టీమిండియా గెలిస్తే.. పాక్ కు టాప్ ర్యాంకు!

if india defeat new zealand, Pakistan to climb top place

న్యూఢిల్లీ: మూడు టీ 20ల సిరీస్ లో భాగంగా టీమిండియా-న్యూజిలాండ్ క్రికెట్ జట్ల మధ్య బుధవారం తొలి టీ 20 జరుగనుంది. నగరంలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో రేపు రాత్రి గం.7.00 ని.లకు మొదటి టీ 20 ఆరంభం కానుంది. ఇప్పటికే వన్డే సిరీస్ ను గెలిచి మంచి ఊపు మీద ఉన్న విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా ఇప్పుడు టీ 20 సిరీస్ పై కన్నేసింది. ఇప్పటివరకూ ఓవరాల్ గా న్యూజిలాండ్ తో ఆడిన ఐదు టీ 20ల్లోనూ  ఓటమి పాలైన భారత జట్టు.. తాజా సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ లోనే శుభారంభం చేసి పైచేయి సాధించేందుకు కసరత్తులు చేస్తోంది. మొదటి మ్యాచ్ లో బోణి కొడితే, సిరీస్ పై పట్టు సాధించేందుకు విరాట్ సేనకు అవకాశం దొరుకుతుంది.

కివీస్ తో జరిగే టీ 20 సిరీస్ ను భారత గెలిస్తే కనుక తన ర్యాంకును మరింత మెరుగుపరుచుకుంటుంది. ఒకవేళ కివీస్ పై సిరీస్ ను గెలిచిన పక్షంలో ఆ ఫార్మాట్ ర్యాంకింగ్స్ లో ఐదో స్థానంలో ఉన్న భారత జట్టు రెండో ర్యాంకుకు చేరుతుంది.   ఫలితంగా ప్రస్తుతం టీ 20 ర్యాంకింగ్స్ లో టాప్ స్థానంలో ఉన్న న్యూజిలాండ్ తన ర్యాంకును కోల్పోతుంది. అదే సమయంలో రెండో స్థానంలో ఉన్న పాకిస్తాన్ టాప్ ర్యాంకు చేరుతుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top