సాక్షి: క్రికెటర్స్, బాలీవుడ్ హీరోలు కలిసి అక్టోబర్ 15న మైదానంలో సందడి చేయనున్నారు. విరాట్ కోహ్లి కెప్టెన్గా ఫుట్బాల్ మ్యాచ్ ఆడేందుకు సిద్దమవుతున్నారు. మరోవైపు అభిషేక్ బచ్చన్ సారథిగా బాలీవుడ్ టీం రెడీ అవుతోంది. ఈ రెండు జట్ల మధ్య ముంబైలోని అందేరి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఆదివారం ఫ్రెండ్లీ ఫుట్బాల్ ఛారిటీ మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా కోహ్లి అభిమానులకు.. రండీ.. చూడండి.. ఇందులో మీరు భాగం కండి అని పిలుపునిచ్చారు. మీరు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నానని పోస్టు చేశాడు.
ఈ మ్యాచ్ వివరాలను విరాట్ కోహ్లి తన ఫెస్బుక్లో పోస్టు చేశాడు. ఇదేం మొదటిసారి కాదు.. గతంలో కూడా క్రికెటర్స్, హీరోలు కలిసి మ్యాచ్ ఆడారు. కోహ్లి ఫౌండేషన్ 2016లో అభిషేక్ బచ్చన్స్తో కలిసి మ్యాచ్ ఆడింది. ఈ ఫుట్బాల్ మ్యాచ్కు అభిమానుల నుంచి భారీగా స్పందన వచ్చింది. కోహ్లీ టీంలో మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని కూడా ఆడుతున్నారు.
క్రికెటర్స్ జట్టు: విరాట్ కోహ్లీ(కెప్టెన్) మయాంక్ దగర్(గోల్ కీపర్) మనోజ్ తివారీ, ధోని, మనీష్ పాండే, కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యార్, అశోక్ దిండా, అజింక్యా రహానే, శిఖర్ ధావన్, ఉమేష్ యాదవ్, ఆర్ అశ్విన్ లు ఉన్నారు.
బాలీవుడ్ జట్టు: అమితాబ్ బచ్చన్(కెప్టెన్), జిన్గేష్ అంటల( గోల్ కీపర్), ఆదిత్య కపూర్, షబీర్ అహ్లువాలియా, రణబీర్ కపూర్, మోరియా, సూజిత్ సిర్కార్, కార్తీక్ ఆర్యన్, సచిన్ జోషి, అర్జున్ కపూర్, రాజ్ కుంద్రాలు ఉన్నారు.
ప్రస్తుతం ఇండియా టీం ఆస్ట్రేలియాతో టీ-20 మ్యాచ్లు ఆడుతున్న విషయం తెలిసిందే. తరువాత ఇండియా టీం న్యూజిలాండ్తో మూడు వన్డే మ్యాచ్లు, మూడు టీ-20 మ్యాచ్లు ఆడనుంది.