లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఇరిగేషన్ డీఈ | acb rides on irrigation DE | Sakshi
Sakshi News home page

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఇరిగేషన్ డీఈ

Dec 23 2016 2:27 PM | Updated on Aug 17 2018 12:56 PM

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో లంచం తీసుకుంటూ ఇరిగేషన్ డీఈ ఆంజనేయులు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.

కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో లంచం తీసుకుంటూ ఇరిగేషన్ డీఈ ఆంజనేయులు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. మిషన్ భగీరథ పనులకు సంబంధించిన చెల్లింపుల నిధులు విడుదల చేసేందుకు ఓ కాంట్రాక్టర్‌ను డీఈ రూ.15 వేలు లంచం అడిగాడు. ఈ విషయం గురించి కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులకు సమాచారం అందించారు. బాధితుడి నుంచి డీఈ లంచం తీసుకుంటుండగా వరంగల్ రేంజ్ డీఎస్పీ సాయిబాబా పథకం ప్రకారం పట్టుకున్నారు. డబ్బు స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement