ఇకనైనా మారకపోతే డిపాజిట్లు దక్కవ్‌ | YSRCP MP Nandigam Suresh Fires On ChandraBabu Naidu | Sakshi
Sakshi News home page

ఇకనైనా మారకపోతే డిపాజిట్లు దక్కవ్‌

May 22 2020 5:05 PM | Updated on May 22 2020 7:36 PM

YSRCP MP Nandigam Suresh Fires On ChandraBabu Naidu - Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్న వ్యక్తి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడని వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగం సురేష్‌ విమర్శించారు. ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి అడ్డుతుగులుతూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా మారాలని, భవిష్యత్‌లో కూడా ఇలానే వ్యవహరిస్తే టీడీపీకి కనీసం డిపాజిట్లు కూడా దక్కవని జోస్యం చెప్పారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సమయంలో దళితులను అన్ని రకాలుగా మోసం చేశారని ధ్వజమెత్తారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో దళితులను ఓటు బ్యాంకుగానే చూశారని అన్నారు. ప్రభుత్వ స్కూళ్లల్లో ఇంగ్లీష్ మీడియాన్ని టీడీపీ నేతలంతా కుట్రపన్ని అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. (‘దేవుడా.. బాబుకు మంచి బుద్ధి ప్రసాదించు’)

శుక్రవారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియాతో మాట్లాడిన నందిగం సురేష్‌.. డాక్టర్‌ సుధాకర్‌ విషయంలో పోలీసులు సంయమనంగా వ్యవహరించారని అన్నారు. ‘సీబీఐ విచారణలో వాస్తవాలు బయటకు వస్తాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై డా. సుధాకర్ ఇష్టానుసారంగా మాట్లాడారు. సుధాకర్ వ్యాఖ్యలను టీడీపీ నేతలు సమర్ధించడం దారుణం. చంద్రబాబుది క్రిమినల్ మైండ్. ఆయన కుట్రలను సాగనివ్వం’ అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement