మానసకు రెండు పతకాలు | Manasa Gets Two Medals in Kick Boxing | Sakshi
Sakshi News home page

మానసకు రెండు పతకాలు

Apr 11 2019 3:47 PM | Updated on Apr 11 2019 3:47 PM

Manasa Gets Two Medals in Kick Boxing - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఎస్‌ఏయూ) విద్యార్థి వి. మానస రెడ్డి అంతర్జాతీయ స్థాయి టోర్నీలో ఆకట్టుకుంది. టర్కిష్‌ ఓపెన్‌ కిక్‌ బాక్సింగ్‌ టోర్నీలో పాల్గొన్న మానస రెండు పతకాలను సాధించింది.

టర్కీలో ఈనెల 4 నుంచి 7 వరకు జరిగి న ఈ టోర్నీలో సీనియర్‌ మ్యూజికల్‌ ఫామ్‌ వెపన్‌ కేటగిరీలో మానస రజతం గెలుచుకుంది. సీనియర్‌ మ్యూజికల్‌ ఫామ్‌లో కాంస్య పతకాన్ని సాధించింది. ఈ సందర్భంగా పీజేటీఎస్‌ఏయూ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రవీణ్‌ రావు, రిజిస్ట్రార్‌ సుధీర్‌ కుమార్, డీన్‌ విష్ణువర్ధన్‌ రెడ్డి అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన మానసను అభినందించారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement