ఆస్పత్రిలో చేరిన ఎంపీ నుస్రత్ జహాన్!

MP Nusrat Jahan Admitted To Hospital - Sakshi

కోల్‌కతా: ప్రముఖ బెంగాలీ నటి, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ నుస్రత్‌ జహాన్‌ శ్వాస సంబంధిత వ్యాధితో బాధ పడుతూ.. కోల్‌కతాలోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నుస్రత్‌ అస్తమాతో బాధ పడుతోందని.. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఎదురైన కారణంగా.. ఆమెను ఆదివారం ఉదయం ఆస్పత్రితో చేరారని ఈ మేరకు నుస్రత్‌ జహాన్‌ కుటుంబ సభ్యులు తెలిపారు.

ప్రస్తుతం నుస్రత్‌ ఐసీయూలో ఉన్నారని.. ఆరోగ్యం నిలకడగానే ఉందని సోమవారం ఆమె కుటుంబ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. బసిర్‌హాట్ నియోజకవర్గానికి తృణముల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) పార్టీ తరపున పోటీచేసిన నుస్రత్‌ జహాన్‌ తొలిసారి ఎంపీగా  ఎన్నికయ్యారు. ఆ తర్వాత వ్యాపారవేత్త నిఖిల్‌ జైన్‌ను ఆమె వివాహమాడి సంచలనాలకు, వివాదాలకు మారు పేరుగా నిలిచారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top