ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో పాకిస్తాన్ ఆధిక్యం ప్రదర్శిస్తోంది.
తొలి ఇన్నింగ్స్లో పాక్ 340/6
లండన్: ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో పాకిస్తాన్ ఆధిక్యం ప్రదర్శిస్తోంది. అసద్ షఫీఖ్ (179 బంతుల్లో 109; 12 ఫోర్లు; 2 సిక్సర్లు), యూనిస్ ఖాన్ (144 బంతుల్లో 101 బ్యాటింగ్; 15 ఫోర్లు; 1 సిక్స్) సెంచరీలతో చెలరేగడంతో రెండో రోజు తమ తొలి ఇన్నింగ్స్లో పాక్ 91 ఓవర్లలో ఆరు వికెట్లకు 340 పరుగులు చేసింది. క్రీజులో యూనిస్తో పాటు సర్ఫరాజ్ అహ్మద్ (27 బంతుల్లో 17 బ్యాటింగ్; 3 ఫోర్లు) ఉన్నాడు.
నాలుగో వికెట్కు అసద్, యూనిస్ కలిసి 150 పరుగులు జోడించారు. ప్రస్తుతం పాక్ 12 పరుగుల స్వల్ప ఆధిక్యంలో ఉంది. ఫిన్, వోక్స్లకు రెండేసి వికెట్లు దక్కాయి. అంతకుముందు ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 76.4 ఓవర్లలో 328 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మొయిన్ అలీ (108) శతకం సాధించాడు.