ఎస్సీ వర్గీకరణకు మద్దతు: సీపీఎం
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ బిల్లును బీజేపీ ప్రభుత్వం పార్లమెం టులో ప్రవేశపెడితే సీపీఎం మద్దతి స్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఆదివారం ఎంబీ భవన్లో తమ్మినేని వీరభద్రంతో ఎమ్మార్పీఎస్ వ్యవ స్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ భేటీ అయ్యారు. సోమవారం ఎమ్మా ర్పీఎస్ నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశానికి రావాలని మంద కృష్ణ తమ్మినేనిని ఆహ్వానించారు. దీనికి తమ్మినేని సానుకూలంగా స్పందించారు.
కేసీఆర్ది నియంతృత్వ పాలన...
సీఎం కేసీఆర్ను విమర్శించే వారిని జైలులో నిర్బంధించేందుకే ఐపీసీ 506, 507 సెక్షన్లలను ప్రభుత్వం నాన్ బెయిలబుల్ సెక్షన్లుగా మార్చిందని వీరభద్రం విమర్శించారు. సెక్షన్ల మార్పు కేసీఆర్ నియంతృత్వ పాలనకు నిదర్శనమన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ పరుష పదజాలంతో దూషించినప్పుడు ఆయనను జైలుకు పంపితే ఉద్యమాన్ని ఎలా నడిపేవారని ప్రశ్నించారు. కేసీఆర్ తన అప్రజాస్వామిక విధానాలకు స్వస్తి పలకాలని తమ్మినేని హితవు పలికారు.