3 నుంచి తెలంగాణ చెస్ టోర్నీ | telangana chess tourny starts from 3rd october | Sakshi
Sakshi News home page

3 నుంచి తెలంగాణ చెస్ టోర్నీ

Sep 23 2016 11:29 AM | Updated on Sep 4 2017 2:40 PM

తెలంగాణ రాష్ట్ర జూనియర్ చెస్ చాంపియన్‌షిప్ వచ్చే నెల 3 నుంచి జరగనుంది.

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర జూనియర్ చెస్ చాంపియన్‌షిప్ వచ్చే నెల 3 నుంచి జరగనుంది. అండర్-19 కేటగిరీలో ఖమ్మంలో మూడు రోజుల పాటు ఈ టోర్నీ పోటీలు జరుగుతాయని టీఎస్‌సీఏ కార్యదర్శి వెంకటేశ్వర రావు తెలిపారు. ఇందులో టాప్-4 స్థానాల్లో నిలిచిన బాలబాలికలు జాతీయ స్థాయి చాంపియన్‌షిప్‌కు అర్హత పొందుతారని ఆయన చెప్పారు. ఈ టోర్నీ నేపథ్యంలో గురువారం రాష్ట్ర హోంమంత్రి నాయినర్సింహా రెడ్డి పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ చెస్ సం ఘం (టీఎస్‌సీఏ) అధ్యక్షుడు ఎ. నరసింహా రెడ్డి, కార్యదర్శి వెంకటేశ్వర రావు, టోర్నీ మీడియా ఇన్‌చార్జి రమేశ్ కుమార్‌లు పాల్గొన్నారు.

 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement