సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా డిమాండ్తో వైఎస్సార్సీపీ ఎంపీలు పార్లమెంట్ వేదికగా పోరాటాన్ని ఉద్ధృతం చేశారు. శుక్రవారం ఉ. 10.30 గంటలకు పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్రెడ్డి, వి.విజయసాయిరెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, వైఎస్ అవినాష్రెడ్డి, పి.వి. మిథున్రెడ్డి పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ టీడీపీకి చెందిన కేంద్ర మంత్రులు రాజీనామాలు చేయడం ఓ డ్రామా, ప్రహసనమని వ్యాఖ్యానిం చారు. ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయినందున రాజీనామాలు చేసినట్లు చెబుతున్న టీడీపీ ఎన్డీఏలో కొనసాగటంలో ఔచిత్యాన్ని ప్రశ్నించారు. కేంద్రంపై విశ్వాసం కోల్పోయినందున అవిశ్వాస తీర్మానం పెట్టటంతోపాటు టీడీపీ ఎంపీలంతా రాజీనామాలు చేయాలన్నారు. అన్ని పార్టీల రాష్ట్ర ఎంపీలు రాజీనామాలు చేసి కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందన్నారు.
బాబు డ్రామాను ప్రజలు గుర్తించారు
కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేవరకూ తమ పోరాటం కొనసాగుతుందని వైఎస్సార్ సీపీ ఎంపీలు స్పష్టం చేశారు. ఏపీకి హోదా కోసం నాలుగేళ్లుగా మడమ తిప్పని పోరాటం చేస్తున్నామని గుర్తు చేశారు. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ రెండేళ్ల క్రితం చెప్పిన విషయాన్నే ఈనెల 7వ తేదీన మరోసారి చెప్పారన్నారు. రెండేళ్ల క్రితం జైట్లీకి శాలువా కప్పి సన్మానించిన చంద్రబాబు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి తమ మంత్రులను ఉపసంహరించుకోవటాన్ని బట్టి ఆయన డ్రామాను ప్రజలు గ్రహించారని చెప్పారు.
చిత్తశుద్ధి ఉంటే అవిశ్వాసానికి మద్దతివ్వాలి: ఎంపీ వరప్రసాదరావు
ప్రత్యేక హోదా సాధనపై టీడీపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వంపై ప్రవేశపెట్టబోయే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని వైఎస్సార్ సీపీ ఎంపీ వరప్రసాదరావు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతలు కేంద్ర మంత్రి పదవులకు రాజీనామాలు చేస్తే సరిపోదని, ప్రజలిచ్చిన ఎంపీ పదవులను వీడేందుకు తమ మాదిరిగా సిద్ధంకావాలని సూచించారు. ఎన్డీఏలో కొనసాగడం వెనకున్న ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.
ఉభయ సభల్లో కొనసాగిన ఆందోళన
శుక్రవారం ఉదయం 11 గంటలకు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే ఉభయ సభల్లో వైఎస్సార్ సీపీ ఎంపీలు వెల్లోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ హోదా కోసం నినదించారు. వివిధ పార్టీల సభ్యుల ఆందోళనలతో ఉభయ సభలు పలుసార్లు వాయిదాపడ్డాయి. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన అశోక్ గజపతిరాజు పార్లమెంట్ ఆవరణలో టీడీపీ నిర్వహించిన ధర్నాలో, లోక్సభ వెల్లో చేపట్టిన ఆందోళనలోనూ పాలుపంచుకున్నారు. పార్టీ ఎంపీ మాగంటి బాబు వెంకటేశ్వరస్వామి ప్రతిమ, భగవద్గీత, ఖురాన్, బైబిల్ గ్రంథాలను ప్రదర్శించారు. టీడీపీ ఎంపీ శివప్రసాద్ కోయదొర వేషంతో సభకు వచ్చారు.
హోదాపై పట్టువీడని ప్రతిపక్షం
Published Sat, Mar 10 2018 1:26 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)
గాలివానలో చిక్కుకున్న హెలికాఫ్టర్.. నవీన్ పట్నాయక్కు తప్పిన ప్రమాదం
సోనాక్షీతో ఇంటిమేట్ సీన్స్.. ఆమె ఆమ్మగారు ఏమన్నారంటే: నటుడు
నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!
2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!
వరల్డ్కప్ ట్రోఫీతో ఫోజులిచ్చిన యువరాజ్.. ఫోటోలు వైరల్
ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement