ఎమిటీ యూనివర్సిటీలో చదువుతున్న 20 ఏళ్ల యువకుడు తన ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని నోయిడా పోలీసులు శనివారం తెలిపారు.
ఎమిటీ యూనివర్సిటీ విద్యార్థి ఆత్మహత్య
Sep 22 2013 12:03 AM | Updated on Sep 1 2017 10:55 PM
న్యూఢిల్లీ: ఎమిటీ యూనివర్సిటీలో చదువుతున్న 20 ఏళ్ల యువకుడు తన ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని నోయిడా పోలీసులు శనివారం తెలిపారు. వసంత్కుంజ్ ప్రాంతంలోని ఘిటోర్నీ గ్రామంలోని తన ఇంట్లోనే అరుణ్కుమార్ లోహియా ఉదయం ఆరింటికి ఉరి వేసుకున్నాడని చెప్పారు. ఆత్మహత్య చేసుకుంటున్నందుకు క్షమించ ాల్సిందిగా ఘటనాస్థలంలో వదిలిన లేఖలో పేర్కొన్నాడు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని పోలీసులు చెప్పారు.
Advertisement
Advertisement