విజయవాడ లిబర్టీ ఆసుపత్రి వద్ద ఆందోళన | protest at vijayawada liberty hospital | Sakshi
Sakshi News home page

విజయవాడ లిబర్టీ ఆసుపత్రి వద్ద ఆందోళన

Nov 8 2016 4:31 PM | Updated on Oct 20 2018 7:38 PM

విజయవాడ ఆటోనగర్‌లోని లిబర్టీ ఆసుపత్రి వద్ద రోగి బంధువులు ఆందోళనకు దిగారు.

విజయవాడ: విజయవాడ ఆటోనగర్‌లోని లిబర్టీ ఆసుపత్రి వద్ద రోగి బంధువులు ఆందోళనకు దిగారు. వివరాలు.. నగరంలోని చెక్‌పోస్ట్ సెంటర్‌కు చెందిన భార్యాభర్తల మధ్య నిన్న గొడవ జరిగింది. ఈ ఘటనలో భర్త చేయి చేసుకోవడంతో భార్య మహ్మద్ శమ్మా తలకు గాయమైంది. చికిత్స నిమిత్తం దగ్గరలో ఉన్న లిబర్టీలో ఆసుపత్రిలో చేరగా..అక్కడ న్యూరో సర్జన్ ఆమెతో అసభ్యంగా ప్రవర్థించాడు. ఈ రోజు ఉదయం కూడా అలాగే మాట్లాడటంతో ఈ విషయం కుటుంబసభ్యులకు తెలిపింది.
 
దీంతో కుటుంబసభ్యులు, బంధువులు, ముస్లిం సంఘాల నాయకులు లిబర్టీ ఆసుపత్రి వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. న్యూరోసర్జన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు న్యూరోసర్జన్‌తో శమ్మాకు క్షమాపణ చెప్పించినా ఆందోళన ఆగలేదు. అక్కడున్న వారందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు అక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement