అలా చెప్పడం సిగ్గుచేటు

V Hanumantha Rao Fire on KTR - Sakshi

కాంగ్రెస్‌ నేత వీహెచ్‌

బంజారాహిల్స్‌: ఇంటర్‌ ఫలితాల్లో తప్పిదాలకు కారణమైన గ్లోబరీనా సంస్థ పేరును తాను మొదటిసారి విన్నానని కేటీఆర్‌ చెప్పడం సిగ్గుచేటని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హన్మంతరావు అన్నారు. ఆ సంస్థ తెలియదని పెద్దమ్మ తల్లిపై ప్రమాణం చేయాలని కేటీఆర్‌కు సవాల్‌ విసిరిన ఆయన... మంగళవారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ తల్లి దేవాలయానికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం అక్కడ బైఠాయించారు. మధ్యాహ్నం 12గంటల వరకు కేటీఆర్‌ కోసం గుడి బయట వేచి చూశారు. కేటీఆర్‌ రాకపోవడంతో బయటకు వచ్చిన వీహెచ్‌ మీడియాతో మాట్లాడారు. రెండేళ్లలో ప్రభుత్వం పడిపోవాలని అమ్మవారిని కోరుకున్నానని చెప్పారు. 23 మంది విద్యార్థుల మరణానికి కారణమైన గ్లోబరీనా సంస్థపై చర్యలు తీసుకోవాలన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top