అపరూప జంట.. 

dumb couple get married in karnataka - Sakshi

వరుడు, వధువు పుట్టు మూగ

సాక్షి, హావేరి(బొమ్మనహళ్లి): పుట్టు మూగ అయిన ఓ ప్రత్యేక జంట శుక్రవారం పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఈ సంఘటన కర్టాటక రాష్ట్రంలోని హావేరి పట్టణంలో చోటుచేసుకుంది. హావేరి నగరంలోని రేణుకా కళ్యాణ మందిరంలో వివాహం ఘనంగా జరిగింది. నగరానికి చెందిన శివపుత్రప్ప కుమారుడు గంగాధర్‌కు పుట్టినప్పటి నుంచి మాటలు రావు. పీయూసీ వరకు చదువుకున్నాడు.

ప్రస్తుతం మేనమాక ప్రింటింగ్‌​ ప్రెస్‌లో పనిచేస్తున్నాడు. అదే జిల్లా శింగాం తాలూకా బంకాపుకు చెందిన గురుసిద్దప్ప కుమార్తె పవిత్ర కూడా పుట్టుకతోనే మూగ. దీంతో ఇరువైపుల పెద్దలు మాట్లాడుకుని వీరికి వివాహం జరిపించారు. ఈ అపురూప జంటను అతిథులు పెద్ద మనసుతో ఆశ్వీరదించారు.
 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top