ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడకుండానే గత ఐపీఎల్ వేలంలో ఢిల్లీ ఫ్రాంచైజీ పవన్ నేగిని ...
న్యూఢిల్లీ: ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడకుండానే గత ఐపీఎల్ వేలంలో ఢిల్లీ ఫ్రాంచైజీ పవన్ నేగిని అక్షరాలా ఎనిమిదిన్నర కోట్ల రూపాయలు వెచ్చించి సొంతం చేసుకుంది! అప్పటి వేలంలో ఇదో సంచలనం. అయితే ఈ సంచలనం ఒక్క సీజన్కే పరిమితైంది. ఈ సారి వేలానికి ముందు డేర్డెవిల్స్ అతన్ని వదిలేసుకొంది.
అతనితో పాటు భారత పేసర్ ఇషాంత్ శర్మ సహా పలువురు సీనియర్ ఆటగాళ్లను ఆయా ఫ్రాంచైజీలు వద్దనుకున్నాయి. ప్రస్తుతం ఇంగ్లండ్తో చెన్నై టెస్టులో ఆడుతున్న ఇషాంత్ సహా పీటర్సన్లను రైజింగ్ పుణే సూపర్జెయింట్స్ విడుదల చేసింది. గుజరాత్ లయన్స్ స్టెయిన్ను వద్దనుకుంది.