కరీంనగర్ జిల్లాలోని మానకొండూరులో సోమవారం తెల్లవారుజామున పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.
మానకొండూరులో కార్డెన్ సెర్చ్
May 15 2017 1:05 PM | Updated on Aug 21 2018 5:51 PM
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలోని మానకొండూరులో సోమవారం తెల్లవారుజామున పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన తనఖీల్లో 200 మంది పోలీసులు పాల్గొన్నారు. ఈ సోదాల్లో సరైన పత్రాలు లేని 24 ద్విచక్రవాహనాలు, 13 ఆటోలు, అక్రమంగా నిల్వచేసిన రెండు క్వింటాళ్ల రేషన్ బియ్యం, పెద్ద ఎత్తున గుట్కాప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. పాత నేరస్థులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. అక్రమ కార్యకలాపాలను అరికట్టడానికే తనిఖీలు నిర్వహిస్తున్నామని సీపీ తెలిపారు.
Advertisement
Advertisement