భారత్‌లో ‘సఫారీ’ అంపైరింగ్ | south african empiring in india | Sakshi
Sakshi News home page

భారత్‌లో ‘సఫారీ’ అంపైరింగ్

Jan 4 2015 12:43 AM | Updated on Sep 2 2017 7:10 PM

భారత్‌లో ‘సఫారీ’ అంపైరింగ్

భారత్‌లో ‘సఫారీ’ అంపైరింగ్

దక్షిణాఫ్రికాకు చెందిన భారత సంతతి అంపైర్ అల్లావుద్దీన్ పాలేకర్ వాంఖడే స్టేడియంలో జరిగే రంజీ మ్యాచ్‌కు అంపైర్‌గా వ్యవహరించనున్నారు.

ముంబై: దక్షిణాఫ్రికాకు చెందిన భారత సంతతి అంపైర్ అల్లావుద్దీన్ పాలేకర్ వాంఖడే స్టేడియంలో జరిగే రంజీ మ్యాచ్‌కు అంపైర్‌గా వ్యవహరించనున్నారు. గ్రూప్ ‘ఎ’లో ముంబై, మధ్యప్రదేశ్ జట్ల మధ్య ఈ నెల 5 నుంచి 8వ తేదీ వరకు ఈ మ్యాచ్ జరగనుంది. 36 ఏళ్ల పాలేకర్ తాతయ్య మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా ఖేద్ గ్రామానికి చెందినవారు. కాగా అంతర్జాతీయ అంపైర్ల మార్పిడి కార్యక్రమంలో భాగంగా ఆయన భారత్‌లో తొలిసారి రెండు మ్యాచ్‌లకు అంపైరింగ్ విధులు నిర్వర్తిస్తారని బీసీసీఐ జనరల్ మేనేజర్ రత్నాకర్ షెట్టి వెల్లడించారు. కేప్‌టౌన్‌లో జన్మించిన పాలేకర్ దక్షిణాఫ్రికాలో 16 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement