అతివృష్టితో నీట మునిగిన పంటపొలాలను వ్యవసాయ శాఖ అధికారులు సోమవారం పరిశీలించారు.
పంటలను పరిశీలించిన అధికారులు
Sep 26 2016 4:19 PM | Updated on Jun 4 2019 5:04 PM
నార్కట్పల్లి: అతివృష్టితో నీట మునిగిన పంటపొలాలను వ్యవసాయ శాఖ అధికారులు సోమవారం పరిశీలించారు. నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెర్వుగట్టు, ఎల్లారెడ్డిగూడెం గ్రామాల్లో వరదతో దెబ్బతిన్న వరి, పత్తి పొలాలను వ్యవసాయ శాఖ డీడీఏ మాధవి, ఏడీఏ శైలజ పరిశీలించారు. మండలంలో పంట నష్టంపై పూర్తి స్థాయి నివేదిక అందజేయాలని ఏవో జగదీశ్వర్రెడ్డిని వారు ఆదేశించారు. వారి వెంట ఎంపీపీ మల్లికార్జున్రెడ్డి, తహశీల్దార్ విజయలక్ష్మి ఉన్నారు.
Advertisement
Advertisement