విలీనంపై కాసేపట్లో ప్రకటన | EPS, OPS factions of AIADMK may announce merger today | Sakshi
Sakshi News home page

విలీనంపై కాసేపట్లో ప్రకటన

Aug 18 2017 8:01 PM | Updated on Sep 17 2017 5:40 PM

విలీనంపై కాసేపట్లో ప్రకటన

విలీనంపై కాసేపట్లో ప్రకటన

ఏఐడీఎంకేలో సీఎం పళనిస్వామి మాజీ సీఎం పన్నీర్‌సెల్వం గ్రూపుల విలీనంపై మరికాసేపట్లో ప్రకటన వెలువడుతుందని భావిస్తున్నారు.

చెన్నైః ఏఐడీఎంకేలో సీఎం పళనిస్వామి మాజీ సీఎం పన్నీర్‌సెల్వం గ్రూపుల విలీనంపై మరికాసేపట్లో ప్రకటన వెలువడుతుందని భావిస్తున్నారు. పన్నీర్‌సెల్వం గ్రూపు ప్రతిపాదించిన డిమాండ్లకు సీఎం పళనిస్వామి అంగీకరిచడంతో విలీనం లాంఛనం కానుంది. ఇరువురు నేతలు జయలలిత మెమోరియల్‌ను సందర్శించి అనంతరం పార్టీ కార్యాలయానికి చేరుకుంటారని సమాచారం.

జయలలిత మరణంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిన నేపథ్యంలో శుక్రవారం ఉదయం నుంచి రెండు గ్రూపుల మధ్య, వేర్వేరుగా సుదీర్ఘ మంతనాలు సాగాయి. పళనిస్వామి తన మం‍త్రివర్గ సభ్యులతో విలీనంపై చర్చించగా, పన్నీర్‌సెల్వం తన నివాసంలో సన్నిహిత నేతలతో సం‍ప్రదింపులు జరిపారు. జయలలిత మరణంపై విచారణ జరిపించడంతో పాటు పోయెస్‌ గార్డెన్స్‌ నివాసాన్ని జయ మెమోరియల్‌గా మార్చాలనే పన్నీర్‌ డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించడంతో ఇరు గ్రూపుల విలీనానికి మార్గం సుగమమైంది.

Advertisement
 
Advertisement
Advertisement