సాగునీటి కోసం రైతుల ఆందోళన | farmers protests in guntur district over crops water | Sakshi
Sakshi News home page

సాగునీటి కోసం రైతుల ఆందోళన

Nov 2 2016 10:17 PM | Updated on Jun 4 2019 5:16 PM

పంటలకు వెంటనే నీరు విడుదల చేయాలని కోరుతూ రైతులు ఆందోళనకు దిగారు.

గుంటూరు : పంటలకు వెంటనే నీరు విడుదల చేయాలని కోరుతూ రైతులు ఆందోళనకు దిగారు. గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలంలోని లంకెలకూరపాడు, బలిదేవరలపాడు, చాగంటివారిపాలెం, నార్నెపాడు గ్రామాలకు చెందిన 50 మంది రైతులు బుధవారం సాయంత్రం సత్తెనపల్లి–నరసరావుపేట రహదారిపై రాస్తారోకో చేపట్టారు. మేజర్‌ కాలువలకు వెంటనే నీటిని విడుదల చేయాలంటూ గుంటూరు బ్రాంచి కాలువ వద్ద ఆందోళనకు దిగారు. దీంతో ఆ మార్గంలో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.

Advertisement
 
Advertisement
Advertisement