సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కన్నడనాట మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ హై కమాండ్కు టికెట్ల పంపిణీ కొత్త తలనొప్పులు తీసుకొచ్చింది. కర్ణాటక సర్కారులో ఉన్న మంత్రులు తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ నేరుగా అధిష్టానాన్ని ఆశ్రయించారు. ఇప్పటికే అన్ని పార్టీలు తొలివిడతగా తమ అభ్యర్థులను ప్రకటించినప్పటికీ.. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ మాత్రం జాబితా విషయంలో స్పష్టతనీయటం లేదు. కన్నడ మంత్రుల్లో ఎనిమిది మంది.. తమ పిల్లలు, అనుచరులకు టికెట్లు ఇవ్వాలంటూ పట్టుబడుతుండటమే అసలు కారణం. అయితే పార్టీ అధ్యక్షుడు రాహుల్ నేతృత్వంలో దీనిపై సుదీర్ఘంగా చర్చించిన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ.. ఆదివారం తొలి జాబితా విడుదల చేయొచ్చని తెలుస్తోంది.
సంతానంతోనే సమస్య!
సీఎం సిద్దరామయ్య సైతం చాముండేశ్వరి (సిట్టింగ్), బదామీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. తన కుమారుడు యతీంద్రకూ టికెట్ ఇప్పించుకోవాలని పోటీపడుతున్నారు. అయితే సిద్దరామయ్య (కుమారుడికి), హోం మంత్రి రామ లింగారెడ్డి (కూతురికి), మాజీ కేంద్ర మంత్రి కేహెచ్ మునియప్ప (కూతురికి), మల్లికార్జున ఖర్గే (కుమారుడు – రాష్ట్ర ఐటీ మంత్రి)లు ఈ విషయంలో విజయం సాధించినట్లేనని తెలుస్తోంది. మార్గరెట్ అల్వా (కుమారుడు నివేదిత్ అల్వా), వీరప్ప మొయిలీ (కుమారుడు హర్ష మొయిలీ), పీసీసీ చీఫ్ పరమేశ్వర (కుమారుడు) మంత్రులు ఆర్వీ దేశ్పాండే (కుమారుడు), టీబీ జయచంద్ర (కుమారుడు)కూడా తమ వాళ్లకు టికెట్లు ఇప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే జేడీఎస్, ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు టికెట్లు ఇవ్వాల్సిందేనంటూ సిద్దరామయ్య, వద్దని ఖర్గే, వీరప్ప మొయిలీ పట్టుబడుతుండటమే ఈ జాబితా ఆలస్యానికి కారణంగా తెలుస్తోంది.
రాహుల్ సమక్షంలోనే వాకౌట్లు..: శుక్ర వారం ఉదయం రాహుల్ అధ్యక్షతన జరిగిన ఎన్నికల కమిటీ సమావేశంలో సీఎం సిద్దరామయ్య, లోక్సభ పక్షనేత మల్లికార్జున ఖర్గే, మాజీ సీఎం వీరప్ప మొయిలీ, పీసీసీ చీఫ్ జి.పరమేశ్వర తదితరులు పాల్గొన్నారు. ఈ భేటీలో నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి నేతలు వాకౌట్ చేసేంతవరకు వెళ్లింది. దీంతో మళ్లీ సాయంత్రం సమావేశమయ్యా రు. ఈ భేటీలో సోనియా పాల్గొన్నారు.
కాంగ్రెస్లో టికెట్ల కుమ్ములాట
Published Sun, Apr 15 2018 3:07 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Haryana: మైనార్టీలో బీజేపీ! మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు
దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్
తెలంగాణ: మళ్లీ భారీ వర్షం కురిసే ఛాన్స్
శతక్కొట్టిన ఆటపట్టు.. టీ20 వరల్డ్కప్ క్వాలిఫయర్ ఛాంపియన్గా శ్రీలంక
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్
హీరోయిన్ జాన్వీ కపూర్.. తిరుపతిలో పెళ్లి చేసుకోనుందా?
సీవీడ్తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..!
మిస్టర్ బీస్ట్ బర్త్డే గిఫ్ట్ : ఖరీదైన టెస్లా కారు కావాలా నాయనా?
తప్పక చదవండి
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- ఓటు వేద్దాం ఇలా.!
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
Advertisement