ఎమ్మెల్యే పౌరసత్వం కేసులో గడువు పెంపు | mla chennamaneni ramesh Citizenship case SC Inquiry extended | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే పౌరసత్వం కేసులో గడువు పెంపు

Dec 2 2016 12:26 PM | Updated on Sep 2 2018 5:24 PM

ఎమ్మెల్యే పౌరసత్వం కేసులో గడువు పెంపు - Sakshi

ఎమ్మెల్యే పౌరసత్వం కేసులో గడువు పెంపు

వేములవాడ ఎమ్మెల్యే పౌరసత్వంపై తేల్చేందుకు కేంద్రానికి సుప్రీంకోర్టు మరోసారి గడువు ఇచ్చింది.

రాజన్న సిరిసిల్ల : వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై తేల్చేందుకు కేంద్రానికి సుప్రీంకోర్టు మరోసారి గడువు ఇచ్చింది. రమేష్ జర్మన్‌ దేశ పౌరుడని, ఆయన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గతంలో విచారించింది.

ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలంటూ కేంద్రానికి అప్పట్లో మూడు నెలల గడువు ఇచ్చింది. గడువు ముగియటంతో మరోసారి విచారణకు రాగా మరో మూడు నెలల సమయం పొడిగించాలని సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ న్యాయస్థానాన్ని కోరారు. ఇందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది.

Advertisement
 
Advertisement
Advertisement