
సురేఖకు ప్రధాని అభినందన
‘అర్జున అవార్డు’కు ఎంపికైన ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ మంగళవారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసింది.
‘అర్జున అవార్డు’కు ఎంపికైన ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ మంగళవారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసింది. ఈ సందర్భంగా ఆమెను అభినందించిన మోదీ... భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. పార్లమెంట్ సభ్యులు గోకరాజు గంగరాజు, మురళీమోహన్, ‘శాప్’ చైర్మన్ పీఆర్ మోహన్ తదితరులు సురేఖ వెంట ఉన్నారు.