పది పరుగులకే రెండు వికెట్లు | India loses two wickets for 10 runs | Sakshi
Sakshi News home page

పది పరుగులకే రెండు వికెట్లు

Aug 15 2014 4:53 PM | Updated on Sep 2 2017 11:55 AM

శుక్రవారం ఆరంభమైన చివరి, ఐదో టెస్టులో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ధోనీసేన 10 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది.

లండన్: సిరీస్ను సమం చేయాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్లో భారత్ పేలవంగా ఆడుతోంది. శుక్రవారం ఆరంభమైన చివరి, ఐదో టెస్టులో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ధోనీసేన 10 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ గంభీర్ (0)ను ఇంగ్లండ్ పేసర్ అండర్సన్ డకౌట్ చేయగా, పుజారా (4)ను బ్రాడ్ బౌల్డ్ చేశాడు. ప్రస్తుతం మురళీ విజయ్, కోహ్లీ క్రీజులో ఉన్నారు.

ఐదు టెస్టుల సిరీస్లో కుక్ సేన 2-1తో ముందంజలో ఉన్న సంగతి తెలిసిందే. చివరి టెస్టు వర్షం కారణంగా కాస్త ఆలస్యంగా ఆరంభమైంది. ఇంగ్లండ్ కెప్టెన్ కుక్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement