రెండు సెషన్స్‌లో ముగిస్తాం: పుజారా | End up with two sessions: Pujara | Sakshi
Sakshi News home page

రెండు సెషన్స్‌లో ముగిస్తాం: పుజారా

Feb 13 2017 12:44 AM | Updated on Sep 5 2017 3:33 AM

రెండు సెషన్స్‌లో ముగిస్తాం: పుజారా

రెండు సెషన్స్‌లో ముగిస్తాం: పుజారా

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో ఆట చివరి రోజు సోమవారం రెండో సెషన్‌లోపు టీమిండియాకు విజయం ఖాయమవుతుందని

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో ఆట చివరి రోజు సోమవారం రెండో సెషన్‌లోపు టీమిండియాకు  విజయం ఖాయమవుతుందని భారత బ్యాట్స్‌మన్‌ చతేశ్వర్‌ పుజారా విశ్వాసం వ్యక్తం చేశాడు. ‘పిచ్‌పై బంతి తిరగడం మొదలైంది. అశ్విన్, జడేజా బౌలింగ్‌లో బంగ్లాదేశ్‌ బ్యాట్స్‌మెన్‌ ఇబ్బంది పడతారు.

ఆఖరి రోజు సాధ్యమైనంత త్వరగా బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌ను ముగించి విజయాన్ని దక్కించుకుంటాం. మిగిలిన ఏడు వికెట్లు రెండు సెషన్స్‌లో లభిస్తాయనే నమ్మకంతో ఉన్నాను’ అని పుజారా వ్యాఖ్యానించాడు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement