సింగరేణి బుల్ డోజర్ దహనం | bulldozer fires in singareni | Sakshi
Sakshi News home page

సింగరేణి బుల్ డోజర్ దహనం

Apr 30 2016 1:55 PM | Updated on Sep 5 2018 9:45 PM

ఆదిలాబాద్ జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్‌లో సింగరేణి సంస్థకు చెందిన బుల్‌డోజర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేశారు.

మందమర్రి: ఆదిలాబాద్ జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్‌లో సింగరేణి సంస్థకు చెందిన బుల్‌డోజర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేశారు. స్థానిక ఓపెన్‌కాస్ట్ గనిలో ఉన్న షావల్ డోజర్‌ను శుక్రవారం రాత్రి కిరోసిన్ పోసి దుండగులు నిప్పంటించారు. డోజర్‌కు పాక్షికంగా నష్టం వాటిల్లింది. ఈ మేరకు సంస్థ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల క్రితమే జిల్లాలో మావోయిస్టులు ప్రాణహితపై వంతెన పనులు చేస్తున్న వాహనాలను తగులబెట్టిన విషయం విదితమే. అయితే, తాజా ఘటనలోనూ వారి పాత్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement