సాక్షి, ముంబై: వివిధ రాష్ట్ర ప్రభుత్వశాఖల డెరైక్టర్లు పదవీ విరమణ చేయడంతో ప్రస్తుత నగర పోలీసు కమిషనర్గా కొనసాగుతున్న సత్యపాల్ సింగ్కుఏదో ఒక ఉన్నత పదవిని అప్పగించే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. సింగ్ సీటును దక్కించుకునేందుకు ఇప్పటి నుంచే అనేక మంది ఉన్నతాధికారులు పైరవీలు చేయడం ప్రారంభించారు. అవినీతి నిరోధకశాఖ డెరైక్టర్ రాజ్ప్రేమ్ ఖిల్నానీ సోమవారం పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో ఎవరిని నియమించాలనే విషయాన్ని ఇంత వరకు నిర్ణయం తీసుకోలేదు. దీంతో తాత్కాలికంగా ఈ పదవి బాధ్యతలను పోలీసుశాఖ గృహనిర్మాణ మండలి డెరైక్టర్ ప్రదీప్ దీక్షిత్కు అదనంగా అప్పగించారు.
గత మార్చిలో హోంశాఖ ఉన్నతాధికారి శ్రీదేవి గోయల్ పదవీ విరమణ చేశారు. ఆ స్థానం ఇప్పటికీ ఖాళీగానే ఉంది. అదేవిధంగా ఖిల్నానీ స్థానంలో ఇంతవరకు ఎవరినీ నియమించకపోవడంపై పోలీసుశాఖలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. సాధారణ ఇన్స్పెక్టర్లతోపాటు అసిస్టెంట్ పోలీసు కమిషనర్లలో కొందరిని ఇటీవల బదిలీ చేశారు. అయితే సూపరింటెండెంట్లు, ఆపైస్థాయి అధికారులను ఇంతవరకు బదిలీ చేయలేదు. పదోన్నతులు కూడా కల్పించలేదు. వాస్తవానికి మార్చి లేదా ఏప్రిల్ ఆఖరులో పోలీసు అధికారులను బదిలీ చేయాలనే నియమాలు ఉన్నాయి. ఐదు నెలలు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు సీనియర్ అధికారులను బదిలీ చేయలేదు. ముఖ్యంగా సూపరింటెండెంట్, డిప్యూటీ కమిషనర్స్థాయి అధికారుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. గోయల్, ఖిల్నానీ పదవీ విరమణ పొందడంతో పోలీసుశాఖలో డెరైక్టర్స్థాయి పదవులు రెండు ఖాళీ అయ్యాయి. ఈ స్థానాల్లో సత్యపాల్సింగ్ లేదా జావెద్ అహ్మద్ ఇద్దరిలో ఒకరిని నియమించే అవకాశాలున్నాయి. వీరిలో సింగ్కే ఎక్కువ శాతం అవకాశాలు ఉన్నాయి.
ఫలితంగా ఖాళీ అయ్యే నగర పోలీసు కమిషనర్ పదవిని దక్కించుకునేందుకు వివిధ శాఖల ఉన్నతాధికారులు పోటీ పడుతున్నారు. వీరిలో విజయ్ కాంబ్లే, రాకేశ్ మారియా వంటి సీనియర్ ఐపీఎస్ అధికారులు ఉన్నారు. హోంమంత్రి ఆర్.ఆర్.పాటిల్ మాట్లాడుతూ ముంబై పోలీసు కమిషనర్ పదవికి అనేక మంది అధికారులు పోటీపడుతున్న విషయం వాస్తవమేనని అన్నారు. జావెద్ అహ్మద్, కె.పి.రఘువంశి, విజయ్ కాంబ్లే, పి.కె.జైన్, మాథుర్, రాకేశ్ మారియా, మీరా బోర్వన్కర్ తదితర అధికారుల పేర్లు పరిశీలనలతో ఉన్నాయని వెల్లడించారు. కమిషనర్గా ఎవరిని నియమించాలనే విషయమై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, త్వరలో ఈ విషయమై ప్రకటన చేస్తామని మంత్రి పాటిల్ చెప్పారు.
కొత్త బాస్ ఎవరు?
Published Wed, Oct 2 2013 12:24 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement