తొలి మ్యాచ్‌ సచిన్‌ జట్టుతో | Newly framed Pro Kabaddi League returns from 28th July | Sakshi
Sakshi News home page

తొలి మ్యాచ్‌ సచిన్‌ జట్టుతో

Jun 29 2017 12:09 AM | Updated on Sep 5 2017 2:42 PM

తొలి మ్యాచ్‌ సచిన్‌ జట్టుతో

తొలి మ్యాచ్‌ సచిన్‌ జట్టుతో

ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) ఐదో సీజన్‌కు రంగం సిద్ధమైంది. ఈ లీగ్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను బుధవారం విడుదల చేశారు.

తమిళ్‌ తలైవాస్‌తో తలపడనున్న తెలుగు టైటాన్స్‌
ప్రొ కబడ్డీ లీగ్‌ షెడ్యూల్‌ విడుదల  


ముంబై: ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) ఐదో సీజన్‌కు రంగం సిద్ధమైంది. ఈ లీగ్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను బుధవారం విడుదల చేశారు. జూలై 28న ప్రారంభమయ్యే ఈ టోర్నీ మొత్తం 12 నగరాలలో జరుగుతుంది. హైదరాబాద్‌ వేదికగా రాహుల్‌ చౌదరీ సారథ్యంలోని తెలుగు టైటాన్స్‌ జట్టు (హైదరాబాద్‌ ఫ్రాంచైజీ), సచిన్‌ యజమానిగా ఉన్న తమిళ్‌ తలైవాస్‌ (చెన్నై ఫ్రాంచైజీ) జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో టోర్నీ మొదలవుతుంది. ఈ సీజన్‌లో పాల్గొనే మొత్తం 12 జట్లను రెండు జోన్లుగా విభజించారు. ప్రతీ జోన్‌లో ఉండే ఆరు జట్లు తమ జోన్‌ పరిధిలో 15 మ్యాచ్‌లు, అంతర్‌ జోన్‌ పరిధిలో 7 మ్యాచ్‌ల్లో తలపడతాయి.

ఆ తర్వాత ప్లే ఆఫ్స్‌లో 3 క్వాలిఫయర్స్, 2 ఎలిమినేటర్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌లు ముంబై, చెన్నై వేదికగా జరుగుతాయి. ఫైనల్‌కు చెన్నై ఆతిథ్యమిస్తుంది. షెడ్యూల్‌ విడుదల సందర్భంగా వివో ప్రొ కబడ్డీ లీగ్‌ కమిషనర్‌ అనుపమ్‌ గోస్వామి మాట్లాడుతూ... పీకేఎల్‌– 5 సీజన్‌ను అత్యంత ప్రభావవంతమైన టోర్నీగా నిర్వహించడమే తమ లక్ష్యమన్నారు. సుదీర్ఘంగా జరిగే ఈ సీజన్‌ కబడ్డీ క్రీడాభిమానులకు ఉత్సాహాన్నిస్తుందని చెప్పారు. భారత్‌లో కబడ్డీ క్రీడను అభివృద్ధి చేసేందుకు నిరంతరం శ్రమిస్తామని అంతర్జాతీయ కబడ్డీ సమాఖ్య సీఈఓ దేవ్‌రాజ్‌ చతుర్వేది పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement