రంజీ ఫైనల్లో కర్ణాటక | karnataka entered in ranji Trophy | Sakshi
Sakshi News home page

రంజీ ఫైనల్లో కర్ణాటక

Jan 23 2014 12:47 AM | Updated on Sep 2 2017 2:53 AM

రంజీట్రోఫీలో కర్ణాటక జట్టు ఫైనల్‌కు చేరింది. పంజాబ్‌తో మొహాలీలో జరిగిన మ్యాచ్‌లో ఐదో రోజు ఆట కూడా వర్షం కారణంగా సాధ్యపడలేదు.

మొహాలీ: రంజీట్రోఫీలో కర్ణాటక జట్టు ఫైనల్‌కు చేరింది. పంజాబ్‌తో మొహాలీలో జరిగిన మ్యాచ్‌లో ఐదో రోజు ఆట కూడా వర్షం కారణంగా సాధ్యపడలేదు. దీంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో పంజాబ్ 270 పరుగులకు ఆలౌట్ కాగా... కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 447 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కర్ణాటక ముందుకు వెళ్లింది. 29 నుంచి హైదరాబాద్‌లో జరిగే టైటిల్ పోరులో మహారాష్ట్రతో కర్ణాటక తలపడుతుంది.
 
 ఫైనల్‌కు జోల్ దూరం
 న్యూఢిల్లీ: మహారాష్ర్ట స్టార్ బ్యాట్స్‌మన్ విజయ్ జోల్ రంజీ ఫైనల్‌కు దూరమవుతున్నాడు. అండర్-19 ప్రపంచకప్ కోసం బెంగళూరులో నిర్వహిస్తున్న శిబిరంలో పాల్గొనాల్సిందిగా ఈ యువ క్రికెటర్‌ను బీసీసీఐ ఆదేశించింది. ఈ క్యాంప్ జాతీయ క్రికెట్ అకాడమీలో మంగళవారం ప్రారంభమైంది. తొలి రోజే జోల్ అక్కడ రిపోర్ట్ చేశాడు. బోర్డు నిర్ణయంపై మహారాష్ట్ర కోచ్ సురేంద్ర భావే అసంతృప్తి వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement