⇒ మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు బందోబస్తులోనే..
⇒ ఉగ్రదాడుల నేపథ్యంలోతీవ్ర బందోబస్తు.. వారాంతపు సెలవులూ బంద్
⇒ మానసిక ఒత్తిడికి గురవుతున్న రక్షక భటులు
సాక్షి, ముంబై: ఇండియన్ ప్రెమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ మ్యాచ్ల నగర పోలీసుల మీదకొచ్చి పడింది. క్రికెట్ స్టేడియాల వద్ద మధ్యాహ్నం నుంచి బందోబస్తులో ఉంటున్న పోలీసులు అర్ధరాత్రి దాటాక కూడా ఇళ్లకు వెళ్లలేక పోతున్నారు. ఇప్పటికే ముంబైకి అత్యంత సమస్యాత్మక నగరంగా పేరు ఉంది. ఉగ్రవాదులు ఎప్పుడు, ఏ రూపంలో దాడులు చేస్తారో తెలియని పరిస్థితి. ఉగ్రవాదుల దాడులు ఏ క్షణంలోనైనా జరగొచ్చని ఇప్పటికే నిఘా సంస్థలు హెచ్చరించాయి.
ఈ నేపథ్యంలో నగరానికి రక్షణ ఇవ్వడం పోలీసులకు పెను సవాలుగా మారింది. ముంబైలోని వాంఖడే, బ్రబార్న్ స్టేడియంలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్నాయి. ఇప్పటికే అదనపు పని భారంతో సతమతమవుతున్న పోలీసులు బందోబస్తుల వల్ల తీవ్ర ఒత్తిడికి గురువుతున్నారు. వేసవి సెలవుల్లో అందరూ ఆనందంగా గడుపుతోంటే, తమకు కనీసం వారంతపు సెలవులు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు క్రికెట్ మ్యాచ్ ఉంటే .. 12 గంటల నుంచే బందోబస్తుకు వెళ్లాలి. రాత్రి ఎనిమిది గంటలకు మ్యాచ్ ఉంటే మధ్యాహ్నం 3 గంటలకే రిపోర్టు చేయాలి. ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో 10 మంది పోలీసులు ఉండాల్సిన చోట 50 మందిని నియమిస్తున్నారు.
ఎర్రని ఎండలో బందోబస్తు ఉండే పోలీసుల వెతలు వర్ణనాతీతం. అర్ధరాత్రి మ్యాచ్ పూర్తయిన తరువాత కూడా ప్రేక్షకులందరూ వెళ్లిపోయేదాకా బందోబస్తు ఉండాలి. అనంతరం తమ కార్యాలయాలకు వెళ్లి వారి సీనియర్ అధికారులకు నివేదించిన తర్వాతే ఇళ్లకు వెళ్లాలి. ఉదయం యథాతథంగా విధులకు హాజరు కావలి. దీంతో సమయానికి భోజనం, తగినంత నిద్ర, విశ్రాంతి లేక నరకయాతన పడుతున్నారు. సిబ్బంది కొరత వల్ల సెలవులు మంజూరు కావడం లేదు. కొన్ని వారాలపాటు కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటుండటంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.
మూడు నెలల్లో 26 మంది..
పనుల ఒత్తిడి వల్ల జనవరి 1 నుంచి మార్చి 31 వరకు (మూడు నెలల్లో) ముంబై పోలీసు శాఖకు చెందిన సుమారు 26 మంది కానిస్టేబుళ్లు వృుత్యువాత పడ్డారు. సమయానికి భోజనం, విశ్రాంతి లేకపోవడం, రక్తపోటు, గుండెపోటు, మెదడులో రక్తస్రావం వంటి సమస్యలతో చనిపోయారు. 2014 లోనూ ఇదే పరిస్థితి. పోలీసు ఇన్స్పెక్టర్లు మొదలుకుని కానిస్టేబుల్ స్థాయి వరకు సుమారు 147 మంది దాకా చనిపోయారు. ఇందులో 41 పోలీసులు గుండెపోటుతో మృతి చెందినట్లు రికార్డులున్నాయి. రోజురోజుకు పోలీసుల్లో పెరుగుతున్న ఒత్తిడిని తగ్గిం చేందుకు నగర పోలీసు కమిషనర్ రాకేశ్ మారియా వివిధ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. త్వరలో వాటిని అమలుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన అమలు చేయాలనుకుంటున్నవి జరిగితే పోలీసులపై ఒత్తిడి కొంత మేరకైనా తగ్గే అవకాశాలున్నాయి.
ఎంకి పెళ్లి.. సుబ్బి చావుకొచ్చినట్లు
Published Thu, May 7 2015 3:47 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్
తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
33 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం.. ఎవరీ ఆశా శోభన?
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
Medigadda Barrage: గత సర్కారే కారణం!
మనసున్న ముఖ్యమంత్రి జగన్
ప్రచార వాహనాల అడ్డగింత
ఈవీఎంల కమిషనింగ్ కీలకం
తప్పక చదవండి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement