నా చివరి శ్వాస వరకు వైఎస్‌ఆర్‌సీపీలోనే

YSRCP Leader Ganta  Prasad Rao Slams On TDP Leaders - Sakshi

సాక్షి, పశ్చమ గోదావరి: తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని జిల్లా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బీసీ సెల్‌  అధ్యక్షుడు ఘంటా ప్రసాదరావు తెలిపారు. బుధవారం ఆయాన మీడియాతో మాట్లాడుతూ... నా చివరి శ్వాస ఉన్నంత వరకు వైఎస్‌ఆర్‌సీపీలోనే కొనసాగుతానని అన్నారు.

కొంత మంది టీడీపీ నేతలు కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మొద్దాన్నారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top