సింగరేణి బుల్ డోజర్ దహనం | bulldozer fires in singareni | Sakshi
Sakshi News home page

సింగరేణి బుల్ డోజర్ దహనం

Apr 30 2016 1:55 PM | Updated on Sep 5 2018 9:45 PM

ఆదిలాబాద్ జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్‌లో సింగరేణి సంస్థకు చెందిన బుల్‌డోజర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేశారు.

మందమర్రి: ఆదిలాబాద్ జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్‌లో సింగరేణి సంస్థకు చెందిన బుల్‌డోజర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేశారు. స్థానిక ఓపెన్‌కాస్ట్ గనిలో ఉన్న షావల్ డోజర్‌ను శుక్రవారం రాత్రి కిరోసిన్ పోసి దుండగులు నిప్పంటించారు. డోజర్‌కు పాక్షికంగా నష్టం వాటిల్లింది. ఈ మేరకు సంస్థ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల క్రితమే జిల్లాలో మావోయిస్టులు ప్రాణహితపై వంతెన పనులు చేస్తున్న వాహనాలను తగులబెట్టిన విషయం విదితమే. అయితే, తాజా ఘటనలోనూ వారి పాత్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement