి మొదలు వదిలేస్తున్నారు. దీనివల్ల కొమ్ము పురుగు వాటిలో ఆవాసాలు ఏర్పాటు చేసుకుని ఉన్న చెట్లను నాశనం చేస్తాయి. మొత్తం చెట్టును తొలగించాలి. – ఎన్బీవీ చలపతిరావు, అధిపతి, డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి ఉద్యాన పరిశోధనా స్థానం, అంబాజీపేట -
హామీలు నెరవేర్చకుంటే ప్రభుత్వాన్ని నిలదీస్తాం
● ప్రజలకు, వైఎస్సార్ సీపీ శ్రేణులకు అండగా ఉంటాం ● మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్రాజమహేంద్రవరం సిటీ: టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కొద్ది నెలల సమయం ఇస్తామని, నెరవేర్చని పక్షంలో నిలదీస్తామని మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ నేత మార్గాని భరత్రామ్ అన్నారు. తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజమహేంద్రవరం నగరాభివృద్ధే లక్ష్యంగా నిరంతరం కష్టపడి పని చేశామన్నారు. ప్రజల అభిమానం ఎందుకు పొందలేదన్నదీ అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ప్రజల వెంటే ఉంటూ, వారి సమస్యలపై పోరాటం చేస్తామన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేయగలిగిందే చెబుతారని, అంతే కానీ అధికారం కోసం ప్రజలకు లేనిపోని ఆశలు చూపడం ఆయనకు అలవాటు లేదని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం ఏ మేరకు సంక్షేమ పథకాలు అమలు చేస్తుందో వచ్చే అయిదారు నెలల్లోనే తెలుస్తుందన్నారు. తమకు ఓటు వేసిన ప్రజలకు, పార్టీ కోసం శ్రమించిన శ్రేణులకు ఎప్పుడూ అండగా ఉంటామని చెప్పారు. ప్రభుత్వం మంచి చేస్తే అభినందిస్తామని, చేయకుంటే నిలదీస్తామని అన్నారు. జగన్తోనే ప్రయాణం తన ప్రయాణం ఎప్పుడూ వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే అని భరత్రామ్ స్పష్టం చేశారు. మోరంపూడి ఫ్లై ఓవర్ బ్రిడ్జి టీడీపీ ఎంపీ మురళీమోహన్ హయాంలో మంజూరైందన్నారు. అప్పుడే రద్దు కూడా అయ్యిందన్నారు. తాను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తిరిగి మంజూరు చేయించానన్నారు. వాస్తవాలను చెరిపేయాలనే ఉద్దేశంతో శిలాఫలకాలు ధ్వంసం చేయడం ఎంత వరకూ సమంజనమని ప్రశ్నించారు. ఎవరి హయాంలో ఫ్లై ఓవర్ బ్రిడ్జి శాంక్షన్ అయిందో, ఎప్పుడు పనులు ప్రారంభమయ్యాయో నగర వాసులందరికీ తెలుసునన్నారు. నగరానికి మరో నాలుగు ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు, ఔటర్ రింగ్ రోడ్ మంజూరయ్యాయని, వాటిని పూర్తి చేసే బాధ్యత ఎంపీ పురందేశ్వరిదేనని అన్నారు. ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ నెరవేర్చుకునే అసలైన సమయం, అవకాశం వచ్చిందని, దీనిపై టీడీపీ ఎటువంటి కృషి చేస్తుందో చూడాలని అన్నారు. బీజేపీకి ఇప్పుడు టీడీపీ, జనసేన ఎంపీల మద్దతు చాలా ముఖ్యమని, ఇటువంటి తరుణంలో రాష్ట్ర విభజన హామీల అమలుకు ప్రధానిపై ఒత్తిడి తెస్తే తప్పక సాధ్యమవుతాయని భరత్ అన్నారు. సమావేశంలో రాజమహేంద్రవరం నగరాభివృద్ధి సంస్థ (రుడా) చైర్మన్ రౌతు సూర్యప్రకాశరావు, పార్టీ నేతలు డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మార్గాని నాగేశ్వరరావు, పార్టీ నగర అధ్యక్షుడు అడపా శ్రీహరి పాల్గొన్నారు. -
జక్కంపూడి చిన్ని మృతి
రాజమహేంద్రవరం సిటీ: దివంగత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు సోదరుడు, సినీ ఎగ్జిబిటర్, రాజకీయ నాయకుడు జక్కంపూడి శ్రీనివాసరావు (చిన్ని) (64) రాజమహేంద్రవరం నారాయణపురంలోని తన నివాసంలో శనివారం మృతి చెందారు. ఆయనకు భార్య, కుమారుడు. ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిన్ని అంత్యక్రియలు కోటిలింగాలపేట శ్మశాన వాటికలో నిర్వహించారు. రాజకీయాల్లో సోదరుడు రామ్మోహనరావుకు చిన్ని చేదోడువాదోడుగా వ్యవహరించారు. వైఎస్సార్ సీపీ నేతలు మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్, డాక్టర్ గూడూరి శ్రీనివాస్లు చిన్ని నివాసానికి వెళ్లి ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, చిన్ని కుమారుడు దత్ను పరామర్శించి, సంతాపం తెలిపారు. నిడదవోలు ఎమ్మెల్యే కందుల దుర్గేష్ కూడా చిన్ని పార్థివ దేహాన్ని సందర్శించి, నివాళులర్పించారు. డెల్టాలకు 6,500 క్యూసెక్కులు ధవళేశ్వరం: కాటన్ బ్యారేజీ నుంచి ఖరీఫ్ సాగుకు సంబంధించి గోదావరి డెల్టా కాలువలకు శనివారం 6,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇందులో తూర్పు డెల్టాకు 1,500, మధ్య డెల్టాకు 1,000, పశ్చిమ డెల్టాకు 4,000 క్యూసెక్కుల చొప్పున వదిలారు. సముద్రంలోకి 1,257 క్యూసెక్కుల మిగులు జలాలను విడుదల చేశారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 10.60 అడుగులుగా నమోదైంది. శనైశ్చరునికి ప్రత్యేక పూజలు కొత్తపేట: శనిదోష నివారణకు ప్రసిద్ధి చెందిన మందపల్లి ఉమామందేశ్వర (శనైశ్చర) ఆలయంలో స్వామివారిని శనివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించి, ప్రత్యేక పూజలు, తైలాభిషేకాలు జరిపించారు. ప్రాతఃకాలంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసిన అనంతరం భక్తుల దర్శనానికి అనుమతించారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా పూజలు, తైలాభిషేకాల టిక్కెట్ల ద్వారా దేవస్థానానికి రూ.1,84,380, అన్నప్రసాదం విరాళాల రూపంలో రూ.50,357 ఆదాయం వచ్చిందని ఈఓ తెలిపారు. -
చిన వెంకన్న క్షేత్రం.. భక్తజన సంద్రం
ద్వారకా తిరుమల: చినవెంకన్న దివ్య క్షేత్రం శనివారం భక్తజన సంద్రమైంది. శ్రీవారికి ప్రీతికరమైన రోజు, అందులోనూ వేసవి సెలవులు ముగుస్తూండటంతో సుదూర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు ఆలయానికి తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తుల రాక మొదలైంది. దీంతో క్షేత్ర పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి. ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతం, అనివేటి మండపం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూ లైన్లు, ప్రసాదం, టికెట్ కౌంటర్లు, కేశఖండన శాల, నిత్యాన్నదాన విభాగాలు భక్తులతో పోటెత్తాయి. క్యూ లైన్లు నిండిపోవడంతో భక్తులు ఆలయ ఆవరణలో పెద్ద సంఖ్యలో బారులు తీరారు. క్యూలైన్లలో ఉన్న వారికి దేవస్థానం సిబ్బంది నిరంతరాయంగా మంచి నీరు అందించారు. అనివేటి మండపంలో పలు భజన మండలి సభ్యులు ప్రదర్శించిన కోలాట నృత్యాలు భక్తులను అలరించాయి. కొండ పైన ఘాట్ రోడ్డులో భక్తుల వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. హోం గార్డులు ట్రాఫిక్ను చక్కదిద్దారు. క్షేత్రంలో సాయంత్రం వరకూ భక్తుల రద్దీ కొనసాగింది. -
భక్తులకు సినిమా కష్టాలు
ఫ గేమ్ ఛేంజర్ షూటింగ్తో తిప్పలు ఫ వాడపల్లి క్షేత్రానికి చేరుకోలేక అవస్థలు ఫ కేవలం ద్విచక్ర వాహనాలకే అనుమతి ఆత్రేయపురం: అవును.. శ్రీవారి భక్తులకు సినిమా కష్టాలు ఎదురయ్యాయి. కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు శనివారం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రతి శనివారం రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 50 వేల నుంచి 60 వేల మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. అయితే శని, ఆదివారాల్లో సినీనటుడు రామ్చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్కు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో ఆత్రేయపురం మండలం పేరవరం పరిసర ప్రాంతాల్లో చిత్ర యూనిట్ షూటింగ్ చేసింది. దీంతో రాష్ట్రం నలుమూలల నుంచి వాడపల్లి వెంకన్న ఆలయానికి చేరుకునే భక్తుల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి బొబ్బర్లంక మీదుగా బైక్లకు తప్ప మిగతా కార్లు, ఇతర వాహనాలకు అనుమతి ఇవ్వలేదు. ధవళేశ్వరం నుంచి వేమగిరి, రావులపాలెం మీదుగా వాడపల్లికి పోలీసులు ట్రాఫిక్ మళ్లించారు. అలాగే విజ్జేశ్వరం, కొవ్వూరు తదితర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు వాడపల్లి చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో ఆర్టీసీ, ఇతర ప్రైవేట్ వాహనాలు ఈ రహదారిలో కాకుండా రావులపాలెం మీదుగా రాకపోకలు సాగించాయి. సినిమా షూటింగ్లకు అనుమతులు ఇచ్చే ముందు అధికారులు వాడపల్లికి చేరుకునే భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాల్సిందని పలువురు కోరారు. మరో రెండు రోజుల చిత్రీకరణ మండలంలోని పేరవరం ధనలక్ష్మీ దానవాయమ్మ ఆలయం వద్ద గేమ్ ఛేంజర్ చిత్రీకరణ జరిగింది. హీరో రామ్చరణ్, సునీల్, రఘు తదితరులతో దర్శకుడు శంకర్ గ్రామంలో రోడ్ల ఆక్రమణపై ఓ సన్నివేశాన్ని చిత్రీకరించారు. మరో రెండు రోజుల పాటు ఆత్రేయపురం పరిసర ప్రాంతాల్లో సినీ షూటింగ్ ఉంటుందని శంకర్ తెలిపారు. -
రాష్ట్ర స్థాయి టీటీ పోటీలు ప్రారంభం
పెద్దాపురం: రాష్ట్ర స్థాయి టెన్నిస్ ర్యాంకింగ్ టోర్నమెంట్ 2024 టీటీ పోటీలు పెద్దాపురం శ్రీప్రకాష్ సినర్జీ పాఠశాలలో శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఏపీ టీటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలను ఉద్దేశించి అసోసియేషన్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ సీహెచ్ విజయ్ప్రకాష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో క్రీడా ఆసక్తిని పెంపొందించాలన్నారు. రాష్ట్ర స్థాయిలో టీటీ పోటీలను శ్రీప్రకాష్ పాఠశాలలో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. కోచ్ వేణుగోపాల్ మాట్లాడుతూ ఈ పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 540 మంది క్రీడాకారులు వచ్చారన్నారు. మూడు రోజుల పాటు నిర్వహించే పోటీల్లో భాగంగా తొలిరోజు అండర్–11, 13, 15 విభాగాల్లో బాలుర, బాలికలు తలపడగా ఫైనల్కు ఎంపికలు చేశామన్నారు. కార్యక్రమంలో ఆయా జిల్లా టీటీ అంపైర్లు, పాఠశాల సిబ్బంది, క్రీడాకారులు పాల్గొన్నారు. -
నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.లక్ష విరాళం
ద్వారకాతిరుమల: స్థానిక శ్రీవారి ఆలయంలో నిత్యాన్నదాన ట్రస్టుకు ఓ భక్తుడు శనివారం రూ.లక్ష విరాళంగా అందజేశారు. పాలకొల్లుకు చెందిన రాయవరపు వెంకట సూర్యనారాయణ ముందుగా కుటుంబ సభ్యులతో కలసి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం ఈ విరాళాన్ని ఆలయ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా దాతకు ఆలయ సూపరింటెండెంట్ రమణరాజు విరాళం బాండ్ పత్రాన్ని ఇచ్చారు. వ్యాన్ బోల్తా: ఐదుగురికి గాయాలు జగ్గంపేట: మండలంలోని రామవరం వద్ద బొలేరా వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. ఆ వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా సూర్యాపేటకు చెందిన నిమ్మల లక్ష్మి, షేక్ నాగూర్మీరా, చిలకల రామలింగేశ్వరరావు, వట్టి నాగరాజులు వంట పనులు చేస్తుంటారు. తెలంగాణ నుంచి విశాఖ వైపు వెళుతున్న టూరిస్టు బస్లో ప్రయాణించే వారికి ఆహార పదార్థాలు వండి ఇచ్చేందుకు కాంటాక్టుకు కుదిరారు. ఈ నేపథ్యంలో టూరిస్టు బస్సు వెనకాలే వీరి వ్యాన్ ప్రయాణిస్తోంది. రామవరం వద్దకు వచ్చేసరికి ప్రమాదవశాత్తూ వ్యాన్ బోల్తా పడింది. దీంతో వ్యాన్లో ప్రయాణిస్తున్న ఐదుగురు గాయపడ్డారు. వీరిని జగ్గంపేట సీహెచ్కీ హైవే అంబులెన్స్లో తరలించి చికిత్స అందించారు. -
భూసారం.. పంటకు ఆధారం
సమీకృత సాగు.. బాగు సమీకృత సాగుతో అనేక లాభాలు పొందవచ్చు. ఈ విధానంపై రైతన్నలు దృష్టి సారించేలా వ్యవసాయ శాఖ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కాకినాడ జిల్లాలోని అన్ని మండలాల్లో సమీకృత వ్యవసాయంతో కలిగే లాభాలను శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు వివరిస్తున్నారు. ఒక ఎకరంలో ఫిష్కల్చర్, వరి, కోళ్లఫారం, కూరగాయలు పండించే విధంగా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. మెట్ట ప్రాంతంలో బోర్లు అందుబాటులో ఉన్న రైతులు వరికి బదులు రాగులు, కొర్రలు, జొన్న, మొక్కజొన్న, సజ్జలు సాగు చేసుకోవచ్చు. వరి పంట సుమారు 120 నుంచి 150 రోజులకు వస్తుంది. అదే చిరు ధాన్యాలు 90 రోజుల్లో పంట పూర్తయ్యి సంవత్సరానికి మూడు పంటలు వేసుకోవచ్చు. ఇలా ఎకరానికి పెట్టుబడి పోను రూ.50 వేల నుంచి రూ.60 వేల ఆదాయం ఆర్జించవచ్చు. అదే వరి సాగు చేస్తే రెండు సీజన్లలోనూ రూ.25 వేలు మిగులుతుంది. దీనిని దృష్టిలో రైతులు సమీకృత సాగుపై దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ అధికారులు వివరిస్తున్నారు. ఫ సమీకృత సాగు, పంట మార్పిడితో మేలైన దిగుబడులు ఫ చీడపీడల నుంచి రక్షణకు సరైన మార్గం ఫ ఎరువులు, మందుల ఖర్చు ఆదా బోట్క్లబ్ (కాకినాడ సిటీ): భూసారం... పంటకు ఆధారం. సాగులో మెళకువలతో భూమికి వస్తోంది పునరుజ్జీవం. పంట మార్పిడి విధానంతో సూక్ష్మ పోషకాలు వృద్ధి చెందుతాయి. తద్వారా నిత్య నూతనంగా పంటలకు అనుకూలంగా భూమి తయారవుతోంది. సమీకృత సాగు, పంట మార్పిడి విధానాలతో కలిగే లాభాలను వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. వీటిని ఆచరిస్తే మేలైన దిగుబడులతో పాటు చీడపీడలు, నష్ట నివారణ సాధ్యమని చెబుతున్నారు. పంట మార్పిడి.. భలే దిగుబడి సాగులో పంట మార్పిడి విధానంతో చీడపీడల సమస్యను అధిగమించవచ్చు. ఒక పంటను ఆశించే తెగుళ్లు రెండో పంటను ఆశించవు. ఈ విధానం ద్వారా ఏడాదికి రెండు, మూడు పంటలను వేస్తే, ఏదైనా ఒక పంటకు గిట్టుబాటు ధర లేకున్నా వేరే పంటల వల్ల లాభం పొందవచ్చు. వివిధ పంటల్లో వ్యవసాయ ఉత్పాదకతను పెంచుకోవచ్చు. రైతులంతా ఒకే రకమైన పంట వేయడం వల్ల చీడపీడల ఉధృతి అధికంగా ఉంటుంది. తద్వారా దిగుబడి తగ్గడమే కాక మార్కెట్లో గిట్టుబాటు ధర లభించదు. ఫ పంట మార్పిడితో సస్యరక్షణ కోసం వాడే పురుగు మందుల ఖర్చు తగ్గించవచ్చు. వేర్లు భూమిలో తక్కువ లోతుకు చొచ్చుకుపోయే పైర్లను పంట మార్పిడి చేయడం వల్ల భూమిలోని వివిధ పొరల్లో ఉన్న తేమ పోషకాలను సమర్థంగా వినియోగించుకుంటాయి. ఫ పత్తి వేసిన పొలంలో మిరప సాగుచేస్తే లాభసాటిగా ఉంటుంది. మిరప పంట వేసిన పొలంలో పత్తి సాగు చేస్తే పెట్టుబడులు తగ్గడంతో పాటు దిగుబడులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మిరప పంట సాగు చేయడానికి ముందు ఆ భూమిలో జనుమ, పిల్లి పెసర వంటి పంటలను సాగు చేసి, దాన్ని ట్రాక్టర్ ద్వారా తొక్కించిన తర్వాత సాగు చేస్తే భూసారం పెరిగి చీడపీడలు దరిచేరవు. పురుగులు ఉన్న ప్రాంతాల్లో టమోటా, బెండ, పెసర, మినుము పంటలు వేయరాదు. వాటిని వేస్తే పురుగులు మరింత అభివృద్ధి చెందుతాయి. ఫ పంట మార్పిడిలో భాగంగా నేలంతా పూర్తిగా కప్పే పంటలు ఎంపిక చేసుకోవాలి. వేరుశెనగ, బొబ్బర్లు, పెసర, మినుము పంటలను వేయడంతో నేలను పూర్తిగా కప్పి ఉంచుతాయి. దీనివల్ల కలుపు మొక్కలు అధికంగా రాకుండా నివారించవచ్చు. ఫ వరి పంట తర్వాత పప్పుధాన్యాల పంటలను కానీ నూనె గింజల పంటలను కానీ సాగు చేయడంతో తెగుళ్లు ఆశించకుండా ఉంటాయి. భూమిలో తేమ ఎక్కువ కాలం నిల్వచేసే శక్తి ఉన్నప్పుడు ఏడాదిలో రెండు పంటలు పండించుకోవచ్చు. ఫ తేలికపాటి నేలలు, ఎర్ర ఇసుక, తువ్వ నేలల్లో మిశ్రమ పంటలను సాగు చేసుకోవచ్చు. కంది పంటను సాగు చేయడం వల్ల నేలపై పైరు ఆకులు రాలి కుళ్లిపోవడంతో భూసారం వృద్ధి చెందుతుంది. అవగాహన కల్పిస్తున్నాం రైతులు సమీకృత వ్యవసాయం చేయాలని విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా ప్రోత్సాహం అందిస్తున్నాం. ఇప్పటికే ఐదారు మండలాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. పంట మార్పిడితో కలిగే లాభాలపై చైతన్యం తీసుకు వస్తున్నాం. ఇది రైతులకు లాభసాటిగా ఉంటోంది. – ఎన్.విజయ్కుమార్, జిల్లా వ్యవసాయశాఖాధికారి, కాకినాడ -
పెద్దాపురంలో చోరీ
పెద్దాపురం: ఓ ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని దుండగులు చొరబడి సుమారు పది కాసుల బంగారు ఆభరణాలు, రూ.రెండు లక్షల నగదు చోరీ చేశారు. శనివారం ఈ ఘటన పెద్దాపురం ప్లీడర్స్ వీధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక ప్లీడర్స్ వీధికి చెందిన నామా సతీష్ బంధువుల ఇంటికి వెళ్లగా, ఇదే అదునుగా భా వించిన గుర్తుతెలియని వ్యక్తులు సొత్తు చోరీకి పాల్పడ్డారు. సీఐ రవికుమార్, ఎస్ఐ వెలుగుల సురేష్లు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్ను రంగంలోకి దింపి విచారణ చేపట్టారు.
Pagination
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
Advertisement