‘పవన్‌ కల్యాణ్‌తో వేదిక పంచుకోం’ | BJP Leaders Will Not Attend Pawan Kalyan Meeting Says Vishnu Vardhan Reddy | Sakshi
Sakshi News home page

‘పవన్‌ కల్యాణ్‌తో వేదిక పంచుకోం’

Oct 30 2019 8:35 PM | Updated on Oct 30 2019 8:53 PM

BJP Leaders Will Not Attend Pawan Kalyan Meeting Says Vishnu Vardhan Reddy - Sakshi

సమస్యకి సంఘీభావం తెలుపుతున్నామే తప్ప వేరే పార్టీలకు సంఘీభావం తెలపడం లేదని స్పష్టం చేశారు. పవన్‌తో వేదికను పంచుకోమని విష్ణువర్ధన్‌రెడ్డి తేల్చిచెప్పారు.

సాక్షి, విజయవాడ : పవన్ కల్యాణ్‌ సభలో పాల్గొనాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణకు లేదని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. ఇసుక సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాసింది మొదట బీజేపీయేనని తెలిపారు. ఇసుక సమస్యపై గవర్నర్‌ని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చింది కూడా బీజేపీయేనని వెల్లడించారు. సమస్యకి సంఘీభావం తెలుపుతున్నామే తప్ప వేరే పార్టీలకు కాదని స్పష్టం చేశారు. పవన్‌తో వేదికను పంచుకోమని విష్ణువర్ధన్‌రెడ్డి చెప్పారు. నవంబర్‌ 4న విజయవాడలో బీజేపీ పెద్దఎత్తున మరోసారి ఆందోళన చేపడుతుందని తెలిపారు. 

తెలుగుదేశం పార్టీ మునిగే నావ..
రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు రోజురోజుకీ మారుతున్నాయని బీజేపీ జాతీయ సమన్వయకర్త పురిహెళ్ల రఘురాం అన్నారు. గుడివాడలో బుధవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ కనుమరుగైందని, తెలుగుదేశం పార్టీ మునిగే నావ లాంటిదని ఎద్దేవా చేశారు. జనసేన ఒక గందరగోళ పార్టీ అని, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వర్తమానంలో ఉందని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా అండగా ఉండేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గెలిచిన పార్లమెంటు సభ్యులందరూ కొత్తవారు కావడంతో వారికి శిక్షణ తరగతులు అవసరమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సహాయ సహకారాలు వినియోగించుకుని ముందుకు సాగాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement