భూ సేకరణ పనులు వేగంవంతం | acquisition of land deeds Fast | Sakshi
Sakshi News home page

భూ సేకరణ పనులు వేగంవంతం

Apr 20 2016 2:11 AM | Updated on Mar 21 2019 7:27 PM

భూ సేకరణ పనులు వేగంవంతం - Sakshi

భూ సేకరణ పనులు వేగంవంతం

జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు యుద్ధప్రాతిపదికన భూసేకరణ పనులు పూర్తి చేయాలని ....

ఇన్‌చార్జి కలెక్టర్ ఎం రాంకిషన్
 
మహబూబ్‌నగర్ న్యూటౌన్: జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు యుద్ధప్రాతిపదికన భూసేకరణ పనులు పూర్తి చేయాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఎం రాంకిషన్ అధాకారులను ఆదేశించారు. మంగళవారం జేసీ క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్ అధికారులతో సమీక్షించారు. భూసేకరణలో ఎదురవుతున్న ఇబ్బందులను ఎదుర్కోవడం, అనుసరించాల్సిన విధానాలను వివరించారు. క్షేత్రస్థాయిలో సమస్యలను అధికారులు జేసీకి వివరించారు.

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిధులు కేటాయించిందని భూసేకరణ వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ప్రాజెక్టు వారీగా భూసేకరణ వివరాలపై చర్చించారు. ఈ సమావేశంలో భూసేకరణ స్పెషల్ కలెక్టర్ వనజాదేవి, సర్వే ల్యాండ్స్ ఏడీ శ్యాంసుందర్‌రెడ్డి, కేఎల్‌ఐ, జూరాల ఎస్‌ఈలు, ఆర్డీఓలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement