విజయవాడ: సాయికృష్ణ లాకప్డెత్ కేసు విజయవాడలో జరిగిన సర్కారీ హత్య అని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. ఆ కుటుంబానికి పూర్తి న్యాయం జరగాలంటే సీబీఐ ఎంక్వయిరీ ఒక్కటే మార్గమన్నారు. సిట్ విచారణ, మేజిస్టీరియల్ విచారణ రెండూ కూడా కంటి తుడుపు చర్యలేనన్నారు. అందుచేత సీబీఐతో విచారణ చేయిస్తే దీని వెనుక ఎవరున్నారో బయటకొస్తుందన్నారు మల్లాది విష్ణు.
‘ప్రభుత్వం బహిరంగంగా మేజిస్టీరియల్ విచారణకు వైఎస్సార్సీపీ నేతలం హాజరయ్యాం. మాకు అనుమానాలు, అభ్యంతరాలు అన్నీ వినతి పత్రం ఇచ్చాం సీబీఐ ఎంక్వయిరీ చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తుంది’ అని పేర్కొన్నారు.
మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు మాట్లాడుతూ.. ‘ మెజిస్ట్రేరియల్ ఎంక్వయిరీలో మా అభిప్రాయం చెప్పాం. ప్రభుత్వం దొడ్డి దారిన నాగరాజుని బాధ్యుడును చేస్తూ ముగిస్తారని అభిప్రాయం ఉంది. దీని వెనక ఇంకెంతమంది ఉన్నారు బయటికి తీయాలి. వీడియో ఫుటేజ్ని బయటకు తీయాలి. స్టేషన్లోనే కాదు మిగతాన్ని ప్రాంతాలకు సిసి పుటిజ్ వెలిగితేయాలి.
మార్కాపురం నుండి విజయవాడ వచ్చేవరకు సీసీ ఫుటేజ్ తీయాలి. నాగరాజుకు సీపీ ఆదేశాలు ఇచ్చారా? సీపీకి డిజిపి ఆదేశాలు ఇచ్చారా? డీజీపీకి సీఎం ఆదేశాలు ఇచ్చారా? తెలియజేయాలి. క్రాంతికుమార్ దాంట్లో ఏ చర్యలు ప్రభుత్వం తీసుకోలేదు. కామెంట్లు చేశారని, యూట్యూబ్ అని స్టేషన్లో పెట్టి స్టేషన్లో తిప్పుతున్నారు. తమ సొంత సామాజిక వర్గం లో యువకుడు చనిపోతే డీసీఎం ఎందుకు మాట్లాడలేదు. సాయి కృష్ణ కేసిన పవన్ ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు. ఇది ఈ చంద్రబాబు ప్రభుత్వానికి సంబంధించిన విషయం కాదు మానవ హక్కులకు సంబంధించిన విషయం’ అని పేర్కొన్నారు.

మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ‘ కేసులో మాకున్న అనుమానాలు, అభిప్రాయాలను వినతి పత్రంలో తెలియజేశాం. లాకప్ డెత్ చేయడమే కాదు.. డెడ్ బాడీ మాయం చేశారు. ఈ కేసును భూస్థాపితం చేయడానికి అనేక చర్యలు తీసుకొన్నారు. మే 28వ సాయి కృష్ణ తల్లి ఫిర్యాదు చేస్తే దాని కూడా పట్టించుకోలేదు జగన్ వచ్చిన తర్వాత కంప్లైంట్ రిజిస్టర్ చేశారు.
జగన్ రాకపోతే కేస్ కూడా రిజిస్టర్ చేసేవారు కాదు. హేబియస్ కార్పస్ లో వెతుకుతున్నామని పోలీసుల చెప్పారు. పోలీసులు చట్టంతో చెలగాటం అడుగుతున్నారు. నాగరాజు సెల్ ఫోన్ తీసుకోలేదు. కానిస్టేబుల్ సెల్ ఫోన్స్ నాగపూర్ లో అమ్ముకొన్నామని కబుర్లు చెపుతున్నారు. సెల్ ఫోన్స్ దొరికితే అన్ని దొరుకుతాయాని వేరే కథ రాస్తున్నారు.వాస్తవాలు బయటకి రాకుండా నాగరాజు ని ఇరికించి కేసు క్లోజ్ చేయాలని చూస్తున్నారు. దెబ్బలు తగిలినప్పుడు మాత్రమే మెజిస్టీరియల్ ఎంక్వైరీ వేయాలి.. ఈ కేసు సీబీఐతో విచారణ జరపాలనేది వైఎస్సార్సీపీ డిమాండ్’ అని స్పష్టం చేశారు.


