తక్షణమే ప్రభుత్వం చర్యలు చేపట్టాలి : వైఎస్‌ జగన్‌ | YS Jagan Mohan reddy On Titli Strom | Sakshi
Sakshi News home page

Oct 11 2018 9:25 PM | Updated on Oct 11 2018 9:49 PM

YS Jagan Mohan reddy On Titli Strom - Sakshi

సాక్షి, విజయనగరం : తుపాను ప్రభావంతో ఇప్పటివరకు 8 మంది చనిపోయారనీ, తీవ్ర ఆస్తి, పంట నష్టాలు కూడా సంభవించాయనీ ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే స్పందించి బాధితులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

ధర్మాన నేతృత్వంలో తిత్లీ నష్టంపై కమిటీ

తిత్లీ తుపాను వల్ల దెబ్బతిన్న శ్రీకాకుళం జిల్లాలో ఆస్తి నష్టాన్ని అంచనా వేసేందుకు, బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పార్టీ సీనియర్‌ నేత ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో కమిటీని నియమించారు.  భూమన కరుణాకర రెడ్డి, తమ్మినేని సీతారాం, ధర్మాన కృష్ణదాస్‌, పాలకొండ ఎమ్మెల్యే కళావతి, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, రెడ్డి శాంతి, పార్టీ జిల్లా వ్యవసాయ విభాగం అధ్యక్షుడు రఘురామ్‌ తదితరులు ఈ కమిటీలో సభ్యులుగా వ్యవహరించనున్నారు. ఈ కమిటీ శుక్రవారం నుంచి బాధిత ప్రాంతాల్లో పర్యటించి జరిగిన నష్టాన్ని పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి నివేదిస్తుందని పత్రికా ప్రకటనను జారీ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement