ఆస్ట్రేలియాపై 45 పరుగులతో  పాక్‌ గెలుపు 

Pakistan won by 45 runs against Australia - Sakshi

ముక్కోణపు టి20 టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ 45  పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఫకర్‌ జమాన్‌ (42 బంతుల్లో 73; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) జోరుతో పాక్‌  20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 194 పరుగులు  చేసింది. అనంతరం ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 149 పరుగులే చేయగలిగింది. అలెక్స్‌ కారీ (37) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. నేడు జింబాబ్వేతో ఆసీస్‌ తలపడుతుంది.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top