లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఇరిగేషన్ డీఈ | Sakshi
Sakshi News home page

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఇరిగేషన్ డీఈ

Published Fri, Dec 23 2016 2:27 PM

acb rides on irrigation DE

కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో లంచం తీసుకుంటూ ఇరిగేషన్ డీఈ ఆంజనేయులు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. మిషన్ భగీరథ పనులకు సంబంధించిన చెల్లింపుల నిధులు విడుదల చేసేందుకు ఓ కాంట్రాక్టర్‌ను డీఈ రూ.15 వేలు లంచం అడిగాడు. ఈ విషయం గురించి కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులకు సమాచారం అందించారు. బాధితుడి నుంచి డీఈ లంచం తీసుకుంటుండగా వరంగల్ రేంజ్ డీఎస్పీ సాయిబాబా పథకం ప్రకారం పట్టుకున్నారు. డబ్బు స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement