‘వాటిని అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించారు’ | Kanna Lakshmi Narayana Fires on Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

‘వాటిని అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించారు’

Feb 16 2019 1:18 PM | Updated on Feb 16 2019 1:31 PM

Kanna Lakshmi Narayana Fires on Chandrababu Naidu - Sakshi

సాక్షి, రాజమండ్రి : మార్చి ఒకటిన విశాఖలో బీజేపీ కార్యకర్తలతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమవుతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ తెలిపారు. ఈ సందర్భంగా శనివారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చం‍ద్రబాబుకు దమ్ముంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలని సవాలు చేశారు. స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌(ఎస్‌పీవీ) ఏర్పాటు చేస్తే రెవెన్యూ లోటు భర్తీ చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కన్నా తెలిపారు.

చంద్రబాబు ప్యాకేజిని సమర్థించిన తీర్మానాలను అసెంబ్లీ రికార్డుల నుంచి తీసేశారని మండి పడ్డారు. టీడీపీ ఓ డ్రామా కంపెనీ అని.. చంద్రబాబులా తాము రోజుకో వేషం వెయ్యలేమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు.. ఏపీలో మాత్రం ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో ఒంటరిగానే పోటీ చేస్తామని కన్నా తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement