నీళ్లలో చేలు.. కళ్లలో నీళ్లు | ys jagan mohan reddy starts second day tour in guntur district | Sakshi
Sakshi News home page

నీళ్లలో చేలు.. కళ్లలో నీళ్లు

Sep 27 2016 11:37 AM | Updated on Jul 25 2018 4:09 PM

నీళ్లలో చేలు.. కళ్లలో నీళ్లు - Sakshi

నీళ్లలో చేలు.. కళ్లలో నీళ్లు

ఇంతకుముందు ఎటు చూసినా పచ్చటి పంటపొలాలు ఉండేవి. కానీ ఇప్పుడు ఎటు చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి.

ఇంతకుముందు ఎటు చూసినా పచ్చటి పంటపొలాలు ఉండేవి. కానీ ఇప్పుడు ఎటు చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కురిసన భారీ వర్షాలకు పల్నాడు ప్రాంతం మునిగిపోయింది. చేల నిండా నీళ్లు నిండిపోవడంతో.. రైతుల కళ్లలో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. ఆపదలో ఉన్న అన్నదాతకు కనీసం భరోసా కల్పించే దిక్కు కూడా లేకుండా పోయింది. ఇలాంటి తరుణంలో ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాళ్లకు అండగా తానుంటానంటూ వెళ్లారు.

వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన గుంటూరు జిల్లా రైతులను పలకరించేందుకు రెండు రోజులు పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా మంగళవారం ఉదయం పిడుగురాళ్ల అంజిరెడ్డి ఆస్పత్రి సెంటర్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మరికాసేపట్లో పాయన అనుపాలెం చేరుకోనున్నారు. అక్కడ నీట మునిగిన పంటపొలాలను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిశీలిస్తారు. రైతులను పలకరిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement