-
ఆ మాట అనడంతో చిన్నబుచ్చుకుంది.. అన్నయ్యలా తెల్లగా అవుతానమ్మా..
చిన్నపిల్లలు ఎంతో సున్నిత మనస్కులు. కాస్త కోపంగా చూస్తేనే చిన్నబుచ్చుకుంటారు. అలాంటిది ఎవరైనా ఏమైనా అంటే అస్సలు తట్టుకోలేరు. కానీ కొందరు నోటికి ఎంతొస్తే అంత అనేస్తుంటారు. అలా బంధువు అన్న మాటలకు తన కూతురు నొచ్చుకుందని చెప్తోంది స్టార్ హీరో అక్షయ్ కుమార్ సతీమణి, నటి, రచయిత్రి ట్వింకిల్ ఖన్నా.శరీరం ట్యాన్ అవుతోందని..నా కూతురు నితార స్విమ్మింగ్ క్లాసులకు వెళ్లేది. కానీ ఓసారి సడన్గా క్లాసులకు వెళ్లడం మానేస్తానంది. ఎండలో ట్యాన్ అయిపోయి శరీరం నల్లగా అవుతోందని చెప్పింది. అన్నయ్య (ఆరవ్) ఎంత తెల్లగా ఉన్నాడో నేనూ అలాగే అవుతానని చెప్పింది. తనకలాంటి ఆలోచన రావడానికి కారణం.. మా బంధువే! నీ పాప చాలా క్యూట్గా ఉంది కానీ ఆమె ఆరవ్ అంత తెల్లగా లేదు అని తెలివితక్కువగా మాట్లాడింది. ఆ మాటలు నా కూతురు విని బాధపడింది.అది చదివాకే మార్పురంగు ముఖ్యం కాదని తనకెలా చెప్పాలా? అనుకున్నాను. ఫ్రిదా ఖలో బయోగ్రఫీని ఆమె చేతికిచ్చాను. ఖలో ఒక మెక్సికన్ పెయింటర్. మనిషి శరీరం, ఐడెంటిటీ, మరణం, వ్యక్తిత్వం.. ఇలా ఎన్నింటినో అందులో చర్చించింది. ఆ పుస్తకం చదివాక నితార ఆలోచనలో మార్పు వచ్చింది. తెలుపు అనేది లైట్ కలర్.. నా టీషర్ట్లాగా త్వరగా మురికిపడుతుంది. అదే బ్రౌన్.. కాస్త డార్క్ కలర్.. అంత ఈజీగా మురికిపడదు అని నితార ఫీలైంది అని ట్వింకిల్ ఖన్నా చెప్పుకొచ్చింది.చదవండి: నిన్ను టీవీలోనే చాలామంది చూశారు.. ఇంకా ఓటీటీలో కష్టమే అన్నారు -
అమెరికాలో విజయ్ దేవరకొండ క్రేజ్ చూశారా.. మామూలుగా లేదు!
కొత్త ఏడాదిలో ఫ్యామిలీ స్టార్తో హిట్ కొట్టిన టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ అతనికి జంటగా నటించింది. పరశురామ్ పెట్ల డైరెక్షన్లో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ప్రస్తుతం ఆయన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్లో నటిస్తున్నారు. అయితే తాజాగా మన యంగ్ హీరో విజయ్ దేవరకొండ అమెరికాలో సందడి చేశారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్నారు. విజయ్ను చూసిన అక్కడి అభిమానులు సెల్ఫీల కోసం పోటీపడ్డారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇది చూసిన అభిమానులు ఎక్కడికెళ్లినా విజయ్ క్రేజ్ వేరే లెవెల్ కామెంట్స్ చేస్తున్నారు.కాగా.. ప్రస్తుతం విజయ్- గౌతమ్ తిన్ననూరి కాంబోలో వస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ గూఢచారి పాత్రలో కనిపించనున్నాడు. అలాగే రవికిరణ్ కోలా డైరెక్షన్లో ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. వీటితో పాటు రాహుల్ సంకృత్యాన్తో ఓ భారీ ప్రాజెక్ట్లో నటిస్తున్నారు.Akkada ikkada clg oo mall oo kadhu raa idii US lo Ela mida padtunnaro chudandii adi ma @TheDeverakonda anna craze uuuu❤️🔥❤️🔥🔥#VijayDeverakonda pic.twitter.com/39FBZIfrF6— The Revanth (@Revanth__7) June 10, 2024Rowdy boy @TheDeverakonda receives overwhelming love and massive response from USA Telugu people-Women forum At ATA - USA! ❤️🔥😍#VijayDeverakonda #VD12 #TeluguFilmNagar pic.twitter.com/T3W7paaWPH— Telugu FilmNagar (@telugufilmnagar) June 10, 2024 -
తుఫాను హెచ్చరిక.. ఫస్ట్లుక్ చూశారా?
అల్లు రామకృష్ణ, సుహానా ముద్వారి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం తుఫాను హెచ్చరిక. జగదీష్ కె కె దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శ్రీ పాద క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్ కిషన్ అనాపు, రజనీకాంత్ ఎస్, సన్నీ బాన్సల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను సోమవారం విడుదల చేశారు.ఈ సందర్భంగా దర్శకుడు జగదీష్ కె.కె. మాట్లాడుతూ, "ఈరోజు మా 'తుఫాను హెచ్చరిక' మొదటి పోస్టర్ విడుదల చేశాం. ఇది ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్. ఒక అందమైన హిల్ స్టేషన్లో ఆహ్లాదంగా జీవించే అబ్బాయి జీవితంలో ఒక తుఫాను లాంటి విధ్వంసం జరిగితే, ఆ పరిస్థితులని ఎలా ఎదుర్కొన్నాడు? ఎలా విజయం సాధించాడు? అనేదే కథ.ఇలాంటి థ్రిల్లింగ్ సినిమాటిక్ విజన్కు మా నటీనటులు, టెక్నీషియన్స్ ప్రాణం పోశారు. ఆ ఆర్టిస్ట్స్ అందరు అతి తక్కువ ఉష్ణోగ్రతల్లో, వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అద్భుతంగా నటించారు. లంబసింగి, చింతపల్లి వంటి ప్రదేశాల్లో సరైన విజువల్ కోసం ఏడాది కాలం ఓపికగా వేచి ఉండి సరైన అందాలను చిత్రీకరించాము. షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మా చిత్రాన్ని త్వరలో విడుదల చేస్తాం" అని తెలిపారు. -
'నేను-కీర్తన' సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి: డైరెక్టర్ సాయి రాజేశ్
చిమటా రమేష్ బాబు హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తీస్తున్న సినిమా 'నేను కీర్తన'. ఈ మూవీలోని 'సీతాకోకై ఎగిరింది మనసే' పాట్ లిరికల్ వీడియోని 'బేబి' దర్శకుడు సాయి రాజేశ్ రిలీజ్ చేశారు. అలానే ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకున్నారు. ఈ మూవీలో రిషిత, మేఘన హీరోయిన్లుగా నటించారు. చిమటా లక్ష్మికుమారి నిర్మాతగా వ్యవహరించారు.(ఇదీ చదవండి: ప్రముఖ నటుడిపై పోక్సో కేసు.. నాలుగేళ్ల పాపతో దారుణంగా!)"ఎంతో బిజీ షెడ్యూల్లోనూ సమయాన్ని కేటాయించిన సాయి రాజేష్కు కృతజ్ఞతలు. త్వరలోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అని హీరో కమ్ డైరెక్టర్ చిమటా రమేష్ బాబు చెప్పారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. అవి ఏంటంటే?) -
ప్రముఖ నటుడిపై పోక్సో కేసు.. నాలుగేళ్ల పాపతో దారుణంగా!
మలయాళీ ప్రముఖ నటుడు కూటికల్ జయచంద్రన్ పోక్సో కేసులో ఇరుక్కున్నాడు. తన నాలుగేళ్ల కూతురిని ఈ నటుడు లైంగికంగా వేధించాడని ఓ మహిళ.. కోజికొడ్లోని కసాబా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అలానే దీని నుంచి తప్పించుకునేందుకు మరో విషయం తెరపైకి తీసుకొచ్చాడని సదరు మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. అవి ఏంటంటే?)మరోవైపు పోలీసులు.. ఇప్పటికే నాలుగేళ్ల చిన్నారి దగ్గరకెళ్లి ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. అయితే ఆ చిన్నారి ఏం చెప్పింది అనే విషయాల్ని మాత్రం బయటపెట్టలేదు. అలానే నటుడు జయచంద్రన్ని అరెస్ట్ చేశారా లేదా అనేది కూడా తెలిసి రావట్లేదు. టీవీ ప్రోగ్రామ్స్, స్టేజీ ఫెర్ఫార్మెన్స్లతో గుర్తింపు తెచ్చుకున్న జయచంద్రన్.. రీసెంట్ టైంలో అయితే 'దృశ్యం 2' సినిమాలో నటించాడు.(ఇదీ చదవండి: అనుమానాస్పద రీతిలో నటి మృతి.. పట్టించుకోని కుటుంబ సభ్యులు) -
కేజీఎఫ్ హీరో సూపర్ హిట్ చిత్రం.. తెలుగులో రిలీజ్ ఎప్పుడంటే?
కేజీఎఫ్ హీరో యశ్, షీనా జంటగా నటిస్తోన్న చిత్రం రాజధాని రౌడీ. ఈ సినిమా కేవీ రాజు దర్శకత్వంలో తెరకెక్కించారు. డ్రగ్స్ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్బస్టర్గా నిలిచింది. సంతోష్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సంతోశ్ కుమార్ మంచి సందేశం ఇచ్చేలా ఈ మూవీని నిర్మించారు. తాజాగా ఈ సినిమా ఈనెల 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా మూవీ నిర్మాత సంతోష్ కుమార్ మీడియాతో మాట్లాడారు.సంతోష్ కుమార్ మాట్లాడుతూ..'మాదకద్రవ్యాలు, మద్యపానంతో నలుగురు యువకులు తమ జీవితాల్ని ఎలా నాశనం చేసుకున్నారు అనే కథే రాజధాని రౌడీ చిత్రం. వినోదానికి, సందేశాన్ని జోడించి రూపొందించిన చిత్రమిది. చెడు పరిణామాలను ఎత్తి చూపుతూ, ఆలోచన రేకెత్తించే ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ పోలీస్ ఆఫీసర్గా అద్భుతమైన నటన ప్రదర్శించారు. ముమైత్ ఖాన్ తన అందాలతో కనువిందుచేస్తారు. అర్జున్ జన్య అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇలాంటి మంచి చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. తెలుగు ప్రేక్షకులందరు ఈ చిత్రాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నా' అని అన్నారు. -
నిన్ను టీవీలోనే చాలామంది చూశారు.. ఇంకా ఓటీటీలో కష్టమే అన్నారు
కొన్ని పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలా కసౌటీ జిందగీ కే సీరియల్లో కోమలిక అనే నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించి గుర్తింపు పొందింది ఊర్వశి ఢోలకియా. ఈ సీరియల్ వచ్చి దాదాపు 15 ఏళ్లవుతున్నా ఇప్పటికీ ఆమెను కోమలికగానే ప్రేక్షకులు గుర్తుపెట్టుకున్నారు. తాజాగా ఆమె దీని గురించి మాట్లాడుతూ.. 'ఇప్పటికీ జనాలు నన్ను కోమలిక అనే పిలుస్తారు. ఆ ఒక్క పాత్రను మాత్రమే గుర్తుపెట్టుకున్నారంటే నేను వేరే సీరియల్స్ ఏమీ చేయలేనని కాదు! నా విషయంలో దర్శకులు, నిర్మాతల క్రియేటివిటీ ఏమైపోయిందోనని అర్థం! ఇకపై అలాంటివి చేయనుఎన్నో పాత్రలు పోషించాను కానీ వాటికంత గుర్తింపు రాకుండా పోయింది. ఒకే రకమైన పాత్రలు చేసి బోర్ కొడుతోంది. ఇకపై నెగెటివ్ రోల్స్ చేయను. ప్రస్తుతం న్యాయవాదిగా పాజిటివ్ రోల్ చేస్తున్నాను. అందుకు సంతోషంగా ఉంది. ఇక మీదట కూడా ఇలాంటివే చేయాలనుంది. ప్రేక్షకులు ఊహించని పాత్రల్లో కనిపించాలనుంది. ఓటీటీల విషయానికి వస్తే ఇప్పుడు దానికి చాలా క్రేజ్ ఉంది. కానీ గతేడాది ఈ ప్లాట్ఫామ్లో నన్ను తిరస్కరించారు. ఓటీటీలు నన్ను పక్కన పెట్టేశాయినిన్ను టీవీలోనే చాలామంది చూసేశారు.. అని ఛాన్స్ ఇవ్వకుండా పక్కన పెట్టేశారు. అసలు ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లో టీవీ సెలబ్రిటీలే లేరా? అంతటా ఉన్నారు.. మరి ఎందుకని నన్ను అలా చిన్నచూపు చూశారని బాధేసింది. అయినా నాకు ఓటీటీల నుంచి ఎటువంటి మంచి ఛాన్సులు రావడం లేదు' అని చెప్పుకొచ్చింది. కాగా ఊర్వశి ప్రస్తుతం పుష్ప ఇంపాజిబుల్ అనే సీరియల్ చేస్తోంది. అందులో లాయర్ దేవి సింగ్ శిఖావత్గా నటిస్తోంది. చదవండి: ఆ డైరెక్టర్ నన్ను పనిమనిషిలా చూశాడు.. అందరిముందు.. -
రామ్తో రూపాయి బిజినెస్ కూడా ఉండేది కాదు: టాలీవుడ్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ హీరో రామ్పై నిర్మాత వైవీఎస్ చౌదరి సంచలన కామెంట్స్ చేశారు. రామ్కు ఇండస్ట్రీలో పెద్దగా మార్కెట్ ఉండేది కాదని అన్నారు. అతనితో కలిసి నిర్మించిన దేవదాసు చిత్రానికి నాలుగు వారాల పాటు ప్రేక్షకులే రాలేదని వెల్లడించారు. సినిమాను ప్రొడ్యూస్ చేయటం అంత ఈజీ కాదని.. రామ్పై ఒక్క రూపాయి కూడా స్కేలబిలీటీ ఉండదని షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో వైవీఎస్ చౌదరి మాట్లాడారు.వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ..'దేవదాసు సినిమా రిలీజ్ రోజునే రూ.10 కోట్లు పోయాయి అన్నారు. నా ఆస్తులన్నీ స్టేక్లో ఉన్నాయి. నాలుగు వారాల వరకు జనాలు లేరు. కానీ నేను బ్రహ్మండగా జనాలు ఉన్నారని మైకుల్లో మాట్లాడా. ఇదే నిజం. నేను శాటిలైట్స్ తక్కువ రేట్కే అమ్మాను. నా విజయాలు అంత ఈజీగా రాలేదు. జనవరి 11న దేవదాసు రిలీజైంది. ఆ తర్వాత 12వ తేదీనే స్టైల్ సినిమా రిలీజైంది. చిరంజీవి, లారెన్స్ ఆ దెబ్బకు నా సినిమా కుదేలైంది.' అన్నారుసంక్రాంతి సీజన్లో లవ్ స్టోరీలు సినిమాలు చూడరు. ఆ వైపు అస్సలు వెళ్లరు. 13న చుక్కల్లో చంద్రుడు, లక్ష్మి సినిమాలు రిలీజ్. నా సినిమాకు థియేటర్ల వద్ద జనాలే లేరు. ఇక 14వ తేదీకల్లా జీ టీవీకి ముందు అనుకున్న దానికంటే తక్కువ ధరకే శాటిలైట్ రైట్స్ అమ్ముకున్నా. డబ్బులు పెట్టుకుని తిరిగితే నాలుగు వారాల తర్వాత నా సినిమాకు సక్సెస్ వచ్చింది. ఆ తర్వాత 17 సెంటర్లలో 175 డేస్ ఆడింది. ఇక్కడ రామ్ను నేను తక్కువ చేయడం లేదు.' అని అన్నారు. ప్రస్తుతం వైవీఎస్ చౌదరి నందమూరి జానకి రామ్ కుమారుడిని హీరోగా పరిచయం చేయనున్నారు.కాగా.. రామ్ పోతినేని ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాను పూరి జగన్నాధ్ తెరకెక్కించనున్నారు. 2006లో రామ్, వైవీఎస్ చౌదరి కాంబోలో వచ్చిన దేవదాసు చిత్రం బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ హిట్గా నిలిచింది. ఈ సినిమాలో ఇలియానా నటించారు. -
మా నాన్న చేసింది తప్పే.. రవిబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
తెలుగులో కొందరు నటులు అప్పుడప్పుడు నోరు జారేస్తుంటారు. హీరో బాలకృష్ణ ఇలా చాలాసార్లు టంగ్ స్లిప్ అయి బుక్కైపోయాడు. అయితే సీనియర్ నటుడు చలపతి రావు కూడా గతంలో ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ అమ్మాయిల గురించి దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రశ్నకు బదులిస్తూ 'పక్కలోకి వస్తారు' అని ఏదేదో వాగారు. అప్పట్లో ఇది పెద్ద వివాదమైంది. ఆ తర్వాత ఆయన క్షమాపణ కూడా చెప్పారు. దీని గురించి ఇన్నాళ్ల తర్వాత ఆయన కొడుకు దర్శకనటుడు రవిబాబు స్పందించాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. అవి ఏంటంటే?)'మా నాన్న చేసిన ఆ కామెంట్స్ గురించి ఇంతవరకు నేను ఎక్కడా స్పందించలేదు. కానీ నేను ఇదివరకే మాట్లాడినట్లు ఎవరో ఫేక్ థంబ్ నెయిల్స్ పెట్టి యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నారు. నిజానికి నేను ఆ టాపిక్ గురించి నాన్నతో అస్సలు మాట్లాడలేదు. అలానే బయట మీడియాతో కూడా అస్సలు మాట్లాడలేదు. కానీ నాన్నతో మాత్రం దీని గురించి.. 'మీరు మాట్లాడిన ఈ మాట కొందరిని నొప్పించి ఉంటే వాళ్లకు సారీ చెప్పడం మీ బాధ్యత అది మీకే వదిలేస్తున్నా' అని అన్నాను. ఆ తర్వాత ఆయన క్షమాపణలు చెప్పారు. ఎందుకంటే మనందరం ఎప్పుడో ఓసారి నోరు జారుతుంటాం. లూజ్గా మాట్లాడేస్తుంటాం. కానీ వాటిని గుర్తించి సారీ చెప్పడం సంస్కారం. మా నాన్న మీడియా ముందు టంగ్ స్లిప్ అవ్వడం ఆయన బ్యాడ్ లక్. సారీ చెప్పేశారు కాబట్టి ఆ టాపిక్ అక్కడితో అయిపోయింది.ఇకపోతే రవిబాబు విషయానికొస్తే.. తండ్రిలానే తొలుత నటుడిగా కెరీర్ ప్రారంభించాడు. కానీ 'అల్లరి' సినిమాతో దర్శకుడిగా మారాడు. అలా అప్పుడప్పుడు సినిమాలు తీస్తూ, నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్గా విజయ్ దేవరకొండ 'ద ఫ్యామిలీ స్టార్'లో విలన్గా చేశాడు. తాజాగా 'రష్' అనే మూవీతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు. ఈ క్రమంలోనే ఇంటర్వ్యూలు ఇస్తూ తన వ్యక్తిగత విషయాలపై క్లారిటీ ఇచ్చేస్తున్నాడు.(ఇదీ చదవండి: అనుమానాస్పద రీతిలో నటి మృతి.. పట్టించుకోని కుటుంబ సభ్యులు) -
కొత్త డైరెక్టర్స్కు వర్మ పరీక్ష.. ఎంపికైన వారి లిస్ట్ ఇదే
టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కొన్నేళ్ల క్రితం హైదరాబాద్లో RGV డెన్ను నిర్మించారు. అక్కడి నుంచే సినిమా కార్యక్రమాలను ఆయన చూస్తూ ఉంటారు. అయితే కొద్దిరోజుల క్రితం ఆయన డెన్ నుంచి ఒక ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టాలని చాలామందికి కోరిక ఉంటుంది. అలాంటి వారికి ఆర్జీవీ డెన్ గతంలోనే ఒక ప్రకటన జారీ చేసింది. ఇందులో ఆసక్తి ఉన్న డైరెక్టర్స్,రైటర్స్, మ్యూజిక్ కంపోజర్స్ కావాలంటూ వర్మ ట్వీట్ ద్వారా తెలిపారు. అయితే తాజాగా వర్మ తన డెన్లోకి అడుగుబెట్టబోయే వారి లిస్ట్ను ప్రకటించారు.డైరెక్టర్స్గా వర్మ డెన్లో అడుగుబెట్టాలని 419 మంది తన వెబ్సైట్ (https://rgvden.com/) ద్వారా నమోదు చేసుకుంటే అందులో 11 మందిని సెలక్ట్ చేసి వారి పేర్లను వెబ్సైట్లో పొందుపరిచారు. వీరందరూ జూన్ 14న హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్కు రావాలని ఆయన తెలిపారు. ఇదే క్రమంలో మ్యూజిక్ డైరెక్టర్స్గా 9మంది ఎంపికయ్యారని చెప్పారు. అయితే, వీరిలో ఒక్కరు మాత్రమే ఫైనల్ అవుతారని, వారిని కూడా ఎలా ఎంపిక చేస్తారు అనేది వెబ్సైట్లో తెలిపారు. వర్మ డెన్కు ఎంపిక అయిన వారందరీ ఇన్స్టాగ్రామ్ ఖాతాలను కూడా వారి పేరు పక్కన చేర్చడం విశేషం. వివరాల కోసం ఈ వెబ్సైట్లో https://rgvden.com/ చూడగలరు -
బాలకృష్ణ-బాబీ కొత్త సినిమా గ్లింప్స్ విడుదల
నందమూరి బాలకృష్ణ- యంగ్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్లో NBK 109 పేరుతో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆ ప్రాజెక్ట్ నుంచి బాలయ్య బర్త్డే గ్లింప్స్ను మేకర్స్ రిలీజ్ చేశారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ బ్యానర్స్ నుంచి నాగవంశీ, సౌజన్య ఈ ప్రాజెక్ట్ను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్గా నటిస్తున్నాడు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా థమన్ ఉన్నారు. గతేడాది మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య చిత్రంతో డైరెక్టర్ బాబీ హిట్ కొట్టాడు. అందులో స్పెషల్ సాంగ్లో మెరిసిన ఊర్వశి రౌటేలాకు డైరెక్టర్ బాబీ మరో ఛాన్స్ ఇచ్చాడు. NBK 109 చిత్రంలో ఆమె కూడా ఒక స్పెషల్ సాంగ్లో మెరవనుంది. చాందిని చౌదరి కూడా ఇందులో కీలక పాత్రలో నటిస్తుంది. -
ఆ డైరెక్టర్ నన్ను పనిమనిషిలా చూశాడు.. అందరిముందు..
మలయాళ దర్శకుడు రథీశ్ బాలకృష్ణ తనను మొదటినుంచీ ఇబ్బందిపెడుతూనే ఉన్నాడంది కాస్ట్యూమ్ డిజైనర్ లిజి ప్రేమన్. తనను ఒక ఆర్టిస్టుగా కాకుండా పనిమనిషిగా చూశాడని వాపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో లిజి మాట్లాడుతూ.. సురేశంతియం సుమలతయుదేయమ్: హృదయహరియయ ప్రణయకథ అనే సినిమాకు నేను కాస్ట్యూమ్ డిజైనర్గా పని చేశాను. 35రోజులు పని ఉంటుందన్నారు. అందుకుగానూ రెండున్నర లక్షలు అడిగాను. సరేనంటూ లక్ష రూపాయలు అడ్వాన్స్గా ఇచ్చారు. ఎన్నో ఇబ్బందులు..ఈ సినిమా ప్రీపొడక్షన్ దగ్గరి నుంచి షూటింగ్ వరకు దాదాపు 110 రోజులు పని చేశాను. ఈ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ముఖ్యంగా ఈ సినిమా డైరెక్టర్ రథీశ్కు ఇగో ఎక్కువ. నన్ను ఒక పనిమనిషిలా చూశాడు. అతడి ప్రవర్తన నాకు ఏమాత్రం నచ్చలేదు. అందరిముందు చులకన చేసి మాట్లాడేవాడు. ఆయన వల్ల ఎంతో మానసిక వేదన అనుభవించాను. తన టార్చర్ భరించలేక చివర్లో ఈ ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చేశాను. నాకు క్రెడిట్ ఇవ్వలేదుతీరా చూస్తే సినిమా క్రెడిట్స్లో నా పేరు వేయలేదు. అసిస్టెంట్ అని రాశారు. కాస్ట్యూమ్ డిజైనర్గా మరో వ్యక్తికి క్రెడిట్ ఇచ్చారు. ఇది నన్ను అవమానించడం కాకపోతే ఇంకేమవుతుంది. పైగా నాకు ఇవ్వాల్సిన డబ్బు పూర్తిగా ముట్టజెప్పలేదు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న నాపై ఇలా కక్ష సాధింపు చర్యలు చేపట్టిన వారిని ఊరికే వదిలిపెట్టను. నా వల్ల సినిమాకు ఇబ్బంది ఉండకూడదనే రిలీజ్ అయ్యేవరకు ఆగాను. ఓటీటీలో అయినా..ఇప్పుడు న్యాయపోరాటం చేస్తాను. కనీసం ఓటీటీలో విడుదల చేసేటప్పుడైనా కాస్ట్యూమ్ డిజైనర్గా సినిమాలో నా పేరు వేయాలని డిమాండ్ చేస్తున్నాను. అలాగే నా పట్ల దురుసుగా ప్రవర్తించినందుకుగానూ డైరెక్టర్ నాకు సారీ చెప్పాలి. మానసిక వేధింపులకు గురి చేసినందుకు పరిహారం చెల్లించాలి. నాలాంటి పరిస్థితి మరెవరికీ రాకూడదు అని లిజి పేర్కొంది.చదవండి: గుడిలో కమెడియన్ పెళ్లి.. వధువు బ్యాక్గ్రౌండ్ ఇదే! -
అనుమానాస్పద రీతిలో నటి మృతి.. పట్టించుకోని కుటుంబ సభ్యులు
ప్రముఖ యువ నటి నూర్ మాళబిక (32) అనుమానాస్పద రీతిలో శవమై కనిపించింది. ముంబయిలో ఓ అద్దె ఇంట్లో ఉంటున్న ఈమె ఫ్యాన్కి ఉరి వేసుకుని ప్రాణాలు వదిలేసింది. అయితే నూర్ బాడీ కుళ్లిన స్థితిలో ఉన్నప్పుడు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. నూర్ కుటుంబ సభ్యులు కనీసం ఈమెని చూడటానికి కూడా రాలేదు. ఇప్పుడిదే పలు అనుమానాలకు తావిస్తోంది.అసోంకి చెందిన నూర్ మాళవిక.. ఎయిర్ హోస్టెస్గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత నటనపై ఆసక్తితో పలు అడల్ట్ సిరీస్, సినిమాల్లో నటించింది. కానీ గతేడాది 'ద ట్రయల్' వెబ్ సిరీసులో నటించి మంచిగానే గుర్తింపు తెచ్చుకుంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. అవి ఏంటంటే?)ఏమైందో ఏమో మరి ముంబయిలోని ఈమె ఉంటున్న ఇంట్లోనే ఉరి వేసుకుని చనిపోయింది. కానీ ఈమె బాడీ నుంచి దుర్వాసన రావడంతో అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు సమాచారమిచ్చారు. వాళ్లు శవాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. ఇది ఆత్మహత్య అని అనుమానపడుతున్నారు.నూర్ చనిపోవడానికి రెండు వారాల ముందే కుటుంబ సభ్యులు.. ముంబయిలోని ఈమె ఇంటికి వచ్చి వెళ్లారు. ఇప్పుడు ఈమె చనిపోయిన తర్వాత పోలీసులు వాళ్లకు ఫోన్ చేసి బాడీని తీసుకెళ్లమని చెబితే పట్టించుకోలేదు. దీంతో ఓ ఎన్జీవో ఆధ్వర్యంలో ఈమె అంత్యక్రియలు నిర్వహించారు. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులతో గొడవ పడిన తర్వాతే నూర్ చనిపోవడం కాస్త డౌట్ అనిపిస్తోంది.(ఇదీ చదవండి: నటి ఇంట్లో చోరీ.. 10 తులాల బంగారం, డబ్బు దొంగతనం) -
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. అవి ఏంటంటే?
ఎప్పటిలానే మరో వారం వచ్చేసింది. కాకపోతే ఈసారి థియేటర్లలో చిన్న చిత్రాలే రిలీజ్ కానున్నాయి. వీటిలో యేవమ్, మ్యూజిక్ షాప్ మూర్తి, హరోంహర తదితర మూవీస్ ఉన్నాయి. వీటిపై పెద్దగా బజ్ లేదు. మరోవైపు ఓటీటీలో మాత్రం పలు క్రేజీ సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో తెలుగువి కూడా ఎక్కువగానే ఉన్నాయి. దీంతో ప్రేక్షకుల వీటిపై ఆసక్తి కనబరుస్తున్నారు.(ఇదీ చదవండి: Pihu Review: ఓటీటీలోనే బెస్ట్ చైల్డ్ మూవీ.. కానీ చూస్తే భయపడతారు!)ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ విషయానికొస్తే.. 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి', 'పారిజాతపర్వం' సినిమాలతో పాటు 'పరువు' అనే తెలుగు సిరీస్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. వీటితో పాటు 'మహారాజ' మూవీ, 'ద బాయ్స్' సిరీస్ ఉన్నంతలో కాస్త ఆసక్తి రేపుతున్నాయి. మరి ఓవరాల్గా ఎన్ని మూవీస్ ఏయే ఓటీటీల్లోకి రాబోతున్నాయనేది ఇప్పుడు చూద్దాం.ఓటీటీల్లో ఈ వారం రిలీజయ్యే మూవీస్ లిస్ట్ (జూన్ 10- 16 వరకు)నెట్ఫ్లిక్స్టూర్ డే ఫ్రాన్స్ అన్ చైన్డ్ సీజన్ 2 (ఫ్రెంచ్ సిరీస్) - జూన్ 11కింగ్ ఆఫ్ కలెక్టబుల్స్ ద గోల్డిన్ టచ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 12మై నెక్స్ట్ గెస్ట్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 12మిస్టరీస్ ఆఫ్ ద టెర్రకోటా వారియర్స్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 12బిడ్జర్టన్ సీజన్ 3 పార్ట్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 13డాక్టర్ క్లైమాక్స్ (థాయ్ సిరీస్) - జూన్ 13అబంగ్ అధిక్ (మాండరిన్ సినిమా) - జూన్ 14గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (తెలుగు మూవీ) - జూన్ 14జోకో అన్వర్స్ నైట్ మేర్స్ అండ్ డే డ్రీమ్స్ (ఇండోనేసియన్ సిరీస్) - జూన్ 14మహారాజ్ (హిందీ సినిమా) - జూన్ 14హాట్స్టార్ప్రొటెక్టింగ్ ప్యారడైజ్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 10ద కలర్ ఆఫ్ విక్టరీ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 10నాట్ డెడ్ యెట్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 12జియో సినిమాఘాంత్ చాప్టర్ 1 (హిందీ సిరీస్) - జూన్ 11అమెజాన్ ప్రైమ్గ్రౌండ్ (తెలుగు సినిమా) - జూన్ 10ద బాయ్స్ సీజన్ 4 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 13ఆహాపారిజాత పర్వం (తెలుగు సినిమా) - జూన్ 12కురంగు పెడల్ (తమిళ సిరీస్) - జూన్ 14ఆపిల్ ప్లస్ టీవీప్రెజూమ్డ్ ఇన్నోసెంట్ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 12క్యాంప్ స్నూపీ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 14జీ5లవ్ కీ అరేంజ్ మ్యారేజ్ (హిందీ సినిమా) - జూన్ 14పరువు (తెలుగు సిరీస్) - జూన్ 14(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) -
స్టార్ హీరో పేరు చెప్పి మోసం.. టాలీవుడ్ హీరోయిన్పై ఫిర్యాదు
షో స్టాపర్.. ఈ సిరీస్ ప్రకటించి రెండేళ్లవుతున్నా ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. ఆ మధ్య ఈ సిరీస్ను అటకెక్కించారని ప్రచారం జరిగితే అదంతా అబద్ధమని దర్శకనిర్మాత మనీశ్ హరిశంకర్ పేర్కొన్నాడు. డబ్బింగ్ పూర్తయిందని, నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపాడు. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామన్నాడు. జీనత్ అమన్, జరీనా వాహబ్, శ్వేత తివారి, దిగంగన సూర్యవంశీ, సౌరభ్ రాజ్ జైన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రగల్భాలు పలికి..ఈ క్రమంలో హీరోయిన్ దిగంగన సూర్యవంశీపై నిర్మాత మనీశ్ హరిశంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల ప్రకారం.. షో స్టాపర్ ప్రాజెక్ట్ కోసం హీరో అక్షయ్ కుమార్తో పాటు అతడి నిర్మాణ కంపెనీని ఈ సిరీస్ సమర్పకులుగా వ్యవహరించేందుకు ఒప్పిస్తానని దిగంగన ప్రగల్భాలు పలికింది. తనకు అక్షయ్ కుమార్, షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి స్టార్స్తో పరిచయాలు ఉన్నాయని, ఈ ప్రాజెక్టులో వారిని కూడా భాగం చేస్తానని నమ్మించింది. పెద్దమొత్తంలో డబ్బు గుంజిఅలా అక్షయ్ కుమార్ను రప్పిస్తానని చెప్పి తమ నుంచి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసి చివరకు మోసం చేసిందని ఎమ్హెచ్ ఫిలింస్ బ్యానర్ ఆరోపిస్తోంది. తన డిమాండ్లు నెరవేర్చకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హరిశంకర్ను బెదిరించిందని అతడి అడ్వకేట్ ఫాల్గుని బ్రాహ్మభట్ తెలిపారు. అలాగే ప్రాజెక్టు ఆగిపోయిందని, పేమెంట్స్ ఇవ్వడం లేదని ఆరోపణలు చేసి తమ బ్యానర్ ప్రతిష్ట దిగజార్చారంటూ నటుడు రాకేశ్ బేడీ, దిగంగన సూర్యవంశీ ఫ్యాషన్ డిజైనర్ కృష్ణన్ పార్మర్పైనా నిర్మాత పరువు నష్టం దావా వేశారు. కాగా దిగంగన తెలుగులో హిప్పి, వలయం, సిటీమార్, క్రేజీఫెలో వంటి చిత్రాల్లో హీరోయిన్గా నటించింది.చదవండి: ప్రియుడితో సినీ నటి ప్లాన్.. స్నేహితురాలిని బర్త్డే పార్టీకి పిలిచి ఆపై.. -
వెండితెరపై కనిపించనున్న మరో ఎన్టీఆర్
సీతారామరాజు, సీతారాముల కళ్యాణం చూతము రారండి, యువరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు’ వంటి చిత్రాలతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు వైవీఎస్ చౌదరి. తెలుగుదనం ఉట్టిపడేలా విభిన్న కథలతో సినిమాలు రూపొందించిన ఆయన కొంతకాలం బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడు నందమూరి నాలుగో తరం నుంచి ఒకరిని వెండితెరకు ఆయన పరిచయం చేయనున్నాడు. ఈ విషయం గురించి వైవీఎస్ చౌదరి తాజాగా అధికారికంగా ప్రకటన చేశారు.స్వర్గీయ హరికృష్ణ గారి మనమడిని హీరోగా పరిచయం చేస్తున్నట్లు వైవీఎస్ చౌదరి ప్రకటించారు. హరికృష్ణ పెద్ద కుమారుడు స్వర్గీయ జానకీ రామ్ అబ్బాయి 'తారక రామారావు'ను ఇండస్ట్రీకి పరిచయం చేసే అవకాశం తనకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన అన్నారు. తన తాతగారి పేరుతో నాలుగో తరం నట వారసుడిగా తారక రామారావు ఎంట్రీ ఇవ్వనున్నాడు. న్యూ టాలెంట్ రోర్స్ బ్యానర్లో యలమంచిలి గీత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పిల్లలతో రూపొందిన పౌరాణిక చిత్రం ‘దానవీర శూర కర్ణ’లో కృష్ణుడి పాత్రలో బాల నటుడిగా తారక రామారావు నటించాడు.వైవీఎస్ చౌదరి సినీ కెరీర్లో మంచి హిట్స్ ఇచ్చి గుర్తింపు తెచ్చుకున్నారు. 2015లో సాయి ధుర్గ తేజ్ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఆయనే నిర్మాతగా 'రేయ్' సినిమాను డైరెక్ట్ చేశారు. ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో మెప్పించలేదు. ఆ తర్వాత ఆయన నుంచి సినిమా రాలేదు. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత నందమూరి వారసుడి సినిమాతో మళ్లీ ఆయన మెగా ఫోన్ పట్టబోతున్నారు.Director #YVSChowdary along with #YalamanchiliGeetha visited #NTRGhat and paid their respects to the Legendary NTR garu and took the blessings for their Production NO-1 under NEW TALENT ROARS@ ✨@HelloYvs @NewTalentRoars pic.twitter.com/MeEJvwnR4N— BA Raju's Team (@baraju_SuperHit) June 10, 2024 -
మోదీ ప్రమాణస్వీకారం.. అంబానీ, షారుక్ ఫోటో వైరల్
భారత ప్రధానిగా నరేంద్ర దామోదర్ దాస్ మోదీ వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టారు. జూన్ 9న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన మోదీ ప్రమాణ స్వీకారోత్సవం కన్నులపండువగా జరిగింది. రాజకీయ, సినీ, పారిశ్రామిక ప్రముఖులు.. ఇలా ఎందరో ఈ వేడుకలో తళుక్కుమని మెరిశారు. వారిలో బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్.. పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ఉన్నారు. ఓఆర్ఎస్ తాగుతూ..పక్కపక్కనే కూర్చున్న వీళ్లిద్దరూ ఓఆర్ఎస్ డ్రింక్తో దర్శనమిచ్చారు. ఇంకేముంది.. వారిని క్లిక్మనిపించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఎంతో ధనవంతులైన వీరు ఖరీదైన డ్రింక్స్కు బదులుగా దాదాపు రూ.30 ఉంటే ఓఆర్ఎస్ డ్రింక్ తాగుతున్నారని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఇదే బెటర్'సోడా సహా ఇతర డ్రింక్స్ కంటే ఇదే నయం.. ఇప్పుడున్న వాతావరణానికి ఓఆర్ఎస్ తాగితేనే బెటర్. పైగా ఈ మధ్యే షారూఖ్కు వడదెబ్బ తగిలింది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిదే', 'హే.. ఈరోజు నేను కూడా ఇదే ఓఆర్ఎస్ తాగాను' అని రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కాగా గత నెల షారూఖ్ వడదెబ్బ కారణంగా అహ్మదాబాద్ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే! ORS 👍 pic.twitter.com/C24eNG6UYx— sonal. (@sonaluwu) June 9, 2024 HQ pictures of Shah Rukh Khan & Mukesh Ambani at Rashtrapati Bhavan earlier today for PM Narendra Modi's Oath Ceremony ♥️#ShahRukhKhan pic.twitter.com/HlUE9lV7PU— Shah Rukh Khan Warriors FAN Club (@TeamSRKWarriors) June 9, 2024చదవండి: నిర్మాతగా బాలకృష్ణ కూతురు.. సినిమా ప్రకటించిన బోయపాటి -
గుడిలో కమెడియన్ పెళ్లి.. వధువు బ్యాక్గ్రౌండ్ ఇదే!
ప్రముఖ తమిళ దర్శకుడు గంగై అమరన్ రెండో కుమారుడు, నటుడు ప్రేమ్జీ 45 ఏళ్ల వయసులో పెళ్లి పీటలెక్కాడు. తిరుత్తణి మురుగన్ సాక్షిగా తన ప్రేమికురాలు ఇందు మెడలో మూడు ముళ్లు వేశాడు. ఆదివారం (జూన్ 9న) నిరాడంబరంగా జరిగిన వివాహ వేడుకల్లో అత్యంత సన్నిహితులు, బంధుమిత్రులు పాల్గొని, నూతన వధూవరులను ఆశీర్వదించారు. కాగా ప్రేమ్జీ.. సేలం నగరానికి చెందిన బ్యాంకు ఉద్యోగి ఇందును కొన్నేళ్లగా ప్రేమిస్తూ వచ్చాడు. గుడిలో సింపుల్గా పెళ్లివీరి ప్రేమకు ఇరుకుటుంబాలు పచ్చజెండా ఊపాయి. ఈ క్రమంలో ఆదివారం నాడు తమిళనాడు తిరువళ్లూరులోని తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి సాక్షిగా వివాహం చేసుకున్నారు. ఈ వేడుకకు సినీ తారలు రావడంతో తిరుత్తణి ఆలయంలో సందడి నెలకొంది. వారిని చూసేందుకు, సెల్పీ దిగేందుకు భక్తులు ఆసక్తి చూపారు. గంగై అమవరన్, అతడి పెద్ద కుమారుడు, సినీ దర్శకుడు వెంకట్ప్రభు సమక్షంలో హిందూ సంప్రదాయ పద్ధతిలో ఈ పెళ్లి జరిగింది. కమెడియన్ ప్రేమ్జీ పెళ్లి ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండిపీటలపై ప్రియురాలికి ముద్దుతన ప్రేమికురాలు జీవిత భాగస్వామి కావడంతో ప్రేమ్జీ పెళ్లిపీటలపైనే ఇందును ముద్దాడి తన ఆనందాన్ని పంచుకున్నాడు. అనంతరం నూతన దంపతులు సుబ్రహ్మణ్యస్వామిని దర్శించుకుని, స్వామివారి ఆశీస్సులు పొందారు. వివాహ వేడుకల్లో సినీ నటులు శివ, జయ్, వైభవ్, సంతాన భారతి, కార్తీక్రాజ, సంగీత, గాయకులు ఎస్పీబీ. చరణ్, క్రిష్ సహా ప్రముఖులు పాల్గొన్నారు.చదవండి: కాస్మెటిక్ సర్జరీ చేయించుకున్న నిమిషా సజయన్.. నిజమేనా? -
నిర్మాతగా బాలకృష్ణ కూతురు.. సినిమా ప్రకటించిన బోయపాటి
నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది. నేడు 65వ పుట్టినరోజును ఆయన జరపుకోనున్నారు. డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబో మరోసారి రిపీట్ కానుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో 3 చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. నేడు (జూన్ 10) బాలయ్య పుట్టినరోజు సందర్భంగా BB4 పేరుతో ఒక పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థ రామ్ ఆచంట,గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.2014లో లెజెండ్ చిత్రాన్ని ఇదే నిర్మాణ సంస్థ నిర్మించింది. సింహా,లెజండ్, అఖండ చిత్రాల తర్వాత బోయపాటి శ్రీను మరోసారి బాలయ్యతో ప్రాజెక్ట్ ఫిక్స్ చేశాడు. అయితే భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బాలకృష్ణ కూతురు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్లో ఎం తేజస్విని నందమూరి సమర్పిస్తున్నట్లు ఆమె పేరు ఉంది. తొలిసారిగా ఆమె చిత్రనిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. The Lethal Combo that sets the screens on fire is Back 🔥🔥The two Forces - 'GOD OF MASSES' #NandamuriBalakrishna & #BoyapatiSreenu reunite for #BB4 🌋🌋Happy Birthday Balayya Babu ❤️🔥Produced by @RaamAchanta #GopiAchanta under @14ReelsPlus banner ❤️Presented by… pic.twitter.com/Oj9b1j9bvS— 14 Reels Plus (@14ReelsPlus) June 10, 2024 -
కాస్మెటిక్ సర్జరీ చేయించుకున్న నిమిషా సజయన్.. నిజమేనా?
నిమిషా సజయన్.. మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ఈ నల్లకలువ తెలుగు వారందరికి కూడా పరిచయమే. చామనఛాయ, కుదురైన ఆకృతి, నటన తెలిసిన కళ్లు ఆమె ప్రత్యేకత. ముంబైలో పుట్టిపెరిగినా తన మూలాలు మాత్రం మలయాళంలోనే ఉన్నాయి. తన టాలెంట్తో సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లోనూ నటిస్తుంది. 2017లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తక్కువ సమయంలోనే గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్గా జిగర్తాండ డబుల్ ఎక్స్, చిన్నా, నాయట్టు (కోట బొమ్మాళి పీఎస్) వంటి చిత్రాలతో టాలీవుడ్ వారికి బాగా దగ్గరైంది.తాజాగా ఈ బ్యూటీ కాస్మెటిక్ సర్జరీ చేపించుకున్నారని ప్రచారం జరుగుతుంది. నటి నిమిషా సజయన్ ప్రస్తుతం కాస్మెటిక్ సర్జరీ చర్చల అంశం మలయాళ పరిశ్రమలో చర్చ జరుగుతుంది. కెరీర్ ప్రారంభంలో ఆమెను చూసిన క్షణం నుంచి ప్రస్తుతం ఆమె ముఖం కొద్దిగా మారిపోయిందని వారు అంటున్నారు. దీనిపై కాస్మోటాలజిస్టుల అభిప్రాయం అందరినీ ఆకర్షిస్తోంది. ఇటీవల సోషల్ మీడియా ద్వారా దృష్టిని ఆకర్షించిన డాక్టర్ శిఖా, తాను కాస్మెటిక్ సర్జరీలు చేయించుకోలేదని చెప్పింది. నిమిషా ముఖంలో వచ్చిన మార్పులకు కారణాన్ని కూడా పంచుకున్నారు.నిమిషా సజయన్ మునుపటి కంటే ఇప్పుడు ఎక్కువ బరువు తగ్గిందని ఆమె తెలిపింది. రింగులుగా ఉన్న ఆమె జుట్టు స్ట్రెయిట్ చేయబడింది. ఆమె పెదవిలోనూ ఏమీ మార్పులేదు. తన మొహంలో కూడా ఎలాంటి మార్పూ లేదని తాను అనుకుంటున్నట్లు డాక్టర్ శిఖా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తన అందానికి ఫిదా అయిన చాలామంది నిమిషా సోషల్మీడియా ఖాతా కామెంట్ బాక్స్లో ప్రశంసిస్తున్నారు. సహజ సౌందర్యం ఉన్న గొప్ప నటి నిమిషా అని పలువురు వ్యాఖ్యానించారు. గత కొన్ని రోజులుగా నిమిషాపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సైబర్ ఎటాక్ జరుగుతోంది.మలయాళ ప్రముఖ నటుడు సురేష్ గోపి త్రిసూర్ ఎన్నికల్లో గెలవలేరని ఆమె పబ్లిక్ ఫోరంలోనే కామెంట్ చేసింది. అయితే, తాజాగా సురేష్ గోపీ విజయం సాధించారు. దీంతో పాత ప్రస్తావన పేరుతో ఆమెపై ట్రోల్స్ వచ్చాయి. దీంతో ఆమె సోషల్ మీడియా కామెంట్ బాక్స్ను ఆఫ్ చేసింది. View this post on Instagram A post shared by NIMISHA BINDU SAJAYAN (@nimisha_sajayan) -
ప్రియుడితో సినీ నటి ప్లాన్.. స్నేహితురాలిని బర్త్డే పార్టీకి పిలిచి ఆపై..
బర్త్డే పార్టీకి వెళ్లిన బాలికకు మత్తు మందు ఇచ్చి, లైంగికదాడి జరిగిన ఘటన తమిళనాడులో జరిగింది. ఈ కేసులో సహయనటి, విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. చైన్నెలోని పెరంబూర్ ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల బాలిక చేత్తుపట్టులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 11వ తరగతి చదువుతోంది. విద్యార్థిని తన స్నేహితులతో కలిసి అన్నానగర్ ప్రాంతంలోని ఓ కాఫీ షాప్నకు వెళ్లింది. ఆ సమయంలో పెరుంగళత్తూరు ప్రాంతానికి చెందిన సహాయ నటి ప్రతిషా అకీరాతో విద్యార్థినికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీరిద్దరూ స్నేహితులయ్యారని తెలుస్తుంది. ఈ క్రమంలో గత నెల 13వ తేదీన సాలీగ్రామంలోని ఓ హోటల్లో జరిగిన తన పుట్టినరోజు వేడుకలకు హాజరు కావాలని విద్యార్థినిని అకీరా ఆహ్వానించింది. ఆ తర్వాత అక్కడికి వెళ్లిన విద్యార్థినికి అకీరా, ఆమె ప్రియుడు సహా ఇద్దరు యువకులు మిఠాయిలు ఇచ్చారు. విద్యార్థి నిరాకరించినప్పటికీ, వారు ఆమెకు బలవంతంగా మిఠాయిలు తినిపించారు. అందులో కొంచెం తినగానే విద్యార్థిని స్పృహతప్పి పడిపోయింది. అనంతరం ఇద్దరు యువకులు ఆ బాలికను పడక గదిలోకి తీసుకెళ్లి లైంగికదాడి చేశారు. చాలా సేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన ఆ బాలిక నిద్ర లేచి తనపై లైంగికదాడి జరిగిందని గ్రహించి దిగ్భ్రాంతి చెందింది. దీని గురించి అడిగితే జరిగిన సంఘటన గురించి బయట చెప్పవద్దు. అలా అయితే, నీకు, మీ కుటుంబానికి పరువు పోతుందని సహాయ నటి అకీరా విద్యార్థినిని బెదిరించింది. ఈ ఘటనతో భయాందోళనకు గురైన విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం తెలుపలేదు. ఈ స్థితిలో రెండు రోజుల క్రితం తనపై లైంగికదాడి జరిగిన విషయాన్ని విద్యార్థిని తన సోదరికి చెప్పింది. వెంటనే ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. బర్త్ డే పార్టీ అంటూ తన కుమార్తెకు మత్తు మందు కలిపిన మిఠాయిలు ఇచ్చి లైంగికదాడి చేశారంటూ విద్యార్థిని తల్లిదండ్రులు విరుగంబాక్కం మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నటి అకీరా, వడపళనికి చెందిన కాలేజీ విద్యార్థి సోమేశ్ను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న విలియమ్స్ కోసం వారు తీవ్రంగా వెతుకుతున్నారు. బర్త్ డే పార్టీకి వెళ్లిన విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన చైన్నెలో సంచలనం సృష్టించింది. -
ఆ హీరోతో ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న లైగర్ బ్యూటీ
అనుకున్నవన్నీ జరగవు.. అయినా అనుకోవడం మానుకోలేం. అలాగే మనసులోని కోరికను వ్యక్తం చేయడం కూడా తప్పు కాదు. నటి అనన్య పాండే కూడా తన మనసులోని కోరికను ఇలానే వ్యక్తం చేశారు. ప్రస్తుతం గ్లామరస్ నటిగా రాణిస్తున్న బాలీవుడ్ బ్యూటీ ఈమె. ఈమె ఇంతకుముందు స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2, కాలీ పీవీ, డ్రీమ్ గర్ల్ 2, తెలుగు చిత్రం లైగర్ తదితర చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు. ప్రస్తుతం హిందీ లో కంట్రోల్ అనే చిత్రంలో నటిస్తున్నారు. సీనియర్ రాజకీయ నాయకుడు, న్యాయవాది సి శంకరన్ నాయర్ బయోపిక్లోనూ నటిస్తున్నారు. సహజంగానే ఛాలెంజింగ్ పాత్రల్లో నటించాలని కోరుకునే నటి ఈమె. ఇప్పటికే తెలుగులో లైగర్ చిత్రంలో నటించిన ఈమె ఇప్పుడు కోలీవుడ్ చిత్రాల్లోనూ నటించాలనే ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టీవ్గా ఉండే అనన్య పాండే ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ కోలీవుడ్లో నటుడు విజయ్ సరసన నటించాలనే కోరిక ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే ఆమె కోరిక నెరవేరే చాన్సే లేదనిపిస్తోంది. ఎందుకంటే రాజకీయ పార్టీని నెలకొల్పిన నటుడు విజయ్ త్వరలో రాజకీయాలపై పూర్తిగా దృష్టి పెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఈయన ప్రస్తుతం గోట్ అనే చిత్రంలో నటిస్తున్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. దీని తర్వాత తన 69వ చిత్రంలో నటించి ఆ తర్వాత నటనకు స్వస్తి పలకబోతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే విజయ్ నటించే చివరి చిత్రంలో అనన్య పాండే అవకాశాన్ని ఎదురుచూస్తున్నారేమో. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఆమె తన మనసులోని కోరికను వ్యక్తం చేశారా? అని అనిపిస్తుంది. -
సీక్వెల్ సెట్లో...
గుజరాతీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అమితాబ్ బచ్చన్. 2022లో అమితాబ్ ఓ కీలక పాత్రలో నటించిన ‘ఫక్త్ మహిళా మాటే’ చిత్రానికి సీక్వెల్ ఇది. యశ్ సోనీ, దీక్షా జోషి ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఫక్త్ మహిళా మాటే’కు మంచి ప్రేక్షకాదరణ దక్కింది. జై బోదాస్ దర్శకత్వంలో ఆనంద్ పండిట్, వైశాల్ షా ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్గా ‘ఫక్త్ పురుషో మాటే’ అనే సినిమాను ఆరంభించారు. అమితాబ్, యశ్ సోనీ, మిత్ర గాధ్వీ, ఇషా కన్సారా, దర్శన్ జరీవాలా సీక్వెల్లో ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్నారు. ఈ సీక్వెల్ని పార్థ్ త్రివేదీతో కలిసి జై బోదాస్ దర్శకత్వం వహిస్తుండటం విశేషం.ప్రస్తుతం అమితాబ్తో పాటు ఈ చిత్రం ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. ‘‘అమితాబ్ బచ్చన్గారితో ఓసారి పని చేసిన ఎవరైనా ఆయనతో మళ్లీ వర్క్ చేయాలనుకుంటారు. అమితాబ్గారి ఎనర్జీ, అంకితభావం సెట్స్లో ఉత్సాహాన్ని మరింత పెంచుతోంది’’ అని పేర్కొన్నారు నిర్మాత ఆనంద్ పండిట్. ఈ సంగతి ఇలా ఉంచితే... మహిళల మనసుల్లో ఏముందో తెలుసుకోగల శక్తులు ఓ కుర్రాడికి వస్తాయి. వాటితో ఆ యువకుడు ఏం చేశాడు? విడిపోతున్న ప్రేమికులను ఎలా కలిపాడు? అనే అంశాలతో ‘ఫక్త్ మహిళా మాటే’ చిత్రం సాగుతుంది. ఇక సీక్వెల్ మగవారి కోణంలో ఉంటుందని టైటిల్ స్పష్టం చేస్తోంది. -
గోవాలో ఆటా పాటా...
మళ్లీ గోవా వెళ్లాడు దేవర. ‘జనతా గ్యారేజ్’ (2016) వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ‘దేవర’. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. కల్యాణ్రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, కె. హరికృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగాన్ని ఈ ఏడాది అక్టోబరు 10న రిలీజ్ చేయనున్నట్లు గతంలో మేకర్స్ వెల్లడించారు.ఈ చిత్రంలో తండ్రీ కొడుకులుగా ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ గోవాలో ప్రారంభమైంది. ఎన్టీఆర్తో పాటు ప్రధాన తారాగణం పాల్గొంటున్న ఈ షెడ్యూల్లో ఓ సాంగ్, కొంత టాకీ పార్ట్, ఓ యాక్షన్ సీక్వెన్స్ను చిత్రీకరించడానికి ప్లాన్ చేశారట. ఈ ఏడాది మార్చిలో ‘దేవర’ యూనిట్ గోవాలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించింది. ఇప్పుడు మళ్లీ గోవాలో షూటింగ్ జరుగుతోంది. -
ఆమెతో నమ్మకం మొదలవుతుంది
ప్రభాస్ హీరోగా నటించిన తాజా పాన్ ఇండియన్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ ఈ సినిమా ద్వారా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్హాసన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు. వైజయంతీ మూవీస్పై సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న విడుదలవుతోంది. కాగా ఈ మూవీ ట్రైలర్ని నేడు విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించి, దీపికా పదుకోన్ లుక్ను విడుదల చేసింది.‘ది హోప్ బిగిన్స్ విత్ హర్’ (ఆమెతో నమ్మకం మొదలవుతుంది) అంటూ మేకర్స్ రిలీజ్ చేసిన దీపిక లుక్ నెట్టింట వైరల్గా మారింది. ‘‘సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్గా ‘కల్కి 2898 ఏడీ’ రూపొందింది. మహాభారత పురాణ ఘటనల నుండి మొదలై క్రీస్తు శకం 2898లో పూర్తయ్యే కథ ఇది. గతం, భవిష్యత్తుతో ముడిపడిన ఆరువేల ఏళ్ల వ్యవధిలో ఈ చిత్రకథ నడుస్తుంది’’ అని మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణన్.
Pagination
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
Advertisement