'మోసం.. బాబు నైజం' | ysrcp mla gowru charitha reddy slams cm chandrababu over election promises | Sakshi
Sakshi News home page

'మోసం.. బాబు నైజం'

Sep 21 2016 10:49 AM | Updated on Oct 30 2018 4:29 PM

'మోసం.. బాబు నైజం' - Sakshi

'మోసం.. బాబు నైజం'

ఎన్నికల హామీలను తుంగలో తొక్కి ప్రజలను చంద్రబాబు మోసం చేశారని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఆరోపించారు.

 వైఎస్‌ఆర్‌ సీపీ పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

కల్లూరు: ఎన్నికల హామీలను తుంగలో తొక్కి అన్ని వర్గాల ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసం చేశారని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఆరోపించారు. మంగళవారం  21వ వార్డు సోమప్ప కాలనీలో గడపగడపకు వైఎస్‌ఆర్‌ కార్యక్రమం వార్డు ఇన్‌చార్జ్‌ కేవీ భాస్కర్‌ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.

స్థానిక పార్కులో అభివృద్ధి పనులు చేపట్టాలని సుబ్బారాయుడు, తిమ్మారెడ్డి, గిరి, కాలనీలో సిమెంట్‌ రోడ్లు వేయించాలని ఆటో శివ, అయ్యస్వామి, శీను, తిరుపాలు కోరారు. 3 నెలలుగా మురుగు కాలువలను శుభ్రం చేయడం లేదని హరినాథ్‌రెడ్డి, హరిశ్చంద్రారెడ్డి ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాబు వస్తే జాబు గ్యారంటీ అంటూ నిరుద్యోగులను దగా చేశారన్నారు.  రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుంటే పరిహారం ఇవ్వకుండా రైతులను మోసం చేస్తున్నాడని ఆరోపించారు.  కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ మైనార్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఫిరోజ్, ఎస్సీ సెల్‌ సభ్యుడు అల్లిపీర, అర్బన్‌ 14 వార్డుల ఇన్‌చార్జ్‌ బెల్లం మహేశ్వరరెడ్డి, 19, 20, 21, 26, 29, 33, 35వ వార్డుల ఇన్‌చార్జ్ లు   పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement