డివిలియర్స్‌ అవుట్‌ | Chahal gets de villiers to stall south africa | Sakshi
Sakshi News home page

డివిలియర్స్‌ అవుట్‌

Feb 16 2018 6:14 PM | Updated on Feb 16 2018 6:14 PM

Chahal gets de villiers to stall south africa - Sakshi

సెంచూరియన్‌: భారత్‌తో జరుగుతున్న చివరిదైన ఆరో వన్డేలో దక్షిణాఫ్రికా మూడో వికెట్‌ను నష్టపోయింది. దక్షిణాఫ్రికా స్టార్‌ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌(30) మూడో వికెట్‌గా అవుటయ్యాడు. స్నిన్నర్‌ చాహల్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. దాంతో దక్షిణాఫ్రికా 105 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది. అంతకుముందు మర్‌క్రామ్‌(24), హషీమ్‌ ఆమ్లా(10)లు పెవిలియన్‌కు చేరారు. ఈ మూడు వికెట్లలో శార్దూల్ ఠాకూర్‌ రెండు వికెట్లు సాధించగా, చాహల్‌కు వికెట్‌ దక్కింది.


ఈ మ్యాచ్‌లో  టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత ఫీల్డింగ్‌ తీసుకుంది. భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి దక్షిణాఫ్రికాను ముందుగా బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఆరో వన్డేలో భారత జట్టు పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు విశ్రాంతినిచ్చారు. అతని స్థానంలో శార్దూల్‌ ఠాకూర్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. మరొకవైపు దక్షిణాఫ్రికా రెండు మార్పులతో పోరుకు సిద్దమైంది.జేపీ డుమిని స్థానంలో జాండో జట్టులోకి రాగా, డేవిడ్‌ మిల్లర్‌ స్థానంలో బెహర్దియన్‌ను తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement