‘ఓటు ధరను 10వేల రూపాయలకు తీసుకెళ్లారు’

VijayaSai Reddy Slams Chandrababu Naidu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నాలుగున్నరేళ్ల పాలన కాలంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బీసీలను ఏనాడు పట్టించుకోలేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి విమర్శించారు. చంద్రబాబు నాయుడు వ్యవహార శైలిపై ట్విటర్‌ వేదికగా స్పందించిన ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశంలో ఓటుకు 500 రూపాయలు ముట్ట చెప్పే పద్దతిని చంద్రబాబు 1996లోనే ప్రవేశ పెట్టారని ఆరోపించారు. ఇప్పుడు అదే ఓటు ధరను పదివేల రూపాయలకు తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల ధరను 20 కోట్ల రూపాయలకు, ఎంపీల ధరను 50 కోట్ల రూపాయలకు చేర్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

నెల రోజుల్లో చంద్రబాబు అపద్ధర్మ ముఖ్యమంత్రి కానున్నారని తెలిపారు. ఎన్నికల సమీపిస్తున్న వేళ.. కులానికొక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని గుర్తొచ్చిందా అని సూటిగా ప్రశ్నించారు. బీసీలను ఓటు బ్యాంక్‌గా తప్ప.. ఉన్నత స్థానాలకు ఎదగనిచ్చారా అని నిలదీశారు. ఇద్దరు బీసీలను హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించ రాదని తప్పుడు ఆరోపణలతో లేఖ రాసిన విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని జస్టిస్‌ ఈశ్వరయ్య ఆధారాలతో సహా బయటపెట్టారని గుర్తుచేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top