తెలంగాణ రాష్ట్ర జూనియర్ చెస్ చాంపియన్షిప్ వచ్చే నెల 3 నుంచి జరగనుంది.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర జూనియర్ చెస్ చాంపియన్షిప్ వచ్చే నెల 3 నుంచి జరగనుంది. అండర్-19 కేటగిరీలో ఖమ్మంలో మూడు రోజుల పాటు ఈ టోర్నీ పోటీలు జరుగుతాయని టీఎస్సీఏ కార్యదర్శి వెంకటేశ్వర రావు తెలిపారు. ఇందులో టాప్-4 స్థానాల్లో నిలిచిన బాలబాలికలు జాతీయ స్థాయి చాంపియన్షిప్కు అర్హత పొందుతారని ఆయన చెప్పారు. ఈ టోర్నీ నేపథ్యంలో గురువారం రాష్ట్ర హోంమంత్రి నాయినర్సింహా రెడ్డి పోస్టర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ చెస్ సం ఘం (టీఎస్సీఏ) అధ్యక్షుడు ఎ. నరసింహా రెడ్డి, కార్యదర్శి వెంకటేశ్వర రావు, టోర్నీ మీడియా ఇన్చార్జి రమేశ్ కుమార్లు పాల్గొన్నారు.