వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు | Odisha CM Naveen Patnaik announces 33% reservation for women | Sakshi
Sakshi News home page

వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు

Mar 11 2019 4:50 AM | Updated on Mar 11 2019 7:27 PM

Odisha CM Naveen Patnaik announces 33% reservation for women - Sakshi

భువనేశ్వర్‌: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తామని ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ ప్రకటించారు.  మహిళాసాధికారతకు ఇది తొలిమెట్టు అని పేర్కొన్నారు. ఆదివారం కేంద్రపాడాలో జరిగిన ఓ ర్యాలీలో ఆయన ఈ ప్రకటన చేశారు. దీంతో 21 లోక్‌సభ స్థానాలున్న ఒడిశాలో ఏడుగురు మహిళలకు అవకాశం లభించనుంది. ప్రస్తుతం ఒడిశా నుంచి ముగ్గురు మహిళలే లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 147 అసెంబ్లీ స్థానాలున్న అసెంబ్లీలో 12 మంది మహిళలు ఉన్నారు. అయితే, పట్నాయక్‌ ప్రకటనను మహిళల ఓట్లు కొల్లగొట్టేందుకు వేసిన ఎత్తు గడగా కాంగ్రెస్, బీజేపీ కొట్టిపారేశాయి.  సీనియర్‌ కాంగ్రెస్‌ నేత ఒకరు మాట్లాడుతూ మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించే ప్రతిపాదనపై తమ పార్టీకి అభ్యంతరం లేదని, ప్రజల విశ్వసనీయత కోల్పోయిన నేపథ్యంలో బీజేడీ దీనిని చివరి అవకాశంగా ఉపయోగించుకుంటోందని విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement