
బీజేపీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప
సాక్షి, బెంగళూరు : భారతీయ జనతా పార్టీ(బీజేపీ) శాసనసభా పక్ష నేత, కర్ణాటక ప్రస్తుత ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా ఆలోచనలో ఉన్నారా?. బల పరీక్షకు తగిన మెజారిటీ లేకపోవడంతో వాజ్పేయి తరహాలోనే యడ్యూరప్ప కూడా రాజీనామా చేస్తారనే ఊహాగానాలు పెల్లుబిక్కుతున్నాయి. 13 పేజీల ప్రసంగం చదివి రాజీనామాపై ప్రకటన చేస్తారనే వార్తలు కర్ణాటకలో సంచలనం రేపుతున్నాయి.
కాగా, అసెంబ్లీని మధ్యాహ్నం 03.30 గంటల వరకూ వాయిదా వేసిన తర్వాత యడ్యూరప్ప పార్టీ నేతలతో అత్యవసరంగా భేటీ అయ్యారు. మెజార్టీ రాకపోతే ఏం చేయాలన్న దానిపై ఆయన చర్చించినట్లు తెలిసింది. అయితే మరో వైపు విపక్షాల నుంచి 10 మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్ కొడతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.