బోండా ఉమా అనుచరుల రౌడీయిజం | Bonda Umamaheswara Rao Followers Attacked YSRCP Leaders | Sakshi
Sakshi News home page

బలప్రదర్శనకు దిగిన బోండా ఉమా అనుచరులు

Apr 8 2019 4:01 PM | Updated on Apr 8 2019 5:12 PM

Bonda Umamaheswara Rao Followers Attacked YSRCP Leaders - Sakshi

సాక్షి, విజయవాడ : టీడీపీ నేతల దౌర్జన్యానికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. రౌడీయిజం చెలాయిస్తూ.. తమ బలాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న వైఎస్సార్‌సీపీ నేతలపై కయ్యానికి కాలుదువ్వుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన విజయవాడ సెంట్రల్‌ నియోజక వర్గంలో చోటుచేసుకుంది. 

వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మల్లాది విష్ణుకు మద్దతుగా జరుగుతున్న ప్రచారంలో బోండా ఉమామహేశ్వరరావు అనుచరులు రౌడీయిజాన్ని ప్రదర్శించారు. మల్లాది విష్ణుకు మద్దతుగా కోగంటి సత్యనారాయణ ప్రచారం చేస్తుండగా.. బుడమేరు వంతెన వద్ద బోండా ఉమా అనుచరులు దుర్భాషలాడుతూ.. వాగ్వాదానికి దిగారు. టీడీపీ నినాదాలు చేస్తూ.. బల ప్రదర్శనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో.. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితి సద్దుమణిగేలా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement